logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సదాశివునిపాలెం లో జరుగుతున్న అంకమ్మ తల్లి తిరునలలో భాగముగా తుంబురు కృష్ణారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారు నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలు. ఈ పోటీలలో మన ప్రియతమ ఎంఎల్ఏ మట్టా రాగమయి దయానంద్ గారు పాల్గొని గెలిసిన వారికి బహుమతులు అందజేశారు

3 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
3 hrs ago
1bc9f42c-2b50-4cc1-85cf-220aa2e5f152
135c3bbe-1355-42b5-bc20-d0b3a77d68bf
13f5f24f-3b39-4b75-9a05-5e80f96b29ee

సదాశివునిపాలెం లో జరుగుతున్న అంకమ్మ తల్లి తిరునలలో భాగముగా తుంబురు కృష్ణారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారు నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలు. ఈ పోటీలలో మన ప్రియతమ ఎంఎల్ఏ మట్టా రాగమయి దయానంద్ గారు పాల్గొని గెలిసిన వారికి బహుమతులు అందజేశారు

More news from తెలంగాణ and nearby areas
  • Post by V Ramarao
    4
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సిమెంటు ధరలు, ఇనుప చువ్వా, హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో కచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన .ఊకే ముత్తయ్య దొర. కొమ్ము విజయకుమార్. నరపోగు దీప్తి. నరేష్.వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇస్తున్న నగదును 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని ఆధార్  పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇస్తున్న 5 లక్షలు ఇల్లు నిర్మించుకునేందుకు అరకొరగా ఉన్నాయని తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం సిమెంటు ధరలు, ఇనుప చువ్వా,  హమాలీల ధరలు భారీగా పెరిగినందున 10 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా బిల్లులను వారంలో కచ్చితంగా లబ్ధిదారుడికి అందే విధంగా చూడాలన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ఏప్రిల్ నెలలో మంజూరు చేస్తానని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ మాటలను నిలబెట్టుకోవాలని కోరారు. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా  మహిళలకు నగదును పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన .ఊకే ముత్తయ్య దొర. కొమ్ము విజయకుమార్. నరపోగు దీప్తి. నరేష్.వెంట ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు సూర్యాంధ్ర ప్ర‌గ‌తి శ‌క‌టాల ద్వారా విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరిశీలించారు.
    1
    పీఎం సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచేందుకు సూర్యాంధ్ర ప్ర‌గ‌తి శ‌క‌టాల ద్వారా విస్తృత ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో పలు గృహాలపై అమర్చిన సౌర విద్యుత్ ఫలకాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పరిశీలించారు.
    user_Narasimha Rao Senior Journalist Damala
    Narasimha Rao Senior Journalist Damala
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*
    1
    ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. టౌన్ పోలీసుల కథనం ప్రకారం…నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన నిందితుడు చిలుకబత్తిని రంజిత్, S/o వెంకన్న, 19 సం,,లు, వృత్తి:డెకరేషన్ వర్క్, అనే యువకుడు, 15 సం,,ల మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకున్నాడు. గత సోమవారం మహబూబాబాద్ కు వచ్చిన బాలికను తన బైక్ పై ఎక్కించుకుని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితున్ని అదుపులోకి తీసుకుని, అతనిపై కిడ్నాప్ మరియు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.*
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • మండపేట న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు బి ఆర్ నాయుడు కు ఎంత మాత్రం లేదని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు ఆయన వాడుతున్న భాష తిరుమల పవిత్రతను దిగజార్చుతున్నాయనీ మండిపడ్డారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని హెచ్చరించారు.వైసిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో శనివారం భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బి.ఆర్. నాయుడుని వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు కదం తొక్కారు.మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసిపి కార్యాలయం నుండి మండపేట కలువపువ్వు సెంటర్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం దేవాలయం వెలుపల మీడియా సమావేశం లో ఆయన పాల్గొన్నారు.ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలువపువ్వు సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూపవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిలో ఉండి ఒక మహిళతో అనైతికంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్నారు. వీడియో సాక్ష్యాలతో రాసలీలలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని పై చర్యలు తీసుకోకుండా, అతనిని ప్రశ్నించేవారి గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే బీఆర్ నాయుడును పదవీచ్యుతుడిని చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక మండపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవిలో వాకచర్ల గుప్తా ఉన్నారని ఆయన పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందన్నారు. భారీ మొత్తం లో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టీ , చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని నియమించడం చట్టవిరుద్ధమని తోట త్రిమూర్తులు దుయ్యబట్టారు. చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్ ఉన్న వ్యక్తిని ఇలాంటి పవిత్ర పదవికి నియమించడం సరికాదనీ స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావుకి గుర్తు చేశారు. ఇది దేవాలయ మర్యాదకు భంగం కలిగిస్తుందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పై తీవ్రంగా మండిపడ్డారు. 2003 లో అలిపిరి బాంబు బ్లాస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామి కృపవల్ల బయటపడ్డానని పదేపదే చెప్పే చంద్రబాబు, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసిందని పేర్కొని కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారన్నారు. ఇది అమాయకులైన భక్తులను మోసం చేయడమేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను కూడా ఎండగట్టారు. 60 సంవత్సరాలు నిండిన వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసి మోసం చేశారన్నారు. ఆడవారికి ఆడబడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల నిండిన మహిళలందరికీ 15,000 ఇస్తానని చెప్పి నిలువునా ముంచారనీ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటి వరకు కట్టిన దాఖలాలు లేవన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మాటే లేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండపేట టౌన్ వైసిపి ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు, జడ్పిటిసి కుడిపూడి రాంబాబు, కపిలేశ్వరం ఎంపీపీలు నౌడు వెంకటరమణ, జిత్తుగ వెంకటలక్ష్మి, మండల కన్వీనర్స్ అడబాల బాబ్జి, వెలగల సత్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు సిరిపురం శ్రీనివాస్, నక్కా సింహాచలం, రాష్ట్ర వైసిపి ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల, సుధాకర్, రాష్ట్ర వైసిపి బీసీ సెల్ కార్యదర్శి యాండ్ర బుజ్జి, రూరల్ వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ పెదపాటి సత్యనారాయణ మూర్తి, పొతంశెట్టి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, మందపల్లి రవికుమార్, సన్మాల ధనరాజు, జొన్నపల్లి సత్తిబాబు, వనుము నారాయణ, గొల్లకోటి రామకృష్ణ, పెంకే వెంకటరావు, పోతుల రాంబాబు పోతుల ప్రసాద్, శ్రీ శ్రీ, సాధనాల శివ, శెట్టి నాగేశ్వరరావు, వల్లూరి రామకృష్ణ, సురేష్, కొప్పిరెడ్డి ప్రసాద్ , షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ ఆలీఖాన్ బాబా,మరిశెట్టి సత్యనారాయణ, కవల శ్రీను, కోణాల బోసు, భాస్కర్ రావు, సెనగకాయల దొరబాబు, రుద్రాక్షల వీర వెంకట శ్రీనివాస్, రుద్రాక్షల వీర్రాజు, కొప్పిశెట్టి రామకిషోర్, తాతపూడి సుబ్రమణ్యం, పల్లివెల మధు. సలాది వీరబాబు, వాసంశెట్టి విష్ణు, జగపతి, సుదర్శన్, మనబడి నియోజకవర్గానికి చెందిన అన్ని గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, మాజీ వార్డ్ నెంబర్స్, ఆ మాజీ కౌన్సిలర్ అన్ని విభాగాలకు చెందిన నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    2
    మండపేట న్యూస్ 
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కొనసాగే నైతిక హక్కు బి ఆర్  నాయుడు కు ఎంత మాత్రం లేదని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలు ఆయన వాడుతున్న భాష తిరుమల పవిత్రతను దిగజార్చుతున్నాయనీ మండిపడ్డారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని హెచ్చరించారు.వైసిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ ఎమ్మెల్సీ  తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో శనివారం భారీ మోటర్ సైకిల్  ర్యాలీ నిర్వహించారు. బి.ఆర్. నాయుడుని వెంటనే టీటీడీ ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ  పెద్ద ఎత్తున కార్యకర్తలు కదం తొక్కారు.మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసిపి కార్యాలయం నుండి మండపేట  కలువపువ్వు సెంటర్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూజల అనంతరం దేవాలయం వెలుపల మీడియా సమావేశం లో ఆయన పాల్గొన్నారు.ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలువపువ్వు సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూపవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిలో ఉండి ఒక మహిళతో అనైతికంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలన్నారు. వీడియో సాక్ష్యాలతో రాసలీలలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని పై చర్యలు తీసుకోకుండా, అతనిని ప్రశ్నించేవారి గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే బీఆర్ నాయుడును పదవీచ్యుతుడిని చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక  మండపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పదవిలో వాకచర్ల గుప్తా ఉన్నారని ఆయన పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందన్నారు. భారీ మొత్తం లో ప్రజలకు కుచ్చు టోపీ పెట్టీ , చిట్టీల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని నియమించడం చట్టవిరుద్ధమని తోట త్రిమూర్తులు దుయ్యబట్టారు. చట్టం ప్రకారం ఎఫ్‌ఐఆర్ ఉన్న వ్యక్తిని ఇలాంటి పవిత్ర పదవికి నియమించడం సరికాదనీ స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావుకి గుర్తు చేశారు. ఇది దేవాలయ మర్యాదకు భంగం కలిగిస్తుందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పై  తీవ్రంగా మండిపడ్డారు. 2003 లో అలిపిరి బాంబు బ్లాస్ట్ నుంచి వెంకటేశ్వర స్వామి కృపవల్ల బయటపడ్డానని పదేపదే చెప్పే చంద్రబాబు, ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిసిందని పేర్కొని కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారన్నారు. ఇది అమాయకులైన భక్తులను మోసం చేయడమేనని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను కూడా ఎండగట్టారు. 60 సంవత్సరాలు నిండిన వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసి మోసం చేశారన్నారు. ఆడవారికి ఆడబడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుండి 59  సంవత్సరాల నిండిన మహిళలందరికీ 15,000 ఇస్తానని చెప్పి నిలువునా ముంచారనీ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పటి వరకు కట్టిన దాఖలాలు లేవన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మాటే లేదన్నారు.  కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.  ఈ కార్యక్రమంలో మండపేట టౌన్  వైసిపి ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, జిల్లా వైసిపి ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు, జడ్పిటిసి కుడిపూడి  రాంబాబు, కపిలేశ్వరం ఎంపీపీలు నౌడు వెంకటరమణ, జిత్తుగ వెంకటలక్ష్మి, మండల కన్వీనర్స్ అడబాల బాబ్జి, వెలగల సత్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు సిరిపురం శ్రీనివాస్,  నక్కా సింహాచలం, రాష్ట్ర వైసిపి ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల, సుధాకర్, రాష్ట్ర వైసిపి బీసీ సెల్  కార్యదర్శి యాండ్ర బుజ్జి, రూరల్ వైస్ ఎంపీపీ పసుమర్తి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ పెదపాటి సత్యనారాయణ మూర్తి, పొతంశెట్టి ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, మందపల్లి రవికుమార్, సన్మాల ధనరాజు, జొన్నపల్లి సత్తిబాబు, వనుము నారాయణ, గొల్లకోటి రామకృష్ణ, పెంకే వెంకటరావు, పోతుల రాంబాబు పోతుల ప్రసాద్, శ్రీ శ్రీ, సాధనాల శివ, శెట్టి నాగేశ్వరరావు, వల్లూరి రామకృష్ణ, సురేష్, కొప్పిరెడ్డి ప్రసాద్ ,  షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ ఆలీఖాన్ బాబా,మరిశెట్టి సత్యనారాయణ, కవల శ్రీను, కోణాల బోసు, భాస్కర్ రావు, సెనగకాయల దొరబాబు, రుద్రాక్షల వీర వెంకట శ్రీనివాస్, రుద్రాక్షల వీర్రాజు, కొప్పిశెట్టి రామకిషోర్, తాతపూడి సుబ్రమణ్యం, పల్లివెల మధు. సలాది వీరబాబు, వాసంశెట్టి విష్ణు, జగపతి, సుదర్శన్, మనబడి నియోజకవర్గానికి చెందిన అన్ని గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, మాజీ వార్డ్ నెంబర్స్, ఆ మాజీ కౌన్సిలర్ అన్ని విభాగాలకు చెందిన నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…
    2
    *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం 
ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    8 hrs ago
  • నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    1
    నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    10 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.