మైనర్ పిల్లలను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం, ఉల్లంఘించినవారు శిక్షార్హులు.. మంగళవారం మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ - ములుగు ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా బాల కార్మిక నిషేధ & క్రమబద్ధీకరణ చట్టం - 1986 (సవరణ చట్టం - 2016) పై మిర్చి రైతులకు అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా వాజేడు మండలంలోని వివిధ గ్రామాలలోని రైతులకు ముఖ్యంగా మిర్చి రైతులకు ప్రత్యేక అవగాహన నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా బాల పరిరక్షణ విభాగము, చైల్డ్ హెల్ప్ లైన్ & మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది తో కూడిన బృందం రైతుల వ్యవసాయ క్షేత్రాలు, మిర్చి కల్లాల వద్ద ప్రత్యక్షంగా సందర్శనచేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్ హరికృష్ణ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ అనేది బాలల ఎదుగుదలకు ఒక గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. ములుగు జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించి, మన ములుగు జిల్లాను బాలల కార్మిక రహిత జిల్లాగా చేయాలనే ధృడ సంకల్పంతో గౌరవ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డా. ధనసరి అనసూయ (సీతక్క) ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర టి.ఎస్ ఐ ఏ ఎస్ ఆదేశానుసారం ములుగు జిల్లాలో ముఖ్యంగా మిర్చి పండిస్తున్న గోదావరి పరీవాహక ప్రాంత మండలాల్లో అధికారులు మిర్చి రైతుల పొలాల వద్దకు వెళ్లి బాల కార్మిక నిషేధ మరియు క్రమబద్ధీకరణ చట్టం - 1986 (సవరణ చట్టం - 2016) పై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం 14 సం.ల లోపు మైనర్ పిల్లలను ఏ పనిలో కూడా పెట్టుకోవద్దని, 15-18 సం.లోపు వయస్సున్న రైతులకు కౌమార దశ పిల్లలను హానికరమైన పనుల్లో పెట్టుకోవడం పూర్తిగా నిషేధం అని రైతులకు అవగాహన కల్పించి, ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 2 సంవత్సరాల జైలు లేదా ₹50,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని నోటీసుల ద్వారా ముందస్తుగా తెలియజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ముఖ్యంగా మిర్చి తోటల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా బాలల పరి విభాగము కౌన్సిలర్ టి సంధ్య, మహిళా సోషల్ వర్కర్ బి జ్యోతి, మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ ఆర్ స్రవంతి, వాజేడు మండలంలోని వివిధ గ్రామాల రైతులు & కూలీలు తదితరులు పాల్గొన్నారు.
మైనర్ పిల్లలను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరం, ఉల్లంఘించినవారు శిక్షార్హులు.. మంగళవారం మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ - ములుగు ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా బాల కార్మిక నిషేధ & క్రమబద్ధీకరణ చట్టం - 1986 (సవరణ చట్టం - 2016) పై మిర్చి రైతులకు అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా వాజేడు మండలంలోని వివిధ గ్రామాలలోని రైతులకు ముఖ్యంగా మిర్చి రైతులకు ప్రత్యేక అవగాహన నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా బాల పరిరక్షణ విభాగము, చైల్డ్ హెల్ప్ లైన్ & మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది తో కూడిన బృందం రైతుల వ్యవసాయ క్షేత్రాలు, మిర్చి కల్లాల వద్ద ప్రత్యక్షంగా సందర్శనచేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎన్ హరికృష్ణ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ అనేది బాలల ఎదుగుదలకు ఒక గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. ములుగు జిల్లాలో బాలకార్మిక వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించి, మన ములుగు జిల్లాను బాలల కార్మిక రహిత జిల్లాగా చేయాలనే ధృడ సంకల్పంతో గౌరవ స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డా. ధనసరి అనసూయ (సీతక్క) ఇచ్చిన పిలుపు మేరకు
జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర టి.ఎస్ ఐ ఏ ఎస్ ఆదేశానుసారం ములుగు జిల్లాలో ముఖ్యంగా మిర్చి పండిస్తున్న గోదావరి పరీవాహక ప్రాంత మండలాల్లో అధికారులు మిర్చి రైతుల పొలాల వద్దకు వెళ్లి బాల కార్మిక నిషేధ మరియు క్రమబద్ధీకరణ చట్టం - 1986 (సవరణ చట్టం - 2016) పై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం 14 సం.ల లోపు మైనర్ పిల్లలను ఏ పనిలో కూడా పెట్టుకోవద్దని, 15-18 సం.లోపు వయస్సున్న రైతులకు కౌమార దశ పిల్లలను హానికరమైన పనుల్లో పెట్టుకోవడం పూర్తిగా నిషేధం అని రైతులకు అవగాహన కల్పించి, ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 2 సంవత్సరాల జైలు లేదా ₹50,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని నోటీసుల ద్వారా ముందస్తుగా తెలియజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ముఖ్యంగా మిర్చి తోటల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు రైతులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా బాలల పరి విభాగము కౌన్సిలర్ టి సంధ్య, మహిళా సోషల్ వర్కర్ బి జ్యోతి, మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ ఆర్ స్రవంతి, వాజేడు మండలంలోని వివిధ గ్రామాల రైతులు & కూలీలు తదితరులు పాల్గొన్నారు.
- జనగామ జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీయగా, ముఖ్యంగా జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆరబోసిన వేల క్వింటాళ్ల మక్కజొన్నలు వర్షపు నీటిలో తడిసి ముద్దయ్యాయి. యార్డ్లో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుండగా, అష్టకష్టాలు పడి పండించిన పంట కళ్లముందే తడిసిపోవడం చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్ని చోట్ల మక్కలు, వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల తేమ శాతం పెరిగి పంట రంగు మారే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన పంటను కొనుగోలు చేయాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి నష్టాలు వాటిల్లకుండా మార్కెట్ యార్డ్లలో షెడ్ల సౌకర్యాన్ని పెంచాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.4
- వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడ మాణిక్య తండాకు చెందిన దంపతులు హైదరాబాద్లోని కూకట్పల్లిలో జరిగిన ఘటన నేపథ్యంలో మృతురాలి స్వగ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భర్త వేధింపులు తాళలేకనే స్రవంతి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు భర్త ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ను తగలబెట్టారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.2
- bellampallii mandal bhuchiyapalli villege madi na ku pinchan vastaledu narige raj kumar my name Naku govarnament nundi shayam kavali daya CHESI Naku govarnament shayam cheyali koruthuna ma villege lo Gala sarpanch garu shayam cheyyalani koruthunna1
- Post by Ramprasad islavath1
- ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని, ఆర్థిక స్వావలంబనకు ఉపయోగ పడుతుందని సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించి రెండేళ్ళు పూర్తి అయి 290 కోట్ల ప్రయాణాలు మహిళలు చేయగా, 10 వేల కోట్లు ఆదా చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ అధికారులు, జిల్లా సంక్షేమ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు ఉచిత బస్ టికెట్ అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకుంటున్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల సేవలు నిత్యం వినియోగిం చుకుంటున్న పలువురు మహిళలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని కలెక్టర్ వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు, సంక్షేమ ఫలాలు వారి పేరిట, వారికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండో రోజు డిసెంబర్ 9వ తేదీ 2023 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత బస్సు ప్రయాణంతో ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు డబ్బులు ఆదా చేసుకొని, వాటిని పిల్లల చదువు, స్వయం ఉపాధి, పొదుపు వైపు మళ్లిస్తున్నారని తెలిపారు. మహిళల ఆర్థిక ప్రగతికి ఈ పథకం దోహదం చేస్తుందని, బస్సుల్లో మహిళల భద్రతకు భరోసా ఇస్తుందని పేర్కొన్నారు.2
- Post by V Ramarao2
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన కవ్వంపల్లి రవి ఆవుతోపాటు లేగ దూడ పై హైనా దాడి చంపి వేయడంతో వెంటనే రవి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి ఫారెస్ట్ సెక్షన్ ఆఫిసర్ చేరుకొని దాడి చేసిన జంతువు హైనాగా గుర్తించారు రాత్రి వెళ్లలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ ఆఫీసర్ సూచించారు.1
- ములుగు జిల్లా:ములుగు మండలం పత్తిపల్లిలో మంగళవారం రాత్రి పేకాట శిబిరంపై దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ రావు తెలిపారు. పేకాట చట్టవిరుద్ధమని, జూదం కుటుంబాలను దెబ్బతీస్తుందని పోలీసులు హెచ్చరించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1