Shuru
Apke Nagar Ki App…
“కౌన్సిల్లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. కౌన్సిల్లో నా మొదటి అనుభవం.. “కౌన్సిల్లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కౌన్సిల్లో తన తొలి అనుభవాలు, అక్కడ జరిగిన పరిణామాలపై మాట్లాడారు. కౌన్సిల్లో చర్చలు, సభ్యుల ప్రవర్తన, ప్రజా సమస్యలపై జరిగిన చర్చలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
Apsv9 News channel
“కౌన్సిల్లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. కౌన్సిల్లో నా మొదటి అనుభవం.. “కౌన్సిల్లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కౌన్సిల్లో తన తొలి అనుభవాలు, అక్కడ జరిగిన పరిణామాలపై మాట్లాడారు. కౌన్సిల్లో చర్చలు, సభ్యుల ప్రవర్తన, ప్రజా సమస్యలపై జరిగిన చర్చలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పాలకొల్లులో.. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సోమంచి శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ ఎంతో నీతి నిజాయితీలతో రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన సేవ చేశారని జీవిత మలిదశలో ఎన్నో అవస్థలకు గురయ్యారని ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చిర్రావూరి నరసింహమూర్తి, కార్యదర్శి నందుల దశరథ్ కోశాధికారి గోటేటి వెంకటేశ్వరరావు, సంఘ ఉపాధ్యక్షులు హోతాహరి నారాయణ, సంఘ సభ్యులు వై ప్రభాకర్ శాస్త్రి, మంచిలి సదాశివమూర్తి, దక్షిణామూర్తి, మీడియా ఇంచార్జ్ శివ సత్య రమణ కుమార్, పాల్గొని ఘన నివాళులు అర్పించారు.3
- తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బుకింగ్కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.1
- ***సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం***. రేషన్ బియ్యం పట్టివేత సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం నుంచి ఏపీలోని కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా శనివారం తెల్లవారుజా మున పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, మధ్యవర్తి ద్వారా కాకినాడకు బియ్యం తరలిం చేందుకు ఆటోలు లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సత్తుపల్లి పోలీసులు దాడులు నిర్వహించగా 25క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం తరలించడానికి ప్రయత్నించిన నక్క వెంకటేశ్వరరావు, మధ్యవర్తి ఏపీకి చెందిన రాజా, కాకినాడకు చెందిన బాబీపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి సివిల్ సప్లై గోదాంకు తరలించారు1
- మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు1
- అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకునే వ్యక్తిని తాను కాదని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఆరోపణలపై సోమవారం ఇబ్రహీంపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యునిగా తన కార్యాలయానికి ప్రతిరోజూ ఎంతోమంది ప్రజలు, వివిధ వర్గాల వారు వస్తుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా మేఘన, ఆమె కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎవరైనా రావచ్చని, తమ సమస్యలను చెప్పుకోవచ్చని పేర్కొన్నారు.మేఘన కుటుంబ వ్యవహారం కావడంతో ఇరు వర్గాలు పరస్పరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రమే తాను సూచించినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు వివరించారు. ఈ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, తన పాత్ర కేవలం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇవ్వడం వరకే పరిమితమైందని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం, తన వ్యవహారశైలి ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే అన్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలతో ముడిపెట్టడం సరికాదని సూచించారు.1
- కూనారం భూ సమస్యకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్ అంకిత్. కొత్తగూడెం, ఆగస్టు 24: కూనారం గ్రామంలోని అటవీ–రెవెన్యూ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. గతంలో నిర్వహించిన సర్వేలు, జాయింట్ సర్వే నివేదికలు, రెవెన్యూ, అటవీ శాఖల రికార్డులు, మ్యాపులను సమగ్రంగా పరిశీలించి తుది నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాత, తాజా సర్వేల మధ్య తేడాలకు కారణాలను గుర్తించాలని సూచించారు. దమ్మపేట, కరకగూడెం, అశ్వారావుపేట ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో జాయింట్ సర్వేలు కొనసాగుతున్నాయని తెలిపారు. వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో సమస్యలకు స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కూనారం సమస్య చాలా కాలంగా కొనసాగుతున్నందున సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు.1
- లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.1
- గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం లారీ డ్రైవర్పై దాడి గాజువాకలో రవాణా శాఖ అధికారి డ్రైవర్ దురహంకారం చూపించి ఇన్స్పెక్టర్ డ్రైవర్ లారీ డ్రైవర్పై దాడి చేశాడు.రక్తం వచ్చేటట్టు లారీ డ్రైవర్పై పిడుగుద్దులతో దాడి చేసిన రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పార్వతి డ్రైవర్ షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్ వాహనం ఆపలేదని లారీని ఓవర్ ట్రాక్ చేసిన ఇన్స్పెక్టర్ పార్వతి ఇన్స్పెక్టర్ పార్వతి సమక్షంలో ఆమె డ్రైవర్ వీరంగం, లారీ డ్రైవర్పై పిడుగులతో దాడి విచక్షణ రహితంగా దాడి చేయడంపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ధర్నాకు సిద్ధం1
- కొత్తగూడెం: కూనారం భూ సమస్యపై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ... కొత్తగూడెం, ఆగస్టు 24: లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కూనారం గ్రామంలో అటవీ–రెవెన్యూ భూ సమస్యపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గిరిజనులు, స్థానికులు, రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులతో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. పాత సర్వేలు, జాయింట్ సర్వే నివేదికలు, రెవెన్యూ–అటవీ రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని జాటోత్ హుస్సేన్ సూచించారు. అంబాసత్రం భూమి ఎక్కడ ఉందో గుర్తించి, ఓవర్ల్యాప్ ప్రాంతాలను మరోసారి సర్వే చేయాలని, 15 రోజుల్లో ప్రాథమిక స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి రైతులు, గిరిజనులు, సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.1