logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిన్న చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేసి ఈరోజు ఉదయం శుద్ధి పూజల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించిన అధికారులు చంద్ర గ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి, అనుబంధ ఆలయాలు నిన్న ఉదయం ఏడు గంటలకు అర్చకులు మూసివేశారు.ఆలయంలో స్వామి వారికి మహానువేదన మంగళ నీరాజనం భజన కార్యక్రమాలు పూర్తి చేసి ప్రత్యేక పూజలు చేసి ద్వార బంధనం చేశారు. తిరిగి ఈరోజు ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ, శుద్ధి పూజల అనంతరం భక్తులకు సర్వదర్శనాలు, అర్జిత సేవలు యథావిధిగా కొనసాగించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు

11 hrs ago
user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
11 hrs ago

నిన్న చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేసి ఈరోజు ఉదయం శుద్ధి పూజల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించిన అధికారులు చంద్ర గ్రహణం సందర్భంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి, అనుబంధ ఆలయాలు నిన్న ఉదయం ఏడు గంటలకు అర్చకులు మూసివేశారు.ఆలయంలో స్వామి వారికి మహానువేదన మంగళ నీరాజనం భజన కార్యక్రమాలు పూర్తి చేసి ప్రత్యేక పూజలు చేసి ద్వార బంధనం చేశారు. తిరిగి ఈరోజు ఉదయం 6 గంటలకు సంప్రోక్షణ, శుద్ధి పూజల అనంతరం భక్తులకు సర్వదర్శనాలు, అర్జిత సేవలు యథావిధిగా కొనసాగించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నారు

More news from తెలంగాణ and nearby areas
  • ఉపాధి హామీ పనుల సమయంలో తేనెటీగల దాడి చోటుచేసుకుని ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి తవ్వే క్రమంలో ప్రమాదవశాత్తు తేనెటీగల గూడు తగిలింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలపై దాడి చేశాయి. తేనెటీగల కాటుకు గురైన ఏడుగురిని సహచరులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, పనుల సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
    1
    ఉపాధి హామీ పనుల సమయంలో తేనెటీగల దాడి చోటుచేసుకుని ఏడుగురు కూలీలు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే  రాజన్న సిరిసిల్ల జిల్లా  కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ శివారులో కాలువ నిర్మాణ పనులు జరుగుతుండగా మట్టి తవ్వే క్రమంలో ప్రమాదవశాత్తు తేనెటీగల గూడు తగిలింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచిన తేనెటీగలు అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ  కూలీలపై దాడి చేశాయి. తేనెటీగల కాటుకు గురైన ఏడుగురిని సహచరులు వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతోంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, పనుల సమయంలో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం… డోలోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించారు. శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తుల సేవను మంగళ వాయిద్యాలతో స్థానిక బ్రహ్మపుష్కరినిలోకి తీసుకొని వెళ్లి హంస వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి ఐదు ప్రదక్షిణలు అనంతరం డోలోత్సవ మండపంలో స్వామివారికి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు క్యూ పద్ధతిలో డోలోత్సవ స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మ పుష్కరిణి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
    1
    జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం… డోలోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించారు. శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవ మూర్తుల సేవను మంగళ వాయిద్యాలతో స్థానిక బ్రహ్మపుష్కరినిలోకి తీసుకొని వెళ్లి హంస వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఆసీనులు గావించి ఐదు ప్రదక్షిణలు అనంతరం డోలోత్సవ మండపంలో స్వామివారికి డోలోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు క్యూ పద్ధతిలో డోలోత్సవ స్వామిని దర్శించుకున్నారు. బ్రహ్మ పుష్కరిణి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    21 min ago
  • Post by వేణు విలేకరి
    1
    Post by వేణు విలేకరి
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
  • ధర్మపురి : బుగ్గారం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్ బుగ్గారం గ్రామంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని, నిర్మాణ పనులు నాణ్యతతో సాగాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న మిడ్ డే మీల్ కార్యక్రమాన్ని తనిఖీ చేసి భోజన నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, పోషకాహారం పంపిణీ, పరిశుభ్రతపై ఆదేశాలు జారీ చేశారు. బుగ్గారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి రాబోయే పరీక్షల కోసం కృషి చేయాలని ప్రోత్సహించారు. విద్యార్థులు సమయపాలనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, తమ భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం, బుగ్గారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 90 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపివో, ఎంఈఓ, బుగ్గారం సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
    1
    ధర్మపురి : బుగ్గారం :
జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్ బుగ్గారం గ్రామంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని, నిర్మాణ పనులు నాణ్యతతో సాగాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న మిడ్ డే మీల్ కార్యక్రమాన్ని తనిఖీ చేసి భోజన నాణ్యత, పరిశుభ్రత, నిల్వ విధానాలను పరిశీలించారు. విద్యార్థులకు పోషకాహారం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, పోషకాహారం పంపిణీ, పరిశుభ్రతపై ఆదేశాలు జారీ చేశారు.
బుగ్గారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి రాబోయే పరీక్షల కోసం కృషి చేయాలని ప్రోత్సహించారు. విద్యార్థులు సమయపాలనతో చదివి మంచి ఫలితాలు సాధించాలని, తమ భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలని సూచించారు.
అనంతరం, బుగ్గారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే 90 రోజుల యాక్షన్ ప్లాన్ అమలుపై విస్తృతంగా చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపివో, ఎంఈఓ, బుగ్గారం సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • కొండ సుస్మిత పటేల్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మంగళవారం రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద కొండ సుస్మిత పటేల్ మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నట్లు చేసిన సంచలనం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బుధవారం రోజు ఉదయం 10:30 నుంచి కొండా సుస్మిత పటేల్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి తాను కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తానని ప్రజలకు సేవ చేస్తానని అనడం కోసమెరుపు
    9
    కొండ సుస్మిత పటేల్ మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మంగళవారం రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మల లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద కొండ సుస్మిత పటేల్ మాట్లాడుతూ తన రాజకీయ జీవితం ఇక్కడి నుంచే మొదలు పెట్టబోతున్నట్లు చేసిన సంచలనం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బుధవారం రోజు ఉదయం 10:30 నుంచి కొండా సుస్మిత పటేల్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి తాను కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తానని ప్రజలకు సేవ చేస్తానని అనడం కోసమెరుపు
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    3 hrs ago
  • సంప్రోక్షణ అనంతరం దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం మళ్లీ తెర్చుకుంది. చంద్రగ్రహణం కావడంతో మంగళవారం ఉదయం వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మూసివేశారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున దేవాలయంలో వేద పండితులు సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. పలు ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి స్వామివారికి పూజలు చేస్తున్నారు.
    1
    సంప్రోక్షణ అనంతరం దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం మళ్లీ తెర్చుకుంది. చంద్రగ్రహణం కావడంతో మంగళవారం ఉదయం వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మూసివేశారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున దేవాలయంలో వేద పండితులు సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. పలు ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి స్వామివారికి   పూజలు చేస్తున్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ కు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం -2026 ను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ సహకరించడం జరుగుతుందని,పాఠశాల అంటే కేవలం విద్య మాత్రమే కాదని విద్యతో పాటుగా సామాజిక సేవలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడం ఎంతగానో అభినందనీయమని అన్నారు. రక్తదాన శిబిరం నిర్వహించాలంటే చాలామంది సహయ, సహకారాలు అవసరం అవుతాయని,రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న వారందరికీ అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు.తల సేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.ఈ శిబిరాలను విజయవంతం చేయడానికి సామాజిక సేవకులు,రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
    1
    కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ కు ఉత్తమ రక్తదాన శిబిర మోటివేటర్ పురస్కారం -2026 ను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు శ్లోక పాఠశాల సెక్రటరీ కరస్పాండెంట్ జలిగామ శ్రీకాంత్ సహకరించడం జరుగుతుందని,పాఠశాల అంటే కేవలం విద్య మాత్రమే కాదని విద్యతో పాటుగా సామాజిక సేవలో విద్యార్థులను భాగస్వాములుగా చేయడం ఎంతగానో అభినందనీయమని అన్నారు.
రక్తదాన శిబిరం నిర్వహించాలంటే చాలామంది సహయ, సహకారాలు అవసరం అవుతాయని,రక్తదాన శిబిరాలకు సహకరిస్తున్న వారందరికీ అవార్డులను అందజేయడం జరుగుతుందని అన్నారు.తల సేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం వారి జీవితాంతం అవసరం ఉందని అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.ఈ శిబిరాలను విజయవంతం చేయడానికి సామాజిక సేవకులు,రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా హోలీ వేడుకలు. నిన్న చంద్రగ్రహణం సందర్భంగా హోలీ వేడుకలు ఈరోజు నిర్వహించుకున్నారు. చిన్నా, పెద్దా కలిసి రంగులు చల్లుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని, అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా  హోలీ వేడుకలు. నిన్న చంద్రగ్రహణం సందర్భంగా హోలీ వేడుకలు ఈరోజు నిర్వహించుకున్నారు.  చిన్నా, పెద్దా కలిసి రంగులు చల్లుకుంటూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రజల జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని, అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.