logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎల్లంపల్లి ప్రాజెక్టు లో పెరిగిన వరద నీరు., అప్రమత్తంగా ఉండాలన్న ప్రాజెక్టు అధికారులు అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) గణనీయంగా పెరిగే అవకాశం ఉందనీ ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారి రవీంద్ర చారి పేర్కొన్నారు.

4 hrs ago
user_Telangana reporter
Telangana reporter
Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
4 hrs ago

ఎల్లంపల్లి ప్రాజెక్టు లో పెరిగిన వరద నీరు., అప్రమత్తంగా ఉండాలన్న ప్రాజెక్టు అధికారులు అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) గణనీయంగా పెరిగే అవకాశం ఉందనీ ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారి రవీంద్ర చారి పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు లో పెరిగిన వరద నీరు., అప్రమత్తంగా ఉండాలన్న ప్రాజెక్టు అధికారులు అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) గణనీయంగా పెరిగే అవకాశం ఉందనీ ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారి రవీంద్ర చారి పేర్కొన్నారు.
    1
    ఎల్లంపల్లి ప్రాజెక్టు లో పెరిగిన వరద నీరు., అప్రమత్తంగా ఉండాలన్న ప్రాజెక్టు అధికారులు
అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం (ఇన్‌ఫ్లో) గణనీయంగా పెరిగే అవకాశం ఉందనీ ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారి రవీంద్ర చారి పేర్కొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
  • యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ* *యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ* *న్యూఢిల్లీ:* దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆందోళనలో పెద్దపల్లి ఎంపీ *గడ్డం వంశీకృష్ణ* పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, యువత హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి పేపర్ లీకేజీలు లేకుండా నిర్వహించాలని యువత చేస్తున్న న్యాయమైన డిమాండ్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు. *పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను నిరాశపరిచిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, పేపర్ లీకేజీల బాధితులు న్యాయం కోసం పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పార్లమెంట్‌లో గొంతెత్తుతోందని అన్నారు.* అదేవిధంగా, తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై రాజకీయాలు చేయకుండా వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
    1
    యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ*
*యువతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ*
*న్యూఢిల్లీ:*
దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలకు నిరసనగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆందోళనలో పెద్దపల్లి ఎంపీ *గడ్డం వంశీకృష్ణ* పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, యువత హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షలు పారదర్శకంగా, ఎలాంటి పేపర్ లీకేజీలు లేకుండా నిర్వహించాలని యువత చేస్తున్న న్యాయమైన డిమాండ్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోందని పేర్కొన్నారు.
*పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను నిరాశపరిచిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు, పేపర్ లీకేజీల బాధితులు న్యాయం కోసం పోరాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ వారి తరఫున పార్లమెంట్‌లో గొంతెత్తుతోందని అన్నారు.*
అదేవిధంగా, తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై రాజకీయాలు చేయకుండా వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • భారీ వర్షాల నేపథ్యంలో విధి నిర్వహణలో మున్సిపల్ కార్మికులు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నప్పటికీ మున్సిపల్ కార్మికులకు మాత్రం విధులు తప్పడం లేదు. కాగా గురువారం బెల్లంపల్లి బజార్ ఏరియాలో మున్సిపల్ చెత్త సేకరించే వాహనంలో డీజిల్ అయిపోవడంతో మున్సిపల్ సిబ్బంది కాసేపు ఇబ్బందిపడ్డారు. వర్షంలో తడుస్తూ వెళ్లి డీజిల్ తీసుకొచ్చి వాహనం ప్రారంభించి యధావిధిగా చెత్త సేకరణ ప్రారంభించడంతో విధుల పట్ల వారి నిబద్దత చూసి స్థానికులు గమనించి వారిని అభినందించారు.
    1
    భారీ వర్షాల నేపథ్యంలో విధి నిర్వహణలో మున్సిపల్ కార్మికులు 
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నప్పటికీ మున్సిపల్ కార్మికులకు మాత్రం విధులు తప్పడం లేదు. కాగా గురువారం బెల్లంపల్లి బజార్ ఏరియాలో మున్సిపల్ చెత్త సేకరించే వాహనంలో డీజిల్ అయిపోవడంతో మున్సిపల్ సిబ్బంది కాసేపు ఇబ్బందిపడ్డారు. వర్షంలో తడుస్తూ వెళ్లి డీజిల్ తీసుకొచ్చి వాహనం ప్రారంభించి యధావిధిగా చెత్త సేకరణ ప్రారంభించడంతో విధుల పట్ల వారి నిబద్దత చూసి స్థానికులు గమనించి వారిని అభినందించారు.
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • భారీ వర్షాల నేపథ్యంలో రాంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* *ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మంచిర్యాల జోన్ బెల్లంపల్లి పట్టణంలోని 27వ,33వ వార్డుల మధ్య ఉన్న రాంనగర్ బ్రిడ్జిపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిని గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకల పరిస్థితిని సమీక్షించి, పోలీసు,రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు అవసరమైన సూచనలు చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు,కాలువలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు,బ్యారికేడ్లను గౌరవిస్తూ పోలీసు, రెవెన్యూ,మున్సిపల్ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ పరిశీలనలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్,27వ, 33వ వార్డుల కౌన్సిలర్లు,బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్,ఇతర ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
    3
    భారీ వర్షాల నేపథ్యంలో రాంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*
*ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... ప్రమాదాల నివారణకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, మంచిర్యాల జోన్ బెల్లంపల్లి పట్టణంలోని 27వ,33వ వార్డుల మధ్య ఉన్న రాంనగర్ బ్రిడ్జిపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిని గురువారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకల పరిస్థితిని సమీక్షించి, పోలీసు,రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు అవసరమైన సూచనలు చేశారు.
అనంతరం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ,భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు,కాలువలు, బ్రిడ్జిలను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు,బ్యారికేడ్లను గౌరవిస్తూ పోలీసు, రెవెన్యూ,మున్సిపల్ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు వెళ్లనివ్వకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఈ పరిశీలనలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్,27వ, 33వ వార్డుల కౌన్సిలర్లు,బెల్లంపల్లి వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్,ఇతర ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్ ఆర్టీసీ.. కరీంనగర్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు శ్రీకారం..మొదటి దశలో మూడు రూట్లలో సేవలు త్వరలో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు విస్తరణ పేదల సంక్షేమం.. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం.. సిటీ బస్సులను విద్యార్థులు మహిళలు ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలి.. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నగర ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ఘనంగా ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమయ్యారు. మొదటి దశలో కరీంనగర్–వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్–చింతకుంట, కరీంనగర్–కొత్తపల్లి హవేలీ రూట్లలో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సిటీ బస్సుల డిమాండ్‌ను నెరవేర్చామని తెలిపారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఉపాధి కోసం చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు వచ్చే కార్మికులు, ఉద్యోగులు, అలాగే వాగేశ్వరి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు కూడా సిటీ బస్సు సేవలను విస్తరిస్తామని ప్రకటించారు. ప్రయాణికుల ఆదరణను బట్టి అవసరమైతే ఒకే రూట్‌లో అదనపు బస్సులు నడపడంతో పాటు, 24 గంటల సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దశలవారీగా సిటీ బస్సు సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.వికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని, ఆర్టీసీ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సుల కొనుగోలు, కొత్త నియామకాలు, కారుణ్య నియామకాలు, కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల సంక్షేమం వంటి చర్యలతో సంస్థను బలోపేతం చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని, ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు అంకితభావంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నారని కొనియాడారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కరీంనగర్ నగర ప్రజలు సిటీ బస్సులను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు స్పందించి సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణతోనే ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ప్రజలకు చేరువయ్యే రవాణా సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల వరకు సిటీ బస్సులు ఏర్పాటు చేయడం హర్షణీయమని, తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పి, ఏఎమ్ & లీగల్) కె. రాజశేఖర్ రీజినల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) పి. మల్లేశం, కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి బావ్ రావు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, డిపో మేనేజర్లు ఐ. విజయమాధురి (కరీంనగర్-1), ఎం. శ్రీనివాస్ (కరీంనగర్-2), ఎ. ప్రకాశ్‌రావు (సిరిసిల్ల), బి. శ్రీనివాస్ (వేములవాడ), ఎన్. రమేశ్ (జగిత్యాల), డి. హరి (మెట్‌పల్లి)తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు.. లైఫ్‌లైన్. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం" అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 
పేద ప్రజల గుండె చప్పుడు.. 
లైఫ్‌లైన్ ఆర్టీసీ..
కరీంనగర్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు శ్రీకారం..మొదటి దశలో మూడు రూట్లలో సేవలు 
త్వరలో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు విస్తరణ
పేదల సంక్షేమం.. ప్రయాణికుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యం..
సిటీ బస్సులను విద్యార్థులు మహిళలు ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలి..
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్ నగర ప్రజలకు ఆధునిక, సౌకర్యవంతమైన ప్రజా రవాణా సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బస్ స్టేషన్‌లో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను ఘనంగా ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో మమేకమయ్యారు.
మొదటి దశలో కరీంనగర్–వాగేశ్వరి కాలేజీ, కరీంనగర్–చింతకుంట, కరీంనగర్–కొత్తపల్లి హవేలీ రూట్లలో సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సిటీ బస్సుల డిమాండ్‌ను నెరవేర్చామని తెలిపారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతిరోజూ ఉపాధి కోసం చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు వచ్చే కార్మికులు, ఉద్యోగులు, అలాగే వాగేశ్వరి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి తెలిపారు. భవిష్యత్తులో చల్మెడ, ప్రతిమ మెడికల్ కాలేజీ, మానకొండూరు వరకు కూడా సిటీ బస్సు సేవలను విస్తరిస్తామని ప్రకటించారు.
ప్రయాణికుల ఆదరణను బట్టి అవసరమైతే ఒకే రూట్‌లో అదనపు బస్సులు నడపడంతో పాటు, 24 గంటల సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దశలవారీగా సిటీ బస్సు సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు.వికాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశామని, ఆర్టీసీ అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సుల కొనుగోలు, కొత్త నియామకాలు, కారుణ్య నియామకాలు, కార్మికుల పెండింగ్ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల సంక్షేమం వంటి చర్యలతో సంస్థను బలోపేతం చేశామని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని, ప్రతి గ్రామానికి ఆర్టీసీ సేవలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లు అంకితభావంతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నారని కొనియాడారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, కరీంనగర్ నగర ప్రజలు సిటీ బస్సులను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు స్పందించి సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆదరణతోనే ఆర్టీసీ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో ప్రజలకు చేరువయ్యే రవాణా సేవలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల వరకు సిటీ బస్సులు ఏర్పాటు చేయడం హర్షణీయమని, తమ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న,
కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పి, ఏఎమ్ & లీగల్) కె. రాజశేఖర్ రీజినల్ మేనేజర్ బి రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్. భూపతిరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) పి. మల్లేశం, కరీంనగర్ జోన్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి 
బావ్ రావు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, డిపో మేనేజర్లు ఐ. విజయమాధురి (కరీంనగర్-1), ఎం. శ్రీనివాస్ (కరీంనగర్-2), ఎ. ప్రకాశ్‌రావు (సిరిసిల్ల), బి. శ్రీనివాస్ (వేములవాడ), ఎన్. రమేశ్ (జగిత్యాల), డి. హరి (మెట్‌పల్లి)తో పాటు ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    7 hrs ago
  • కరీంనగర్ పట్టణంలో సిటీ బస్సులను ప్రారంబించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడానికి కరీంనగర్ బస్ స్టేషన్ లో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు. కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట , ఓద్యారం, కొత్తపల్లి ,విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా , ముఖ్య నేతలు ,అధికారులు పాల్గొన్నారు.
    2
    కరీంనగర్ పట్టణంలో సిటీ బస్సులను ప్రారంబించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడానికి కరీంనగర్ బస్ స్టేషన్ లో సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.
అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో ప్రయాణం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు. కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. 
పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. 
ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట , ఓద్యారం, కొత్తపల్లి ,విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం , కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ కొలగాని శ్రీనివాస్ , జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా , 
ముఖ్య నేతలు ,అధికారులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డులో శ్రీనివాస టాకీస్ ఎదుట ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్లలో కొనుగోలు చేసిన వడలో బొద్దింక కనిపించిందని ఓ వ్యక్తి ఆరోపించారు. బుధవారం రాత్రి పిల్లల కోసం ఇడ్లీ, వడ పార్సిల్ తీసుకెళ్లి ఇంట్లో విప్పి చూడగా వడలో బొద్దింక ఉన్నట్లు గుర్తించానన్నారు.
    1
    జగిత్యాల పట్టణంలోని యావర్ రోడ్డులో శ్రీనివాస టాకీస్ ఎదుట ఉన్న మొబైల్ టిఫిన్ సెంటర్లలో కొనుగోలు చేసిన వడలో బొద్దింక కనిపించిందని ఓ వ్యక్తి ఆరోపించారు. బుధవారం రాత్రి పిల్లల కోసం ఇడ్లీ, వడ పార్సిల్ తీసుకెళ్లి ఇంట్లో విప్పి చూడగా వడలో బొద్దింక ఉన్నట్లు గుర్తించానన్నారు.
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • తిలక్ నగర్ చౌరస్తాలో అక్రమ ప్రైవేట్ నిర్మాణాలను కూల్చిన సింగరేణి స్పెషల్ స్క్వాడ్ బృందం సింగరేణి భూముల్లో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు (ప్రైవేట్ నిర్మాణాలు) చేపట్టడం చట్టవిరుద్ధమని తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా సింగరేణి భూమిలో అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్మాణాలను వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు.
    1
    తిలక్ నగర్ చౌరస్తాలో అక్రమ ప్రైవేట్ నిర్మాణాలను కూల్చిన సింగరేణి స్పెషల్ స్క్వాడ్ బృందం
సింగరేణి భూముల్లో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు       (ప్రైవేట్ నిర్మాణాలు) చేపట్టడం చట్టవిరుద్ధమని తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా సింగరేణి భూమిలో అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్మాణాలను వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.