logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాయదుర్గం నియోజకవర్గం లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనను జయప్రదం చేయండి రాయదుర్గంలో నిర్వహించనున్న మంత్రి లోకేశ్ పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, టీడీపీ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ధ్యేయమన్నారు. పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. 10 వేల 15 వేల మంది స్వచ్ఛందంగా తరలివస్తారని తెలిపారు.

18 hrs ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

రాయదుర్గం నియోజకవర్గం లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనను జయప్రదం చేయండి రాయదుర్గంలో నిర్వహించనున్న మంత్రి లోకేశ్ పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, టీడీపీ కోఆర్డినేటర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ధ్యేయమన్నారు. పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. 10 వేల 15 వేల మంది స్వచ్ఛందంగా తరలివస్తారని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • బంగాళాఖాతంలో అల్పపీడ ద్రోని బలపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉంది ప్రజలు వరుణ్ దేవుని వైపే కన్నార్పకుండా వరుణ్ దేవుని కొరకు పూజలు ఎన్నో చేస్తున్నారు రైతులు ఎదురుచూపులు వర్షాన్ని కురవాలని రైతే రాజు మాటల్లో కాదు ఆచరణలో పెట్టాలని మనమందరం ఆ వరుణ దేవుని వర్షాలు కురవాలి రైతులు ఆనందంగా ఉండాలి వాళ్లు పండిస్తూనే మన ఐదేళ్ల నోట్లోకి పోయేది అటువంటి రైతు దేవునికి పూజలు తప్ప ఏం చేయగలడు మనమందరం ఒక్కసారి వాన దేవుడా కరుణించు అనే ప్రార్థిద్దాం వర్షాలు కురవాలి రైతులు ఎదురుచూపులు
    1
    బంగాళాఖాతంలో అల్పపీడ ద్రోని బలపడుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉంది
ప్రజలు వరుణ్ దేవుని వైపే కన్నార్పకుండా వరుణ్ దేవుని కొరకు పూజలు ఎన్నో చేస్తున్నారు రైతులు ఎదురుచూపులు వర్షాన్ని కురవాలని రైతే రాజు మాటల్లో కాదు ఆచరణలో పెట్టాలని మనమందరం ఆ వరుణ దేవుని  వర్షాలు కురవాలి రైతులు ఆనందంగా ఉండాలి వాళ్లు పండిస్తూనే మన ఐదేళ్ల నోట్లోకి పోయేది అటువంటి రైతు దేవునికి పూజలు తప్ప ఏం చేయగలడు మనమందరం ఒక్కసారి వాన దేవుడా కరుణించు అనే ప్రార్థిద్దాం వర్షాలు కురవాలి రైతులు ఎదురుచూపులు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Farmer ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    21 hrs ago
  • సంగమేశ్వరం ఆలయం వద్ద గుంపులు గుంపులుగా పిచ్చుకలు - భక్తులకు కనువిందు అంతరించిపోతున్న పిచ్చుకలు మళ్లీ కనువిందు చేస్తున్నాయి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంగమేశ్వరం ఆలయం వద్ద గుంపులు గుంపులుగా పిచ్చుకలు దర్శనమిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలోని చెట్లు, గోపురాలపై వందల సంఖ్యలో పిచ్చుకలు చేరి కిచకిచమంటూ చేస్తున్న సందడి భక్తులను ఆకట్టుకుంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహారం కోసం గుంపులుగా తిరుగుతున్న పిచ్చుకల దృశ్యాలు చూపరులను అలరిస్తున్నాయి. ఆలయ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం, కాలుష్యం లేని పరిసరాలు ఉండటంతో పిచ్చుకలు ఇక్కడకు చేరుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన పిచ్చుకలు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్న తరుణంలో సంగమేశ్వరం ఆలయం వద్ద వాటి సందడి పక్షి ప్రేమికులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
    1
    సంగమేశ్వరం ఆలయం వద్ద గుంపులు గుంపులుగా పిచ్చుకలు - భక్తులకు కనువిందు
అంతరించిపోతున్న పిచ్చుకలు మళ్లీ కనువిందు చేస్తున్నాయి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంగమేశ్వరం ఆలయం వద్ద గుంపులు గుంపులుగా పిచ్చుకలు దర్శనమిస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలోని చెట్లు, గోపురాలపై వందల సంఖ్యలో పిచ్చుకలు చేరి కిచకిచమంటూ చేస్తున్న సందడి భక్తులను ఆకట్టుకుంటోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆహారం కోసం గుంపులుగా తిరుగుతున్న పిచ్చుకల దృశ్యాలు చూపరులను అలరిస్తున్నాయి. ఆలయ పరిసరాల్లో ప్రశాంత వాతావరణం, కాలుష్యం లేని పరిసరాలు ఉండటంతో పిచ్చుకలు ఇక్కడకు చేరుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన పిచ్చుకలు ఇప్పుడు అరుదుగా కనిపిస్తున్న తరుణంలో సంగమేశ్వరం ఆలయం వద్ద వాటి సందడి పక్షి ప్రేమికులకు ఆనందాన్ని కలిగిస్తోంది.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    58 min ago
  • #rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty
    1
    #rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty 
Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty Rayachoty
    user_Phatan dastagir kham
    Phatan dastagir kham
    రాయచోటి, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి* కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.
    1
    రోడ్డుపై కూలిన చెట్టు: శ్రమదానం చేసి తొలగించిన పానుగల్ మాజీ జెడ్పీటీసీ రవి*
కేతేపల్లి- వనపర్తి* రహదారిపై అడ్డంగా *పడిన భారీ వృక్షాన్ని* పానుగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు *మాజీ జెడ్పీటీసీ రవి తన అనుచరులతో* కలిసి శ్రమదానం చేసి ఆదివారం తొలగించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకూడదని, సమస్యను గమనించిన రవి వెంటనే స్పందించారు. అధికారుల కోసం వేచి చూడకుండా, స్వయంగా రంగంలోకి దిగారు. *స్థానికులు, తన అనుచరులతో కలిసి శ్రమదానం చేశారు. కొడవలి తో చెట్టు కొమ్మలను నరికి, అటుగా వెళ్తున్న ట్రాక్టర్ సహాయం తో రహదారిపై నుంచి పక్కకు తొలగించారు* . సేవాభావాన్ని చూసి ప్రయాణికులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా పదవిలో లేకపోయినా, సమాజం పట్ల ఆయన చూపిన బాధ్యతను పలువురు అభినందించారు.
    user_A Rajasheker
    A Rajasheker
    Lawyer పాంగల్, వనపర్తి, తెలంగాణ•
    17 hrs ago
  • బద్వేలు,ఆగస్టు 23: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చండువాయి కాలనీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్ చేశారు. చండువాయి కాలనీకి చెందిన బొమ్మిశెట్టి ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు హరిబాబు నివాసంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీ, కూలర్, ఫ్యాన్లు, సోఫా సెట్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి పేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. కాలనీలో చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా, వోల్టేజ్ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు. ఘటన అనంతరం విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ కి ఫోన్ చేసి సంఘటన స్థలానికి రావాలని కోరగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా “మీటర్ ఉందా? డిమాండ్ నంబర్ ఉందా?” అని ప్రశ్నించడం అమానుషమని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని, పాత విద్యుత్ తీగలను మార్చి, ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి. సరస్వతి, ఆదిలక్ష్మి, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
    2
    బద్వేలు,ఆగస్టు 23: నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్. వెంకటాపురం పంచాయతీ పరిధిలోని చండువాయి కాలనీలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఇ. రమణయ్య డిమాండ్ చేశారు.
చండువాయి కాలనీకి చెందిన బొమ్మిశెట్టి ఈశ్వరమ్మ, ఆమె కుమారుడు హరిబాబు నివాసంలో విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీ, కూలర్, ఫ్యాన్లు, సోఫా సెట్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయి పేద కుటుంబం తీవ్రంగా నష్టపోయింది.
కాలనీలో చాలా కాలంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నా, వోల్టేజ్ సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని విమర్శించారు.
ఘటన అనంతరం విద్యుత్ శాఖ ఏఈ కృష్ణ కి ఫోన్ చేసి సంఘటన స్థలానికి రావాలని కోరగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా “మీటర్ ఉందా? డిమాండ్ నంబర్ ఉందా?” అని ప్రశ్నించడం అమానుషమని మండిపడ్డారు.
బాధిత కుటుంబానికి తక్షణ సాయం అందించాలని, పాత విద్యుత్ తీగలను మార్చి, ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యం పెంచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పి. సరస్వతి, ఆదిలక్ష్మి, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • డోన్‌లో కీలక భేటీ నిర్వహించిన నంద్యాల డీసీసీ డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి నంద్యాల డీసీసీ అధ్యక్షులు,& డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి అధ్యక్షతన డోన్‌లో కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు, ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ గారు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా జీవీవీఎస్ కమలాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో స్పోర్ట్స్ కేటగిరీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పారదర్శకంగా అవకాశాలు కల్పించాలని తెలిపారు. గతంలో స్పోర్ట్స్‌కు ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండేవారని రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. క్రీడారంగ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి మాట్లాడుతూ యువత కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ‘పీపుల్ బుక్’ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో బనగానపల్లె ఇన్‌చార్జి బాలు యాదవ్, ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భరగోడ్ల హుస్సేన్ బాష, నందికొట్కూరు ఇన్‌చార్జి తేనే నాగరాజు, నంద్యాల టౌన్ అధ్యక్షులు మస్తాన్ వలి, పాణ్యం అర్బన్ ఇన్‌చార్జి రజాక్ వలి, డీసీసీ ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్, కార్యదర్శి ఆర్. గోపినాథ్ రావు, మండల అధ్యక్షులు ధోని రామాంజనేయులు, శనిగాల మహీంద్ర నాయుడు, స్టేట్ మైనారిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ మాజిద్ మౌలానా , పఠాన్ మహమ్మద్ హుస్సేన్, కాంగ్రెస్ మహిళా నేతలు భారతి, లక్ష్మీదేవి, నాయకులు గిడ్డయ్య, నాగన్న వెంకటేశ్వర్లు, బాలు, సురేష్, రాజ్ కుమార్, అప్పన్న, ఇంతియాజ్, మస్తాన్ బాష, రామకృష్ణ, మల్లికార్జున, శివ, రామాంజినేయులు, మద్దిలేటి, మాషుమ్, జలీల్, సెక్షవలి, మధు తదితరులు పాల్గొన్నారు.
    1
    డోన్‌లో కీలక భేటీ నిర్వహించిన నంద్యాల డీసీసీ డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి
నంద్యాల డీసీసీ అధ్యక్షులు,& డోన్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి అధ్యక్షతన డోన్‌లో కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ సెల్ సమావేశం నిర్వహించారు. 
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జీవీవీఎస్ కమలాకర్ రావు, ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ గారు పాల్గొని ప్రసంగించారు
ఈ సందర్భంగా జీవీవీఎస్ కమలాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో స్పోర్ట్స్ కేటగిరీలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని అన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు పారదర్శకంగా అవకాశాలు కల్పించాలని తెలిపారు. గతంలో స్పోర్ట్స్‌కు ప్రత్యేకంగా ఒక మంత్రి ఉండేవారని రాహుల్ గాంధీ ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేశారు. క్రీడారంగ సమస్యలను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఏఐసీసీ సభ్యులు జంగిటి లక్ష్మి నరసింహ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు.  గ్రామీణ స్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని చెప్పారు. 
డీసీసీ అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి మాట్లాడుతూ యువత కాంగ్రెస్‌లోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ‘పీపుల్ బుక్’ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమావేశంలో బనగానపల్లె ఇన్‌చార్జి బాలు యాదవ్, ఆళ్లగడ్డ ఇన్‌చార్జి భరగోడ్ల హుస్సేన్ బాష, నందికొట్కూరు ఇన్‌చార్జి తేనే నాగరాజు, నంద్యాల టౌన్ అధ్యక్షులు మస్తాన్ వలి, పాణ్యం అర్బన్ ఇన్‌చార్జి రజాక్ వలి, డీసీసీ ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్, కార్యదర్శి ఆర్. గోపినాథ్ రావు, మండల అధ్యక్షులు ధోని రామాంజనేయులు, శనిగాల మహీంద్ర నాయుడు, స్టేట్ మైనారిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ మాజిద్ మౌలానా , పఠాన్ మహమ్మద్ హుస్సేన్, కాంగ్రెస్ మహిళా నేతలు భారతి, లక్ష్మీదేవి, నాయకులు గిడ్డయ్య, నాగన్న వెంకటేశ్వర్లు, బాలు, సురేష్, రాజ్ కుమార్, అప్పన్న, ఇంతియాజ్, మస్తాన్ బాష, రామకృష్ణ, మల్లికార్జున, శివ, రామాంజినేయులు, మద్దిలేటి, మాషుమ్, జలీల్, సెక్షవలి, మధు తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • మదనపల్లి: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశానికి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. జర్నలిస్టుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తన తరఫున విలేకరులందరికీ హెల్త్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని బోడే రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో జర్నలిస్టులు, ఫెడరేషన్ మరియు బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించిన హామీ పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
    1
    మదనపల్లి: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశానికి భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.
జర్నలిస్టుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తన తరఫున విలేకరులందరికీ హెల్త్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని బోడే రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
ఈ సమావేశంలో జర్నలిస్టులు, ఫెడరేషన్ మరియు బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించిన హామీ పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • మొగిలి ఘాట్లో అదుపుతప్పి ఒక దానికి ఒకటి ఢీకొన్న కార్లు .. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాట్లో ఆదివారం మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాదంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
    1
    మొగిలి ఘాట్లో అదుపుతప్పి ఒక దానికి ఒకటి ఢీకొన్న కార్లు ..
చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలంలోని మొగిలి ఘాట్లో ఆదివారం మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు  ముందు వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న కార్లు అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నట్లు  తెలిపారు. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే మూడు కార్లు స్వల్పంగా ధ్వంసమైనట్లు సమాచారం. ప్రమాదంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • తంబళ్లపల్లి లో ఇద్దరు చిన్నారులపై మహబూబ్ భాష అనే వ్యక్తి లైంగిక దాడి. అన్నమయ్య జిల్లా,తంబళ్లపల్లి మొలకలచెరువు (మం) చౌడసముద్రం గ్రామంలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ భాషా అనే వ్యక్తి... అదే గ్రామానికి చెందిన 6,7 సంవత్సరాల చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ భాషా చిన్నారులు కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయిన వృద్ధుడు... చిన్నారుల అవ్వ కవితమ్మ,తల్లి భాగ్యశ్రీ, తం ఆంజనేయులు ఫిర్యాదుల మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మొలకలచెరువు పోలీసులు...
    3
    తంబళ్లపల్లి లో ఇద్దరు చిన్నారులపై  మహబూబ్ భాష అనే వ్యక్తి లైంగిక దాడి.
అన్నమయ్య జిల్లా,తంబళ్లపల్లి 
మొలకలచెరువు (మం) చౌడసముద్రం గ్రామంలో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డ మహబూబ్ భాషా అనే వ్యక్తి...
అదే గ్రామానికి చెందిన 6,7 సంవత్సరాల చిన్నారులపై లైంగిక  దాడికి పాల్పడ్డ మహబూబ్ భాషా చిన్నారులు కేకలు వేయడంతో అక్కడి నుండి పారిపోయిన వృద్ధుడు...
చిన్నారుల అవ్వ కవితమ్మ,తల్లి భాగ్యశ్రీ, తం ఆంజనేయులు ఫిర్యాదుల మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మొలకలచెరువు పోలీసులు...
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.