Shuru
Apke Nagar Ki App…
భూభారతి నిషేధిత భూముల జాబితా అని మొత్తం తొలగించారు మాజీ మంత్రి హరీష్ రావు భూభారతిలో నిషేధిత భూముల జాబిత మొత్తం తొలగించారు ఏ తప్పూ చేయనప్పుడు జాబితా ఎందుకు మాయమైంది? మొత్తం హైదరాబాద్ నగరమంతా భూ భారతి నుండి మాయం చేసారు ఇదంతా అసలైన ప్రభుత్వ భూములు కూడా కాజేసే కుట్ర జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి – హరీష్ రావు
SIRIPATI ARUNKUMAR
భూభారతి నిషేధిత భూముల జాబితా అని మొత్తం తొలగించారు మాజీ మంత్రి హరీష్ రావు భూభారతిలో నిషేధిత భూముల జాబిత మొత్తం తొలగించారు ఏ తప్పూ చేయనప్పుడు జాబితా ఎందుకు మాయమైంది? మొత్తం హైదరాబాద్ నగరమంతా భూ భారతి నుండి మాయం చేసారు ఇదంతా అసలైన ప్రభుత్వ భూములు కూడా కాజేసే కుట్ర జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి – హరీష్ రావు
More news from తెలంగాణ and nearby areas
- హోటల్లో ఏం జరుగుతుందో నాకు తెలిసింది 10% మాత్రమే 90% నాకు తెలియదు మీకు తెలుసు హోటల్లో ఏం జరిగిందో మీకు తెలిసింది 10% మాత్రమే.. 90% మీకు తెలియదు నా రూం వాష్రూంలో వేరే వ్యక్తి ఉన్నందుకు నేను మాధురి రాథోడ్ వాష్రూం వాడుకోవడానికి వెళ్లాను అదే సమయంలో ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వడంతో నా భార్య అక్కడకు వచ్చింది ఆ సమయంలో నేను చెప్తే వినే పరిస్థితిలో నా భార్య లేదు నేను, మాధురి రాథోడ్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం కానీ మా మధ్య అంత వరకు వెళ్లే ర్యాపో రాలేదు మా ఇద్దరి మధ్య ఎమోషనల్ కనెక్షన్ మాత్రమే ఉంది.. అది కూడా తప్పే ఇంత జరిగినందుకు మాధురి రాథోడ్కు నా తరపున సారీ.. ఇంక ఇంతటితో ఆపేయండి * ఫోక్ సాంగ్స్ యాక్టర్ ఈశ్వర్ సాయి1
- ఆటపాటలతో సంస్కృతిని చాటిన లంబాడీలు:బంజారా సంస్కృతికి ప్రతీక ‘తీజ్’: జనగామలో ఘనంగా శోభాయాత్ర జనగామ: జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ వాంకుడోత్ అనిత నివాసం వద్ద తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బంజారా తీజ్ ఉత్సవాలు నిమజ్జన వేడుకతో ఘనంగా ముగిశాయి. అనిత నివాసం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర్ చౌరస్తా మీదుగా బతుకమ్మ కుంట వరకు సాగింది. బంజారా మహిళలు, యువత, ఉద్యోగులు, ప్రజలు సంప్రదాయ వేషధారణలతో ఆటపాటలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున తరలిరావడంతో జనగామ పురవీధులు బంజారా జనసంద్రంగా మారాయి. ఈ కార్యక్రమంలో కుసుంబాయి తండా సర్పంచ్ కొర్ర స్వరూప రాజేందర్ నాయక్తో పాటు పలువురు బంజారా నాయకులు, ప్రజాప్రతినిధులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలు, సంస్కృతిని కాపాడుకోవాలని, మేరామాయాడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.1
- పెరిగిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.14.42 లక్షలు, VIP దర్శనాలతో రూ.5.68 లక్షలు, కార్ పార్కింగ్ తో రూ.7 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.3.63 లక్షలు, ప్రధాన బుకింగ్తో రూ.1.82 లక్షలు. తదితర విభాగాల నుంచి మొత్తం రూ.44,71,561 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- లోక కల్యాణార్థం రామకోటి లిఖిత మహాయజ్ఞం రాంసాగర్లో భద్రాచల రామకోటి పుస్తకాల పంపిణీ చేసిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు* లోకకల్యాణమే లక్ష్యంగా, శ్రీరామ నామమే శక్తిగా శ్రావణమాసంలో 10 కోట్ల శ్రీరామ నామ లిఖిత మహా సంకల్పానికి శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టిందని సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తెలిపారు. ఆదివారం రాయిపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని రామాలయంలో భద్రాచలం నుంచి వచ్చిన నూతన రామకోటి పుస్తకాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ రామనామం పలికే, లిఖించే ప్రతి హృదయం పవిత్రమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరామ నామాన్ని స్మరిస్తూ, లిఖిస్తూ ఈ మహా సంకల్పంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 10 కోట్ల లిఖిత శ్రీరామ నామాలను పూర్తి చేసి భద్రాచలానికి సమర్పించడమే మహా సంకల్పమని, ఇది కేవలం లిఖిత యజ్ఞం మాత్రమే కాకుండా భక్తి, ధర్మం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో మరింతగా పెంపొందించే మహోద్యమమని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా భక్తులను అధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నామని తెలిపారు. రామాలయ అధ్యక్షులు ఎనిశెట్టి వెంకటేశం మాట్లాడుతూ తమ గ్రామ భక్తులకు ఇంతటి మహాభాగ్యాన్ని కల్పించిన రామకోటి రామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయిని ఆదిరెడ్డి, బిక్కుమల్ల నాగేష్, శ్రావణ్, బిక్షపతి, మెట్టయ్య, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.2
- కరీంనగర్ లో రోడ్డెక్కిన 22ఏ బాధితులు...కలెక్టరేట్ ఎదుట మహాధర్నా....వారంరోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తాం- ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరిక ఏళ్ల తరబడి పట్టాలు ఉండి నివాసాలు ఏర్పరచుకొని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న భూములను సైతం నిషేధిత 22ఏ జాబితాలో చేర్చడంపై కరీంనగర్ లో బాధితులు ఆందోళనకు దిగారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రేకుర్తి, విద్యానగర్ బాధితులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి మహా ధర్నా చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లు రవీందర్ రెడ్డి, అనిల్ గౌడ్, నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ తోపాటు కార్పోరేట్మర్ లు పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని రేకుర్తి, విద్యానగర్, హిందూపురి కాలనీ, కొత్తపల్లి, ఆరేపల్లి తో పాటు పలు కాలనీలకు చెందిన దాదాపు 1000 ఎకరాల పట్టా భూమిని నిషేధిత 22ఏ జాబితాలో చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేని పట్టా భూములను 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని కోరారు. 22ఏపై పొంతన లేని సమాధానం చెబుతున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలున్న భూములను 22a జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించనిచో కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.3
- పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణ దాడి: బెంగాల్లో కలకలం మాల్దా (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై కొందరు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. విద్యార్థి బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ) జారీ చేసే విషయంలో తలెత్తిన వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.వివాదం: పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి టీసీ జారీ వ్యవహారంలో ఉపాధ్యాయురాలితో కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. దాడి: నిబంధనల ప్రకారం వెంటనే టీసీ ఇచ్చేందుకు సదరు టీచర్ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన వారు ఆమెపై భౌతిక దాడికి దిగారు. వైరల్ వీడియో: పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో స్థానికంగా తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిపై దాడి జరగడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.1
- కాలనీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత.. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే నాయిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబాస్ నగర్, పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ తదితర ప్రాంతాల్లో రూ.1.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రారంభించిన పనులకు నిర్దిష్ట కాలపరిమితి విధించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. జ్యోతిబాస్ నగర్లో ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, మిగిలిన రెండు చిన్న గల్లీల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థలో సమస్యలు లేకుండా సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు పేదల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాయిని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.1
- భూభారతి నిషేధిత భూముల జాబితా అని మొత్తం తొలగించారు మాజీ మంత్రి హరీష్ రావు భూభారతిలో నిషేధిత భూముల జాబిత మొత్తం తొలగించారు ఏ తప్పూ చేయనప్పుడు జాబితా ఎందుకు మాయమైంది? మొత్తం హైదరాబాద్ నగరమంతా భూ భారతి నుండి మాయం చేసారు ఇదంతా అసలైన ప్రభుత్వ భూములు కూడా కాజేసే కుట్ర జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయి – హరీష్ రావు1