Shuru
Apke Nagar Ki App…
అబ్బీపురం గ్రామంలో దేవుడి చిత్రపటాల వెనక నాగుపాము ప్రత్యక్షం మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన బాలకృష్ణ ఇంట్లో పూజ గదిలోని చిత్రపటాల వెనుక పెద్ద నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. గురువారం పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందజేశారు. అతను అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ నాగుపామును సమీపంలోని నల్లమల అడవిలో విడిచిపెట్టారు.పామును పట్టుకోవడంతో బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Syed Rafi
అబ్బీపురం గ్రామంలో దేవుడి చిత్రపటాల వెనక నాగుపాము ప్రత్యక్షం మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన బాలకృష్ణ ఇంట్లో పూజ గదిలోని చిత్రపటాల వెనుక పెద్ద నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. గురువారం పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందజేశారు. అతను అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ నాగుపామును సమీపంలోని నల్లమల అడవిలో విడిచిపెట్టారు.పామును పట్టుకోవడంతో బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన బాలకృష్ణ ఇంట్లో పూజ గదిలోని చిత్రపటాల వెనుక పెద్ద నాగుపాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. గురువారం పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందజేశారు. అతను అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ నాగుపామును సమీపంలోని నల్లమల అడవిలో విడిచిపెట్టారు.పామును పట్టుకోవడంతో బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.1
- ఇటీవల శ్రీరామునిపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేష్ గురువారం తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. ప్రకాష్ రాజ్ను ఉద్దేశించి ఆయన ఒక చిత్రాన్ని వినూత్నంగా గీసినట్లు తెలిపారు. ఈ చిత్రంలో హిందూ మతం మగ పిల్లలు ప్రకాష్ రాజ్ ముఖం మీద మూత్రం పోస్తూన్నట్లు, మెడలో చెప్పుల దండ వేసినట్లు చిత్రం గీసినట్లు కోటేష్ తెలిపారు.1
- బద్వేలు , ఏప్రిల్ 23: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు, వైయస్సార్ సర్కిల్ సమీపంలో ప్రముఖ కరెంటు కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి నర్సారెడ్డి ఇంటి ముందు చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. నర్సారెడ్డి సతీమణి కీర్తిశేషులు పెద్దిరెడ్డి లక్ష్మమ్మ జ్ఞాపకార్థం గత మూడు సంవత్సరాలుగా ఈ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన కుమారులు డాక్టర్ జయసింహారెడ్డి, డాక్టర్ విజయ నరసింహారెడ్డి, అల్లుడు సింగమల సుధాకర్ రెడ్డి తెలిపారు. మండుటెండల్లో పాదచారులు, చిరు వ్యాపారస్తులు, ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ఈ సేవా కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ చైర్మన్ గోనుగుంట వెంకటసుబ్బారెడ్డి, బద్దెన కళా పీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి, ఆదూరి వీర ప్రతాపరెడ్డి, జమ్మన వేణుగోపాల్ రెడ్డి, కత్తెరపల్లె రాజశేఖర్ రెడ్డి, పాపదిప్పు మల్లికార్జున రెడ్డి, మాచుపల్లి రాజారెడ్డి, కనుపర్తి చెన్న కృష్ణారెడ్డి, లేపాకు రామకృష్ణారెడ్డి, ఎస్.ఎన్. సుబ్బరాయుడు, కల్లూరు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని మజ్జిగ, చల్లని మంచినీటిని వితరణ చేశారు.1
- భగీరథ మహర్షి జయంతి1
- ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు..! టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకుల అత్యుత్సాహం. పులివెందులకు వెళ్లి.. మాజీ సీఎం వైఎస్ జగన్కు వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు. మాజీ సీఎం వైఎస్ జగన్ సేవలో తరించిన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్కుమార్, వీణా మనోజ్కుమార్, కె.పార్థసారథికి, ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు..!1
- నాగర్ కర్నూలు జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు విధులను బహిష్కరించారు. జిల్లాలోని 90 శాతం బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో జేఏసీ నాయకులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. అధికారులు ప్రత్యామ్నాయంగా 15 బస్సులను నడుపుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది1
- ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులకు టీటీడీ షోకాజ్ నోటీసులు..! టీటీడీ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా అర్చకుల అత్యుత్సాహం. పులివెందులకు వెళ్లి.. మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్కు వేద ఆశీర్వచనంతో పాటు, శేష వస్త్రం, రాములోరి తోమాల, ముత్యాల తలంబ్రాలు అందజేసిన ఒంటిమిట్ట ఆలయ అర్చకులు. మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ సేవలో తరించిన ఒంటిమిట్ట కోదండ రామాలయ అర్చకులు ఎ.శ్రావణ్కుమార్, వీణా మనోజ్కుమార్, కె.పార్థసారథికి, ఉప కార్యనిర్వహణాధికారి ఎ.ప్రశాంతి షోకాజ్ నోటీసులు జారీ చేసి.. రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు..!1
- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమాలోచన కార్యక్రమం” నంద్యాల పట్టణంలో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించబడింది. రాయలసీమ ప్రాంత భవిష్యత్తుకు కీలకమైన సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర చర్చలు జరపడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ—రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న నీటి సమస్య తీవ్రతను, సాగునీటి అవసరాన్ని స్పష్టంగా గుర్తించిన నాయకుడు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పేర్కొన్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్ట్ను ప్రారంభించారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో గోప్య ఒప్పందాలు కుదుర్చుకుని రాయలసీమ హక్కులను దెబ్బతీస్తూ, రైతులకు అన్యాయం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ అంశాలపై శాసన మండలిలో ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానాలు రాలేదని, ఎన్జీటీ అనుమతుల కోసం తీసుకున్న చర్యలు, రాయలసీమ నీటి అవసరాల కోసం నిధుల కేటాయింపు వంటి కీలక ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిస్థితులను బట్టి రాయలసీమకు జరుగుతున్న అన్యాయం స్పష్టమవుతోందని, కాబట్టి మన హక్కుల సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీ సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు,మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ DR తలారి రంగయ్య గారు,నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్పలత రెడ్డి గారు, నంద్యాల మాజీ పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు,మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, కాటసాని రామి రెడ్డి గారు, గంగుల నాని గారు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త ధార సుదీర్ గారు, మాజీ ఎమ్మెల్సి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు,బుడ్డా శేషి రెడ్డి గారు,రైతు విభాగం జోనల్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి గారు, చల్లా విగ్నేశ్వర రెడ్డి గారు మరియు YSR Congress Party - YSRCP నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1