Shuru
Apke Nagar Ki App…
https://youtube.com/shorts/5i54tnVHxMY?si=Phxwb-79ZW5k-mpl
JaiDesh Party
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అర్ధాకలితో అలమటిస్తున్న హాస్టల్ విద్యార్థులు… వార్డెన్ దౌర్జన్యాలపై ఆగ్రహం వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సమీకృత వసతి గృహంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్లో ఉన్న విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవని, పరిశుభ్రత లేక బాత్రూములు దుర్వాసనతో కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. సుమారు 60 మంది విద్యార్థులకు కేవలం 10 గుడ్లు మాత్రమే వేసి రోస్ట్ చేసి అందరికీ సర్దుతున్నారని, దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చికెన్ చేసినప్పటికీ ఒక్కొక్కరికి కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే ఇస్తారని, మిగిలినది వార్డెన్ భార్య ఇంటికి తీసుకెళ్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నం కూడా ఒక్కసారి మాత్రమే కొద్దిగా పెడతారని, రెండోసారి అడిగితే వంటమనిషి బూతులు తిడుతూ అవమానిస్తాడని విద్యార్థులు తెలిపారు. అంతేకాకుండా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల చేత సారా (బ్రాందీ) తెప్పించుకుంటున్నాడని మరింత షాకింగ్ ఆరోపణలు వెలువడ్డాయి. శ్యాం అనే 10వ తరగతి విద్యార్థి చేత నిత్యం మందు తెప్పించుకుని, అతడితో కలిసి తాగేవాడని విద్యార్థులు చెబుతున్నారు. అదే విద్యార్థి వద్ద నుంచి ₹3000 తీసుకుని తిరిగి ఇవ్వకుండా బూతులు మాట్లాడాడని సమాచారం. ఒకసారి వార్డెన్ మరియు ఓ విద్యార్థి కలిసి బ్రాందీ తాగి గొడవపడగా ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందని కూడా విద్యార్థులు చెబుతున్నారు. అయితే కొందరు విలేకరులు మధ్యలో జోక్యం చేసుకుని, హాస్టల్ వార్డెన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఆ విషయాన్ని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపారని విద్యార్థులు ఆరోపించారు. మందు తాగిన సమయంలో వార్డెన్ విద్యార్థులను బూతులు తిట్టడం, హాస్టల్లోనే మద్యం సేవించి అక్కడే పడుకోవడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బులను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టమైపోయిందని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి హాస్టల్పై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అర్ధాకలితో, అవమానాలతో రోజులు గడుపుతున్న ఈ విద్యార్థుల బాధకు జిల్లా అధికారులు వెంటనే స్పందిస్తారా? లేక ఇలాంటి దారుణాలు కొనసాగుతూనే ఉంటాయా? అనే ప్రశ్నలు స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.2
- Post by J ramesh1
- గిద్దలూరు లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సోమవారం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పొట్టి శ్రీరాములు 125 వ జయంతి సందర్భంగా ఆయన చేసిన త్యాగాన్ని స్మరించారు. తెలుగు వారి కోసం ప్రత్యేకంగా రాష్ట్రం ఉండాలని 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన ఆయన త్యాగాన్ని గుర్తించి అమరావతిలో ప్రభుత్వం 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు.1
- ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో ఏరులై పారుతున్న మద్యం ఎక్సైజ్ చట్టాలను తుంగలోకి తొక్కి, బార్ రూల్స్కి విరుద్ధంగా టెంట్లు వేసి మద్యం అమ్మకాలు మద్యం సిండికేట్ల అవినీతి మత్తులో మునిగితేలుతున్న కృష్ణా జిల్లా ఎక్సైజ్ అధికారులు ఏ బార్లో ఎంత సరుకు కొంటున్నారో.. బహిరంగంగా చెప్పే ధైర్యం ఎక్సైజ్ కమిషనర్కు ఉందా? -పేర్ని నాని, మాజీ మంత్ర1
- నెల్లూరు నగరంలోని స్థానిక మైపాడు గేటు సమీపంలో గల నాయుడు ఫంక్షన్ హాల్ నందు నేటి ఉదయం అంగరంగ వైభవంగా శ్రీ పీఠం గురువర్యులు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ లలిత శివ స్వామి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలను నందు దాదాపు 11 గ్రూపులో సభ్యులు 300 మంది పాల్గొని ఈ కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలు సాంస్కృతిక ముత్యాలు తంబోలా గేమ్స్ మహిళల క్యాట్ వాక్ తదితర పోటీలను నిర్వహించి విజేతలు అయినటువంటి మహిళలను ఘనంగా సన్మానించే కార్యక్రమాన్ని చేపట్టారు. పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఈ కార్యక్రమంలో పండరి భజన బృందాలు కోలాట బృందాలు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు సాయంత్రం వచ్చిన మహిళలందరికీ కూడా బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పీఠం సభ్యులు బ్రాహ్మణ సంఘం సభ్యులు ఇతర గ్రూపు సభ్యులు భక్తులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన మహిళ లకు ప్రత్యేక బహుమతి మరియు ఘనంగా సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగించేందుకు సహకరించిన శ్రీ పీఠం సభ్యులందరికీ కూడా పేరుపేరునా శ్రీ పీఠం నిర్వాహకులు శివయ్య స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.1
- కోవూరు చౌదరి పెట్రోల్ బంకు జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం కోవూరు మండలం లో చౌదరి పెట్రోల్ బంక్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆగి ఉన్న లారీ ను ఆటో డీ కొట్టడం అలాగే ఎల్లయ్యపాలెం కి చెందిన గర్భిణీ స్త్రీ నెల్లూరుకు వెళ్లి ఆస్పత్రిలో చూపించుకొని ఆటోలో ఇంటికి వెళ్లే తరుణంలో ముందుఆగి ఉన్న లారీని ఢీకొట్టడం జరిగింది వాళ్లల్లో డైవర్ కి గర్భిణీ స్త్రీ కి గాయాలు స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ లో నెల్లూరుకు తీసుకెళ్లడం జరిగింది.4
- పుంగనూరు పట్టణంలో ఆదివారం ఓకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం అందరిని కలచివేసింది, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ వర్యులు శ్రీ చల్లా రామచంద్రా రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మృతుల కుటుంబ సభ్యులను కలసి ఓదార్చిన పుంగనూరు తెలుగుదేశం పార్టీ నాయకులు. అన్నమయ్య జిల్లా, పుంగనూరులో నలుగురు మృతి చెందిన ఘటనపై టీడీపీ నాయకులు సోమవారం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందించడం జరిగింది, వారికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.1
- పుట్టింది కమ్మ కులంలో… కానీ రాజకీయాల కోసం కాపు అని చెప్పుకోవడం సిగ్గు లేదా, దొండకాయ కిరణ్ రాయల్?1