logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని బస్సు స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు చెయ్యివెత్తి సిగ్నల్ ఇచ్చినా ఆపకుండా దూసుకుపోతున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు మండిపడుతున్నారు. గురువారం అయ్యవారి కోడూరు గ్రామంలో మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు మూడు బస్సులు వెళ్లినప్పటికీ, వాటిలో ఎక్కడానికి స్థలం ఉన్నప్పటికీ డ్రైవర్లు బస్సులు ఆపలేదని ప్రయాణికులు ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిందని, బస్సులు ఆపకపోవడంతో మహిళలు కూడా చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదని వారు పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యంపై సంబంధిత ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సు స్టాప్‌లో బస్సులు తప్పకుండా ఆగేలా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఉచిత పథకంతో ప్రయాణాలు చేసే మహిళల సంఖ్య పెరిగినందున, ప్రభుత్వం స్పందించి ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

19 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
19 hrs ago

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని బస్సు స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు చెయ్యివెత్తి సిగ్నల్ ఇచ్చినా ఆపకుండా దూసుకుపోతున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు మండిపడుతున్నారు. గురువారం అయ్యవారి కోడూరు గ్రామంలో మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు మూడు బస్సులు వెళ్లినప్పటికీ, వాటిలో ఎక్కడానికి స్థలం ఉన్నప్పటికీ డ్రైవర్లు బస్సులు ఆపలేదని ప్రయాణికులు ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిందని, బస్సులు ఆపకపోవడంతో మహిళలు కూడా చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదని వారు పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యంపై సంబంధిత ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సు స్టాప్‌లో బస్సులు తప్పకుండా ఆగేలా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఉచిత పథకంతో ప్రయాణాలు చేసే మహిళల సంఖ్య పెరిగినందున, ప్రభుత్వం స్పందించి ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వినూత్నమైన రీతిలో పర్యావరణ పరిరక్షణపై ఒక సందేశాన్ని ఇచ్చారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని, ఆయన ఒక టెంకాయ చుట్టూ 620 సూక్ష్మ చిత్రాలను మైక్రో బ్రష్‌లతో, వాటర్ కలర్ పెయింటింగ్స్‌తో కేవలం ఆరు గంటల వ్యవధిలో అద్భుతంగా చిత్రించారు. ఈ చిత్రం ద్వారా పర్యావరణం సమతుల్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, అలాగే పర్యావరణ మార్పులు సంభవించి క్షామం (కరువు) ఎలా ఉంటుందో ఆయన కళ్లకు కట్టారు. తన చిత్రంలోని భావాలను వివరిస్తూ, కోటేష్ పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, కొండలు, కోనలు, ఎగిరే గువ్వలు, పక్షులు, జంతువులు, పశువులు స్వేచ్ఛగా విహరించడం, నదీ జలాలు, జలచరాలు వంటి ప్రకృతి సోయగాన్ని చూసి వనదేవత సంతోషంతో చిరునవ్వులు చిందించడాన్ని చిత్రీకరించినట్లు తెలిపారు. దీనికి విరుద్ధంగా, పర్యావరణం బాగా లేనప్పుడు క్షామం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించానన్నారు. ఎండిపోయిన, నరికివేసిన చెట్లతో వన్యప్రాణులు చెట్లు, నీడ, నీరు, ఆహారం లేక అలమటించి వనదేవతకు మొరపెట్టుకోవడం, మరణించిన వన్యప్రాణులు, మనుషుల మృతదేహాలు వంటి దృశ్యాలతో వనదేవత కన్నీరు పెడుతూ, చేతులు జోడించి "మనుషులారా, ఇకనైనా మారండి. పర్యావరణాన్ని కాపాడండి, చెట్లను పెంచండి, ప్రతి నీటి చుక్కను వృధా కానివ్వకండి" అని వేడుకున్నట్లుగా తాను చిత్రించినట్లు వివరించారు. పర్యావరణం అనేది మన చుట్టూ ఉన్న సహజ వాతావరణమని, ఇందులో గాలి, నీరు, భూమి, చెట్లు, పక్షులు, పశువులు, జంతువులు, మానవులు వంటివన్నీ భాగమై ఉన్నాయని కోటేష్ స్పష్టం చేశారు. ప్రతి జీవరాశికి పర్యావరణమే జీవనాధారమని, అయితే మనుషులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లను నరికివేయడం, విపరీతంగా ప్లాస్టిక్ వినియోగించడం, ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమికి హాని కలిగించడం వంటి చర్యలను ఆయన ఖండించారు. పరిశోధకుల అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 11 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమ్మీద, నీటి మీద చేరుతున్నాయని గుర్తు చేశారు. వాతావరణంలో పెద్ద మార్పులు సంభవించడం వల్ల వేసవిలో 45 నుండి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నామని కోటేష్ పేర్కొన్నారు. అత్యంత వేడిమిని తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి లక్షలాది మంది మనుషులు చనిపోతున్నారని, ఈ సంవత్సరం భారతదేశంలో 30 వేల మందికి పైగా మరణించారని అంచనా వేశారన్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. విపరీతంగా చెట్లను పెంచాలని, ప్రతి నీటి చుక్కను వృధా చేయకూడదని కోరారు. పర్యావరణం పచ్చగా ఉంటేనే జీవన విధానం బాగుంటుందని నొక్కి చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వినూత్న చిత్రాలు వేస్తుంటానని, ఈసారి బొచ్చు తీసిన టెంకాయ మీద వేశానని ఆయన వెల్లడించారు.
    1
    నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వినూత్నమైన రీతిలో పర్యావరణ పరిరక్షణపై ఒక సందేశాన్ని ఇచ్చారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని, ఆయన ఒక టెంకాయ చుట్టూ 620 సూక్ష్మ చిత్రాలను మైక్రో బ్రష్‌లతో, వాటర్ కలర్ పెయింటింగ్స్‌తో కేవలం ఆరు గంటల వ్యవధిలో అద్భుతంగా చిత్రించారు. ఈ చిత్రం ద్వారా పర్యావరణం సమతుల్యంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, అలాగే పర్యావరణ మార్పులు సంభవించి క్షామం (కరువు) ఎలా ఉంటుందో ఆయన కళ్లకు కట్టారు.

తన చిత్రంలోని భావాలను వివరిస్తూ, కోటేష్ పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, కొండలు, కోనలు, ఎగిరే గువ్వలు, పక్షులు, జంతువులు, పశువులు స్వేచ్ఛగా విహరించడం, నదీ జలాలు, జలచరాలు వంటి ప్రకృతి సోయగాన్ని చూసి వనదేవత సంతోషంతో చిరునవ్వులు చిందించడాన్ని చిత్రీకరించినట్లు తెలిపారు. దీనికి విరుద్ధంగా, పర్యావరణం బాగా లేనప్పుడు క్షామం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించానన్నారు. ఎండిపోయిన, నరికివేసిన చెట్లతో వన్యప్రాణులు చెట్లు, నీడ, నీరు, ఆహారం లేక అలమటించి వనదేవతకు మొరపెట్టుకోవడం, మరణించిన వన్యప్రాణులు, మనుషుల మృతదేహాలు వంటి దృశ్యాలతో వనదేవత కన్నీరు పెడుతూ, చేతులు జోడించి "మనుషులారా, ఇకనైనా మారండి. పర్యావరణాన్ని కాపాడండి, చెట్లను పెంచండి, ప్రతి నీటి చుక్కను వృధా కానివ్వకండి" అని వేడుకున్నట్లుగా తాను చిత్రించినట్లు వివరించారు.

పర్యావరణం అనేది మన చుట్టూ ఉన్న సహజ వాతావరణమని, ఇందులో గాలి, నీరు, భూమి, చెట్లు, పక్షులు, పశువులు, జంతువులు, మానవులు వంటివన్నీ భాగమై ఉన్నాయని కోటేష్ స్పష్టం చేశారు. ప్రతి జీవరాశికి పర్యావరణమే జీవనాధారమని, అయితే మనుషులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లను నరికివేయడం, విపరీతంగా ప్లాస్టిక్ వినియోగించడం, ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమికి హాని కలిగించడం వంటి చర్యలను ఆయన ఖండించారు. పరిశోధకుల అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం 11 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు భూమ్మీద, నీటి మీద చేరుతున్నాయని గుర్తు చేశారు.

వాతావరణంలో పెద్ద మార్పులు సంభవించడం వల్ల వేసవిలో 45 నుండి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నామని కోటేష్ పేర్కొన్నారు. అత్యంత వేడిమిని తట్టుకోలేక ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి లక్షలాది మంది మనుషులు చనిపోతున్నారని, ఈ సంవత్సరం భారతదేశంలో 30 వేల మందికి పైగా మరణించారని అంచనా వేశారన్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రజలు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. విపరీతంగా చెట్లను పెంచాలని, ప్రతి నీటి చుక్కను వృధా చేయకూడదని కోరారు. పర్యావరణం పచ్చగా ఉంటేనే జీవన విధానం బాగుంటుందని నొక్కి చెప్పారు. ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వినూత్న చిత్రాలు వేస్తుంటానని, ఈసారి బొచ్చు తీసిన టెంకాయ మీద వేశానని ఆయన వెల్లడించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆధారంగా చేపట్టిన జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గుడ్డెం దొడ్డి జలాశయం సామర్థ్యాన్ని 11 లేదా 15 టీఎంసీలకు పెంచాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పంపుహౌస్‌ను సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా, ఇరిగేషన్ అధికారులు జిల్లాకు అవసరమైన నీటి వనరుల సామర్థ్యం పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా, గూడెం దొడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచడం, ర్యాలంపాడు సీపేజీ సమస్యను పరిష్కరించి నాలుగు టీఎంసీల నీటిని నిలువ చేసే విధంగా చర్యలు చేపట్టడం, అలాగే మల్లమ్మ కుంట భూసేకరణ పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. గురువారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ధరూర్ మండలంలోని గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఇతర నాయకులు బొకేలు, మొక్కలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం రోడ్డు మార్గంలో జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టేజ్-1 గుడ్డెం దొడ్డి పంపుహౌస్ వద్దకు చేరుకొని, మంత్రులతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులపై పీపీటీ ద్వారా సమీక్ష నిర్వహించారు. అంతకుముందు, జిల్లా ప్రాజెక్టుల గురించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. తిరిగి వెళ్లే సమయంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ కరచాలనం చేశారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కర్నాటక మంత్రి బోసురాజు, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, రాష్ట్ర వాళ్మీకి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, గొర్రెల, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీవో శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సీఈ రహీముద్దీన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా ముగిసింది, ఈ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
    2
    జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆధారంగా చేపట్టిన జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన గుడ్డెం దొడ్డి జలాశయం సామర్థ్యాన్ని 11 లేదా 15 టీఎంసీలకు పెంచాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పంపుహౌస్‌ను సందర్శించారు.

ఈ సందర్శనలో భాగంగా, ఇరిగేషన్ అధికారులు జిల్లాకు అవసరమైన నీటి వనరుల సామర్థ్యం పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా, గూడెం దొడ్డి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచడం, ర్యాలంపాడు సీపేజీ సమస్యను పరిష్కరించి నాలుగు టీఎంసీల నీటిని నిలువ చేసే విధంగా చర్యలు చేపట్టడం, అలాగే మల్లమ్మ కుంట భూసేకరణ పనులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేశారు.

గురువారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ధరూర్ మండలంలోని గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో పాటు ఇతర నాయకులు బొకేలు, మొక్కలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం రోడ్డు మార్గంలో జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టేజ్-1 గుడ్డెం దొడ్డి పంపుహౌస్ వద్దకు చేరుకొని, మంత్రులతో కలిసి జోగులాంబ గద్వాల జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులపై పీపీటీ ద్వారా సమీక్ష నిర్వహించారు. అంతకుముందు, జిల్లా ప్రాజెక్టుల గురించి ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. తిరిగి వెళ్లే సమయంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ కరచాలనం చేశారు.

ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కర్నాటక మంత్రి బోసురాజు, గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, రాష్ట్ర వాళ్మీకి అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, గొర్రెల, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ సరిత, అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీవో శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సీఈ రహీముద్దీన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా ముగిసింది, ఈ పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
    user_Elluru Varaprasad
    Elluru Varaprasad
    Local News Reporter గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    13 hrs ago
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, ప్రజలను మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, రాష్ట్రవ్యాప్త నిరసనలలో భాగంగా బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ఘోర వైఫల్యం చెందిందని వైఎస్సార్సీపీ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పోరుమామిళ్ల అంబేద్కర్ సర్కిల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు గురువారం జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి సహా కలసపాడు, కాశినాయన, బి. కోడూర్, పోరుమామిళ్ల మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన 'సూపర్ సిక్స్' పథకాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని, రెండేళ్ల పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న కాపు నేస్తం, ఆరోగ్యశ్రీ, జగనన్న కాలనీలు, డ్వాక్రా సంఘాలకు ప్రయోజనాలు వంటి పథకాలు ఇప్పుడు లేవని వారు గుర్తుచేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఎరువుల కొరత, ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు పెరగడం ప్రజలందరూ గమనిస్తున్నారని, దీంతో బాధపడుతున్నారని తెలిపారు. సంపద సృష్టిస్తానని చెప్పిన ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని, ఈ అప్పులు భావితరాలపై కూడా భారం మోపుతాయని ఆరోపించారు. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు భావిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు జోస్యం చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
    1
    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, ప్రజలను మోసం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, రాష్ట్రవ్యాప్త నిరసనలలో భాగంగా బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన ఘోర వైఫల్యం చెందిందని వైఎస్సార్సీపీ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పోరుమామిళ్ల అంబేద్కర్ సర్కిల్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు గురువారం జరిగిన ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి సహా కలసపాడు, కాశినాయన, బి. కోడూర్, పోరుమామిళ్ల మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన 'సూపర్ సిక్స్' పథకాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని, రెండేళ్ల పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు వంచనకు గురయ్యారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న కాపు నేస్తం, ఆరోగ్యశ్రీ, జగనన్న కాలనీలు, డ్వాక్రా సంఘాలకు ప్రయోజనాలు వంటి పథకాలు ఇప్పుడు లేవని వారు గుర్తుచేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఎరువుల కొరత, ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు పెరగడం ప్రజలందరూ గమనిస్తున్నారని, దీంతో బాధపడుతున్నారని తెలిపారు. సంపద సృష్టిస్తానని చెప్పిన ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తోందని, ఈ అప్పులు భావితరాలపై కూడా భారం మోపుతాయని ఆరోపించారు.

మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు భావిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు జోస్యం చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • జూన్ 14వ తేదీ నుంచి ఇంటింటి ఓటరు ధృవీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ఓటరు జాబితాలో పారదర్శకతను నిర్ధారించేందుకు ఉద్దేశించిన ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్‌లో, ఎమ్మెల్యే బీవీ బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఏలు) కు కీలక సూచనలు, దిశానిర్దేశాలు చేశారు.
    1
    జూన్ 14వ తేదీ నుంచి ఇంటింటి ఓటరు ధృవీకరణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో, ఓటరు జాబితాలో పారదర్శకతను నిర్ధారించేందుకు ఉద్దేశించిన ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్‌లో, ఎమ్మెల్యే బీవీ బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఏలు) కు కీలక సూచనలు, దిశానిర్దేశాలు చేశారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం వాలసి గ్రామ గిరిజనులు, ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలోని కూలీలు ఆరు వారాల పాటు పనిచేశారని, అయితే కేవలం రెండు వారాలకు మాత్రమే వేతనాలు అందుకున్నారని వారు వాపోయారు. మిగిలిన నాలుగు వారాల వేతనాలను అధికారులు తక్షణమే విడుదల చేయాలని ఉపాధి హామీ వేతనదారులు కోరుతున్నారు. ప్రభుత్వం మరియు అధికారులు సకాలంలో వేతనాలు చెల్లిస్తేనే తమ ఆర్థిక అవసరాలు తీరుతాయని వాలసి గ్రామ గిరిజనులు స్పష్టం చేశారు.
    2
    అల్లూరి జిల్లాలోని అనంతగిరి మండలం వాలసి గ్రామ గిరిజనులు, ఉపాధి హామీ పథకం కింద చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామంలోని కూలీలు ఆరు వారాల పాటు పనిచేశారని, అయితే కేవలం రెండు వారాలకు మాత్రమే వేతనాలు అందుకున్నారని వారు వాపోయారు. మిగిలిన నాలుగు వారాల వేతనాలను అధికారులు తక్షణమే విడుదల చేయాలని ఉపాధి హామీ వేతనదారులు కోరుతున్నారు. ప్రభుత్వం మరియు అధికారులు సకాలంలో వేతనాలు చెల్లిస్తేనే తమ ఆర్థిక అవసరాలు తీరుతాయని వాలసి గ్రామ గిరిజనులు స్పష్టం చేశారు.
    user_Laxman Regam
    Laxman Regam
    Local News Reporter అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని బస్సు స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు చెయ్యివెత్తి సిగ్నల్ ఇచ్చినా ఆపకుండా దూసుకుపోతున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు మండిపడుతున్నారు. గురువారం అయ్యవారి కోడూరు గ్రామంలో మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు మూడు బస్సులు వెళ్లినప్పటికీ, వాటిలో ఎక్కడానికి స్థలం ఉన్నప్పటికీ డ్రైవర్లు బస్సులు ఆపలేదని ప్రయాణికులు ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిందని, బస్సులు ఆపకపోవడంతో మహిళలు కూడా చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదని వారు పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యంపై సంబంధిత ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సు స్టాప్‌లో బస్సులు తప్పకుండా ఆగేలా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఉచిత పథకంతో ప్రయాణాలు చేసే మహిళల సంఖ్య పెరిగినందున, ప్రభుత్వం స్పందించి ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
    1
    నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం అయ్యవారి కోడూరు గ్రామంలోని బస్సు స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు చెయ్యివెత్తి సిగ్నల్ ఇచ్చినా ఆపకుండా దూసుకుపోతున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు మండిపడుతున్నారు.

గురువారం అయ్యవారి కోడూరు గ్రామంలో మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు మూడు బస్సులు వెళ్లినప్పటికీ, వాటిలో ఎక్కడానికి స్థలం ఉన్నప్పటికీ డ్రైవర్లు బస్సులు ఆపలేదని ప్రయాణికులు ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి ఈ పరిస్థితి మరింత దారుణంగా మారిందని, బస్సులు ఆపకపోవడంతో మహిళలు కూడా చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదని వారు పేర్కొన్నారు.

ఈ నిర్లక్ష్యంపై సంబంధిత ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సు స్టాప్‌లో బస్సులు తప్పకుండా ఆగేలా చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఉచిత పథకంతో ప్రయాణాలు చేసే మహిళల సంఖ్య పెరిగినందున, ప్రభుత్వం స్పందించి ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • హైదరాబాద్ నగరంలోని అమీర్ పేట్ మెయిన్ రోడ్డు, మైత్రీవనం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెయిన్ రోడ్డుపై ఉన్న KSR ఫ్యాషన్స్ అనే బట్టల దుకాణం ఉన్న మూడు అంతస్తుల భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. భవనం నిలువెల్లా తగలబడిపోతూ పూర్తిగా కాలిబూడిదవుతుండగా, భగభగ మండే మంటల ధాటికి స్థానికులు దాని దగ్గరకు వెళ్లడానికి కూడా సాహసించలేకపోతున్నారు. ఈ దృశ్యాలు చుట్టుపక్కల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. KSR ఫ్యాషన్స్ దుకాణంలో దుస్తులు ఉండటంతో మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ భవనం చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు వంటి అనేక దుకాణాలు ఉన్నాయి. మండే ఎండల కారణంగా మంటలు చుట్టుపక్కల ఉన్న ఈ దుకాణాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో మంటల ధాటికి భయపడిన వ్యాపారులు తమ షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసి, అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూ, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
    1
    హైదరాబాద్ నగరంలోని అమీర్ పేట్ మెయిన్ రోడ్డు, మైత్రీవనం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెయిన్ రోడ్డుపై ఉన్న KSR ఫ్యాషన్స్ అనే బట్టల దుకాణం ఉన్న మూడు అంతస్తుల భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. భవనం నిలువెల్లా తగలబడిపోతూ పూర్తిగా కాలిబూడిదవుతుండగా, భగభగ మండే మంటల ధాటికి స్థానికులు దాని దగ్గరకు వెళ్లడానికి కూడా సాహసించలేకపోతున్నారు. ఈ దృశ్యాలు చుట్టుపక్కల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

KSR ఫ్యాషన్స్ దుకాణంలో దుస్తులు ఉండటంతో మంటల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ భవనం చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు వంటి అనేక దుకాణాలు ఉన్నాయి. మండే ఎండల కారణంగా మంటలు చుట్టుపక్కల ఉన్న ఈ దుకాణాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో మంటల ధాటికి భయపడిన వ్యాపారులు తమ షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసి, అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూ, మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.