Shuru
Apke Nagar Ki App…
బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏 బీసీలకు 27% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు పుంజాల శివ శంకర్ గారు బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏💐
NIMMANAGANTI ANIL BABU
బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏 బీసీలకు 27% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించిన మహనీయుడు పుంజాల శివ శంకర్ గారు బీసీల పక్షపాతి పుంజాల శివ శంకర్ గారి జయంతి సందర్భంగా ఆయనను మనసారా స్మరించుకుందాం🙏💐
More news from తెలంగాణ and nearby areas
- చార్మినార్ సమీపంలో ఈవ్ టీజింగ్కు పాల్పడిన వ్యక్తిని ఓ యువతి ధైర్యంగా ఎదుర్కొని అక్కడి నుంచి తరిమికొట్టింది. ఘటనను తన మొబైల్లో రికార్డ్ చేసిన ఆమె, ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ధక్కా మార్ కే లే జావో అబ్!” అంటూ ఆ యువతి నిందితుడిని గట్టిగా నిలదీసిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.1
- పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యం: మంత్రిలు పొంగులేటి, పొన్నం హన్మకొండ జిల్లా:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గూడూరు, మనేపల్లి తదితర గ్రామాల్లో 394 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సుమారు 8 లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చామని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లతో పాటు కాలనీల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి మాట్లాడుతూ కమలాపూర్ మండలంలో 394 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందడం సంతోషకరమన్నారు. కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేశామని, అనర్హులు తేలితే కేటాయింపులు రద్దు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.1
- *ఇప్పటిదాక ఒక లెక్కా....నేనొచ్చినాక ఒక లెక్క🔥* *మీ భూముల్లో నుంచి ఇంచు భూమి కూడా పోనియ్యా* *ఇప్పటిదాక ఒక లెక్కా....నేనొచ్చినాక ఒక లెక్క🔥* *మీ భూముల్లో నుంచి ఇంచు భూమి కూడా పోనియ్యా* *రాజేంద్ర నగర్ భూ బాధితులకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండ💯*1
- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత నర్సంపేట: దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం నర్సంపేటలో వివాదానికి దారితీసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు గద్దె నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు రాత్రి సమయంలో గద్దెను కూల్చివేశారని వారు ఆరోపించారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ అనుమతి లేదనే కారణంతో అధికారులు చర్యలు తీసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గద్దె కూల్చివేతపై బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- వర్షాలు కురవాలని ముసలి కి పూజలు చేసినా పూజారి.......! గద్వాల జిల్లా బీచుపల్లిలో కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మొసలికి పురోహితుడు పూజలు చేసిన వీడియో వైరల్గా మారింది. మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించి వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేసినట్లు పూజారి అనిల్శర్మ తెలిపారు. పూజల అనంతరం మొసలిని తిరిగి నదిలో విడిచిపెట్టారు.1
- నర్సంపేటలో ఉద్రిక్తత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కూల్చివేత నర్సంపేట మండలంలోని మెడికల్ కాలేజీ ఎదురుగా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో, ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు1