నాలుగు లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన కాంట్రాక్ట్ కార్మికులు-బ్లాక్ డే లో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లాక్ డే పిలుపులో భాగంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, టియుసిఐ నాయకులు పి సతీష్ లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చివేసి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా, విదేశీ బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడులను 2019 నుంచి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు వల్ల పని గంటలు పెరుగుతాయని,ఉద్యోగ భద్రత ఉండదని, వేతనాల చెల్లింపుకు గ్యారెంటీ ఉండదని అన్నారు. కార్మిక సంఘాలను, సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కులను పరిమితం చేయడమే ఈ లేబర్ కోడల ఉద్దేశమని అన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పోరాడే తమ హక్కులను కాపాడుకోవడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.
నాలుగు లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన కాంట్రాక్ట్ కార్మికులు-బ్లాక్ డే లో పాల్గొన్న కార్మిక సంఘాల నాయకులు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లాక్ డే పిలుపులో భాగంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, టియుసిఐ నాయకులు పి సతీష్ లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చివేసి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా, విదేశీ బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడులను 2019 నుంచి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు వల్ల పని గంటలు పెరుగుతాయని,ఉద్యోగ భద్రత ఉండదని, వేతనాల చెల్లింపుకు గ్యారెంటీ ఉండదని అన్నారు. కార్మిక సంఘాలను, సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కులను పరిమితం చేయడమే ఈ లేబర్ కోడల ఉద్దేశమని అన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పోరాడే తమ హక్కులను కాపాడుకోవడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.
- హన్మకొండ జిల్లా కాజీపేట బాపూజీ నగర్లోని కారుణ్య క్లీనిక్ సమీపంలో గొలుసు దొంగతనం జరిగింది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళపై బైక్పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.3
- పోలవరం జిల్లా... పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం. పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...4
- నకిరేకల్ మునిసిపాలిటీ:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ 21వ రోజు మహాధర్నా కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ మహాధర్నాకు అధ్యక్షుడు వంటిపాక లక్ష్మయ్య ఆధ్వర్యం వహించగా, ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మార్కెట్ యార్డులో పనిచేసే దడువాయుల జీవనోపాధి కష్టాల్లో ఉందని, వారికి తక్షణమే పని కల్పించి ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.3
- अमरावती बनी आंध्र प्रदेश की स्थायी राजधानी, लोकसभा में FCRA बिल को लेकर हंगामा लोकसभा में बुधवार का दिन राजनीतिक तौर पर बेहद गर्म रहा। सदन ने आंध्र प्रदेश पुनर्गठन (संशोधन) बिल, 2026 को मंजूरी दे दी, जिसके बाद अमरावती को राज्य की एकमात्र और स्थायी राजधानी बनाने का रास्ता पूरी तरह साफ हो गया। गृह राज्य मंत्री ने यह बिल पेश किया था, जिस पर एक घंटे से ज्यादा चर्चा चली और फिर वॉयस वोट से पास कर दिया गया। लेकिन कार्यवाही शुरू होते ही माहौल बदल गया। विपक्षी सदस्यों ने विदेशी अंशदान संशोधन (FCRA) बिल के खिलाफ जोरदार विरोध शुरू कर दिया। ‘बिल वापस लो’ के नारे लगाते हुए सांसद अपनी सीटों पर खड़े हो गए। स्पीकर की अपील के बाद भी हंगामा थमता नहीं दिखा। संसदीय कार्य मंत्री ने साफ किया कि FCRA बिल पर आज कोई चर्चा नहीं होगी। यह बिल 25 मार्च को पेश किया गया था और विदेशी फंडिंग पाने वाले संगठनों पर नियमों को और सख्त व पारदर्शी बनाने का प्रस्ताव रखता है। FCRA संशोधन में यह भी व्यवस्था है कि जिन संगठनों का पंजीकरण रद्द या समाप्त होता है, उनकी विदेशी फंडिंग और उससे जुड़ी संपत्तियों के प्रबंधन के लिए अलग से एक प्राधिकरण नियुक्त किया जा सकेगा। लोकसभा की कार्यवाही में बजट सत्र के दौरान यह अब तक के सबसे तीखे टकरावों में से एक माना जा रहा है।1
- గుంటూరు నూతన కలెక్టర్ C.Mసాయికాంత్ వర్మ గుంటూరు జిల్లా నూతన కలెక్టర్గా C.M సాయికాంత్ వర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, DRO ఖాజావలి, RDO శ్రీనివాస్, కమిషనర్ కె.మయూర్ అశోక్ తదితరులు ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.1
- జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వాసవి గార్డెన్ సమీపంలో కుక్కల దాడితో ముగ్గురు గాయపడ్డారు. కుక్కల బెడద తో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన పరువురిని గాయపరచడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉదయం ఆడుకుంటున్న ఓ బాలుడి పై దాడి చేసిన కుక్కలు.. మధ్యాహ్నం సమయంలో అదే బాధితుడి తాత పై దాడి చేసి గాయపరిచింది. ఆ బాలుడిని నెల రోజుల్లో కుక్కలు కరవడం రెండోసారి. అక్కడితో ఆగకుండా, మరో చిన్నారిని, అతని కుటుంబీకులను కూడా కుక్కలు వేటాడి కరిచాయి. వరుస ఘటనలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.1
- వరంగల్ జిల్లా:వరంగల్లోని ఏనుమాముల మార్కెట్ సమీపంలో నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు తయారు చేస్తున్న ‘ఉమానాగ్ పాలిమర్స్’పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.12 లక్షల విలువైన ప్లాస్టిక్ సరుకును స్వాధీనం చేసుకొని, ఫ్యాక్టరీ నిర్వాహకుడికి రూ.50 వేల జరిమానా విధించారు. అధికారులు యూనిట్ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.1
- జగిత్యాల జిల్లాలో అకాల వర్షం వడగళ్ల వానతో పంట నష్టాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. సారంగాపూర్ మండలం అర్పపల్లి , పెంబట్ల గ్రామంలో అకాల వర్షంతో నెలకొరిగిన మొక్కజొన్న, నువ్వుల పంటలను లక్ష్మీదేవిపల్లెలో రవి నాయక్ బీరకాయ తోటను రైతులతో కలిసి పరిశీలించారు. అక్కడినుంచే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జీవన్ రెడ్డి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మన జిల్లాలో అకాల వర్షంతో జగిత్యాల నియోజకవర్గంతో పాటు ధర్మపురి నియోజకవర్గంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. జన్మదిన కానుకగా రైతులు ఎవరు అధైర్యాపడొద్దు అని ప్రకటన చేసి కలెక్టర్ తో నివేదిక తెప్పించుకొని ప్రభుత్వ పరంగా త్వరగా పరిహారం అందేలా చూడాలని కోరారు. పంటల బీమా పథకం అమలు చేస్తే కొంత రైతుకు ఊరట కలుగుతుండేనని ప్రభుత్వం వెంటనే పంటల బీమా పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకున్నప్పుడే రైతాంగం పై ఆధారపడి ఉన్న రైతు కూలీలకు ఉపాధి కలిగించిన వాళ్ళం అవుతామని తెలిపారు. పంటల పెట్టుబడి రైతు భరోసా రైతుకు కల్పింపచేయటంలో ప్రభుత్వం సరైన సమయంలో స్పందన లేకపోవడంతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాన 20 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.4
- Post by Syyed taher1