రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం... సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పిలుపు -పిఠాపురంలో జిల్లా సదస్సు – సుప్రీంకోర్టు తీర్పుపై పునఃసమీక్షకు డిమాండ్ పిఠాపురం: దేశంలో సంఘ్ పరివార్ శక్తులు రాజ్యాంగంపై చేస్తున్న దాడులను అడ్డుకుని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు పిలుపునిచ్చారు. శనివారం పిఠాపురంలోని లైన్స్ క్లబ్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని పార్టీ జిల్లా నాయకులు గొడుగు సత్యనారాయణ అధ్యక్షతన రాజ్యాంగాన్ని కాపాడండి - ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బంగార్రాజు మరియు ఐలాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎస్. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. మార్చి 24, 2026న సుప్రీంకోర్టు ఆర్టికల్ 341ని పక్కనపెట్టి మతం మారితే ఎస్సీ హోదా కోల్పోతారని ఇచ్చిన తీర్పుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోదని,దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని,డిలిమిటేషన్ ద్వారా తమ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవాలని చూస్తోందని వారు విమర్శించారు. అయితే నిన్న పార్లమెంటులో డిలిమిటేషన్ బిల్లు వీగిపోవడం నిరంకుశత్వానికి తగిలిన ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అధికార,ప్రతిపక్ష పార్టీలు కేంద్రం ప్రవేశపెట్టే ప్రజావ్యతిరేక బిల్లులకు మద్దతు తెలపడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ సదస్సులో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే పునఃసమీక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చెయ్యాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను యథాతథంగా కొనసాగించాలని, దళితులు,మైనారిటీలు,మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వామపక్ష,ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అయార్ల రాష్ట్ర కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు,జిల్లా కార్యదర్శి కె. జనార్ధన్, ఎస్. అప్పలరాజు,అడ్వకేట్ పి.వి. రావు, ఆర్. సింహాచలం, థామస్, సాకా రామకృష్ణ తదితర నాయకులు,జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం... సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పిలుపు -పిఠాపురంలో జిల్లా సదస్సు – సుప్రీంకోర్టు తీర్పుపై పునఃసమీక్షకు డిమాండ్ పిఠాపురం: దేశంలో సంఘ్ పరివార్ శక్తులు రాజ్యాంగంపై చేస్తున్న దాడులను అడ్డుకుని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు పిలుపునిచ్చారు. శనివారం పిఠాపురంలోని లైన్స్ క్లబ్లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని పార్టీ జిల్లా నాయకులు గొడుగు సత్యనారాయణ అధ్యక్షతన రాజ్యాంగాన్ని కాపాడండి - ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బంగార్రాజు మరియు ఐలాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.ఎస్. అజయ్ కుమార్ మాట్లాడుతూ.. మార్చి 24, 2026న సుప్రీంకోర్టు ఆర్టికల్ 341ని పక్కనపెట్టి మతం మారితే ఎస్సీ హోదా కోల్పోతారని ఇచ్చిన తీర్పుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోదని,దళిత క్రైస్తవులను ఎస్సీలుగానే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం
పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని,డిలిమిటేషన్ ద్వారా తమ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవాలని చూస్తోందని వారు విమర్శించారు. అయితే నిన్న పార్లమెంటులో డిలిమిటేషన్ బిల్లు వీగిపోవడం నిరంకుశత్వానికి తగిలిన ఎదురుదెబ్బ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అధికార,ప్రతిపక్ష పార్టీలు కేంద్రం ప్రవేశపెట్టే ప్రజావ్యతిరేక బిల్లులకు మద్దతు తెలపడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ సదస్సులో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే పునఃసమీక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చెయ్యాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను యథాతథంగా కొనసాగించాలని, దళితులు,మైనారిటీలు,మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వామపక్ష,ప్రజాస్వామిక శక్తులు ఐక్యంగా పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అయార్ల రాష్ట్ర కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు,జిల్లా కార్యదర్శి కె. జనార్ధన్, ఎస్. అప్పలరాజు,అడ్వకేట్ పి.వి. రావు, ఆర్. సింహాచలం, థామస్, సాకా రామకృష్ణ తదితర నాయకులు,జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
- 🙏😭1
- 🙏😭1
- Post by Shyam1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations51911
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear1
- Post by Ramprasad islavath1
- 😭🙏1