Shuru
Apke Nagar Ki App…
రాములోరికి లక్ష పుష్పములతో అర్చనలు ఏపీలోని ప్రముఖ పుణ్య క్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థం సీతారామస్వామి దేవస్థానం లో లక్ష పుష్ప అర్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Journalist Naidu
రాములోరికి లక్ష పుష్పములతో అర్చనలు ఏపీలోని ప్రముఖ పుణ్య క్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థం సీతారామస్వామి దేవస్థానం లో లక్ష పుష్ప అర్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చాలా మంది రోగులు దంత చికిత్సలను ధరల ఆధారంగా మాత్రమే పోల్చుతారు. కానీ దంతవైద్యంలో, సత్వరమార్గాలు తరచుగా పునరావృత విధానాలు, చిగుళ్ల సమస్యలు లేదా నెలల తర్వాత విఫలమైన పనిగా మారుతాయి. నైతిక దంతవైద్యం నైతిక దంతవైద్యం ఖరీదైనది కాదు. ఇది మీ దీర్ఘకాలిక నోటి ఆరోగ్యానికి సురక్షితమైనది మరియు శాశ్వతమైనది చేయడం గురించి. ఎందుకంటే ఒకే పంటిని రెండుసార్లు సరిచేయడం దీర్ఘకాలంలో ఎప్పుడూ చౌకగా ఉండదు.1
- 'రాష్ట్రీయ సేవా సమ్మాన్' పురస్కారంతో మరింత బాధ్యత పెరిగింది విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, విజయనగరం మండలం గుంకలాం జెడ్.పి.హైస్కూలులో హెడ్ మాస్టరుగా పని చేస్తున్న వెలమల శ్రీనివాస రావు 'రాష్ట్రీయ సేవా సమ్మాన్ 2026' అవార్డు అందుకోవడంపట్ల జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హర్షం వ్యక్తం చేసి, జిల్లా పోలీసు కార్యాలయంలో వెలమల శ్రీనివాసరావును ప్రత్యేకంగా అభిందించి, మిఠాయి తినిపించి, సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు మాస్టరు జాతీయ పురస్కారం లభించడం అభినందనీయమన్నారు. శ్రీనివాసరావు మాస్టరు ఒక వైపు హెడ్ మాస్టరుగా విధులు నిర్వహిస్తూ, మరోవైపు వలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ, వ్యాఖ్యానం అందిస్తూ, ప్రజలందరికీ చేరువయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమీషను ఆధ్వర్యంలో ఎంపికైన ఉద్యోగులకు భారతీయ వారసత్వం సంస్కృతి గొప్పదనాన్ని వివిరిస్తూ తరగతులు నిర్వహించడం, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం, పలు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడంతో నీతి అయోగ్ ఆధ్వర్యంలోని బృందం వెలమల శ్రీనివాసరావు సేవలను జాతీయ స్థాయిలో గుర్తించి 'రాష్ట్రీయ సేవా సమ్మాన్ 2026' అవార్డును జనవరి 25న న్యూఢిల్లీలో ప్రదానం చేసిందన్నారు. ఈ అవార్డు అందుకోవడంతో శ్రీనివాసరావు మాస్టరు పై మరింత బాధ్యత పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అకాంక్షించారు. జాతీయ పురస్కారం పొందిన వెలమల శ్రీనివాసరావు ఫిబ్రవరి 3న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అభినందించి, మిఠాయిలు తినిపించి, సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, రిజర్వు ఇన్స్పెక్టరు ఎన్.గోపాల నాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, శ్రీనివాసరావు మాస్టరును అభినందించారు.1
- ఆమదాలవలస: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 6వ తేదీన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘వ్యవసాయాధారిత వ్యాపారాభివృద్ధి’ అంశంపై కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె. భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మి దేవి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మేళాలో భాగంగా ఏర్పాటు చేసే వ్యవసాయ ప్రదర్శన, రైతు సదస్సు, క్షేత్ర సందర్శన వంటి కార్యక్రమాల్లో జిల్లాకు చెందిన ముఖ్య ప్రజా ప్రతినిధులు, విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ, పరిశోధనా సంచాలకులు డాక్టర్ పి.వి.సత్యనారాయణ, ఐసీఏఆర్-అటారి డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్.మీరా తదితరులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని రైతులు, మహిళా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ఔత్సాహిక యువత ఈ మేళాకు పెద్ద ఎత్తున హాజరై సాగులో వ్యాపార మెళకువలను తెలుసుకోవాలని కోరారు.3
- డుంబ్రిగూడ మండలంలోని కించుమండ సంతలో ఎస్సై సురేష్ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రమాదకరమని, చిన్న నిర్లక్ష్యం ప్రాణాలకు ముప్పుగా మారుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.1
- Post by APPARAO KONCHADA1
- అడ్డతీగల: దుచ్చర్తి వై.జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టి, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పోలవరం జిల్లాలో ప్రమాదాలు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మంచు కురుస్తున్నందున వాహనదారులు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.1
- ఫిబ్రవరి 4,టెక్కలి మండలం నర్సింగపల్లి తదితర గ్రామాల్లో బుధవారం ఉదయం పిచ్చికుక్క స్వైరవిహారం చేసి నలుగురిని గాయపరిచిన విషయం తెలిసిందే. మధ్యాహ్నానానికి ఆ సంఖ్య 9కి చేరింది. గాయపడిన మరో ఐదుగురు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. ఒక రోజులో తొమ్మిది మంది కుక్క కాటుకు గురవ్వడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ అధికారులు పరిశీలించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.3
- బొద్దంగ్రామంలో చోరీ జరిగిన ఇంటిని సందర్శించిన డీఎస్పీ మరియు అధికారులు. బొద్దంగ్రామంలో గత ఆదివారం జనపరెడ్డి వెంకటరమణ ఇంట్లో జరిగిన భారీ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మంగళవారం నాడు ఇన్చార్జి డీఎస్పీ ఆర్. గోవిందరావు, ఎస్.కోట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. అప్పలనాయుడు, మరియు ఎస్.కోట ఇన్స్పెక్టర్ నారాయణ మూర్తి ఘటనా స్థలాన్ని స్వయంగా సందర్శించి విచారణ చేపట్టారు. అధికారులు చోరీ జరిగిన గదులను, బీరువాలను మరియు నిందితులు ఇంట్లోకి ప్రవేశించిన మార్గాలను పరిశీలించారు. బాధితుడు వెంకటరమణ మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడి, పోయిన నగదు, నగలు మరియు ఇతర విలువైన వస్తువుల వివరాలను సేకరించారు. క్లూస్ టీమ్ సేకరించిన వేలిముద్రలు, స్థానిక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ.. ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో విచారిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు తిరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.1