Shuru
Apke Nagar Ki App…
కళ్యాణదుర్గం పట్టణంలో దీర్ఘకాలిక సెలవులో మున్సిపల్ కమిషనర్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారెడ్డి అనారోగ్యాలను కారణంగా చూపుతూ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుని దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 29 వరకు ఆయన సెలవు పెట్టారు. మున్సిపల్ ఎన్నికలు ప్రక్రియ మొదలు కానున్న తరుణంలో కమిషనర్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంలో ఆంతర్యమేమిటని జనాలు చర్చిస్తున్నారు. దగ్గరుండి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాల్సిన కమిషనర్ సెలవులో వెళ్లారు
Merzaa Tv
కళ్యాణదుర్గం పట్టణంలో దీర్ఘకాలిక సెలవులో మున్సిపల్ కమిషనర్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారెడ్డి అనారోగ్యాలను కారణంగా చూపుతూ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుని దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 29 వరకు ఆయన సెలవు పెట్టారు. మున్సిపల్ ఎన్నికలు ప్రక్రియ మొదలు కానున్న తరుణంలో కమిషనర్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంలో ఆంతర్యమేమిటని జనాలు చర్చిస్తున్నారు. దగ్గరుండి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాల్సిన కమిషనర్ సెలవులో వెళ్లారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కళ్యాణదుర్గం పట్టణంలో వినాయకుడి నిమజ్జనంలో ఊరేగింపులో సందడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గణపతి నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలను అలంకరించిన వాహనాల్లో ఊరేగించారు. యువత రంగురంగుల రిబ్బన్లు కట్టుకుని, రంగులు చల్లుకుంటూ డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ 'జై గణేశ్' నినాదాలతో సందడి చేశారు. అనంతరం సమీప చెరువులో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు.1
- రాయదుర్గంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం సిడిమానుకు యువకుడిని తిప్పి మహోత్సవ వేడుకలు రాయదుర్గం పట్టణంలోని కోటలో మారమ్మ దేవి ఆలయం వద్ద సిడిమాను మహోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. సిడిమానుకు యువకుడిని కట్టి మూడు చుట్లు తిప్పారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు స్థానిక భక్తులే కాక కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అద్భుత ఘట్టాన్ని వీక్షించి మొక్కులు తీర్చుకున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.1
- ప్రజాబలం సంఘం అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి.. అనంతపురం నగరంలో గత రెండు వారాలుగా సంచలనం సృష్టించిన ట్రెల్లిస్ స్కూల్ మైనర్ బాలిక ఘటన లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, వెంటనే స్కూల్ ను సీజ్ చేయాలని డి ఈ ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ స్కూల్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా డీఈవో అధికారి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే స్కూలు సీజ్ చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు1
- గుమ్మనూరు గ్రామంలో అంగరంగా వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు గుమ్మనూరులో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు చిప్పగిరి, సెప్టెంబర్ 16: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువతలో ఉత్సాహాన్ని నింపేలా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అనంతరం గుమ్మనూరు నారాయణ కుమారుడు గుమ్మనూరు బాలాజీ గణేష్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. జీఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను రూ.50,000లకు, లంబోదర యూత్ ఆధ్వర్యంలోని గణేష్ లడ్డూను రూ.50,000లకు వేలంలో దక్కించుకున్నారు. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.4
- అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్ను సందర్శించిన ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్ను ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. పరిసరాల్లో పరిశుభ్రత, నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. భోజనం అందించే విధానం, వంటశాల పరిసరాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్యాంటీన్కు వచ్చే ప్రజలకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు1
- మక్కా మీద డ్రోన్ దాడి... 🙄 మధ్యలోనే పేల్చేసిన సౌదీ... తృటిలో తప్పిన ప్రమాదం ప్రాణాపాయం... షియా ముస్లిం దేశం ఇరాన్ మద్దతుతొ ఇంకో షియా హౌతీ ఉగ్రవాదులు సున్ని దేశం మక్కాపై దాడి కీ ప్రయత్నం,, డ్రోన్స్ వేశారు. దాడి చేశారు. 👊👊👊 ఇప్పుడు ఒక ఇస్లాం, ఇంకో ఇస్లామిక్ ఉగ్రవాదానికి లక్ష్యంగా మారింది. 🎯 అక్కడ హిందువులు లేరు,, RSS లేదు. దాడి చేసినవాడు ఇజ్రాయెల్కు చెందినవాడు కాదు. 😏 భారతదేశం లోని గల్లీ అబ్దుల్, సందులో సనా.. నకిలీ పాలస్తీనా ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. ఎవరూ కూడా రోడ్ల మీదకు రాలేదు.. 😭😭 ఇక కమ్యూనిస్ట్ 🐈🐈 ల నోర్లు పడిపోయాయి. ఎర్ర మీడియా, అర్బన్ నక్సల్ మేధావుల నోళ్లకు పక్షవాతం వచ్చింది. 🤣🤣🤣1
- బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.4
- గొడిసెలపల్లి గ్రామంలోని సమ్మర్ స్టోరేజీకి గండి.. భారీగా నీరు వృధా నీట మునిగిన పంటలు డి.హీరేహాళ్: గోడిసలపల్లి గ్రామ సమీపంలోని తాగునీటి సత్యసాయి స్టోరేజ్ వద్ద గండి పడింది. దీంతో భారీగా నీరు పొలాల్లోకి చేరి దాదాపు 20 ఎకరాల్లో సాగు చేసిన పంటలు నీటమునిగాయి.ఉదయం 5.30 గంటలకు పొలాలకు వెళ్లిన రైతులు గండిని గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. వెంటనే హిటాచీ,జేసీబీలతో గండిని పూడ్చే పనులు చేపట్టారు.ఘటనా స్థలంలో టీడీపీ నాయకుడు ఉండాల శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రవీందర్రెడ్డి, బీజేపీ నాయకులు తిమ్మారెడ్డి, సిద్ధారెడ్డి, తిప్పేస్వామితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు, గ్రామస్తులు ఉన్నారు.1