Shuru
Apke Nagar Ki App…
హిందుత్వం మా డిఎన్ఏ..MP ధర్మపురి అరవింద్ హిందుత్వం తమకు ఓట్ల కోసం వాడే ఆయుధం కాదని, అది తమ డీఎన్ఏలోనే ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం నిజామాబాద్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు అవినీతి కోసమే హిందుత్వాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి గత 17ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.8 కోట్ల మున్సిపల్ బకాయిలను ఇప్పుడు చెల్లించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Sri
హిందుత్వం మా డిఎన్ఏ..MP ధర్మపురి అరవింద్ హిందుత్వం తమకు ఓట్ల కోసం వాడే ఆయుధం కాదని, అది తమ డీఎన్ఏలోనే ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం నిజామాబాద్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు అవినీతి కోసమే హిందుత్వాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి గత 17ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.8 కోట్ల మున్సిపల్ బకాయిలను ఇప్పుడు చెల్లించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- హిందుత్వం తమకు ఓట్ల కోసం వాడే ఆయుధం కాదని, అది తమ డీఎన్ఏలోనే ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం నిజామాబాద్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు అవినీతి కోసమే హిందుత్వాన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి గత 17ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.8 కోట్ల మున్సిపల్ బకాయిలను ఇప్పుడు చెల్లించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వడ్డెర కాలనీకి చెందిన గండికోట మల్లేష్ (35) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మానసికంగా కుంగిపోయి, జీవితంపై విరక్తి చెంది ఈ నెల 3వ తేదీ రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో, చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్.ఐ.మహేష్ తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి గండికోట ఎల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలున్నారు.1
- బోథ్ నియోజకవర్గంలోని తాంసి(బి) భీంపూర్ మండలల్లో నూతన వివో బావనాలకు భూమి పూజా చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,అధికారులు BRS కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- మెదక్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 30వ వార్డు నుండి అరుణతి వెంకటరమణ కవిత ఆస్తి కోసం పంచాయతీ నడుస్తుందని అన్నారు ప్రజల కోసం ప్రజాపాలన చేస్తున్న ము పారి పాలన చూసిన ప్రజలు మున్సిపల్ లో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు మెదక్ మున్సిపల్ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు పాల్గొన్నారు.1
- చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరు చేనేతను ధరించి ప్రోత్సహించాలి వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు జగిత్యాల ఫిబ్రవరి 4 : చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరు చేనేతను ధరించి ప్రోత్సహించాలని వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు బెజ్జంకి సంపూర్ణ చారి లు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శివ సాయి రెసిడెన్సీలో టెస్కో టెస్కో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చేనేత వస్త్రాలు మనదేశంలో తయారుచేసే చేనేత కార్మికులు ఉన్నారని, విదేశీ వస్త్రాల మోజులో పడి మన చేనేతను ఆదరించకపోవడంతో చేనేత కార్మికులు ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేనేత కార్మికులను ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరు నాణ్యమైన చేనేత వస్త్రాలను ధరించాలని కోరారు. టెస్కో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేనేత ప్రదర్శనలో 50 శాతం నుండి 90 శాతం వరకు రాయితీ ఇస్తున్నందున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టెస్కో ఇన్చార్జ్ వెంకటేష్, పాత్రికేయులు సిరిసిల్ల వేణుగోపాల్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- ఈ నెల 11 వ తేదీన నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి బుధవారం పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ స్కూల్, వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న మున్సిపల్ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రం కోసం చేసుకున్న ప్లాన్ ను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి పరిశీలించారు. స్కూల్, కళాశాల ఆవరణల్లో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు. అలాగే సిరిసిల్ల, వేములవాడ పట్టణంలోని సీ నారాయణరెడ్డి కళా మందిరాల్లో రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రం కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.కౌంటింగ్ హాల్లో భద్రతా ఏర్పాట్లు, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, తాగునీరు, తదితర సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనాల పార్కింగ్ కోసం చదును చేస్తున్న స్థలాన్ని సందర్శించారు. కళా మందిరం లోపల స్ట్రాంగ్ రూం, ఓట్ల లెక్కింపు కోసం ఎన్ని టేబుల్స్, అధికారులు, పోటీలో ఉన్న అభ్యర్థులకు కోసం చేస్తున్న ఏర్పాట్లను సందర్శిచారు. వాహనాల పార్కింగ్, క్రమబద్ధమైన రాకపోకలు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. మీడియా సెంటర్ ఏర్పాటుపై సూచనలు చేశారు. పరిశీలనలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, నోడల్ అధికారులు శ్రీనివాసాచారి, ప్రవీణ్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్ తదితరులు ఉన్నారు.1
- జగిత్యాల : -ఇప్పటికైనా, జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీ లో ఉన్నారో తెలుసుకోవడం సంతోషం అని ఎద్దేవా -ఇకనైనా బుద్ధిగా ఉండు..పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో.. -అభివృద్ధి అంటే.. పక్కింటి కీ కన్నం వేయడమా...అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై ఆగ్రహం జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై, స్పీకర్ తన తీర్పులో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ బీ ఆర్ ఎస్ పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారనీ, ఇప్పటికైనా, జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీ లో ఉన్నారో తెలుసుకోవడం సంతోషం అని ఎద్దేవా చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడారు. చట్ట సభలకు ఎన్నికైన వారు ఎవరైనా రాజ్యంగ విలువలకు కట్టుబడి ఉండాలనీ,మీ సంసారం చక్కబెట్టుకోకుండా.. మా సంసారంలో ఎందుకు చిచ్చు పెడుతున్నావు అని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాట ఫలితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తె..ఆ ఫలాలు కాంగ్రెస్ కార్యకర్తలు పొందాలన్నారు. అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా అని అంటూ, 20 నెలల్లో జగిత్యాల నియోజక వర్గ అభివృద్ధికి చేసింది ఏమిటో చెప్పాలన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధాన పరమైన నిర్ణయం.. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో జగిత్యాలలో ఏర్పాటు చేస్తున్నారు.. ప్రతి జిల్లా లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించి ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. క్రిటికల్ కేర్ ఏర్పాటు చేయడం..ఇవన్నీ విధానపరమైన అభివృద్ధి..గత ప్రభుత్వం తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెమెంట్ కార్పొరేషన్ మంజూరు చేసిన నిధులు ఖర్చు కాకుంటే, తిరిగి అవే నిధులు తాను తీసుకు వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. గౌరీ శంకర్ ఇన్ఫ్రా కంపెనీ మొదటి కాల్ లో 3 శాతం అధికంగా కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. 14 శాతం ఎస్టిమేషన్ లో కలుపుతారు. 17 శాతం నేరుగా లాభం పొందుతున్నారు.. దాని వెనక ఇంకా ఎంత లాభం ఉందో.. .ఇదేనా మీరు సాధించిన అభివృద్ధి.. పక్కింటి కీ కన్నం వేయటం.. బిల్లుల కోసం తాపత్రయం..ఇదేనా మీ అభివృద్ధి అని అన్నారు.2
- బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే 4, 8 వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్తూ ఓటర్లను అభ్యర్థించారు. బిచ్కుంది అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. 12 వార్డుల్లోనూ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకుడు నాల్చర్ రాజు తదితరులు పాల్గొన్నారు.1