సమర్థవంతంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం... బుధవారం 01/04/2026చింతూరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలు మేరకు రంపచోడవరం శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి సూచనల ప్రకారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మహ్మద్ జమాల్ ఖాన్ వృద్ధులకు, వితంతువు లకు పింఛన్ల పంపిణీ చేశారు. బుధవారం చింతూరు సచివాలయం, నిమ్మలగూడెం,శబరీ ఒడ్డు,వేగితోట(బండారిగూడెం), పోతనపల్లి, రత్నపురం గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసాస పంపిణీ చేసారు. ఈ సందర్భంగా పెన్షన్ దారులు, వికలాంగులు, వృద్ధులు వితంతువులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ మార్కెట్ కమిటీ సభ్యులు పి సాల్మన్ రాజు, క్లస్టర్ ఇంచార్జీ ఓబిలినేని నర్సింహారావు, షేక్ జానీ,కట్ట శంకర్ వైస్ ప్రెసిడెంట్ పొదిలి రామారావు యూనిట్ ఇంచార్జీ సచివాలయం ఎంపీడీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సమర్థవంతంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం... బుధవారం 01/04/2026చింతూరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలు మేరకు రంపచోడవరం శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి సూచనల ప్రకారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మహ్మద్ జమాల్ ఖాన్ వృద్ధులకు, వితంతువు లకు పింఛన్ల పంపిణీ చేశారు. బుధవారం చింతూరు సచివాలయం, నిమ్మలగూడెం,శబరీ ఒడ్డు,వేగితోట(బండారిగూడెం), పోతనపల్లి, రత్నపురం గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసాస పంపిణీ చేసారు. ఈ సందర్భంగా పెన్షన్ దారులు, వికలాంగులు, వృద్ధులు వితంతువులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం నియోజకవర్గ మార్కెట్ కమిటీ సభ్యులు పి సాల్మన్ రాజు, క్లస్టర్ ఇంచార్జీ ఓబిలినేని నర్సింహారావు, షేక్ జానీ,కట్ట శంకర్ వైస్ ప్రెసిడెంట్ పొదిలి రామారావు యూనిట్ ఇంచార్జీ సచివాలయం ఎంపీడీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Post by Sode Prasad1
- పోలవరం జిల్లా... పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం. పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...4
- కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లాక్ డే పిలుపులో భాగంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, టియుసిఐ నాయకులు పి సతీష్ లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చివేసి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా, విదేశీ బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడులను 2019 నుంచి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు వల్ల పని గంటలు పెరుగుతాయని,ఉద్యోగ భద్రత ఉండదని, వేతనాల చెల్లింపుకు గ్యారెంటీ ఉండదని అన్నారు. కార్మిక సంఘాలను, సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కులను పరిమితం చేయడమే ఈ లేబర్ కోడల ఉద్దేశమని అన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పోరాడే తమ హక్కులను కాపాడుకోవడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.1
- Post by Ramprasad islavath1
- Post by Shyam1
- జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీలక్ష్మి దీక్షను ప్రారంభించి సూపర్-6 డిమాండ్స్ను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ ఛైర్మన్ నియామకం, బకాయిల చెల్లింపు, ఓపీఎస్ అమలు వంటి అంశాలను ప్రస్తావించారు. అనంతరం నాయకులు జిల్లా రెవిన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు.1
- కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలు హనుమాన్ విజయోత్సవ దినం కోసం తరలివచ్చిన భక్తులు నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తుల ఆగ్రహం1
- Post by Ramprasad islavath1