రంపచోడవరం: 17/04/2026 ఆదివాసీల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు జాతీయ ఎస్టీ కమిషన్ విచారణకు వైద్యాధికారులు, పోలీసులకు సమన్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోటం బాపనమ్మ మరియు ఆమె నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) అత్యంత తీవ్రంగా స్పందించిందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులందరికీ ఈ కేసు ఒక గుణపాఠం కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ మరణాలపై తాము చేసిన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338A ప్రకారం తనకు ఉన్న సివిల్ కోర్టు అధికారాలను ఉపయోగిస్తూ ఈ నెల 22న న్యూఢిల్లీలో ప్రత్యక్ష విచారణకు (Sitting) ఆదేశించిందని వెల్లడించారు. బాధ్యులైన అధికారులను కాపాడేందుకు స్థానిక యంత్రాంగం ఏకపక్ష నివేదికలు ఇచ్చినప్పటికీ, కమిషన్ వాటన్నింటినీ తోసిపుచ్చి జిల్లా వైద్యాధికారి (DMHO) మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) స్వయంగా విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడం గిరిజనుల విజయాన్ని సూచిస్తోందన్నారు. ముఖ్యంగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వరుస మరణాలకు చిరునామాగా మారిందని, బాపనమ్మ మృతికి ముందు కూడా ఇక్కడ అనేక మంది ఆదివాసీలు వైద్యం అందక మరణించారని కుంజా శ్రీను గుర్తు చేశారు. ఈ ఆసుపత్రిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న దారుణమైన లోపాలను, మౌలిక వసతుల లేమిని మరియు వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని తాము ఆధారాలతో సహా కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వివరించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవడం భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 304-A ప్రకారం నేరమని, అలాగే గిరిజన హక్కుల ఉల్లంఘన కింద ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం (POA Act) లోని కఠిన సెక్షన్లు కూడా వర్తిస్తాయని హెచ్చరించారు. విచారణలో తప్పుడు సమాచారం ఇస్తే అధికారులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసే అధికారం కమిషన్కు ఉందని, బాధితులకు కోటి రూపాయల పరిహారంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే వరకు తాము విశ్రమించబోమని కుంజా శ్రీను స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల ప్రాణాలంటే అధికారులకు లోకువగా మారిందని, ఇప్పటికైనా వ్యవస్థలో మార్పు రాకపోతే రాజ్యాంగబద్ధమైన పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
రంపచోడవరం: 17/04/2026 ఆదివాసీల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదు జాతీయ ఎస్టీ కమిషన్ విచారణకు వైద్యాధికారులు, పోలీసులకు సమన్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా కోటం బాపనమ్మ మరియు ఆమె నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) అత్యంత తీవ్రంగా స్పందించిందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులందరికీ ఈ కేసు ఒక గుణపాఠం కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ మరణాలపై తాము చేసిన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338A ప్రకారం తనకు ఉన్న సివిల్ కోర్టు అధికారాలను ఉపయోగిస్తూ ఈ నెల 22న న్యూఢిల్లీలో ప్రత్యక్ష విచారణకు (Sitting) ఆదేశించిందని వెల్లడించారు. బాధ్యులైన అధికారులను కాపాడేందుకు స్థానిక యంత్రాంగం ఏకపక్ష నివేదికలు ఇచ్చినప్పటికీ, కమిషన్ వాటన్నింటినీ తోసిపుచ్చి జిల్లా వైద్యాధికారి (DMHO) మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) స్వయంగా విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడం గిరిజనుల విజయాన్ని సూచిస్తోందన్నారు. ముఖ్యంగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి వరుస మరణాలకు చిరునామాగా మారిందని, బాపనమ్మ మృతికి ముందు కూడా ఇక్కడ అనేక మంది ఆదివాసీలు వైద్యం అందక మరణించారని కుంజా శ్రీను గుర్తు చేశారు. ఈ ఆసుపత్రిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న దారుణమైన లోపాలను, మౌలిక వసతుల లేమిని మరియు వైద్యుల బాధ్యతారాహిత్యాన్ని తాము ఆధారాలతో సహా కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వివరించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవడం భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 304-A ప్రకారం నేరమని, అలాగే గిరిజన హక్కుల ఉల్లంఘన కింద ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం (POA Act) లోని కఠిన సెక్షన్లు కూడా వర్తిస్తాయని హెచ్చరించారు. విచారణలో తప్పుడు సమాచారం ఇస్తే అధికారులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసే అధికారం కమిషన్కు ఉందని, బాధితులకు కోటి రూపాయల పరిహారంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే వరకు తాము విశ్రమించబోమని కుంజా శ్రీను స్పష్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసుల ప్రాణాలంటే అధికారులకు లోకువగా మారిందని, ఇప్పటికైనా వ్యవస్థలో మార్పు రాకపోతే రాజ్యాంగబద్ధమైన పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
- గంగవరం మండలంలోని నెమల్లి చెట్టూ సెంటర్ వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో సుమారు 60 లక్షల రూపాయల విలువైన 120 కేజీల గంజాయి భారీగా పట్టుబడింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రంపచోడవరం డీఎస్పీ పర్యవేక్షణలో గంగవరం ఎస్సై సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్లో, గంజాయిని తరలిస్తున్న మారుతీ ఎర్టిగా మరియు హ్యుందాయ్ i-20 వాహనాలను సీజ్ చేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజీవ్ పిట్చేశ్రావు, సుచిత్ర జాదవ్, అనీష్ అహ్మద్, నితిన్ హనుమంతలతో పాటు కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన కోలా ప్రభు అనే ఐదుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.1
- 🙏😭1
- జీవితమరణ సరిహద్దుల్లో నిలిచిన వేళ 108 అంబులెన్స్ సిబ్బంది చూపిన అప్రమత్తత, మానవత్వం ఓ తల్లి, శిశువుకు కొత్త జీవితం అందించింది. బయ్యారం మండలం నామాలపాడు గ్రామానికి చెందిన ఒడిశా కార్మికురాలు రశ్మిత (20)కు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే 108 సేవలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ మెరుపువేగంతో చేరుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగానే నొప్పులు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. పరిస్థితి అత్యంత కీలకంగా మారిన వేళ మెడికల్ టెక్నీషియన్ శ్రీను, పైలట్ ఉపేందర్ అప్రమత్తంగా వ్యవహరించి అంబులెన్స్ను రోడ్డు పక్కన నిలిపారు. క్షణక్షణం కీలకమవుతున్న పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసి, అంబులెన్స్లోని డెలివరీ కిట్ సహాయంతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. వారి సమయస్ఫూర్తి ఫలితంగా రశ్మిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ కాసిరెడ్డి ఫోన్ ద్వారా నిరంతరం సూచనలు అందిస్తూ కీలక పాత్ర పోషించారు. అనంతరం తల్లికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించి, శిశువుకు ఆక్సిజన్ ఇచ్చి, ఇద్దరినీ సురక్షితంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రాణాల విలువను కాపాడుతూ అద్భుత సేవ అందించిన EMT శ్రీను, పైలట్ ఉపేందర్లపై స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.1
- హుకుంపేట మండలం గడుగుపల్లి–కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం ప్రమాదం జరిగింది. అరకు నుంచి పాడేరు వైపు వస్తున్న పాల వ్యాన్ డ్రైవర్కు నిద్ర రావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వ్యాన్ కింద డ్రైవర్ చేయి ఇరుక్కుపోవడంతో విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి వాహనాన్ని పైకి లేపి క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం పాడేరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- పెదకూరపాడు : జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్ ఫీల్డ్ కు వెళ్లి జనగణన సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ యొక్క వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు క్లుప్తంగా వివరించాలని కోరారు.1
- యుద్ధం వద్దు శాంతి ముద్దు విజయవాడ: ఇరాన్ పై అమెరికా దాడి చేయడాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది .ఈ ర్యాలీలో అమెరికా ఇరాన్ పై దాడులు చేయటం ఆపాలని, శాంతి నెలకొల్పాలని, చర్చలతో ముందుకు ముందుకు వెళ్లాలని ప్రజాసంఘాలు పిలుపు ఇచ్చాయి.1
- 🙏😭1
- జనగాం జిల్లా అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ ఆఫీసర్ నరేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొన్నారు. ఆసుపత్రి సిబ్బంది, రోగులకు అగ్నిప్రమాదాల నివారణ చర్యలు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఎస్టింగిషర్ వినియోగ విధానాన్ని ప్రాక్టికల్గా చూపించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.1
- Post by Rai Narendra1