నల్గొండలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై సమావేశం.. హాజరైన మండల చైర్మన్ గుత్తా మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి నల్లగొండ.. నల్గొండలో "ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక" పై భారీ సన్నాహక సమావేశం ఉదయాదిత్య భవన్లో రాజకీయ, పరిపాలనా నేతల సమాగమం... నల్గొండ కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”పై ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు... తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు... జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశంలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై కీలక సూచనలు చేశారు... పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు... ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొని కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.... ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం, ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశం కీలకంగా మారింది... గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు... వచ్చే 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, పారిశుధ్యం, గృహనిర్మాణం, పేదలకు సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు... అభివృద్ధి పనుల్లో ఆలస్యం సహించబోమని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజలకు ప్రత్యక్ష లాభం కలిగేలా చర్యలు తీసుకోవాలని నాయకులు స్పష్టం చేశారు.... ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లలను అభివృద్ధిలో ముందంజలో నిలబెట్టేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశంలో పేర్కొన్నారు... ప్రజలకు పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని, అధికారులంతా బాధ్యతగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు....
నల్గొండలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై సమావేశం.. హాజరైన మండల చైర్మన్ గుత్తా మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి నల్లగొండ.. నల్గొండలో "ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక" పై భారీ సన్నాహక సమావేశం ఉదయాదిత్య భవన్లో రాజకీయ, పరిపాలనా నేతల సమాగమం... నల్గొండ కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”పై ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి సన్నాహక సమావేశం ఘనంగా నిర్వహించారు... తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు... జిల్లా ఇంచార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశంలో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై కీలక సూచనలు చేశారు... పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు... ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొని కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు.... ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల వేగవంతం, ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశం కీలకంగా మారింది... గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు... వచ్చే 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, పారిశుధ్యం, గృహనిర్మాణం, పేదలకు సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు... అభివృద్ధి పనుల్లో ఆలస్యం సహించబోమని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజలకు ప్రత్యక్ష లాభం కలిగేలా చర్యలు తీసుకోవాలని నాయకులు స్పష్టం చేశారు.... ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లలను అభివృద్ధిలో ముందంజలో నిలబెట్టేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశంలో పేర్కొన్నారు... ప్రజలకు పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని, అధికారులంతా బాధ్యతగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు....
- నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..* ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష... లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి... పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి... డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన... అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం... అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి... ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది... కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..1
- Post by Tagore3
- ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.1
- ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు4
- పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సూర్యాంధ్ర ప్రగతి శకటాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరిశీలించారు.1
- Post by Tagore1