Shuru
Apke Nagar Ki App…
నల్గొండలో రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకతో వాహనదారుల ఇబ్బందులు NLG: నల్గొండ నుంచి దేవరకొండ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో సాగర్ ఎక్స్ రోడ్ సమీపంలోని రహదారిపై గతంలో కురిసిన వర్షాలకు, ట్రాక్టర్ల ద్వారా కింద పడుతున్న ఇసుక పేరుకుపోయింది. దీంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై మేటలు వేసి ఉన్న ఇసుకను తొలగించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
జిల్లపల్లి ఇంద్ర
నల్గొండలో రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకతో వాహనదారుల ఇబ్బందులు NLG: నల్గొండ నుంచి దేవరకొండ వైపు వెళ్లే ప్రధాన మార్గంలో సాగర్ ఎక్స్ రోడ్ సమీపంలోని రహదారిపై గతంలో కురిసిన వర్షాలకు, ట్రాక్టర్ల ద్వారా కింద పడుతున్న ఇసుక పేరుకుపోయింది. దీంతో వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుపై మేటలు వేసి ఉన్న ఇసుకను తొలగించాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు మెమొరండం సమర్పించారు. అర్హులైన వారందరికీ ఆసరా, వికలాంగ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని, నిరుద్యోగులకు భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్ధన్నపేటలో త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు నివారించడంతో పాటు స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- విజయవాడలో ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.1
- గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలగూడ విద్యార్థులు కాలేజీలో ప్రాక్టికల్ లేదు..ప్రాక్టీసు లేదు అంటూ ఆందోళనకు దిగారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుసంధానంగా ఉన్న ప్రభుత్వ కాలేజీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు బోధించేందుకు ఉపాధ్యాయులు రారు. ప్రాక్టీస్ చేసేందుకు విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ... కళాశాల ముందు ప్లకార్ట్స్ పట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కోసం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఓయూ ఉన్నతాధికారులు స్పందించి ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు క్లాసులు సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో విసీ చాంబర్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థులు పాల్గొన్నారు.1
- Hotel ki Nahari mey Chuha aur Tahari mey Chipkali tou pachan liye, Haleem ki Degh mey jo ghotey gaye honge uska kya ?1
- Post by Sampathkumar neerudu1
- అక్కన్నపేట మండల కేంద్రంలో ఈదురు గాలులు భారీగా రావడంతో చేతికచ్చిన పంట నష్టపోయింది మామిడి తోటలు,ముక్కలు, వరి పంటలు భారీగా నష్టం జరిగాయి నీళ్ళు లేక వరస సల్లు పెట్టుకుని పరిచ్చిన పంట కాస్త నేల మట్టం ఐపోయింది. ఒక వైపు యూరియా కొరత మరో వైపు భూగర్భ జలాలు అడుగంటడంతో రైతుల ఆవేదన ప్రభుత్వం ఆదుకోవాలనీ రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.2
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో నీటి కొరత రైతులను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు ఎండిపోగా, వరి పంటలు ఎండిపోతున్నాయి. రావూరు, సీత్యాతండాకు చెందిన రైతు రమావత్ దసురు 2.16 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట నీరు లేక ఎండిపోవడంతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే రూ.50 వేల పెట్టుబడి పెట్టిన ఆయన, చేసేదేమీ లేక పంటను పశువులకు మేతగా వదిలివేశాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.1
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన వరల్డ్ కప్ హీరో తిలక్ వర్మ! హైదరాబాద్ : టీమ్ ఇండియా యువ ఆల్రౌండర్, టీ20 వరల్డ్ కప్-2026 విజేత తిలక్ వర్మ సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిశారు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మొదటిసారి నగరానికి చేరుకున్న తిలక్ వర్మ, జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలక్ వర్మను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు. ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసి, తెలంగాణ గడ్డ గర్వపడేలా చేసినందుకు తిలక్ వర్మను సీఎం ప్రశంసించారు.కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 1
- Post by Sampathkumar neerudu1