Shuru
Apke Nagar Ki App…
ఉపాధి హామీ EKYC కి నేడే లాస్ట్ డే తెలంగాణలో ఆందోళన... గడువును పెంచాలంటూ వినతి ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రం ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. దీన్ని పూర్తిచేసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. అయితే తెలంగాణలో ఇంకా దాదాపు 3 లక్షల మంది కూలీలకు EKYC నమోదు కాలేదని సమాచారం. సర్వర్ డౌన్, వేలిముద్రలు పడకపోవడం వంటి సమస్యలతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. అందువల్ల గడువు పొడిగించాలని కూలీలు, అధికారులు కోరుతున్నారు.
Journalist Anil kumar
ఉపాధి హామీ EKYC కి నేడే లాస్ట్ డే తెలంగాణలో ఆందోళన... గడువును పెంచాలంటూ వినతి ఉపాధి హామీ పథకాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్రం ఈకేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. దీన్ని పూర్తిచేసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. అయితే తెలంగాణలో ఇంకా దాదాపు 3 లక్షల మంది కూలీలకు EKYC నమోదు కాలేదని సమాచారం. సర్వర్ డౌన్, వేలిముద్రలు పడకపోవడం వంటి సమస్యలతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. అందువల్ల గడువు పొడిగించాలని కూలీలు, అధికారులు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం – 40 మొక్కజొన్న బస్తాలు దగ్ధం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళా రైతు అజ్మీర లలిత పంట చేనులో నిల్వ ఉంచిన మొక్కజొన్న బస్తాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 40 బస్తాల మొక్కజొన్న పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు.1
- వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.2
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- నల్గొండ జిల్లాలోని కొత్తపల్లి గ్రామం మీదుగా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కనిపించని స్పీడ్ బ్రేకర్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రాత్రి వేళల్లో ఇవి అస్సలు కనిపించక అనేక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే మార్కింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.1
- తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- నల్గొండ జిల్లా తిప్పర్తిలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కస్టమర్లను మోసం చేస్తుందని ఆరోపిస్తూ వినియోగదారులు ఆందోళన చేపట్టారు. గత రెండు నెలలుగా గ్యాస్ బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు తెలిపారు. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ వెంటనే సిలిండర్ అందించాలని డిమాండ్ చేశారు.1
- ఎనుమాముల మార్కెట్లో మిర్చి వ్యాపారి పరార్ — రైతులకు రూ.2.60 కోట్ల చెల్లింపులు నిలిచిపోవడం వరంగల్: వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మరో మిర్చి వ్యాపారి రైతులను మోసం చేసి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీవిద్య చిల్లీస్ ట్రేడర్స్ అధినేత అయిలయ్య అలియాస్ అరుణ్ 62 మంది రైతుల వద్ద నుంచి రూ.2.60 కోట్ల విలువైన మిర్చి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో రైతులకు చెల్లింపులు నిలిచిపోయాయి. బాధితులు చాంబర్ ఆఫ్ కామర్స్ను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.1