టైగర్ జోన్లో 'వేట'గాళ్ల రాజ్యం.. నిమ్మకు నీరెత్తినట్లు అటవీశాఖ! వన్యప్రాణుల రక్షణ గాలికి.. అధికారుల ధ్యాస కాసుల పైనేనా? కవ్వాల్ టైగర్ జోన్.. వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తున్న ప్రాంతం. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే 'వేటగాళ్లకు అడ్డాగా' మారుతోంది. తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో ఓ చిరుత పులిని అతి కిరాతకంగా చంపి, దాని గోళ్లను పీకేసిన ఘటన అటవీ అధికారుల వైఫల్యాన్ని ఎండగడుతోంది. ఘటన వెనుక విస్తుపోయే నిజాలు: ఊట్ల గ్రామానికి చెందిన మొత్తే వెంకటేష్, మొత్తే శ్రీనివాస్, మరియు పాతమామిడిపల్లికి చెందిన వనపర్తి శ్రీకాంత్ అనే ముగ్గురు నిందితులు పక్కా ప్లాన్తో చిరుతను హతమార్చారు. కేవలం క్లచ్ వైరుతో ఉచ్చు వేసి, ఒక క్రూర మృగాన్ని హతమార్చగలిగారంటే.. ఆ ప్రాంతంలో అటవీ శాఖ నిఘా ఎంత 'ఘనం'గా ఉందో అర్థం చేసుకోవచ్చు. వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. వన్యప్రాణులపై లేదా? లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న బీట్ ఆఫీసర్ల నుంచి ఎఫ్.డి.ఓ, వరకు అందరిపై ఇప్పుడు విమర్శల జడివాన కురుస్తోంది. నాలుగు రోజుల మౌనం: చిరుత చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా, నిందితులు దాని అవయవాలను అమ్ముకోవడానికి బయలుదేరే వరకు అధికారులకు ఉలుకూ లేదు.. పలుకూ లేదు. ఫోన్లకు నో ఆన్సర్: వివరణ కోసం మీడియా ప్రతినిధులు ఫోన్ చేస్తే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారులు స్పందించకపోవడం దేనికి సంకేతం? అవినీతి ఆరోపణలు: స్మగ్లర్లు, అక్రమ ఇసుక రవాణా చేసే వారితో చేతులు కలిపి, సామాన్య ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారాయి. "అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలతో కాలక్షేపం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వేటగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటే వీరు ఏసీ గదుల్లో ఏం చేస్తున్నారు?" అని మండల వాసులు, ప్రజా సంఘాల నేతలు నిలదీస్తున్నారు. తక్షణ డిమాండ్: సస్పెన్షన్ వేటు పడాల్సిందే! విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన బీట్ ఆఫీసర్లు, ఎఫ్.ఆర్.ఓ, మరియు ఎఫ్.డి.ఓ, లను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తూ, వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్రోశిస్తున్నారు.
టైగర్ జోన్లో 'వేట'గాళ్ల రాజ్యం.. నిమ్మకు నీరెత్తినట్లు అటవీశాఖ! వన్యప్రాణుల రక్షణ గాలికి.. అధికారుల ధ్యాస కాసుల పైనేనా? కవ్వాల్ టైగర్ జోన్.. వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తున్న ప్రాంతం. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే 'వేటగాళ్లకు అడ్డాగా' మారుతోంది. తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో ఓ చిరుత పులిని అతి కిరాతకంగా చంపి, దాని గోళ్లను పీకేసిన ఘటన అటవీ అధికారుల వైఫల్యాన్ని ఎండగడుతోంది. ఘటన వెనుక విస్తుపోయే నిజాలు: ఊట్ల గ్రామానికి చెందిన మొత్తే వెంకటేష్, మొత్తే శ్రీనివాస్, మరియు పాతమామిడిపల్లికి చెందిన వనపర్తి శ్రీకాంత్ అనే ముగ్గురు నిందితులు పక్కా ప్లాన్తో చిరుతను హతమార్చారు. కేవలం క్లచ్ వైరుతో ఉచ్చు వేసి, ఒక క్రూర మృగాన్ని హతమార్చగలిగారంటే.. ఆ ప్రాంతంలో అటవీ శాఖ నిఘా ఎంత 'ఘనం'గా ఉందో అర్థం చేసుకోవచ్చు. వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. వన్యప్రాణులపై లేదా? లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న బీట్ ఆఫీసర్ల నుంచి ఎఫ్.డి.ఓ, వరకు అందరిపై ఇప్పుడు విమర్శల జడివాన కురుస్తోంది. నాలుగు రోజుల మౌనం: చిరుత
చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా, నిందితులు దాని అవయవాలను అమ్ముకోవడానికి బయలుదేరే వరకు అధికారులకు ఉలుకూ లేదు.. పలుకూ లేదు. ఫోన్లకు నో ఆన్సర్: వివరణ కోసం మీడియా ప్రతినిధులు ఫోన్ చేస్తే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారులు స్పందించకపోవడం దేనికి సంకేతం? అవినీతి ఆరోపణలు: స్మగ్లర్లు, అక్రమ ఇసుక రవాణా చేసే వారితో చేతులు కలిపి, సామాన్య ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారాయి. "అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలతో కాలక్షేపం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వేటగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటే వీరు ఏసీ గదుల్లో ఏం చేస్తున్నారు?" అని మండల వాసులు, ప్రజా సంఘాల నేతలు నిలదీస్తున్నారు. తక్షణ డిమాండ్: సస్పెన్షన్ వేటు పడాల్సిందే! విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన బీట్ ఆఫీసర్లు, ఎఫ్.ఆర్.ఓ, మరియు ఎఫ్.డి.ఓ, లను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తూ, వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్రోశిస్తున్నారు.
- జన్నారం మండలంలో అంబేద్కర్ జయంతిని అంబేద్కర్ వాదులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు భరత్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో పార్టీలు, సంఘాల నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జన్నారంలోని అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు. గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి.. విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.2
- మెట్పల్లి, ఏప్రిల్ 13: మెట్పల్లి డిపోలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జాతీయ రోడ్డు భద్రత–2026 కార్యక్రమాన్ని డిపో ఎస్టీఐ టి. ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం డిపో నుంచి పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ ఏ. రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ పి. కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం డీఎస్పీ రాములు మాట్లాడుతూ, ఒక ప్రైవేట్ వాహనం సరుకులు తీసుకెళ్తే అవి పాడవుతాయని, కానీ బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత డ్రైవర్ చేతుల్లో ఉంటుందని తెలిపారు. అందువల్ల డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా, బాధ్యతతో వాహనం నడపాలని సూచించారు.అనంతరం డిపో నుండి పాత బస్టాండ్ వరకు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ, భద్రతా సిబ్బంది మరియు కార్యాలయ సిబ్బంది నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మెకానిక్ సూపర్వైజర్ ఏ. చంద్రయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ పవన్, ఎం.డి. ముజిబ్ ఖాన్ (ఆర్హెచ్సీ), ట్రాఫిక్ సూపర్వైజర్లు, మెకానికల్ సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ మరియు భద్రతా సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.3
- Post by Vedam chamdu Vedam1
- నెరడిగొండ మండల కేంద్రంలో రాజ్యాంగ రహిత డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 135వ జయంతి సందర్భంగా నెరడిగొండ మండల కేంద్రంలో జరిగిన అంబెడ్కర్ జయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బోరును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు కల్పించిన రిజర్వేషన్ తోనే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాయని అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివిన అంబెడ్కర్ సమాజాన్ని అంతకంటే లోతుగా చదివి రాజ్యాంగాన్ని రాశారని గుర్తుచేశారు. ఆనాడు బాబా సాహెబ్ రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించకపోయి ఉంటే భారత సమాజం ఏమయ్యేదో ఆలోచించాలన్నారు. భారత పౌరులకు తమ నాయకున్ని తామే ఎన్నుకునే అవకాశం కల్పించిన గొప్ప మహనీయులు అంబెడ్కర్ గారని అన్నారు.1
- . మాజీ మంత్రి మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారమే ప్రతి ఒక్కరికి సమాన ఫలాలను అందుకోగలుగుతున్నమ్మన్నారు.ప్రపంచ దేశాలలో సైతం అంబేద్కర్ కు ఘన నివాళులు అందించడం జరుగుతుందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క 125 అడుగుల అంబేద్కర్ గారి భారీ విగ్రహాన్ని నివాళులు అర్పించకుండా సంకెళ్లతో బంధించడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.. అంబేద్కర్ గారు సమానత్వం, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు దేశానికి చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. సమాజంలోని అణగారిన వర్గాల అభివృద్ధి కోసం అంబేద్కర్ చూపిన మార్గం నేటికీ ప్రాసంగికమని పేర్కొన్నారు. అంబేద్కర్ గారి ఆశా సాధనలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో దళిత అభ్యున్నతికి పాటుపడిందన్నారు ఉన్నతమైన విద్యా విధానంతో పాటు దళిత కుటుంబాలు ఆర్థికంగా ముందుకు పోయేలా దళిత బస్తీ దళిత బంధు కార్యక్రమాలను కూడా అమలు చేయడం జరిగిందన్నారు.2
- ప్రజల ఆశీస్సులతో బీజేపీ గెలిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు అన్నారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన నూతన మున్సిపల్ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు ఖానాపూర్ పట్టణ శివారులోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుండి మున్సిపల్ కార్యాలయం వరకు బిజెపి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో జరిగిన పదవీ ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు పడిన ధర్మం గెలిచిందన్నారు. ఖానాపూర్ పట్టణ అభివృద్ధికి బిజెపి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1