logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుడిహత్నూర్‌లో భారీ ట్రాఫిక్ జామ్ గంటల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు.. అవస్థలు పడ్డ ప్రయాణికులు గుడిహత్నూర్ జాతీయ రహదారిపై బుధవారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవే సమీపంలో సర్వీస్ రోడ్డు నిర్మాణ పనుల కారణంగా మండల కేంద్రంలోని జవహర్ నగర్ వరకు వాహనాలు బారులుగా నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దారి ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.

59 min ago
user_Shaik Mahmood
Shaik Mahmood
Local News Reporter గుడిహత్నూర్, ఆదిలాబాద్, తెలంగాణ•
59 min ago

గుడిహత్నూర్‌లో భారీ ట్రాఫిక్ జామ్ గంటల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు.. అవస్థలు పడ్డ ప్రయాణికులు గుడిహత్నూర్ జాతీయ రహదారిపై బుధవారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవే సమీపంలో సర్వీస్ రోడ్డు నిర్మాణ పనుల కారణంగా మండల కేంద్రంలోని జవహర్ నగర్ వరకు వాహనాలు బారులుగా నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దారి ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గుడిహత్నూర్‌లో భారీ ట్రాఫిక్ జామ్ గంటల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు.. అవస్థలు పడ్డ ప్రయాణికులు గుడిహత్నూర్ జాతీయ రహదారిపై బుధవారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవే సమీపంలో సర్వీస్ రోడ్డు నిర్మాణ పనుల కారణంగా మండల కేంద్రంలోని జవహర్ నగర్ వరకు వాహనాలు బారులుగా నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దారి ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.
    1
    గుడిహత్నూర్‌లో భారీ ట్రాఫిక్ జామ్
గంటల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు.. అవస్థలు పడ్డ ప్రయాణికులు
గుడిహత్నూర్ జాతీయ రహదారిపై బుధవారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైవే సమీపంలో సర్వీస్ రోడ్డు నిర్మాణ పనుల కారణంగా మండల కేంద్రంలోని జవహర్ నగర్ వరకు వాహనాలు బారులుగా నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దారి ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.
    user_Shaik Mahmood
    Shaik Mahmood
    Local News Reporter గుడిహత్నూర్, ఆదిలాబాద్, తెలంగాణ•
    59 min ago
  • భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచిన శ్రీరామ జన్మభూమి భూమిపూజ వార్షికోత్సవం ఎంతో అపూర్వమైనది. ఆ ధర్మమూర్తి చూపిన మార్గంలో నడుస్తూ మన సంప్రదాయ వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం.
    1
    భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచిన శ్రీరామ జన్మభూమి
భూమిపూజ వార్షికోత్సవం ఎంతో అపూర్వమైనది. ఆ ధర్మమూర్తి చూపిన మార్గంలో నడుస్తూ మన సంప్రదాయ వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకెళ్దాం.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ఆదిలాబాద్ గిరిజన డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రెషర్స్ డే... ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో నూతనంగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సీనియర్లు ఆత్మీయ స్వాగతం పలికారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన 'ప్రెషర్స్ వెల్కమ్' వేడుకల్లో సీనియర్ విద్యార్థులు నూతన విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రిన్సిపల్ డా. ఎం. శివకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డా. ముంతాజ్ బేగం మాట్లాడారు. నూతన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, నిబద్ధతతో చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ గిరిజన డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రెషర్స్ డే...
ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో నూతనంగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సీనియర్లు ఆత్మీయ స్వాగతం పలికారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన 'ప్రెషర్స్ వెల్కమ్' వేడుకల్లో సీనియర్ విద్యార్థులు నూతన విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, ఆటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రిన్సిపల్ డా. ఎం. శివకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డా. ముంతాజ్ బేగం మాట్లాడారు. నూతన విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, నిబద్ధతతో చదివి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు స్థానిక వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ గీమ్మ సంతోష్ రావు ఆధ్వర్యంలో స్థానిక కేఆర్కే కాలినిలోని వృద్ధాశ్రమంలో వృద్ధులతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారికి అన్నదానం చేసి పండ్లు పంపిణీ చేశారు. "సేవలోనే సంతోషం అనే స్ఫూర్తితో మానవత్వమే మహోన్నతమైన సేవ అని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శంతన్ రావ్, దీపక్ రావ్ మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఆయురారోగ్యాలతో, అజేయమైన సేవా ప్రయాణం కొనసాగాలని వారు పేర్కొన్నారు.
    1
    ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు 

స్థానిక వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం 
ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  కంది శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ గీమ్మ సంతోష్ రావు ఆధ్వర్యంలో స్థానిక కేఆర్కే కాలినిలోని వృద్ధాశ్రమంలో వృద్ధులతో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారికి అన్నదానం చేసి పండ్లు  పంపిణీ చేశారు. "సేవలోనే సంతోషం  అనే స్ఫూర్తితో మానవత్వమే మహోన్నతమైన సేవ అని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ  నాయకులు శంతన్ రావ్, దీపక్ రావ్ మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి ఆయురారోగ్యాలతో, అజేయమైన సేవా ప్రయాణం కొనసాగాలని  వారు పేర్కొన్నారు.
    user_Jakkula Sujith
    Jakkula Sujith
    Local News Reporter Adilabad Urban, Telangana•
    6 hrs ago
  • సిర్గాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్.హెచ్.జీ. (S.H.G.) వి.ఓ. భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో స్వయం సహాయక సంఘాల (S.H.G.) వి.ఓ. రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన భవనాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. అనంతరం మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలు మరియు ప్రజల అవసరాలపై మండల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోండుగారి చైతన్య శంకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్ , మండల అద్యక్షులు నర్సారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి , BJYM జిల్లా అద్యక్షులు నిరంజన్ రెడ్డి తో పాటు మహిళా సమైక్య సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    2
    సిర్గాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్.హెచ్.జీ. (S.H.G.) వి.ఓ. భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
దిలావర్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో  స్వయం సహాయక సంఘాల (S.H.G.) వి.ఓ.  రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన భవనాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా  బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.
అనంతరం మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలు మరియు ప్రజల అవసరాలపై మండల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోండుగారి చైతన్య శంకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్ , మండల  అద్యక్షులు నర్సారెడ్డి,  బీజేపీ సీనియర్ నాయకులు  ముత్యం రెడ్డి , BJYM జిల్లా అద్యక్షులు నిరంజన్ రెడ్డి తో పాటు  మహిళా సమైక్య సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    4 hrs ago
  • ఖానాపూర్ దిలావపూర్ రేంకోని వాగు బ్రిడ్జ్ దగ్గర మూలమలుపు భయంకరంమైన ములమలుపు ఖానాపూర్ దిలావపూర్ రేంకోని వాగు బ్రిడ్జి కంప్లీట్ చేయకపోగా భయంకరంగా మూలమలుపు తయారైందని స్థానిక ప్రజలు వాహనదారులు తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు రోడ్ల వెడల్పు పనులు చేపట్టి పూర్తిచేయాలని ప్రజలు వాహనదారులు తెలియజేశారు
    1
    ఖానాపూర్   దిలావపూర్  రేంకోని వాగు బ్రిడ్జ్ దగ్గర మూలమలుపు భయంకరంమైన ములమలుపు 
ఖానాపూర్ దిలావపూర్ రేంకోని వాగు  బ్రిడ్జి కంప్లీట్ చేయకపోగా భయంకరంగా మూలమలుపు తయారైందని స్థానిక ప్రజలు వాహనదారులు తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు రోడ్ల వెడల్పు పనులు చేపట్టి  పూర్తిచేయాలని ప్రజలు వాహనదారులు తెలియజేశారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    6 hrs ago
  • రోటిగూడా గ్రామంలో ఘనంగా ఊరు అంపుడు, గ్రామ దేవతలకు పూజలు జన్నారం మండలంలోని రోటిగూడలో ఊరు అంపుడు కార్యక్రమాన్ని గ్రామస్తులు, భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాడ మాసం బోనాల సందర్భంగా బుధవారం సాయంత్రం గ్రామంలో ఊరు అంపుడు ప్రారంభమైంది. రాత్రి గ్రామస్తులు, భక్తులు ఊరేగింపు నిర్వహిస్తూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఊరు బాగుండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు మొక్కులు తీర్చుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు కార్యక్రమం కొనసాగనుంది.
    1
    రోటిగూడా గ్రామంలో ఘనంగా ఊరు అంపుడు, గ్రామ దేవతలకు పూజలు
జన్నారం మండలంలోని రోటిగూడలో ఊరు అంపుడు కార్యక్రమాన్ని గ్రామస్తులు, భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాడ మాసం బోనాల సందర్భంగా బుధవారం సాయంత్రం గ్రామంలో ఊరు అంపుడు ప్రారంభమైంది. రాత్రి గ్రామస్తులు, భక్తులు ఊరేగింపు నిర్వహిస్తూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఊరు బాగుండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు మొక్కులు తీర్చుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు కార్యక్రమం కొనసాగనుంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    1 hr ago
  • ఆంధ్రప్రదేశ్ డెయిరీ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం రూ.115 కోట్లకు పాడి రైతులకు శుభవార్త పైగా నిధులతో ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించింది. ఉచిత పశు టీకాలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా రాష్ట్ర పాడి పరిశ్రమకు కేంద్రం కొత్త ఊపిరి పోసింది.
    1
    ఆంధ్రప్రదేశ్ డెయిరీ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం రూ.115 కోట్లకు 
పాడి రైతులకు శుభవార్త 
పైగా నిధులతో ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందించింది. ఉచిత పశు టీకాలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా రాష్ట్ర పాడి పరిశ్రమకు కేంద్రం కొత్త ఊపిరి పోసింది.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.