Shuru
Apke Nagar Ki App…
మల్కాజిగిరి పరిధిలోని చిన్మయ మార్గ్–మిర్జల్గూడలో వర్షపు నీటి ముప్పు మల్కాజిగిరి పరిధిలోని చిన్మయ మార్గ్, మిర్జల్గూడ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీల్లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. దీంతో రహదారులు జలమయంగా మారి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో దిగువ ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి నిల్వ, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని వారు పేర్కొన్నారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
Bhaskar Reddy
మల్కాజిగిరి పరిధిలోని చిన్మయ మార్గ్–మిర్జల్గూడలో వర్షపు నీటి ముప్పు మల్కాజిగిరి పరిధిలోని చిన్మయ మార్గ్, మిర్జల్గూడ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీల్లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. దీంతో రహదారులు జలమయంగా మారి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో దిగువ ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి నిల్వ, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని వారు పేర్కొన్నారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- *శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఘనంగా ఆషాఢ ఉత్సవాలు* *బోనాలు, పోతరాజుల విన్యాసాలతో అలరించిన విద్యార్థులు* గజ్వేల్ జగదేవ్పూర్, ప్రజా తెలంగాణ న్యూస్ : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య సెంట్ పీటర్ పాఠశాలలో ఆషాఢ మాస ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను పాఠశాల యాజమాన్యం విద్యార్థుల భాగస్వామ్యంతో సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్భంగా విద్యార్థినులు అమ్మవారి వేషధారణలో బోనాలు ఎత్తుకొని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా పాల్గొనగా, విద్యార్థులు పోతరాజుల వేషధారణలో విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అమ్మవారి భక్తి గీతాలకు అనుగుణంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోతరాజుల విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. పాఠశాల ప్రాంగణం సంప్రదాయ అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులకు పుస్తక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించడం కూడా విద్యాసంస్థల బాధ్యతేనని అన్నారు. అందుకే ప్రతి పండుగను పాఠశాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.నేటి తరం పిల్లలు తమ సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకొని వాటిని గౌరవించేలా ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శించిన నృత్యాలు, బోనాల శోభాయాత్ర, పోతరాజుల విన్యాసాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రిన్సిపాల్ కొత్త నర్సింహ్మారెడ్డి అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ ఆషాఢ ఉత్సవాలు విద్యార్థుల్లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై మరింత అవగాహన పెంచాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఆషాఢ ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.2
- శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్.. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు శస్త్రచికిత్స లేకుండానే ప్రాణాపాయ రక్తస్రావానికి చెక్.. 41 ఏళ్ల మహిళ గర్భాశయాన్ని కాపాడిన మెడికోవర్ వైద్యులు మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ నిపుణులు అత్యాధునిక, మినిమల్లీ ఇన్వేసివ్ విధానంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 41 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స అందించి, గర్భాశయాన్ని తొలగించకుండా కాపాడారు. తీవ్రమైన యోని రక్తస్రావంతో బాధపడుతున్న మహిళకు సంప్రదాయ శస్త్రచికిత్స అవసరం లేకుండా "నో సర్జరీ – నో స్కార్" విధానంలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సాంకేతికతను ఉపయోగించి రక్తస్రావాన్ని నియంత్రించారు. దీంతో గర్భాశయాన్ని తొలగించే అవసరం లేకుండా రోగి ప్రాణాలను, గర్భాశయాన్ని సురక్షితంగా కాపాడగలిగారు. ఈ సందర్భంగా మెడికోవర్ వైద్య నిపుణులు మాట్లాడుతూ, అసాధారణమైన యోని రక్తస్రావాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఆధునిక ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా అనేక గైనకాలజీ సమస్యలకు శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. ఈ విధానంలో శరీరంపై పెద్ద కోతలు లేకుండా, మచ్చలు లేకుండా చికిత్స అందించడంతో పాటు రోగులు తక్కువ సమయంలోనే కోలుకుని సాధారణ జీవితానికి తిరిగి వెళ్లే అవకాశం ఉంటుందని వైద్యులు వివరించారు. ఈ విజయవంతమైన చికిత్సకు సంబంధించిన వివరాలను హైటెక్ సిటీలోని మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆధునిక వైద్య సాంకేతికతతో మహిళల ఆరోగ్య సంరక్షణలో మెడికోవర్ అందిస్తున్న సేవలను వివరించారు.1
- మైనంపల్లి హనుమంతరావు టూ ప్లస్ టు సెక్యూరిటీ ఎందుకు ఇచ్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మైనంపల్లి హన్మంతరావు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశాడని, ఏ తీవ్రవాద సంస్థ, ఏ మావోయిస్టులు ఆయనను టార్గెట్ చేశారని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? కొండా మురళీ ఎమ్మెల్సీ కాదు, కార్పొరేషన్ చైర్మన్ కాదు. ఆయనకు 2+2 సెక్యూరిటీ ఇచ్చారు.. ఆయనకు ఏ హోదా ఉందని 2+2 సెక్యూరిటీ ఇచ్చారు? ఏనుముల తిరుపతి రెడ్డి, ఏనుముల కొండల్ రెడ్డిలు ఏం కూంబింగ్ ఆపరేషన్లు చేశారని, ఏ ఉగ్రవాద సంస్థతో ముప్పు ఉందని, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక సెమీ ఆటోమేటెడ్ వెపన్స్ ఇచ్చారు? సునీతా మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్పర్సన్. ఆమెకు గన్మెన్లను ఇచ్చారు సత్యవతి రాథోడ్ గారు తెలంగాణ రాష్ట్రంలో తొలి గిరిజన మహిళా మంత్రి.. ఆమె ఇప్పుడు మాజీ మంత్రి. ఆమె గన్మెన్లను తీసేశారు జోగు రామన్న మాజీ మంత్రి. ఆయన గన్మెన్లను తొలగించారు.. అదే జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డికి 2+2 గన్మెన్లను ఇచ్చారు ఎందుకు? కుందూరు జానారెడ్డి ప్రస్తుత హోదా ఏంటి? ఆయనకు 2+2 గన్మెన్లను ఇచ్చి, అత్యాధునిక బుల్లెట్ప్రూఫ్ వాహనం ఇచ్చారు జానారెడ్డి మాజీ మంత్రి అయితే సత్యవతి రాథోడ్, జోగు రామన్న కూడా మాజీ మంత్రులే కదా. మరి వీళ్లకు ఎందుకు సెక్యూరిటీ తొలగించారు? బీఆర్ఎస్ నాయకులకు ఒక న్యాయం.. కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయమా? దీని మీద డీజీపీ సమాధానం చెప్పాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్1
- JAI BC ✊ SELF-RESPECT - POWER - Share 🔥 JAI TEENMAAR MALLANNA TRP Flag Unveiling Ceremony by Teenmar Mallanna in Mahabubnagar || Telangana Rajyadhikara Party1
- చెరువుల పరిరక్షణే లక్ష్యంగా.. శేరిలింగంపల్లిలో హైడ్రాకు భారీ మద్దతు! హైదరాబాద్లోని తమ్మిడికుంట చెరువు వద్ద హైడ్రా (HYDRAA) చేపడుతున్న చర్యలకు ప్రజా మద్దతు మరింత పెరుగుతోంది. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ చేస్తున్న సాహసోపేతమైన ప్రయత్నాలకు సంఘీభావంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్-ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘం చైర్మన్ మేట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆక్రమణల చెర నుంచి జలవనరులను కాపాడుతూ, నగర భవిష్యత్తు కోసం హైడ్రా అడుగులు వేయడం అభినందనీయమని నాయకులు కొనియాడారు. ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలపై హైడ్రా ముద్రించే కఠిన చర్యలు నిరంతరం కొనసాగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.4
- కుషాయిగూడ శివ సాయి నగర్ శివ సాయి దేవాలయంలో గురు పౌర్ణమి మహోత్సవం కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శివసాయి నగర్లో ఉన్న శివసాయి దేవాలయంలో గురుపౌర్ణమి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నప్రసాదం నిర్వహించనున్నారు. ఈ మహోత్సవంలో కాలనీలకు చెందిన కుటుంబ సభ్యులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని గురుపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.1
- మల్కాజిగిరి పరిధిలోని చిన్మయ మార్గ్–మిర్జల్గూడలో వర్షపు నీటి ముప్పు మల్కాజిగిరి పరిధిలోని చిన్మయ మార్గ్, మిర్జల్గూడ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీల్లోని ప్రధాన రహదారులపై వర్షపు నీరు ఏరులై పారుతోంది. దీంతో రహదారులు జలమయంగా మారి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో దిగువ ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటి నిల్వ, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని వారు పేర్కొన్నారు. వెంటనే సంబంధిత మున్సిపల్ అధికారులు ప్రాంతాన్ని పరిశీలించి, వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.1