ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ఇవ్వాలి. CM, Dy. CM, విద్యా శాఖ మంత్రి.. తమ శ్రమ ను గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగు మన్మధరావు శ్రీకాకుళం : ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అధ్యాపకులకు కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ అధ్యాపక అవార్డులను ఇవ్వాలని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగు మన్మధరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ లో అక్షరాస్యతలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పాత్ర కీలకమన్నారు. గవర్నమెంట్ స్టూడెంట్స్ కన్నా.. గవర్నమెంట్ టీచర్స్, లెక్చరర్స్ కన్నా.. ప్రైవేట్ స్టూడెంట్స్.. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అధికమన్నారు. తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డుల ఎంపికలో ప్రైవేటు ఉపాధ్యాయులను, అధ్యాపకులను కూడా చేర్చాలని కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల అధ్యాపకులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకుల సమిష్టి కృషితోనే విద్యావ్యవస్థలో సమూల మార్పులు వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి, విద్యా శాఖ కమీషనర్, అన్ని స్థాయిల విద్యా శాఖాధికారులు జోక్యం చేసు కుని ప్రైవేట్ ఉపాధ్యాయుల అధ్యాపకుల కృషిని గుర్తించి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉత్తమ అవార్డులు ఇవ్వాలని కోరారు.ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ సేవలకుగానూ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రమే అని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. అటెండర్ స్థాయి ఉద్యోగి పిల్లల నుండి అఖిల భారత సర్వీసెస్ లో పనిచేసే వారి పిల్లల వరకు విద్యాబుద్ధులు నేర్పి నీట్, ఐఐటి జెఈఈ మైన్స్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలలో పదవ, ఇంటర్మీడియట్ వంటి పరీక్షలలో ఉత్తమ ర్యాంకులకు కారకులు ప్రయివేట్ టీచర్స్, లెక్చర్స్ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ శ్రమను గుర్తించాలని కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు జిల్లా అధ్యక్షులు నాగశివ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ ఇవ్వాలి. CM, Dy. CM, విద్యా శాఖ మంత్రి.. తమ శ్రమ ను గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి. ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగు మన్మధరావు శ్రీకాకుళం : ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అధ్యాపకులకు కూడా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ అధ్యాపక అవార్డులను ఇవ్వాలని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గంగు మన్మధరావు కోరారు. ఈ మేరకు
బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ లో అక్షరాస్యతలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పాత్ర కీలకమన్నారు. గవర్నమెంట్ స్టూడెంట్స్ కన్నా.. గవర్నమెంట్ టీచర్స్, లెక్చరర్స్ కన్నా.. ప్రైవేట్ స్టూడెంట్స్.. ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ అధికమన్నారు. తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డుల ఎంపికలో ప్రైవేటు ఉపాధ్యాయులను, అధ్యాపకులను కూడా చేర్చాలని కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల అధ్యాపకులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకుల సమిష్టి కృషితోనే విద్యావ్యవస్థలో సమూల మార్పులు
వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి, విద్యా శాఖ కమీషనర్, అన్ని స్థాయిల విద్యా శాఖాధికారులు జోక్యం చేసు కుని ప్రైవేట్ ఉపాధ్యాయుల అధ్యాపకుల కృషిని గుర్తించి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉత్తమ అవార్డులు ఇవ్వాలని కోరారు.ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ సేవలకుగానూ అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రమే అని కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. అటెండర్ స్థాయి ఉద్యోగి పిల్లల నుండి
అఖిల భారత సర్వీసెస్ లో పనిచేసే వారి పిల్లల వరకు విద్యాబుద్ధులు నేర్పి నీట్, ఐఐటి జెఈఈ మైన్స్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలలో పదవ, ఇంటర్మీడియట్ వంటి పరీక్షలలో ఉత్తమ ర్యాంకులకు కారకులు ప్రయివేట్ టీచర్స్, లెక్చర్స్ కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ శ్రమను గుర్తించాలని కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ఉత్తమ ఉపాధ్యాయ, అధ్యాపక అవార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు జిల్లా అధ్యక్షులు నాగశివ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
- Post by KLakshmi Devi1
- Post by Ravi Poreddy1
- Post by Katravath Hathiram1
- అంబేద్కర్ భవన స్థలాన్ని వెంటనే పరిష్కరించాలి. ఏఐబిఎస్పి. పలమనేరు డిసెంబర్ 16( ప్రజా ప్రతిభ) గంగవరం మండలంలో వివాదాస్పదంగా మారిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంకు సంబంధించిన స్థలాన్ని అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం కోరారు. అందులో భాగంగా మంగళవారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు మణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.వి. మునిరత్నం, అమానుల్లా,వాణి, గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి, మాట్లాడుతూ గత వారం రోజుల నుండి అంబేద్కర్ భవనానికి సంబంధించిన స్థలాన్ని అక్కడే నివాసముంటున్న శ్రీలంక కాలనీవాసులు ఆక్రమించుకోవాలనే ప్రయత్నాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. నిత్యం తహసిల్దార్ , ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆ మార్గంలోనే వెళ్తున్నప్పటికీ శ్రీలంక వాసులు ఆక్రమిస్తున్న స్థలం కనపడినా ప్రశ్నించ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీలంక శరణార్థులు రోజుకో దేవాలయం పేరు చెప్పుకొని ఉన్నత అధికారులకు అర్జీలతో పాటు ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ భవన ఆవరణలో శరణార్థులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇతరులకు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాటిని నివారించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. లంక వాసులు ఆ స్థలములో చేస్తున్న వివిధ రకాల అసాంఘిక కార్యక్రమాలను చూసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేయక చాలా ఏళ్ల నుండి చేతగాని వారిగా మిగిలిపోతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్థల వివాదంలో శ్రీలంక వాసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళితే, ఓ అధికారి సమన్వయం పాటించండని, ఇంకొక అధికారి శ్రీలంక వాసులు రెచ్చగొట్టిన మీరు రెచ్చిపోవద్దని ఉచిత సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతవరకు ఆక్రమణదారులను అధికారులు పిలిపించి విచారించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంబేద్కర్ స్థలాన్ని ఆక్రమించి, విద్వేషాలను రెచ్చగొడుతున్న వ్యక్తులను విచారించి నివారించాలని , అంబేద్కర్ భవనం స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. మంజునాథ్, సూర శ్రీనివాసులు, శివ, ఆనంద, శాంతమ్మ, మునెయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.1