Shuru
Apke Nagar Ki App…
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామంలో ఈరోజు రైతు వేదికలో ఏఈఓ ఆబిద్ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తమ మొబైల్ ఫోన్లలో Fertilizer యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే విధానాన్ని వివరించారు. యాప్ వినియోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఎరువులు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజుపేట గ్రామానికి చెందిన రైతులు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
Chetty:Ramesh
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామంలో ఈరోజు రైతు వేదికలో ఏఈఓ ఆబిద్ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తమ మొబైల్ ఫోన్లలో Fertilizer యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే విధానాన్ని వివరించారు. యాప్ వినియోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఎరువులు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజుపేట గ్రామానికి చెందిన రైతులు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
More news from Warangal and nearby areas
- వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట గ్రామంలో ఈరోజు రైతు వేదికలో ఏఈఓ ఆబిద్ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు తమ మొబైల్ ఫోన్లలో Fertilizer యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే విధానాన్ని వివరించారు. యాప్ వినియోగం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఎరువులు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజుపేట గ్రామానికి చెందిన రైతులు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.3
- మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం అయ్యగారి పల్లి సమీపం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఫోన్ మాట్లాడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న హచ్యా అనే వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది ఈ ఘటనలో హత్య అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన వ్యక్తిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు1
- డిగ్రీ తో బ్యాంకు ఉద్యోగాలు exam లేదు... ఫుల్ డీటెయిల్స్ వీడియో ఇన్ my యూట్యూబ్ ఛానల్ లింక్ ఇన్ కామెంట్స్ box 👇👇👇🤝1
- హన్మకొండ:పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.2
- సామాజిక సమానత్వం ద్వారానే అన్ని వర్గాలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ పట్టణం భగత్ నగర్ లోని ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో ‘తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దివ్యాంగులు, నిరుపేదలందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, వృద్ధులకు న్యాయం, సేవా అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అందరూ ఐక్యంగా ఉంటూ ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సమాజాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. విద్యార్థులు గొప్ప ఆశయంతో ముందుకు వెళ్లాలని, ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్య అభ్యసించి ఉపాధి అవకాశాలతో ఆర్థిక సాధికారత సాధించాలని తెలిపారు. జిల్లా రెవిన్యూ అధికారి బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు.1
- కాంగ్రెస్ అభ్యర్థులను సర్వే ఆధారంగా సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని అభ్యర్థుల ఎంపికలో పార్టీ నాయకుల ప్రమేయం లేదని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో రేపు సీఎం పర్యట నేపథ్యంలో చొప్పదండి కరీంనగర్ లో పర్యటించిన మంత్రి తుమ్మల కరీంనగర్ లో పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయంపై దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో మంత్రి తుమ్మల తో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం నాయిని రాజేందర్ రెడ్డి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నియోజకవర్గం నగర అధ్యక్షులు అంజన్ కుమార్ ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. పైరవీలకు తావు లేకుండా ప్రజా మద్దతు గల వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మనోభావాలకు తగ్గట్లుగా అభ్యర్థులు ఎంపిక చేశామని తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ విజయం ఈ రాష్ట్రానికి, ప్రభుత్వానికి పార్టీకి గొప్ప గుర్తింపు తీసుకువచ్చే విజయం అన్నారు. నాణ్యత గల నాయకులను ఈ రాష్ట్రానికి అందించిన జిల్లా కరీంనగర్ అని అలాంటి జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకొని చైర్మన్ మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలని సూచించారు. అన్ని పార్టీలకంటే ప్రచారంలో మనం ముందు ఉండాలని, అభ్యర్థులు పట్టుదలతో గెలవాలనే లక్ష్యసాధన ఉండాలని హితవు పలికారు. ప్రస్తుతం టికెట్లు దక్కని వారికి జిల్లా పరిషత్, సుడా, సింగిల్ విండో, గ్రంథాలయం ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి వార్డులో ప్రతి ఓటర్ ను కలవాలని రేపటి ముఖ్యమంత్రి సభ విజయవంతమే మీ విజయానికి పునాది అవుతుందని తెలిపారు. సీఎం సభకు ప్రతి డివిజన్ నుండి 500 మంది కార్యకర్తలను తరలించాలని సూచించారు.1
- గత 25 ఏళ్లుగా నల్లగొండ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి ఈ ప్రాంత ప్రజలు నా ప్రాణం. నా చివరి శ్వాస వరకు ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తాను. నల్లగొండను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో భారీగా నిధులు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు మరియు సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరుస్తున్నాం. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మకుండా, పట్టణ అభివృద్ధి కోసం 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. మీ సమస్యలను నేరుగా నా దృష్టికి తీసుకువచ్చే కాంగ్రెస్ కార్పొరేటర్లకు మద్దతుగా నిలవండి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, శాంతిభద్రతలను కాపాడుతూ, నల్లగొండను అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాను.1
- ఒటాయిలో సమ్మక్క సారలమ్మ మినీ జాతర తిరుగువారం ఘనంగా నిర్వహించారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని ఒటాయిలో పుట్టల మేడారంలో తిరుగువారం జాతరలో భాగంగా వనంను ఆదివాసి గిరిజన సంప్రదాయాలతో ఆదివాసి పూజారీలు డోలీలు వడ్డెలు శివసత్తులు ఆధ్వర్యంలో గద్దెలకు తీసుకొచ్చారు అనంతరం తిరుగువారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు అమ్మవారు దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.1