logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉపాధి హామీ కార్మికులకు ఇనుప కంచెలు, పండ్ల మొక్కలు అందించాలి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పీడీకి మంచంగిపుట్టు మండల ఆదివాసి గిరిజన సంఘం వినతి ముంచంగిపుట్టు: మండలంలోని 23 పంచాయతీల ఉపాధి హామీ పథకం కార్మికులకు సరఫరా చేసిన సిల్వర్ మొక్కల రక్షణ కోసం ఇనుప కంచెలు, జాలీలు సబ్సిడీపై మంజూరు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం నాయకులు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పీడీకి వినతిపత్రం అందజేశారు. సిల్వర్ మొక్కలతో పాటు నేరేడు, జామ, మామిడి వంటి పండ్ల మొక్కలను కూడా ప్రతి ఏడాది సరఫరా చేయాలని కోరారు. మండలంలోని భూసారాన్ని బట్టి మట్టి పరిశోధన చేసి, లోకల్ నర్సరీలను ప్రోత్సహించాలని, ఉపాధి హామీ మేట్లను కొనసాగించాలని, కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన పీడీ గారు, 23 పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేసి, అవసరమైన మొక్కల వివరాలు ముందుగా అందిస్తే తప్పకుండా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

1 day ago
user_Rc Tv Telugu
Rc Tv Telugu
Paderu, Alluri Sitharama Raju•
1 day ago
d7a0f2c4-729f-40d6-99c7-d1857b64fc1e

ఉపాధి హామీ కార్మికులకు ఇనుప కంచెలు, పండ్ల మొక్కలు అందించాలి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పీడీకి మంచంగిపుట్టు మండల ఆదివాసి గిరిజన సంఘం వినతి ముంచంగిపుట్టు: మండలంలోని 23 పంచాయతీల ఉపాధి హామీ పథకం కార్మికులకు సరఫరా చేసిన సిల్వర్ మొక్కల రక్షణ కోసం ఇనుప కంచెలు, జాలీలు సబ్సిడీపై మంజూరు చేయాలని ఆదివాసి గిరిజన సంఘం నాయకులు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పీడీకి వినతిపత్రం అందజేశారు. సిల్వర్ మొక్కలతో పాటు నేరేడు, జామ, మామిడి వంటి పండ్ల మొక్కలను కూడా ప్రతి ఏడాది సరఫరా చేయాలని కోరారు. మండలంలోని భూసారాన్ని బట్టి మట్టి పరిశోధన చేసి, లోకల్ నర్సరీలను ప్రోత్సహించాలని, ఉపాధి హామీ మేట్లను కొనసాగించాలని, కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన పీడీ గారు, 23 పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేసి, అవసరమైన మొక్కల వివరాలు ముందుగా అందిస్తే తప్పకుండా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీలక్ష్మి దీక్షను ప్రారంభించి సూపర్-6 డిమాండ్స్‌ను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ ఛైర్మన్ నియామకం, బకాయిల చెల్లింపు, ఓపీఎస్ అమలు వంటి అంశాలను ప్రస్తావించారు. అనంతరం నాయకులు జిల్లా రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
    1
    జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీలక్ష్మి దీక్షను ప్రారంభించి సూపర్-6 డిమాండ్స్‌ను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ ఛైర్మన్ నియామకం, బకాయిల చెల్లింపు, ఓపీఎస్ అమలు వంటి అంశాలను ప్రస్తావించారు. అనంతరం నాయకులు జిల్లా రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును లోక్‌స‌భ ఆమోదించ‌డం ప్ర‌తి తెలుగోడు గ‌ర్వించే విష‌యం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త కల్పిస్తూ బుధ‌వారం లోక్‌స‌భ‌లో బిల్లు ఆమోదం పొందిన నేప‌థ్యంలో మంత్రి విజ‌య‌న‌గ‌రంలోని త‌న క్యాంప్ కార్యాయంలో విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఏపీ ప్ర‌జ‌లంద‌రికి ముందుగా శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశ ప‌టంలో ఏపీ రాజ‌ధాని ఎక్క‌డ అన్న సందిగ్ధ‌త‌కు తెర‌దించుతూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్య‌క్తం చేయ‌డంతో పాటు ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఏపీకి ఆంధ్రులు గ‌ర్వించే ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని కావాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గారు ఎంతో తాప‌త్ర‌య‌ప‌డ్డార‌ని.. ఆయ‌న కృషి అమోఘం అని కొనియాడారు. శాత‌వాహ‌నులు పాలించి ఎంతో చ‌రిత్ర ఉన్న అమ‌రావ‌తిని నాడు రాజ‌ధానిగా బాబు ఎంపిక చేశార‌ని గుర్తు చేశారు. నాడు చంద్ర‌బాబు 29 వేల మంది రైతుల‌ను ఒప్పించి.. 33 వేల ఎక‌రాలు సేక‌రించి అమ‌రావ‌తిని ప్ర‌జా రాజ‌ధానిగా ఎంపిక చేశార‌ని... రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులంద‌రికి మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. అమ‌రావ‌తిని అభివృద్ధి మోడ‌ల్‌లో సింగ‌పూర్ లాంటి ప్ర‌పంచం మెచ్చిన న‌గ‌రాల స్థాయిలో ఉంచాల‌నుకున్నార‌ని ... ఎడ్యుకేష‌న్ హ‌బ్‌, క్వాంట‌మ్ వ్యాలీ, మ్యాన్‌ఫ్యాక్చ‌రింగ్ సెక్టార్‌, నాలెడ్జ్ సిటీ వీట‌న్నింటిని మేళ‌విస్తూ అమ‌రావ‌తిని మ‌హాన‌గ‌రం చేయాల‌ని బాబు అనుకున్నార‌ని మంత్రి తెలిపారు. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాల‌న్న నిర్దిష్ట‌మైన ఆలోచ‌న లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మంత్రి వాపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ చంద్ర‌బాబు ప్రారంభించిన అమ‌రావ‌తిని కంటిన్యూ చేస్తే ఆయ‌న‌కు ఎక్క‌డ మంచి పేరు వ‌స్తుందో అని.. అమరావ‌తిని స‌ర్వ‌నాశ‌నం చేసి మూడు రాజ‌ధానుల‌ను తెర‌మీద‌కు తెచ్చార‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ తీరుతో 2014 - 19 టైంలో రాష్ట్రానికి వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌లు కూడా వెన‌క్కు వెళ్లిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం అన్నారు. ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ ప్రాజెక్ట్‌, పోర్టులు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ అన్నీ గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో మొద‌లు పెట్టిన‌వే అన్న విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన మూడు రాజ‌ధానులు ప‌క్క‌న పెట్టి ఇప్పుడు మ‌ళ్లీ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు న‌గ‌రాల‌ను క‌లుపుతూ మావిగన్ పేరుతో కొత్త ప‌ల్ల‌వి అందుకోవ‌డం చూస్తుంటే... ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా ఉంద‌న్నారు. రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ మ‌తిభ్ర‌మించి మాట్లాడుతూ పూట‌కో మాట‌.. రోజుకో నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.
    1
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును లోక్‌స‌భ ఆమోదించ‌డం ప్ర‌తి తెలుగోడు గ‌ర్వించే విష‌యం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త కల్పిస్తూ బుధ‌వారం లోక్‌స‌భ‌లో బిల్లు ఆమోదం పొందిన నేప‌థ్యంలో మంత్రి విజ‌య‌న‌గ‌రంలోని త‌న క్యాంప్ కార్యాయంలో విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఏపీ ప్ర‌జ‌లంద‌రికి ముందుగా శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశ ప‌టంలో ఏపీ రాజ‌ధాని ఎక్క‌డ అన్న సందిగ్ధ‌త‌కు తెర‌దించుతూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్య‌క్తం చేయ‌డంతో పాటు ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఏపీకి ఆంధ్రులు గ‌ర్వించే ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని కావాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గారు ఎంతో తాప‌త్ర‌య‌ప‌డ్డార‌ని.. ఆయ‌న కృషి అమోఘం అని కొనియాడారు. శాత‌వాహ‌నులు పాలించి ఎంతో చ‌రిత్ర ఉన్న అమ‌రావ‌తిని నాడు రాజ‌ధానిగా బాబు ఎంపిక చేశార‌ని గుర్తు చేశారు. నాడు చంద్ర‌బాబు 29 వేల మంది రైతుల‌ను ఒప్పించి.. 33 వేల ఎక‌రాలు సేక‌రించి అమ‌రావ‌తిని ప్ర‌జా రాజ‌ధానిగా ఎంపిక చేశార‌ని... రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులంద‌రికి మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. అమ‌రావ‌తిని అభివృద్ధి మోడ‌ల్‌లో సింగ‌పూర్ లాంటి ప్ర‌పంచం మెచ్చిన న‌గ‌రాల స్థాయిలో ఉంచాల‌నుకున్నార‌ని ... ఎడ్యుకేష‌న్ హ‌బ్‌, క్వాంట‌మ్ వ్యాలీ, మ్యాన్‌ఫ్యాక్చ‌రింగ్ సెక్టార్‌, నాలెడ్జ్ సిటీ వీట‌న్నింటిని మేళ‌విస్తూ అమ‌రావ‌తిని మ‌హాన‌గ‌రం చేయాల‌ని బాబు అనుకున్నార‌ని మంత్రి తెలిపారు. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాల‌న్న నిర్దిష్ట‌మైన ఆలోచ‌న లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మంత్రి వాపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ చంద్ర‌బాబు ప్రారంభించిన అమ‌రావ‌తిని కంటిన్యూ చేస్తే ఆయ‌న‌కు ఎక్క‌డ మంచి పేరు వ‌స్తుందో అని.. అమరావ‌తిని స‌ర్వ‌నాశ‌నం చేసి మూడు రాజ‌ధానుల‌ను తెర‌మీద‌కు తెచ్చార‌ని విమ‌ర్శించారు. 
జ‌గ‌న్ తీరుతో 2014 - 19 టైంలో రాష్ట్రానికి వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌లు కూడా వెన‌క్కు వెళ్లిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం అన్నారు.  
ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ ప్రాజెక్ట్‌, పోర్టులు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ అన్నీ గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో మొద‌లు పెట్టిన‌వే అన్న విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన మూడు రాజ‌ధానులు ప‌క్క‌న పెట్టి ఇప్పుడు మ‌ళ్లీ  మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు న‌గ‌రాల‌ను క‌లుపుతూ మావిగన్ పేరుతో కొత్త ప‌ల్ల‌వి అందుకోవ‌డం చూస్తుంటే... ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా ఉంద‌న్నారు. రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ మ‌తిభ్ర‌మించి మాట్లాడుతూ పూట‌కో మాట‌.. రోజుకో నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.
    user_Kumar
    Kumar
    Reporter Vizianagaram, Andhra Pradesh•
    21 hrs ago
  • కాకినాడ జిల్లా తుని పట్టణంలో గురువారం నాడు ఉదయం జైశ్రీరామ్ "హిందూ బంధువులారా"ఏకం కండి అని నినాదంతో పట్టణంలో హిందూ సంఘాలు ఆధ్వర్యంలో పురవీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన పురవీధుల్లో గుండా జరిగిన ఈ భారీ ర్యాలీలో హిందూ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ పై జరిగిన దాడికి నిరసనగా మేము ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ ర్యాలీలో జైశ్రీరామ్ అనే నినాదం పట్టణమంతా దద్దరిల్లిపోయింది.
    1
    కాకినాడ జిల్లా తుని పట్టణంలో గురువారం నాడు ఉదయం జైశ్రీరామ్ "హిందూ బంధువులారా"ఏకం కండి  అని నినాదంతో పట్టణంలో హిందూ సంఘాలు ఆధ్వర్యంలో పురవీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన పురవీధుల్లో గుండా జరిగిన ఈ భారీ ర్యాలీలో హిందూ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ పై జరిగిన దాడికి నిరసనగా మేము ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ ర్యాలీలో జైశ్రీరామ్ అనే నినాదం పట్టణమంతా దద్దరిల్లిపోయింది.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by Sode Prasad
    1
    Post by Sode Prasad
    user_Sode Prasad
    Sode Prasad
    Insurance Agent చింతూరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • కాకినాడ జిల్లా.. కాకినాడ రూరల్.. *కాకినాడ రూరల్* పరిధిలోని *సర్పవరంలో* *మేక మాంసం* పేరిట *బీఫ్* కలిపి విక్రయిస్తున్న దుకాణదారుడిని మేక మాంసం వర్తక సంఘం సభ్యులు పట్టుకున్నారు. పూల మార్కెట్ సమీపంలో ఉన్న దుకాణాన్ని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. వెంటనే దుకాణ నిర్వాహకుడిని పట్టుకుని గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా మేక మాంసం వర్తక సంఘం సభ్యులు మాట్లాడుతూ… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకు మేక మాంసం అందిస్తామనే పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 500 నుంచి 600 రూపాయలకే మేక మాంసం అమ్ముతున్నారని నమ్మి కొనుగోలు చేస్తే, అందులో బీఫ్ కలపడం, చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న మేకలను కోసి విక్రయించడం జరుగుతోందని ఆరోపించారు. గత రెండు రోజులుగా సంఘం ఆధ్వర్యంలో అన్ని మేక మాంసం దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, అసలు తక్కువ ధరలకు మాంసం ఎలా అమ్ముతున్నారో తెలుసుకునేందుకే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి ఇలాంటి అక్రమాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, రోడ్డు పక్కన అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇకపై కూడా ఇలాంటి దుకాణాలను గుర్తించి ఫిర్యాదులు చేస్తామని స్పష్టం చేశారు.
    1
    కాకినాడ జిల్లా..
కాకినాడ రూరల్..
*కాకినాడ రూరల్* పరిధిలోని *సర్పవరంలో* *మేక మాంసం* పేరిట *బీఫ్* కలిపి విక్రయిస్తున్న దుకాణదారుడిని మేక మాంసం వర్తక సంఘం సభ్యులు పట్టుకున్నారు. పూల మార్కెట్ సమీపంలో ఉన్న దుకాణాన్ని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. వెంటనే దుకాణ నిర్వాహకుడిని పట్టుకుని గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్‌కు అప్పగించారు.
ఈ సందర్భంగా మేక మాంసం వర్తక సంఘం సభ్యులు మాట్లాడుతూ…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకు మేక మాంసం అందిస్తామనే పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 500 నుంచి 600 రూపాయలకే మేక మాంసం అమ్ముతున్నారని నమ్మి కొనుగోలు చేస్తే, అందులో బీఫ్ కలపడం, చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న మేకలను కోసి విక్రయించడం జరుగుతోందని ఆరోపించారు.
గత రెండు రోజులుగా సంఘం ఆధ్వర్యంలో అన్ని మేక మాంసం దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, అసలు తక్కువ ధరలకు మాంసం ఎలా అమ్ముతున్నారో తెలుసుకునేందుకే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు.
నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి ఇలాంటి అక్రమాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, రోడ్డు పక్కన అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇకపై కూడా ఇలాంటి దుకాణాలను గుర్తించి ఫిర్యాదులు చేస్తామని స్పష్టం చేశారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • పాతపట్నంలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చింతాడ పూజిత (12) అనే విద్యార్థిని మృతి చెందింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భోజనాలకు వెళుతుండగా మెట్ల పైనుంచి జారి కిందపడింది. తీవ్రంగా గాయపడిన బాలికను పాఠశాల సిబ్బంది సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.
    1
    పాతపట్నంలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చింతాడ పూజిత (12) అనే విద్యార్థిని మృతి చెందింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భోజనాలకు వెళుతుండగా మెట్ల పైనుంచి జారి కిందపడింది. తీవ్రంగా గాయపడిన బాలికను పాఠశాల సిబ్బంది సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మల మండలం నౌపడ గ్రామంలో హనుమాన్ విజయోత్సవ పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా భక్తులు స్వామివారిని సింధూర సేవలు తమ చిన్న సేవలు చేసి స్వామి వారి విశేష పూజ నిర్వహించారు.
    4
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మల మండలం నౌపడ గ్రామంలో హనుమాన్ విజయోత్సవ పూజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో భాగంగా భక్తులు స్వామివారిని సింధూర సేవలు తమ చిన్న సేవలు చేసి స్వామి వారి విశేష పూజ నిర్వహించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.