Shuru
Apke Nagar Ki App…
వీణవంక చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఈ నూతన సంఘం అధ్యక్షురాలుగా జడల పద్మలత, ఉపాధ్యక్షుడిగా ఉయ్యాల రాజయ్య, కోశాధికారిగా చిందం సదానందం తో పాటు నూతన డైరెక్టర్ల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి జిల్లా ఎన్నికల అధికారిణి జి.రూప, అసిస్టెంట్ అక్బర్ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చేనేత సంఘం అధ్యక్షురాలు జడల పద్మలత మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు, సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత సహకార సంఘం అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఉయ్యాల పద్మ, వలస సరోజన, వంగ రాంచంద్రం, ఉయ్యాల విజయ, ఉయ్యాల హేమలత, వంగ రమేష్ పాల్గొన్నారు.
T. sridhar✍️
వీణవంక చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఈ నూతన సంఘం అధ్యక్షురాలుగా జడల పద్మలత, ఉపాధ్యక్షుడిగా ఉయ్యాల రాజయ్య, కోశాధికారిగా చిందం సదానందం తో పాటు నూతన డైరెక్టర్ల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి జిల్లా ఎన్నికల అధికారిణి జి.రూప, అసిస్టెంట్ అక్బర్ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన చేనేత సంఘం అధ్యక్షురాలు జడల పద్మలత మాట్లాడుతూ, తన ఎన్నికకు సహకరించిన డైరెక్టర్లకు, సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. చేనేత సహకార సంఘం అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఉయ్యాల పద్మ, వలస సరోజన, వంగ రాంచంద్రం, ఉయ్యాల విజయ, ఉయ్యాల హేమలత, వంగ రమేష్ పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎడారిని తలపిస్తున్న మిడ్ మానేర్ జలాశయం వద్ద బీఆర్ఎస్ పార్టీ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసింది. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు జలాశయం ఎండిపోయిన ప్రదేశంలో కబడ్డీ, క్రికెట్ ఆడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జలాశయంలో నీటి నిల్వలు తగ్గి, మునిగిపోయిన గ్రామాలు మళ్ళీ తేలుతుండటంతో బీఆర్ఎస్ నాయకులు పరిస్థితిని పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో మండే వేసవిలో సైతం నిండు కుండలా జలకళను సంతరించుకున్న మిడ్ మానేర్ ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోవడం పాలకపక్షం నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమని బీఆర్ఎస్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగినప్పటికీ, గత రెండున్నర ఏళ్లుగా రిపేర్లు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను ఎండిపోయేలా చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై రాజకీయ కక్షతో రైతులకు సాగునీరు అందించకుండా కుట్ర పడుతోందని కూడా ఆరోపించారు. రైతులపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వెంటనే మేడిగడ్డ వద్ద కాపర్ డ్యామ్ నిర్మించి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి రైతులకు సాగు, త్రాగునీరు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో త్రాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టక తప్పదని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ హెచ్చరించారు.4
- కరీంనగర్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్, శ్రీరామ యోగ గ్రూప్ ఆధ్వర్యంలో యోగా గురువు కుమార్ మహర్షి యోగా ఆసనాలను చేయించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 304 గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ గుడిపాటి రమణారెడ్డి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ గొట్టుముక్కల రవీందర్ కూడా పాలుపంచుకున్నారు. యోగా ద్వారానే మానసిక ప్రశాంతత లభించి ఆరోగ్యమైన జీవితాన్ని పొందవచ్చని, అన్ని ఆరోగ్య సమస్యలకు యోగ ఒకటే మార్గమని వారు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా వాకింగ్, యోగా ప్రతిరోజు చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ వెల్ది సర్పంచ్ పెంచాల కిషన్ రావుతో పాటు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వేల్పుల వెంకటేష్ ఆర్ట్స్, చింతకింద శ్రీనివాస్, ఆడెపు కమలాకర్, తోట శ్రీనివాస్, మిరియాల శ్రీధర్ రెడ్డి, పూసాల సంపత్, ఎడవల్లి శ్రీనివాస్ రెడ్డి, తొడుపునూరు శ్రీనివాస్, మునీందర్, చెన్నాడి రవీందర్ రెడ్డి, నాగేల్లి ప్రతాపరెడ్డి, రాచకొండ అనిల్, వేముల విష్ణుమూర్తి, రేకింధర్, సంపత్ భాస్కర్ రెడ్డి, సాయన్న, గీకురు ఆంజనేయులు, రమేష్ రాజు గౌడ్, బండి రాధా శ్రీనివాస్, నాగన్న, శ్యామ్, పొన్నం రాజు, పెద్ది శీను, సుదర్శన్ వంటి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం, డిస్ట్రిక్ట్ గవర్నర్ అన్నమనేని సుధాకర్ రావు యోగా గురువు కుమార్ మహర్షిని ఘనంగా సన్మానించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియం లోని రచ్చబండ వాకర్ అసోసియేషన్, చెట్టుకింద బ్యాచ్ వాకర్స్, వాలీబాల్ టీం మరియు పెద్ద సంఖ్యలో వాకర్ సంఘ సభ్యులు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు.2
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామం వద్ద శనివారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులోని మోయతుమ్మెద వాగు నుంచి ఈ ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఎస్ఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనకు సంబంధించి ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.1
- కరీంనగర్ జిల్లా సెషన్ జడ్జి శివ కుమార్, రాజీ మార్గమే రాజ మార్గం అని పేర్కొంటూ, లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్ట్ న్యాయ సేవ సదన్ హాల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ కేసులను త్వరగా రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్లో తమ పేర్లను నమోదు చేసుకుని సత్వర న్యాయం పొందాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, హుజురాబాద్లలో కలిపి మొత్తం 12 బెంచ్లను ఏర్పాటు చేసినట్లు డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జి శివ కుమార్ వివరించారు. జిల్లాలో మొత్తం 3 వేల పెండింగ్ కేసులను గుర్తించగా, వీటిలో ఇప్పటికే 2 వేలకు పైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. మిగిలిన కేసులను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాయంత్రం వరకు వచ్చే వారి కేసులను పరిష్కరించడానికి బ్యాంకులు, ఫైనాన్స్, ఇతర సంస్థలు కూడా ఈ లోక్ అదాలత్లో పాల్గొని సహకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ తో పాటు ఇతర న్యాయవాదులు మరియు కక్షిదారులు పాల్గొన్నారు.1
- జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ యోగా ప్రాధాన్యాన్ని వివరించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని ఆయన పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని శ్రీధర్ అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందని, ఆరోగ్యకర జీవనానికి యోగా ఉత్తమ మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగా సాధన కోసం సమయం కేటాయించాలని ఆయన పిలుపునిచ్చారు.4
- వేములవాడ పట్టణానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మోచీ సంఘం అధ్యక్షుడు కొండ్లెపు ముత్యం, తనను కులం పేరుతో దూషించి, దుకాణంలోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారులపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన ఈ ఫిర్యాదులో కోరారు. ముత్యం తెలిపిన వివరాల ప్రకారం, వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న తన కొబ్బరికాయల దుకాణాన్ని తొలగించాలని గత నెల రోజులుగా దేవస్థాన అధికారుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఈ క్రమంలో జూన్ 18న రాత్రి సుమారు 8 గంటల సమయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఆదేశాల మేరకు సుమారు 30 మంది దేవస్థాన సిబ్బంది తన దుకాణం వద్దకు వచ్చి తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో తనను కులం పేరుతో దూషించడంతో పాటు అవమానకరంగా మాట్లాడారని, తన అనుమతి లేకుండా దుకాణంలోకి ప్రవేశించి పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారని ముత్యం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో దేవస్థానం ఈవో రమాదేవి, ఏఈవో శ్రావణ్, సూపరింటెండెంట్ నూగూరి నరేందర్, రాంకిషన్రావు, భగవంతరావు, జయకుమారి, రాజేందర్, భరత్, గంగిశెట్టి సాయి తదితరులపై చర్యలు తీసుకోవాలని ముత్యం కోరారు. సంఘటన జరిగిన సమయంలో రేగుల శ్రీకాంత్, వంగళ శ్రీనివాస్, మైలారపు శ్రీనివాస్, బోనాల శివ, మామిండ్ల లక్ష్మిరాజం తదితరులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై జూన్ 19న వేములవాడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని ఆయన తెలిపారు. అందువల్ల, సంబంధిత అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని కొండ్లెపు ముత్యం జాతీయ ఎస్సీ కమిషన్ను కోరారు.4
- కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడలు యువజన అధికారి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, యోగాను భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపదగా అభివర్ణించారు. ఆయన మాట్లాడుతూ, యోగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానానికి ప్రతీకగా నిలిచిందని, నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో యోగాకు లభిస్తున్న ఆదరణ ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలియజేశారు. యోగాను దినచర్యలో భాగంగా చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ప్రస్తుత జీవనశైలి మార్పుల వల్ల పెరుగుతున్న వెన్నునొప్పి, మెడనొప్పి, మోకాళ్ల నొప్పులు, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో యోగా, ప్రాణాయామం, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయని అధికారి వివరించారు. యోగా సాధనకు ప్రత్యేక పరికరాలు లేదా ఖరీదైన జిమ్లు అవసరం లేదని, ఇంట్లోనే కొద్దిపాటి స్థలంలో ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి యోగా చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ సభ్యులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. వయస్సుతో సంబంధం లేకుండా క్రమశిక్షణతో యోగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు యోగా, ప్రాణాయామం, ధ్యానం ఎంతో ఉపయోగకరమని చెబుతూ, అనులోమ-విలోమ, భ్రమరి వంటి ప్రాణాయామాలు ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడతాయని తెలిపారు. కరోనా తర్వాత యోగాకు మరింత ప్రాచుర్యం లభించిందని, ప్రతి విద్యార్థి రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ ఆసనాలు ఆకట్టుకున్నాయి. అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు టి. రమేష్ రెడ్డి, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కన్న కృష్ణ, గుంటి రామకృష్ణ, 'పెటా' అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, యోగా కోచ్ లు వి. కిష్టయ్య, మల్లికా, పి. స్వరూపచారి, కోటేశ్వరరావు, ఆనంద కిషోర్, ప్రశాంత్ రాజమౌళి, వీణ వాణి, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, సిబ్బంది, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.1
- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు వద్ద ఘనంగా నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి యువత, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలతో కలిసి యోగాసనాలు చేశారు, అనంతరం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక, ఆరోగ్య సంపద అని మంత్రి ప్రభాకర్ అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన యోగా మన జీవన విధానంలో అంతర్భాగంగా కొనసాగుతూ వస్తోందని ఆయన పేర్కొన్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. ప్రజల్లో యోగా పట్ల మరింత అవగాహన, ప్రేరణ కల్పించే లక్ష్యంతో హుస్నాబాద్లో 12 సూర్య నమస్కార భంగిమలను ప్రతిబింబించే విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ విగ్రహాలు యోగా ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా ఉంటాయని ఆయన చెప్పారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడి, అనారోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. యోగ సాధనకు వయస్సుతో ఎలాంటి సంబంధం లేదని, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ యోగా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. రోజువారీ యోగా ద్వారా ఆరోగ్యవంతమైన వ్యక్తులు, ఆరోగ్యకరమైన కుటుంబాలు, సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘ఆరోగ్య హుస్నాబాద్ – ఆరోగ్య తెలంగాణ – ఆరోగ్య భారత్’ లక్ష్య సాధనలో యోగా కీలక సాధనంగా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, మహిళలు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2
- కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైంది. అల్గునూర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న ఈ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. బస్సు డ్రైవర్ ప్రశాంత్ చాకచక్యంతో, తృటిలో పెను ప్రమాదం తప్పింది; డ్రైవర్తో సహా బస్సులో ఉన్న మొత్తం 42 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక విచారణలో బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. బస్సు పెట్రోల్ బంక్ వద్ద ఆగిపోయినప్పుడు డ్రైవర్ ప్రశాంత్ వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ డోర్ పగులగొట్టి ప్రయాణీకులను కిందకు దింపారు. అనంతరం, బస్సును పెట్రోల్ బంక్ నుండి వంద మీటర్ల దూరం తీసుకెళ్ళి నిలిపివేశారు. బస్సు మంచి కండిషన్లోనే ఉందని, ఒక్కసారిగా బ్యాటరీ నుండి మంటలు రావడంతో బస్సును నిలిపివేసినట్లు డ్రైవర్ తెలిపారు. బస్సు నుండి ఎగిసిపడిన మంటల ధాటికి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ హై టెన్షన్ వైర్లు కాలి కింద పడిపోయాయి. అయితే, వెంటనే పవర్ సప్లై నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, విచారణకు అధికారులను ఆదేశించారు. బ్యాటరీ లోపం వల్లా లేక మరేదైనా కారణంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.4