రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్గా కరీంనగర్ జిల్లా జట్టు మంచిర్యాల రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్గా కరీంనగర్ జిల్లా జట్టు మంచిర్యాల రామకృష్ణాపూర్లో ముగిసిన అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్బాల్ లీగ్ ఫైనల్లో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్పై 1-0తో ఘనవిజయం క్రీడాకారిణులను అభినందించిన రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కోశాధికారి / ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ W. గణపతి గారు , జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నాయుడు గారు ,జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు W. వెంకట రావు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ వేదికగా గత మూడు రోజులుగా (ఏప్రిల్ 27 నుండి 29 వరకు) అత్యంత ఉత్సాహంగా సాగిన రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్బాల్ లీగ్ బుధవారం ఘనంగా ముగిసింది. డీఎఫ్ఏ (DFA) ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో కరీంనగర్ జిల్లా జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరు నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్లో కరీంనగర్ జిల్లా జట్టు, రంగారెడ్డి జిల్లాకు చెందిన బలమైన హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ జట్టుతో తలపడింది. ఆట ఆరంభం నుండే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, కరీంనగర్ క్రీడాకారిణులు వ్యూహాత్మకంగా ఆడి 1-0 గోల్ తేడాతో విజయం సాధించి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ రన్నరప్గా నిలిచింది. ప్రముఖుల అభినందనలు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన కరీంనగర్ జట్టును రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కోశాధికారి / ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ W. గణపతి గారు , జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నాయుడు గారు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు W. వెంకట రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరీంనగర్ క్రీడాకారిణులు ప్రదర్శించిన క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి గర్వకారణమని, రాబోయే రోజుల్లో వీరు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. హెడ్ కోచ్ W. విజయ్ మరియు అసిస్టెంట్ కోచ్ బొంతు రేవంత్ కు ప్రశంసలు జట్టును విజయపథంలో నడిపించిన హెడ్ కోచ్ W. విజయ్ గారిని మరియు అసిస్టెంట్ కోచ్ బొంతు రేవంత్ గారి కృషిని అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. క్రీడాకారుల నిరంతర శ్రమ, క్రమశిక్షణ మరియు సరైన శిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని హెడ్ కోచ్ W. విజయ్ గారు సంతోషం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించారని తెలిపిన జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు
రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్గా కరీంనగర్ జిల్లా జట్టు మంచిర్యాల రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్గా కరీంనగర్ జిల్లా జట్టు మంచిర్యాల రామకృష్ణాపూర్లో ముగిసిన అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్బాల్ లీగ్ ఫైనల్లో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్పై 1-0తో ఘనవిజయం క్రీడాకారిణులను అభినందించిన రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కోశాధికారి / ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ W. గణపతి గారు , జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నాయుడు గారు ,జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు W. వెంకట రావు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ వేదికగా గత మూడు రోజులుగా (ఏప్రిల్ 27 నుండి 29 వరకు) అత్యంత ఉత్సాహంగా సాగిన రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్బాల్ లీగ్ బుధవారం ఘనంగా ముగిసింది. డీఎఫ్ఏ (DFA) ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో కరీంనగర్ జిల్లా జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరు నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్లో కరీంనగర్ జిల్లా జట్టు, రంగారెడ్డి జిల్లాకు చెందిన బలమైన హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ జట్టుతో తలపడింది. ఆట ఆరంభం నుండే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, కరీంనగర్ క్రీడాకారిణులు వ్యూహాత్మకంగా ఆడి 1-0 గోల్ తేడాతో విజయం సాధించి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ రన్నరప్గా నిలిచింది. ప్రముఖుల అభినందనలు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన కరీంనగర్ జట్టును రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ కోశాధికారి / ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ W. గణపతి గారు , జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నాయుడు గారు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు W. వెంకట రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరీంనగర్ క్రీడాకారిణులు ప్రదర్శించిన క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి గర్వకారణమని, రాబోయే రోజుల్లో వీరు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. హెడ్ కోచ్ W. విజయ్ మరియు అసిస్టెంట్ కోచ్ బొంతు రేవంత్ కు ప్రశంసలు జట్టును విజయపథంలో నడిపించిన హెడ్ కోచ్ W. విజయ్ గారిని మరియు అసిస్టెంట్ కోచ్ బొంతు రేవంత్ గారి కృషిని అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. క్రీడాకారుల నిరంతర శ్రమ, క్రమశిక్షణ మరియు సరైన శిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని హెడ్ కోచ్ W. విజయ్ గారు సంతోషం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించారని తెలిపిన జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు
- :* కార్మిక చట్టాల సవరణలపై సీఫీఐ గళం: బెల్లంపల్లిలో 141వ మేడే ఘనం *బెల్లంపల్లి:* భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో 141వ మేడే [కార్మిక దినోత్సవం] వేడుకలు కామ్రేడ్ బాసెట్టి గంగారం పేరుతో ఉన్న విజ్ఞాన భవనంలో ఘనంగా జరిగాయి. బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి జెండా ఆవిష్కరించారు. మాట్లాడుతూ 1886లో చికాగో అమరవీరులు 12 గంటల పనివిధానాన్ని రద్దు చేసి 8 గంటల పని కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా కుదించి కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని, దీనిని సీఫీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని, ప్రజలపై భారం మోపే విధానాలను మార్చుకోవాలని, అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీఫీఐ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో వివిధ వార్డుల్లో మేడే పతాకావిష్కరణలు జరిగాయి: - *భగత్సింగ్ విగ్రహం:* నియోజకవర్గ కార్యదర్శి దాగం మల్లేష్ - *రైల్వే స్టేషన్:* రాష్ట్ర సమితి సభ్యురాలు బొల్లం పూర్ణిమ - *శాంతిఖని:* గౌతూరి కిష్టయ్య - *9వ వార్డు రైల్వే స్టేషన్:* అక్కేపల్లి బాపు - *26వ వార్డు:* కాసిపేట స్వర్ణలత - *పాత బస్టాండ్:* బొల్లం తిలక్ అంబేద్కర్ - *అశోక్ నగర్:* జూపాక కొమురయ్య - *సింగరేణి హాస్పిటల్:* డాక్టర్ శ్రీధర్ సింగరేణి హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిప్ప నరసయ్య, దాసరి తిరుపతి గౌడ్, బొంతల లక్ష్మీనారాయణ, రత్నం రాజం, జీ.సీ మాణిక్యం, కొంకుల రాజేష్, మీనుగు లక్ష్మీనారాయణ, మంతెన రమేష్, బియ్యాల ఉపేందర్, బొంకూరి రాంచందర్, బొల్లం సోని తదితరులు పాల్గొన్నారు1
- కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి (NH-563)పై ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంగాధర మండలంలోని తుర్కాశీనగర్ 29/T రైల్వే గేటు పడడంతో రహదారి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోవడంతో ఎండలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం వెళ్తున్నవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇదిలా ఉండగా, ట్రాఫిక్లో చిక్కుకున్న ఒక అంబులెన్స్కు మార్గం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆటంకం కలిగింది. సమయానికి చికిత్స అందాల్సిన రోగులకు ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో రైల్వే గేటు మూసివేత సమయంలో తరచూ ఇలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు తెలిపారు. రోజువారీ ప్రయాణికులు, వాణిజ్య వాహనాలు ఇబ్బందులు పడుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.1
- కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో శుక్రవారం మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు కనీస మద్దతు ధరకు మక్కజొన్న కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని, మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా సాగేందుకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.1
- ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ* నేడు మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా యావత్తు కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు.. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం,11% పిఆర్సి పెంపు, కార్మిక సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నేడు మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ఆర్టీసీ 1 డిపో వద్ద ఆర్టీసీ కార్మిక సోదరులతో కలిసి మే డే సంబరాలను జరుపుకోవడం జరిగింది, ఈ సందర్భంగా బాణాసంచా కాల్చి ఆర్టీసీ కార్మికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. యావత్ కార్మిక లోకానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి లేదు 50 రోజుల సమ్మె చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ సమ్మె ప్రారంభించిన కేవలం రెండు రోజుల్లో నేటి ప్రజా పాలన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి మట్టి విక్రమార్కతో పాటు ముఖ్యంగా జిల్లాకు చెందిన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సాధక బాదకాలను అర్థం చేసుకొని వారి డిమాండ్లను పరిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ కార్మికుల, కర్షకుల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యం.డి.ఇమ్రాన్, సుంకరి గణపతి, యం.డి. లయీక్, గడప శ్రీను, సిరిపురం మనోజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.3
- हैदराबाद से विशेष रिपोर्ट तेलंगाना पुलिस विभाग में नई ऊर्जा का संचार हुआ है। वरिष्ठ आईपीएस अधिकारी सी.वी. आनंद ने राज्य के नए पुलिस महानिदेशक (डीजीपी) के रूप में पदभार ग्रहण किया। पदभार ग्रहण समारोह में उन्होंने कहा कि राज्य की शांति, सुरक्षा और कानून व्यवस्था को सर्वोच्च प्राथमिकता दी जाएगी। उन्होंने पुलिस बल को आधुनिक तकनीक, पारदर्शिता और जनसहभागिता के साथ आगे बढ़ाने का संकल्प व्यक्त किया। सी.वी. आनंद के नेतृत्व में पुलिस विभाग से जनता को नई उम्मीदें जुड़ी हैं। प्रशासनिक हलकों में माना जा रहा है कि उनके अनुभव और दृढ़ संकल्प से राज्य में अपराध नियंत्रण और जनविश्वास को और मजबूती मिलेगी।1
- జన్నారం మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ, బస్టాండ్, తదితర ప్రాంతాలలో సిపిఎం, సీఐటీయూ, ఐద్వా మహిళా సంఘం నాయకులు మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కొండ గొర్ల లింగన్న, సిఐటియు నాయకులు బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్, ఐద్వా మహిళా సంఘం మండల అధ్యక్షులు పోతు విజయశంకర్, సిపిఎం నాయకులు జయక్క, రాజన్న, పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు.1
- Post by Venu Gopal1
- *అంతర్జాతీయ మ్యాప్లో మంచిర్యాల: తొలి ఇంటర్నేషనల్ ఫిష్పాండ్కు శ్రీకారం* :* 85 ఎకరాల కేటాయింపు... 150 మంది మత్స్యకారుల జీవితాల్లో వెలుగు *మంచిర్యాల:* మత్స్య రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపుతూ, దేశంలోనే ప్రథమంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘ఇంటర్నేషనల్ ఫిష్పాండ్’ ఏర్పాటుకు మంచిర్యాల జిల్లా వేదిక కానుంది. హాజీపూర్ మండలం గుడిపేట రెవెన్యూ పరిధిలో 85.10 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక జీవో విడుదల చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యే శ్రీ ప్రేమ్సాగర్రావు బుధవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. "ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు... మత్స్యకార కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు వేసిన పునాది. ఈ మెగా ఫిష్పాండ్ ద్వారా ప్రత్యక్షంగా 150 మంది మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభించడంతో పాటు, పరోక్షంగా వందలాది కుటుంబాలకు జీవనోపాధి చేకూరనుంది" అని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి స్థాయిలో చేపల ఉత్పత్తి, శాస్త్రీయ పద్ధతుల్లో పెంపకం, శిక్షణా కేంద్రం ఏర్పాటు ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు. దూరదృష్టితో నిధులు మంజూరు చేసి, భూమి కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి జిల్లా ప్రజల తరఫున ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మంచిర్యాల జిల్లా దేశ మత్స్య పటంలో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది.1