logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గుడంబా స్తావరాలపై పోలీసుల దాడులు భారీగా నాటు సారా, బెల్లం స్వాధీనం మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల అనంతారం, పెద్ద తండా, సిరోలు మండలంలోని తాళ్ల సంకీసా వసరం తండా మన్నెగూడెం మరియు కొత్త తండాలలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, DTF- మహబూబాబాద్ & STF- హైదరాబాద్ టీంలు సంయుక్తంగా సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు ఇట్టి దాడుల్లో (05) మంది ముద్దాయిలను అదుపులో కి తీసుకుని వారి పై కేసులు నమోదు చేసి, తదుపరి వారిని సంబంధిత తాహసిల్దార్ గారి ముందు బైండోవర్ చేసారు,ఈ దాడుల్లో (19) లీటర్ల సారాయి, (50) కిలోల బెల్లం,(30) కిలోల పటిక స్వాధీనం చేసుకుని (600)లీటర్ల సారాయి తయారీకి ఉపయోగించే బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

1 hr ago
user_Mogulagani Mahendar Mogulagani Mahendar
Mogulagani Mahendar Mogulagani Mahendar
మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
1 hr ago

మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గుడంబా స్తావరాలపై పోలీసుల దాడులు భారీగా నాటు సారా, బెల్లం స్వాధీనం మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల అనంతారం, పెద్ద తండా, సిరోలు మండలంలోని తాళ్ల సంకీసా వసరం తండా మన్నెగూడెం మరియు కొత్త తండాలలో మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, DTF- మహబూబాబాద్ & STF- హైదరాబాద్ టీంలు సంయుక్తంగా సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు ఇట్టి దాడుల్లో (05) మంది ముద్దాయిలను అదుపులో కి తీసుకుని వారి పై కేసులు నమోదు చేసి, తదుపరి వారిని సంబంధిత తాహసిల్దార్ గారి ముందు బైండోవర్ చేసారు,ఈ దాడుల్లో (19) లీటర్ల సారాయి, (50) కిలోల బెల్లం,(30) కిలోల పటిక స్వాధీనం చేసుకుని (600)లీటర్ల సారాయి తయారీకి ఉపయోగించే బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • మహబూబాబాద్ జిల్లా:కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బంగారి నరేష్, తన కుమారుడు లక్కీతో కలిసి​ గుండం రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో తండ్రీకొడుకులిద్దరూ కలిసి లయబద్ధంగా డ్యాన్స్ చేశారు. తండ్రీకొడుకులు ఇలా కలిసి డ్యాన్స్ చేయడం చూడటానికి ఎంతో కనువిందుగా ఉందని స్థానికులు ప్రశంసించారు. చిన్న వయసులోనే లక్కీ ప్రదర్శించిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
    1
    మహబూబాబాద్ జిల్లా:కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బంగారి నరేష్, తన కుమారుడు లక్కీతో కలిసి​ గుండం రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో తండ్రీకొడుకులిద్దరూ కలిసి లయబద్ధంగా డ్యాన్స్ చేశారు.
తండ్రీకొడుకులు ఇలా కలిసి డ్యాన్స్ చేయడం చూడటానికి ఎంతో కనువిందుగా ఉందని స్థానికులు ప్రశంసించారు. చిన్న వయసులోనే లక్కీ ప్రదర్శించిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    13 min ago
  • వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సును ఏకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ చర్యలు చేపట్టింది. పర్యాటకుల కోసం బోటు షికారు, కాటేజీలు, అంతర్గత రహదారులు, టాయిలెట్లు వంటి సౌకర్యాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పనులతో పాకాల సరస్సు పర్యాటక ఆకర్షణగా మారనుంది.
    2
    వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సును ఏకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అటవీ శాఖ చర్యలు చేపట్టింది. పర్యాటకుల కోసం బోటు షికారు, కాటేజీలు, అంతర్గత రహదారులు, టాయిలెట్లు వంటి సౌకర్యాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. ఈ పనులతో పాకాల సరస్సు పర్యాటక ఆకర్షణగా మారనుంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పాకాల సరస్సును ఏకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రకృతి సోయగాలను కాపాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు. వరంగల్ అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకాల సరస్సులో బోటు షికారును మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదనంగా పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాయిలెట్ల మరమ్మత్తులు చేపడుతున్నట్లు వివరించారు. పర్యావరణానికి హాని కలగకుండా, సహజ వనరులను సంరక్షిస్తూ ఏకో టూరిజం ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాలతో వచ్చే సందర్శకులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అభివృద్ధి చర్యలతో పాకాల సరస్సు ప్రాంతానికి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
    2
    వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం పాకాల సరస్సును ఏకో టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రకృతి సోయగాలను కాపాడుతూ అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వరంగల్ డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ తెలిపారు.
వరంగల్ అటవీశాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకాల సరస్సులో బోటు షికారును మరింత విస్తరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అదనంగా పర్యాటకుల కోసం కాటేజీల నిర్మాణం, అంతర్గత రహదారుల అభివృద్ధి, శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాయిలెట్ల మరమ్మత్తులు చేపడుతున్నట్లు వివరించారు.
పర్యావరణానికి హాని కలగకుండా, సహజ వనరులను సంరక్షిస్తూ ఏకో టూరిజం ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. కుటుంబాలతో వచ్చే సందర్శకులకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక భద్రతా చర్యలు కూడా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ అభివృద్ధి చర్యలతో పాకాల సరస్సు ప్రాంతానికి పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • వరంగల్ :వర్ధన్నపేట పట్టణం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న మీరు, మా నాయకుడు 2 వేల ఎకరాల భూమి కబ్జా చేశాడని చెబితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మండలానికో గెస్ట్ హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాలు ప్రజా సేవ కోసం వినియోగిస్తున్నవేనని, సిఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా అక్కడే జరిగిందని పేర్కొన్నారు. అక్రమ మార్గాల్లో పదవులు చేపట్టి మా నాయకులను విమర్శిస్తే కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోధుమలు మధుసూదన్, మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, కౌన్సిలర్లు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
    2
    వరంగల్ :వర్ధన్నపేట పట్టణం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న మీరు, మా నాయకుడు 2 వేల ఎకరాల భూమి కబ్జా చేశాడని చెబితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
మండలానికో గెస్ట్ హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యాలయాలు ప్రజా సేవ కోసం వినియోగిస్తున్నవేనని, సిఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా అక్కడే జరిగిందని పేర్కొన్నారు. అక్రమ మార్గాల్లో పదవులు చేపట్టి మా నాయకులను విమర్శిస్తే కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోధుమలు మధుసూదన్, మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, మాజీ జెడ్పిటిసి మార్గం బిక్షపతి, కౌన్సిలర్లు మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    19 min ago
  • ఖమ్మం:పెనుబల్లి మండల కేంద్రంలో విషాదం... స్నేహితుడి దశదిన కర్మకు వచ్చి వెళ్తుండగా పెనుబల్లి శివారు వైంజంక్షన్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న బర్రె వంశీ(24) కి తలభాగంలో తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి. మృతుడు వంశీ సత్తుపల్లి డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహణ తోటి ప్రైవేటు బస్సు డ్రైవర్ రాయల ప్రకాశ్ దశదిశ కార్యక్రమానికి వచ్చి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వంశీ.. 10రోజుల వ్యవధిలో ఇద్దరు ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందటంతో నెలకొన్న విషాదం
    3
    ఖమ్మం:పెనుబల్లి మండల కేంద్రంలో విషాదం...
స్నేహితుడి దశదిన కర్మకు వచ్చి వెళ్తుండగా పెనుబల్లి శివారు వైంజంక్షన్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న బర్రె వంశీ(24) కి తలభాగంలో తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే మృతి.
మృతుడు వంశీ సత్తుపల్లి డిపోలో ప్రైవేటు బస్సు డ్రైవర్ గా విధులు నిర్వహణ
తోటి ప్రైవేటు బస్సు డ్రైవర్ రాయల ప్రకాశ్ దశదిశ కార్యక్రమానికి వచ్చి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వంశీ..
10రోజుల వ్యవధిలో  ఇద్దరు ఆర్టీసీ ప్రైవేట్ బస్ డ్రైవర్లు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందటంతో నెలకొన్న విషాదం
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
  • హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో దొంగలు హల్చల్ తాళం వేసి ఉన్న ఆవుల సంపత్ ఇంట్లో 5 తులాల బంగారం,లక్ష యాభై వేల నగదు అపహరణ. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
    1
    హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరా గ్రామంలో దొంగలు హల్చల్ తాళం వేసి ఉన్న ఆవుల సంపత్ ఇంట్లో 5 తులాల బంగారం,లక్ష యాభై వేల నగదు అపహరణ.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    10 hrs ago
  • ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని,అనుముల గ్రామమును సోలార్ మోడల్ విలేజ్ ఎంపికైన సందర్భంగా సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన TGSPDCL-CMD గౌరవ శ్రీ ముషరఫ్ అలీ ఫరూక్ IAS మరియు నల్గొండ జిల్లా సబ్-కలెక్టర్ శ్రీ అమిత్ నారాయన్ IAS గారితో పాటు హాజరై అనుముల గ్రామానికి 41.63 కోట్ల రూపాయలతో సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ,సౌర విద్యుత్ వలన ఉన్న లాభాలను,కరెంటు వినియోగించుకునే పద్ధతులను రైతులకు మరియు ప్రజలకు సవివరంగా తెలియజేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ కుందూరు జయవీర్ రెడ్డి గారు
    1
    ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని,అనుముల గ్రామమును సోలార్ మోడల్ విలేజ్  ఎంపికైన సందర్భంగా సోలార్ విద్యుత్ పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన TGSPDCL-CMD గౌరవ శ్రీ ముషరఫ్ అలీ ఫరూక్ IAS మరియు నల్గొండ జిల్లా సబ్-కలెక్టర్ శ్రీ అమిత్ నారాయన్ IAS గారితో పాటు హాజరై అనుముల గ్రామానికి 41.63 కోట్ల రూపాయలతో సోలార్ మోడల్ విలేజ్ గా ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ,సౌర విద్యుత్ వలన ఉన్న లాభాలను,కరెంటు వినియోగించుకునే పద్ధతులను రైతులకు మరియు ప్రజలకు సవివరంగా తెలియజేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ కుందూరు జయవీర్ రెడ్డి గారు
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    4 hrs ago
  • లక్కీ డ్రాలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా తునం శ్రావణ్ గెలవడంతో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎంపీ కడియం కావ్య ఆనందోత్సవానికి సంబందించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది తొర్రూరు చైర్మన్ పీఠాన్ని దక్కింఛుకునేందుకు ఇరు పార్టీలకు సమానం ఓట్లు రాగా ఎన్నికల అధికారులు లక్కీ డ్రా తీస్తున్న సమయంలో మున్సిపల్ కార్యాలయంలో నెలకొన్న ఉత్కంఠ క్షణాలు గెలిచిన ఆనందం లో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ నేతల సంబరాలు ఈ వీడియోలో పార్టీ కార్యకర్తలను ఆకట్టుకుంది
    1
    లక్కీ డ్రాలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా తునం శ్రావణ్ గెలవడంతో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎంపీ కడియం కావ్య ఆనందోత్సవానికి సంబందించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది తొర్రూరు చైర్మన్ పీఠాన్ని దక్కింఛుకునేందుకు ఇరు పార్టీలకు సమానం ఓట్లు రాగా ఎన్నికల అధికారులు లక్కీ డ్రా తీస్తున్న సమయంలో మున్సిపల్ కార్యాలయంలో నెలకొన్న ఉత్కంఠ క్షణాలు గెలిచిన ఆనందం లో ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్ నేతల సంబరాలు ఈ వీడియోలో పార్టీ కార్యకర్తలను ఆకట్టుకుంది
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.