logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పాతపట్నం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మెట్లపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి పాతపట్నంలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చింతాడ పూజిత (12) అనే విద్యార్థిని మృతి చెందింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భోజనాలకు వెళుతుండగా మెట్ల పైనుంచి జారి కిందపడింది. తీవ్రంగా గాయపడిన బాలికను పాఠశాల సిబ్బంది సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.

2 hrs ago
user_ANR
ANR
పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

పాతపట్నం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మెట్లపై నుంచి జారిపడి విద్యార్థిని మృతి పాతపట్నంలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చింతాడ పూజిత (12) అనే విద్యార్థిని మృతి చెందింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భోజనాలకు వెళుతుండగా మెట్ల పైనుంచి జారి కిందపడింది. తీవ్రంగా గాయపడిన బాలికను పాఠశాల సిబ్బంది సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పాతపట్నంలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చింతాడ పూజిత (12) అనే విద్యార్థిని మృతి చెందింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భోజనాలకు వెళుతుండగా మెట్ల పైనుంచి జారి కిందపడింది. తీవ్రంగా గాయపడిన బాలికను పాఠశాల సిబ్బంది సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.
    1
    పాతపట్నంలోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చింతాడ పూజిత (12) అనే విద్యార్థిని మృతి చెందింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భోజనాలకు వెళుతుండగా మెట్ల పైనుంచి జారి కిందపడింది. తీవ్రంగా గాయపడిన బాలికను పాఠశాల సిబ్బంది సామాజిక ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాఆముదాలవలసలో కొరపాం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే కూన రవికుమార్.ఈ సందర్భంగా పాఠ శాలలో, అంగన్వాడీ లో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, శుభ్రత, మెనూ వంటి అంశాలను అధికారులు మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.ఈ సందర్శనలో ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు.
    4
    శ్రీకాకుళం జిల్లాఆముదాలవలసలో కొరపాం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఆకస్మికంగా పరిశీలించిన ఎమ్మెల్యే కూన రవికుమార్.ఈ సందర్భంగా పాఠ శాలలో, అంగన్వాడీ లో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే  స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, శుభ్రత, మెనూ వంటి అంశాలను అధికారులు మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.ఈ సందర్శనలో ఎమ్మెల్యే కూన రవికుమార్ విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • శ్రీకాకుళం రూరల్, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఊపిరి పోస్తూ కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్న 'ఉచిత విద్యుత్' పథకం నేతన్నల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సింగుపురం పంచాయతీలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. దీనివల్ల చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 8,640 నుండి రూ. 21,600 వరకు విద్యుత్ భారం తగ్గుతుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ. 150 కోట్లు వెచ్చిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సింగుపురంలో కొత్తగా మంజూరైన పింఛన్లను కూడా పంపిణీ చేస్తూ, వృద్ధులు, వికలాంగులు, విధవలకు ప్రతి నెలా సమయానికి ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. "వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్" పథకంలో రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డుల్లో 4 చేనేత రంగానికే రావడం గమనార్హమని, ఆప్కో డిజిటలైజేషన్ ద్వారా అమ్మకాలు కూడా పెరిగాయని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
    4
    శ్రీకాకుళం రూరల్, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఊపిరి పోస్తూ కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్న 'ఉచిత విద్యుత్' పథకం నేతన్నల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోందని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం సింగుపురం పంచాయతీలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. దీనివల్ల చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 8,640 నుండి రూ. 21,600 వరకు విద్యుత్ భారం తగ్గుతుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ. 150 కోట్లు వెచ్చిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం సింగుపురంలో కొత్తగా మంజూరైన పింఛన్లను కూడా పంపిణీ చేస్తూ, వృద్ధులు, వికలాంగులు, విధవలకు ప్రతి నెలా సమయానికి ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యతని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. "వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్" పథకంలో రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డుల్లో 4 చేనేత రంగానికే రావడం గమనార్హమని, ఆప్కో డిజిటలైజేషన్ ద్వారా అమ్మకాలు కూడా పెరిగాయని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును లోక్‌స‌భ ఆమోదించ‌డం ప్ర‌తి తెలుగోడు గ‌ర్వించే విష‌యం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త కల్పిస్తూ బుధ‌వారం లోక్‌స‌భ‌లో బిల్లు ఆమోదం పొందిన నేప‌థ్యంలో మంత్రి విజ‌య‌న‌గ‌రంలోని త‌న క్యాంప్ కార్యాయంలో విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఏపీ ప్ర‌జ‌లంద‌రికి ముందుగా శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశ ప‌టంలో ఏపీ రాజ‌ధాని ఎక్క‌డ అన్న సందిగ్ధ‌త‌కు తెర‌దించుతూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్య‌క్తం చేయ‌డంతో పాటు ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఏపీకి ఆంధ్రులు గ‌ర్వించే ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని కావాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గారు ఎంతో తాప‌త్ర‌య‌ప‌డ్డార‌ని.. ఆయ‌న కృషి అమోఘం అని కొనియాడారు. శాత‌వాహ‌నులు పాలించి ఎంతో చ‌రిత్ర ఉన్న అమ‌రావ‌తిని నాడు రాజ‌ధానిగా బాబు ఎంపిక చేశార‌ని గుర్తు చేశారు. నాడు చంద్ర‌బాబు 29 వేల మంది రైతుల‌ను ఒప్పించి.. 33 వేల ఎక‌రాలు సేక‌రించి అమ‌రావ‌తిని ప్ర‌జా రాజ‌ధానిగా ఎంపిక చేశార‌ని... రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులంద‌రికి మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. అమ‌రావ‌తిని అభివృద్ధి మోడ‌ల్‌లో సింగ‌పూర్ లాంటి ప్ర‌పంచం మెచ్చిన న‌గ‌రాల స్థాయిలో ఉంచాల‌నుకున్నార‌ని ... ఎడ్యుకేష‌న్ హ‌బ్‌, క్వాంట‌మ్ వ్యాలీ, మ్యాన్‌ఫ్యాక్చ‌రింగ్ సెక్టార్‌, నాలెడ్జ్ సిటీ వీట‌న్నింటిని మేళ‌విస్తూ అమ‌రావ‌తిని మ‌హాన‌గ‌రం చేయాల‌ని బాబు అనుకున్నార‌ని మంత్రి తెలిపారు. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాల‌న్న నిర్దిష్ట‌మైన ఆలోచ‌న లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మంత్రి వాపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ చంద్ర‌బాబు ప్రారంభించిన అమ‌రావ‌తిని కంటిన్యూ చేస్తే ఆయ‌న‌కు ఎక్క‌డ మంచి పేరు వ‌స్తుందో అని.. అమరావ‌తిని స‌ర్వ‌నాశ‌నం చేసి మూడు రాజ‌ధానుల‌ను తెర‌మీద‌కు తెచ్చార‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ తీరుతో 2014 - 19 టైంలో రాష్ట్రానికి వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌లు కూడా వెన‌క్కు వెళ్లిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం అన్నారు. ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ ప్రాజెక్ట్‌, పోర్టులు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ అన్నీ గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో మొద‌లు పెట్టిన‌వే అన్న విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన మూడు రాజ‌ధానులు ప‌క్క‌న పెట్టి ఇప్పుడు మ‌ళ్లీ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు న‌గ‌రాల‌ను క‌లుపుతూ మావిగన్ పేరుతో కొత్త ప‌ల్ల‌వి అందుకోవ‌డం చూస్తుంటే... ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా ఉంద‌న్నారు. రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ మ‌తిభ్ర‌మించి మాట్లాడుతూ పూట‌కో మాట‌.. రోజుకో నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.
    1
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును లోక్‌స‌భ ఆమోదించ‌డం ప్ర‌తి తెలుగోడు గ‌ర్వించే విష‌యం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త కల్పిస్తూ బుధ‌వారం లోక్‌స‌భ‌లో బిల్లు ఆమోదం పొందిన నేప‌థ్యంలో మంత్రి విజ‌య‌న‌గ‌రంలోని త‌న క్యాంప్ కార్యాయంలో విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఏపీ ప్ర‌జ‌లంద‌రికి ముందుగా శుభాకాంక్ష‌లు తెలిపారు. దేశ ప‌టంలో ఏపీ రాజ‌ధాని ఎక్క‌డ అన్న సందిగ్ధ‌త‌కు తెర‌దించుతూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్య‌క్తం చేయ‌డంతో పాటు ప్ర‌ధాన‌మంత్రి మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఏపీకి ఆంధ్రులు గ‌ర్వించే ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని కావాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గారు ఎంతో తాప‌త్ర‌య‌ప‌డ్డార‌ని.. ఆయ‌న కృషి అమోఘం అని కొనియాడారు. శాత‌వాహ‌నులు పాలించి ఎంతో చ‌రిత్ర ఉన్న అమ‌రావ‌తిని నాడు రాజ‌ధానిగా బాబు ఎంపిక చేశార‌ని గుర్తు చేశారు. నాడు చంద్ర‌బాబు 29 వేల మంది రైతుల‌ను ఒప్పించి.. 33 వేల ఎక‌రాలు సేక‌రించి అమ‌రావ‌తిని ప్ర‌జా రాజ‌ధానిగా ఎంపిక చేశార‌ని... రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులంద‌రికి మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. అమ‌రావ‌తిని అభివృద్ధి మోడ‌ల్‌లో సింగ‌పూర్ లాంటి ప్ర‌పంచం మెచ్చిన న‌గ‌రాల స్థాయిలో ఉంచాల‌నుకున్నార‌ని ... ఎడ్యుకేష‌న్ హ‌బ్‌, క్వాంట‌మ్ వ్యాలీ, మ్యాన్‌ఫ్యాక్చ‌రింగ్ సెక్టార్‌, నాలెడ్జ్ సిటీ వీట‌న్నింటిని మేళ‌విస్తూ అమ‌రావ‌తిని మ‌హాన‌గ‌రం చేయాల‌ని బాబు అనుకున్నార‌ని మంత్రి తెలిపారు. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాల‌న్న నిర్దిష్ట‌మైన ఆలోచ‌న లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మంత్రి వాపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ చంద్ర‌బాబు ప్రారంభించిన అమ‌రావ‌తిని కంటిన్యూ చేస్తే ఆయ‌న‌కు ఎక్క‌డ మంచి పేరు వ‌స్తుందో అని.. అమరావ‌తిని స‌ర్వ‌నాశ‌నం చేసి మూడు రాజ‌ధానుల‌ను తెర‌మీద‌కు తెచ్చార‌ని విమ‌ర్శించారు. 
జ‌గ‌న్ తీరుతో 2014 - 19 టైంలో రాష్ట్రానికి వ‌చ్చిన ప‌రిశ్ర‌మ‌లు కూడా వెన‌క్కు వెళ్లిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం అన్నారు.  
ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ ప్రాజెక్ట్‌, పోర్టులు, భోగాపురం ఎయిర్‌పోర్ట్ అన్నీ గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో మొద‌లు పెట్టిన‌వే అన్న విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన మూడు రాజ‌ధానులు ప‌క్క‌న పెట్టి ఇప్పుడు మ‌ళ్లీ  మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు న‌గ‌రాల‌ను క‌లుపుతూ మావిగన్ పేరుతో కొత్త ప‌ల్ల‌వి అందుకోవ‌డం చూస్తుంటే... ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా ఉంద‌న్నారు. రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ మ‌తిభ్ర‌మించి మాట్లాడుతూ పూట‌కో మాట‌.. రోజుకో నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.
    user_Kumar
    Kumar
    Reporter Vizianagaram, Andhra Pradesh•
    4 hrs ago
  • గమ్ డిసీజ్ నొప్పి లేకుండా నిశ్శబ్దంగా మొదలవుతుంది, కానీ లోపల నష్టం జరుగుతూనే ఉంటుంది. బ్రష్ చేస్తే రక్తం రావడం, గమ్‌లు ఎర్రగా లేదా వాపుగా ఉండటం మొదటి లక్షణాలు. ప్రారంభ దశలో (gingivitis) ఇది పూర్తిగా తగ్గించవచ్చు, కానీ పట్టించుకోకపోతే బోన్ లాస్, పళ్ళు లూజ్ అవ్వడం వరకు వెళ్తుంది. క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లోస్ చేయడం, డెంటిస్ట్ చెక్‌ప్ చేయించుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు. Dr. ప్రియాంక మజ్జి పీరియాడోంటిస్ట్ (చిగుళ్ల నిపుణులు) మరియు ఇంప్లాంటాలజిస్ట్ కిరణ్ డెంటల్ క్లినిక్, విజయనగరం
    1
    గమ్ డిసీజ్ నొప్పి లేకుండా నిశ్శబ్దంగా మొదలవుతుంది, కానీ లోపల నష్టం జరుగుతూనే ఉంటుంది. 
బ్రష్ చేస్తే రక్తం రావడం, గమ్‌లు ఎర్రగా లేదా వాపుగా ఉండటం మొదటి లక్షణాలు. 
ప్రారంభ దశలో (gingivitis) ఇది పూర్తిగా తగ్గించవచ్చు, కానీ పట్టించుకోకపోతే బోన్ లాస్, పళ్ళు లూజ్ అవ్వడం వరకు వెళ్తుంది. 
క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లోస్ చేయడం, డెంటిస్ట్ చెక్‌ప్ చేయించుకోవడం ద్వారా దీన్ని నివారించవచ్చు.
Dr. ప్రియాంక మజ్జి 
పీరియాడోంటిస్ట్ (చిగుళ్ల నిపుణులు) మరియు ఇంప్లాంటాలజిస్ట్ 
కిరణ్ డెంటల్ క్లినిక్, విజయనగరం
    user_Kiran Dental Clinic
    Kiran Dental Clinic
    Dental Clinic విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీలక్ష్మి దీక్షను ప్రారంభించి సూపర్-6 డిమాండ్స్‌ను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ ఛైర్మన్ నియామకం, బకాయిల చెల్లింపు, ఓపీఎస్ అమలు వంటి అంశాలను ప్రస్తావించారు. అనంతరం నాయకులు జిల్లా రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
    1
    జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీలక్ష్మి దీక్షను ప్రారంభించి సూపర్-6 డిమాండ్స్‌ను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ ఛైర్మన్ నియామకం, బకాయిల చెల్లింపు, ఓపీఎస్ అమలు వంటి అంశాలను ప్రస్తావించారు. అనంతరం నాయకులు జిల్లా రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో చేనేత కార్మికులకు పింఛన్లను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేతన్నల జీవితాలలో సరికొత్త వెలుగులు నింపుతుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం CBN చిత్రపటానికి బాలాభిషేకం చేశారు.చేనేత కార్మికులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు,
    1
    పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో చేనేత కార్మికులకు పింఛన్లను పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేతన్నల జీవితాలలో సరికొత్త వెలుగులు నింపుతుందని అన్నారు. ఈ సందర్భంగా సీఎం CBN చిత్రపటానికి బాలాభిషేకం చేశారు.చేనేత కార్మికులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు,
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.