logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

'పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని *ఆకివీడు మండలంలో జనావాసాల మధ్య అనుమతి లేని 113 చర్చిలు* ఉన్నట్టు గుర్తించారు ఒక్క ఆకివీడు పట్టణంలోనే 29 చోట్ల ఇంటి పన్నులు కడుతూ చర్చిలు నడుపుతున్నారు. వారికి రెండు రోజుల్లో నోటీసులు ఇస్తాం. రాముడి గుడిలో రాముడిని ఆరాధించకూడదనే చర్చ వచ్చింది. కనుక దాని ఆధారంగా ఎన్ని చర్చిలు ఉన్నాయి. అనుమతులు లేనివి ఎన్ని? ఆధారాలు సేకరించాం' అని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెద అమిరంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'రెవెన్యూ రికార్డు ప్రకారం పెదపేటలో రామాలయం ఉంది. అది శిథిలావస్థలో ఉన్నట్టు అధికారులు నకలు ఇచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా భక్తుల అభిమతం మేరకు.. వారి సహకారంతో రామాలయం నిర్మిస్తాం. రూ.80 లక్షల ప్రజా విరాళంతో ప్రముఖ స్తపతి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో కృష్ణశిలతో అత్యంత సుందరంగా నిర్మిస్తాం. రామాలయం అభివృద్ధి కమిటీ పేరుతో కెనరా బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్‌ చేశాం. కనిష్టంగా రూ.100 నుంచి గరిష్టంగా రూ.10 వేలు విరాళం సేకరిస్తాం. రూ.80 లక్షలు రాగానే ఆటోమేటిక్‌గా అకౌంట్‌ నిలుపుదల చేయబడుతుంది' అని రఘురామకృష్ణరాజు చెప్పారు. పెదపేట ఘటనలో మరో పది మంది అరెస్ట్‌ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయం వివాదంలో మరో పది మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. శ్రీరామ నవమి రోజు పెదపేట రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, కూటమి నేతలు, భక్తులపై కొందరు దాడులు చేశారు. ఈ కేసులో 57 మందిని నిందితులుగా గుర్తించగా సోమవారం నాటికి 31 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆకివీడులో 144 సెక్షన్‌ అమలులో ఉండగా పెదపేటకు చెందిన 17 మంది మహిళలు గుంపులుగా తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తహసీల్దార్‌ ముందు బైండోవర్‌ చేశారు.

8 hrs ago
user_RAVI KUMAR
RAVI KUMAR
Tirupati (Rural), Andhra Pradesh•
8 hrs ago
480d2b84-f28f-409f-81f3-4057f5df931d

'పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని *ఆకివీడు మండలంలో జనావాసాల మధ్య అనుమతి లేని 113 చర్చిలు* ఉన్నట్టు గుర్తించారు ఒక్క ఆకివీడు పట్టణంలోనే 29 చోట్ల ఇంటి పన్నులు కడుతూ చర్చిలు నడుపుతున్నారు. వారికి రెండు రోజుల్లో నోటీసులు ఇస్తాం. రాముడి గుడిలో రాముడిని ఆరాధించకూడదనే చర్చ వచ్చింది. కనుక దాని ఆధారంగా ఎన్ని చర్చిలు ఉన్నాయి. అనుమతులు లేనివి ఎన్ని? ఆధారాలు సేకరించాం' అని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం పెద అమిరంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'రెవెన్యూ రికార్డు ప్రకారం పెదపేటలో రామాలయం ఉంది. అది శిథిలావస్థలో ఉన్నట్టు అధికారులు నకలు ఇచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా భక్తుల అభిమతం మేరకు.. వారి సహకారంతో రామాలయం నిర్మిస్తాం. రూ.80 లక్షల ప్రజా విరాళంతో ప్రముఖ స్తపతి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో కృష్ణశిలతో అత్యంత సుందరంగా నిర్మిస్తాం. రామాలయం అభివృద్ధి కమిటీ పేరుతో కెనరా బ్యాంకులో అకౌంట్‌ ఓపెన్‌ చేశాం. కనిష్టంగా రూ.100 నుంచి గరిష్టంగా రూ.10 వేలు విరాళం సేకరిస్తాం. రూ.80 లక్షలు రాగానే ఆటోమేటిక్‌గా అకౌంట్‌ నిలుపుదల చేయబడుతుంది' అని రఘురామకృష్ణరాజు చెప్పారు. పెదపేట ఘటనలో మరో పది మంది అరెస్ట్‌ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేట రామాలయం వివాదంలో మరో పది మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. శ్రీరామ నవమి రోజు పెదపేట రామాలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, కూటమి నేతలు, భక్తులపై కొందరు దాడులు చేశారు. ఈ కేసులో 57 మందిని నిందితులుగా గుర్తించగా సోమవారం నాటికి 31 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆకివీడులో 144 సెక్షన్‌ అమలులో ఉండగా పెదపేటకు చెందిన 17 మంది మహిళలు గుంపులుగా తిరుగుతుండడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తహసీల్దార్‌ ముందు బైండోవర్‌ చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవత ఆలయం నిర్మాణం విషయంలో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, గ్రామ పరంబోకు స్థలంలో గ్రామ దేవత విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయం నిర్మించేందుకు ప్రయత్నించగా, అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం, నిన్నటి వరకు ఎమ్మార్వో కార్యాలయం నుండి ఆ స్థలం పరంబోకు భూమిగా ఉండి దేవస్థానం అవసరాలకు ఉపయోగించుకోవచ్చని చెప్పారని, అయితే ఈరోజు. గొడవ జరిగిన రోజే. ఎమ్మార్వో గారు. 12:30 ఈరోజు అదే స్థలం కొందరి పేర్లపై రిజిస్టర్ అయిందని ఎంతవరకు న్యాయమని చెప్పడం అనుమానాలకు తావిస్తున్నదని గంగాధర్ నెల్లూరు ఎమ్మార్వో ని ఇలా చేస్తే. ఇంకెవరికి. చెప్పాలో మాకు తెలియలేదు. మీరు ఊరికినా చెప్పుకోండి మాకేమి. నీ ఎమ్మార్వో అనడం. ఎంతవరకు న్యాయం ఇది. మీది ఏదైనా ఉంటే ఆర్డిఓ దగ్గర గానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర గాని తేల్చుకోండి అని ఎంఆర్ఓ మమ్మల్ని బెదిరిస్తున్నారు డబ్బులు ఇస్తే. ఒకేరోజులో వాల్ పేరు పైకి మార్చడం ఏ రాజ్యాంగంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలిపారు. ఇన్ని సంవత్సరాలు ఎలాంటి రికార్డు లేకుండా ఉన్న భూమి ఒక్కరోజులో ఎలా పట్టా అయ్యిందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీవో గారు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి గ్రామ దేవత ఆలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా, ఆలయం నిర్మాణానికి ప్రయత్నిస్తున్న వారిని కొంతమంది బెదిరిస్తూ ఊర్లోకి వస్తే ప్రాణహాని కలిగిస్తామని హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ బెదిరింపులపై జిల్లా ఎస్పీ గారు స్పందించి గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలని కోరుతున్నారు. ఇంకా, ఎమ్మార్వో గారు హైకోర్టులో పిటిషన్ వేయాలని సూచించారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారి ఇలాంటి సూచనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రామస్తుల డిమాండ్లు: పరంబోకు భూమి రికార్డులపై పూర్తి విచారణ జరపాలి ఆలయం నిర్మాణానికి అధికారిక అనుమతి ఇవ్వాలి బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలి గ్రామ దేవత ఆలయాలు గ్రామ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ పెద్దలు తెలిపారు.
    1
    చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు
చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు మండలం పాత వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవత ఆలయం నిర్మాణం విషయంలో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను న్యాయం చేయాలని కోరుతున్నారు.
గ్రామస్తుల వివరాల ప్రకారం, గ్రామ పరంబోకు స్థలంలో గ్రామ దేవత విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయం నిర్మించేందుకు ప్రయత్నించగా, అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
గ్రామస్తులు చెబుతున్న ప్రకారం, నిన్నటి వరకు ఎమ్మార్వో కార్యాలయం నుండి ఆ స్థలం పరంబోకు భూమిగా ఉండి దేవస్థానం అవసరాలకు ఉపయోగించుకోవచ్చని చెప్పారని, అయితే ఈరోజు. గొడవ జరిగిన రోజే. ఎమ్మార్వో గారు. 12:30 ఈరోజు అదే స్థలం కొందరి పేర్లపై రిజిస్టర్ అయిందని ఎంతవరకు న్యాయమని చెప్పడం అనుమానాలకు తావిస్తున్నదని గంగాధర్ నెల్లూరు ఎమ్మార్వో ని ఇలా చేస్తే. ఇంకెవరికి. చెప్పాలో మాకు తెలియలేదు. మీరు ఊరికినా చెప్పుకోండి మాకేమి. నీ ఎమ్మార్వో అనడం. ఎంతవరకు న్యాయం ఇది. మీది ఏదైనా ఉంటే ఆర్డిఓ దగ్గర గానీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర గాని తేల్చుకోండి అని ఎంఆర్ఓ మమ్మల్ని బెదిరిస్తున్నారు డబ్బులు ఇస్తే. ఒకేరోజులో వాల్ పేరు పైకి మార్చడం ఏ రాజ్యాంగంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.తెలిపారు. ఇన్ని సంవత్సరాలు ఎలాంటి రికార్డు లేకుండా ఉన్న భూమి ఒక్కరోజులో ఎలా పట్టా అయ్యిందని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీవో గారు స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి గ్రామ దేవత ఆలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అదేవిధంగా, ఆలయం నిర్మాణానికి ప్రయత్నిస్తున్న వారిని కొంతమంది బెదిరిస్తూ ఊర్లోకి వస్తే ప్రాణహాని కలిగిస్తామని హెచ్చరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ బెదిరింపులపై జిల్లా ఎస్పీ గారు స్పందించి గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలని కోరుతున్నారు.
ఇంకా, ఎమ్మార్వో గారు హైకోర్టులో పిటిషన్ వేయాలని సూచించారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారి ఇలాంటి సూచనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు.
గ్రామస్తుల డిమాండ్లు:
పరంబోకు భూమి రికార్డులపై పూర్తి విచారణ జరపాలి
ఆలయం నిర్మాణానికి అధికారిక అనుమతి ఇవ్వాలి
బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
గ్రామంలో శాంతి భద్రతలు కల్పించాలి
గ్రామ దేవత ఆలయాలు గ్రామ సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని, వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ పెద్దలు తెలిపారు.
    user_Krishanamurthy Reddy
    Krishanamurthy Reddy
    చిత్తూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో మంగళవారం ప్రమాదం జరిగింది. మదనపల్లి పట్టణం ఎస్టేట్లో గల కరెంట్ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, వైసిపి మదనపల్లి మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
    1
    మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో మంగళవారం ప్రమాదం జరిగింది. మదనపల్లి పట్టణం ఎస్టేట్లో గల కరెంట్ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, వైసిపి మదనపల్లి మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • *అన్నమయ్య జిల్లా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం* తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.
    2
    *అన్నమయ్య జిల్లా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం*
తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    12 hrs ago
  • అభివృద్ధి, సంక్షేమాలే కూటమి ప్రభుత్వ అజెండా - రేగడిచెలిక గ్రామంలో 55 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. - చేనేతలకు నేటి నుంచి అమలు కానున్న ఉచిత విద్యుత్ పధకం. - ఇఫ్కో కోసాన్ సెజ్ లో 10 వేల 705 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు రాబోతున్నాయి. - సిఎం చంద్రబాబు నాయుడు చొరవతోనే గమేషా కంపెనీ స్థాపన. - ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ. - రైతులు పండించిన ప్రతి వడ్ల గింజ ప్రభుత్వం తీసుకుంటుంది. - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొడవలూరు మండలం రేగడిచెలిక గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైన్లతో పాటు 15 లక్షలతో నిర్మించిన పంచాయితీ కార్యాలయ ప్రహారి గోడ ప్రారంభోత్సవ కార్యకారక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభత్వం అధికారంలోనికి వచ్చిన 21 నెలల్లో కొడవలూరు మండల వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం గిట్టుబాటు ధరకు సేకరిస్తుందన్నారు. గత 30 ఏళ్లుగా నిర్లక్షానికి గురైన ఇఫ్కో కిసాన్ సెజ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. మరో ఏడాదిలో ఇఫ్కో కోసాన్ సెజ్ లో 10 వేల 705 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షలు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఐటి మంత్రి లోకేష్ హామీ కార్యరూపం దాల్చనుందన్నారు.ఏప్రియల్ ఒకటి నుంచి చేనేత వర్గాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు పధకాన్ని అమలులోకి తీసుకురానుందన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగావినియోగించవచ్చన్నారు. ఈ పధకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 531 మంది చేనేతలకు లబ్ది చేకూరనుందనాన్రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడాతూ సిఎం చంద్రబాబు నాయుడు చొరవ కారణంగానే 2016 లో విండ్ పవర్ ఫ్యాన్లు తయారు చేసే గమేషా కంపెనీ కంపెనీ స్థాపన జరిగిందన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టబద్ధమైన హామీ యివ్వాలని శాసనసభలో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కిసాన్ సెజ్ లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలకు సంబంధించి శిక్షణ యిచ్చి కిసాన్ సెజ్ లో ఏర్పాటు చేసే పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మేం చేసిన అభివృద్ధి పనులు మీరు ఎలా ప్రారంభోత్సవం చేస్తారనే వైసిపి నేతలకు శంఖుస్థానాలు చేసాక పని పూర్తి చేయాలని టెంకాయ కొట్టేసి మేం చెప్పుకుంటే కుదరదని సూటిగా సమాధానం చెప్పారు. కూటమి ప్రభుత్వ 21 నెలల కాలంలో రేగడిచెలిక గ్రామాభివృద్ధి కోసం 1 కోటి 6 లక్షల 5 వేల579 రూపాయలు వెచ్చించిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు వివరించారు. సర్పంచుల పదవీ కాలం రేపటితో ముగియనుందన్నారు. స్థానిక సంస్థల నిధులను గత ప్రభుత్వం పక్క దారి పట్టించడంతో అభివృద్ధి చేయలేక అసంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నారనని స్థానిక సంస్థల బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభత్వ చొరవను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల ముఖ్య నాయకులు మరియు టిడిపి కూటమి పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    4
    అభివృద్ధి, సంక్షేమాలే కూటమి ప్రభుత్వ అజెండా
- రేగడిచెలిక గ్రామంలో 55 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం.
- చేనేతలకు నేటి నుంచి అమలు కానున్న ఉచిత విద్యుత్ పధకం. 
- ఇఫ్కో కోసాన్ సెజ్ లో 10 వేల 705 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు రాబోతున్నాయి. 
- సిఎం చంద్రబాబు నాయుడు  చొరవతోనే గమేషా కంపెనీ స్థాపన. 
- ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ. 
- రైతులు పండించిన ప్రతి వడ్ల గింజ ప్రభుత్వం తీసుకుంటుంది.
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 
కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  కొడవలూరు మండలం రేగడిచెలిక గ్రామంలో 40 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు, డ్రైన్లతో పాటు 15 లక్షలతో నిర్మించిన పంచాయితీ కార్యాలయ ప్రహారి గోడ ప్రారంభోత్సవ కార్యకారక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభత్వం అధికారంలోనికి వచ్చిన 21 నెలల్లో కొడవలూరు మండల వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం గిట్టుబాటు ధరకు సేకరిస్తుందన్నారు. గత 30 ఏళ్లుగా నిర్లక్షానికి గురైన ఇఫ్కో కిసాన్ సెజ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పరిశ్రమలు  స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. మరో ఏడాదిలో ఇఫ్కో కోసాన్ సెజ్ లో 10 వేల 705 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షలు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఐటి మంత్రి లోకేష్  హామీ కార్యరూపం దాల్చనుందన్నారు.ఏప్రియల్ ఒకటి నుంచి చేనేత వర్గాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు పధకాన్ని అమలులోకి తీసుకురానుందన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగావినియోగించవచ్చన్నారు. ఈ పధకం ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 531 మంది చేనేతలకు లబ్ది చేకూరనుందనాన్రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  మాట్లాడాతూ సిఎం చంద్రబాబు నాయుడు  చొరవ కారణంగానే 2016 లో విండ్ పవర్ ఫ్యాన్లు తయారు చేసే గమేషా కంపెనీ కంపెనీ స్థాపన జరిగిందన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టబద్ధమైన హామీ యివ్వాలని శాసనసభలో ముఖ్యమంత్రి  దృష్టికి తెచ్చిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. 
ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  సహకారంతో కిసాన్ సెజ్ లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకు పరిశ్రమలకు అవసరమైన  నైపుణ్యాలకు సంబంధించి  శిక్షణ యిచ్చి కిసాన్ సెజ్ లో ఏర్పాటు చేసే పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మేం చేసిన అభివృద్ధి పనులు మీరు ఎలా ప్రారంభోత్సవం చేస్తారనే వైసిపి నేతలకు  శంఖుస్థానాలు చేసాక పని పూర్తి చేయాలని టెంకాయ కొట్టేసి మేం చెప్పుకుంటే కుదరదని సూటిగా సమాధానం చెప్పారు. కూటమి ప్రభుత్వ 21 నెలల కాలంలో  రేగడిచెలిక గ్రామాభివృద్ధి కోసం 1 కోటి 6 లక్షల  5 వేల579 రూపాయలు వెచ్చించిన అభివృద్ధి పనుల వివరాలను ప్రజలకు వివరించారు. సర్పంచుల పదవీ కాలం రేపటితో ముగియనుందన్నారు. స్థానిక సంస్థల నిధులను గత ప్రభుత్వం పక్క దారి పట్టించడంతో అభివృద్ధి చేయలేక అసంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నారనని స్థానిక సంస్థల బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభత్వ చొరవను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు మండల ముఖ్య నాయకులు మరియు టిడిపి కూటమి పార్టీల స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • బద్వేలు:బద్వేలు పట్టణం రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జనసేన నేతలు హల్చల్ చేశారు. కళ్యాణ మండపం పరిధిలోని ఇంటిలోనికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి మహిళలపై దౌర్జన్యం చేసి ఇండ్లు ఖాళీ చేయకపోతే జెసిపి తో కూల్చి వేస్తామని భయబ్రాంతులకు జనసేన నేతలు చేసినట్లు స్థానికులు తెలిపారు. దినిపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
    1
    బద్వేలు:బద్వేలు పట్టణం రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జనసేన నేతలు హల్చల్ చేశారు.
కళ్యాణ మండపం పరిధిలోని ఇంటిలోనికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి మహిళలపై దౌర్జన్యం చేసి ఇండ్లు ఖాళీ చేయకపోతే జెసిపి తో కూల్చి వేస్తామని భయబ్రాంతులకు జనసేన నేతలు చేసినట్లు స్థానికులు తెలిపారు. దినిపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో  బాధితులు ఫిర్యాదు చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • గాండ్లపెంట కటారుపల్లి గ్రామంలో జరిగిన వేమన బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగ ళవారం ఉట్ల తిరుణాల జరిగింది. మద్ది వారిగొంది గ్రామానికి చెందిన సాయికుమార్ నాయుడు టీం సభ్యులు సాధించుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వేమన ఉట్ల తిరుణాల ఆ గ్రామానికి చెందిన వారే సాధించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వేమన భక్తులు యువతకు ప్రశంసించారు. వేమన ఆలయ పీఠాధిపతులు నందవేమారెడ్డి మరి కొంతమంది అర్చకులు యువత పాల్గొన్నారు.
    1
    గాండ్లపెంట  కటారుపల్లి గ్రామంలో జరిగిన వేమన బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగ ళవారం ఉట్ల తిరుణాల జరిగింది. మద్ది వారిగొంది గ్రామానికి చెందిన సాయికుమార్ నాయుడు టీం సభ్యులు సాధించుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వేమన ఉట్ల తిరుణాల ఆ గ్రామానికి చెందిన వారే సాధించుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వేమన భక్తులు యువతకు ప్రశంసించారు. వేమన ఆలయ పీఠాధిపతులు నందవేమారెడ్డి మరి కొంతమంది అర్చకులు యువత పాల్గొన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    3 hrs ago
  • నరసరావుపేట–గుంటూరు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు గుండాలపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గుండాలపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    నరసరావుపేట–గుంటూరు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు గుండాలపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో గుండాలపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్ 'అమృత ధార' వాటర్ ప్లాంట్‌ ప్రారంభం - విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు. - కోవూరు నియోజకవర్గంలో ఇది 26 వ వాటర్ ప్లాంట్‌. - పార్లపల్లిలో గ్రామంలో 20 నెలల్లో 1 కోటి 2 లక్షలతో అభివృద్ధి పనులు - ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. విడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రులు డాక్టర్లు ఉండడం లేదని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లా వైద్యాధికారి తో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో డాక్టర్లను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పార్లపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జల్ జీవన్ మిషన్ ద్వారా 36 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్, 11 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం, 3 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ మరియు పంచాయతీ నిధులతో కలిపి మొత్తం 9 సి.సి. రోడ్ల నిర్మాణం చేసామన్నారు.ఆరగాణి కాలువపై 10 లక్షలతో కల్వర్టు, CSR నిధులతో స్మశాన వాటికల్లో షెల్టర్ల నిర్మాణం గురించి చెబుతూ ​గడిచిన 20 నెలల పార్లపల్లి గ్రామంలో 1 కోటి 2 లక్షలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక భూమి సమస్య పరిష్కారానికి తన వంతుగా రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. ముగ్గురు అనారోగ్య బాధితులకు CMRF ద్వారా రూ. 2 లక్షల 76 వేల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. 1 కోటి 70లక్షల రూపాయలతో పార్లపల్లి నుండి చవటపాలెం వరకు కనెక్టింగ్ రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ఈ పనులను మంజూరు చేయించి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈసందర్భంగా హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
    4
    పార్లపల్లిలో విపిఆర్ ఫౌండేషన్  'అమృత ధార' వాటర్ ప్లాంట్‌ ప్రారంభం
- విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజలకు సురక్షిత తాగునీరు.
- కోవూరు నియోజకవర్గంలో ఇది 26 వ వాటర్ ప్లాంట్‌.
- పార్లపల్లిలో గ్రామంలో 20 నెలల్లో 1 కోటి 2 లక్షలతో అభివృద్ధి పనులు
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. 
రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాము ప్రజా సేవకులమని పదవుల కోసం కాకుండా ప్రజలకు మరింత చేరువై సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'అమృత ధార' ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  పవిత్ర సంకల్పంతో 2016లో ఉదయగిరిలో ప్రారంభమైన అమృత ధార ప్రస్థానం నేడు జిల్లా అంతటా విస్తరించిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 200 వాటర్ ప్లాంట్ల ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. కోవూరు నియోజకవర్గంలో ఇది 26వ ప్లాంట్ అని, దీని నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషనే చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. విడవలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రులు డాక్టర్లు ఉండడం లేదని స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  జిల్లా వైద్యాధికారి తో ఫోన్లో మాట్లాడి హాస్పిటల్లో నైట్ షిఫ్ట్ లో డాక్టర్లను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పార్లపల్లి గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జల్ జీవన్ మిషన్ ద్వారా 36 లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంక్, 11 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం, 3 లక్షలతో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేసిన విషయాన్ని ఆమె తెలిపారు. 
ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ మరియు పంచాయతీ నిధులతో కలిపి మొత్తం 9 సి.సి. రోడ్ల నిర్మాణం చేసామన్నారు.ఆరగాణి కాలువపై 10 లక్షలతో కల్వర్టు, CSR నిధులతో స్మశాన వాటికల్లో షెల్టర్ల నిర్మాణం గురించి చెబుతూ ​గడిచిన 20 నెలల పార్లపల్లి గ్రామంలో  1 కోటి 2 లక్షలతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఆమె వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్మశాన వాటిక భూమి సమస్య పరిష్కారానికి తన వంతుగా రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.
ముగ్గురు అనారోగ్య బాధితులకు CMRF ద్వారా రూ. 2 లక్షల 76 వేల  ఆర్థిక సహాయం అందజేశామన్నారు. 1 కోటి 70లక్షల రూపాయలతో పార్లపల్లి నుండి చవటపాలెం వరకు కనెక్టింగ్ రోడ్డు మరియు కల్వర్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే ఈ పనులను మంజూరు చేయించి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈసందర్భంగా హామీ యిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.