logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

టైగర్ జోన్‌లో 'వేట'గాళ్ల రాజ్యం.. నిమ్మకు నీరెత్తినట్లు అటవీశాఖ! ​వన్యప్రాణుల రక్షణ గాలికి.. అధికారుల ధ్యాస కాసుల పైనేనా? కవ్వాల్ టైగర్ జోన్.. వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తున్న ప్రాంతం. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే 'వేటగాళ్లకు అడ్డాగా' మారుతోంది. తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో ఓ చిరుత పులిని అతి కిరాతకంగా చంపి, దాని గోళ్లను పీకేసిన ఘటన అటవీ అధికారుల వైఫల్యాన్ని ఎండగడుతోంది. ​ఘటన వెనుక విస్తుపోయే నిజాలు: ​ఊట్ల గ్రామానికి చెందిన మొత్తే వెంకటేష్, మొత్తే శ్రీనివాస్, మరియు పాతమామిడిపల్లికి చెందిన వనపర్తి శ్రీకాంత్ అనే ముగ్గురు నిందితులు పక్కా ప్లాన్‌తో చిరుతను హతమార్చారు. కేవలం క్లచ్ వైరుతో ఉచ్చు వేసి, ఒక క్రూర మృగాన్ని హతమార్చగలిగారంటే.. ఆ ప్రాంతంలో అటవీ శాఖ నిఘా ఎంత 'ఘనం'గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ​వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. వన్యప్రాణులపై లేదా? ​లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న బీట్ ఆఫీసర్ల నుంచి ఎఫ్.డి.ఓ, వరకు అందరిపై ఇప్పుడు విమర్శల జడివాన కురుస్తోంది. ​నాలుగు రోజుల మౌనం: చిరుత చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా, నిందితులు దాని అవయవాలను అమ్ముకోవడానికి బయలుదేరే వరకు అధికారులకు ఉలుకూ లేదు.. పలుకూ లేదు. ​ఫోన్లకు నో ఆన్సర్: వివరణ కోసం మీడియా ప్రతినిధులు ఫోన్ చేస్తే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారులు స్పందించకపోవడం దేనికి సంకేతం? ​అవినీతి ఆరోపణలు: స్మగ్లర్లు, అక్రమ ఇసుక రవాణా చేసే వారితో చేతులు కలిపి, సామాన్య ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారాయి. ​"అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలతో కాలక్షేపం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వేటగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటే వీరు ఏసీ గదుల్లో ఏం చేస్తున్నారు?" అని మండల వాసులు, ప్రజా సంఘాల నేతలు నిలదీస్తున్నారు. ​తక్షణ డిమాండ్: సస్పెన్షన్ వేటు పడాల్సిందే! ​విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన బీట్ ఆఫీసర్లు, ఎఫ్.ఆర్.ఓ, మరియు ఎఫ్.డి.ఓ, లను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తూ, వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్రోశిస్తున్నారు.

2 hrs ago
user_తుడుం జితేందర్
తుడుం జితేందర్
Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
2 hrs ago
35d48173-fbc0-4aeb-b9d0-a96f05cfaec0

టైగర్ జోన్‌లో 'వేట'గాళ్ల రాజ్యం.. నిమ్మకు నీరెత్తినట్లు అటవీశాఖ! ​వన్యప్రాణుల రక్షణ గాలికి.. అధికారుల ధ్యాస కాసుల పైనేనా? కవ్వాల్ టైగర్ జోన్.. వన్యప్రాణుల రక్షణ కోసం ప్రభుత్వం కోట్లు కుమ్మరిస్తున్న ప్రాంతం. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తుంటే 'వేటగాళ్లకు అడ్డాగా' మారుతోంది. తాళ్లపేట అటవీ రేంజ్ పరిధిలో ఓ చిరుత పులిని అతి కిరాతకంగా చంపి, దాని గోళ్లను పీకేసిన ఘటన అటవీ అధికారుల వైఫల్యాన్ని ఎండగడుతోంది. ​ఘటన వెనుక విస్తుపోయే నిజాలు: ​ఊట్ల గ్రామానికి చెందిన మొత్తే వెంకటేష్, మొత్తే శ్రీనివాస్, మరియు పాతమామిడిపల్లికి చెందిన వనపర్తి శ్రీకాంత్ అనే ముగ్గురు నిందితులు పక్కా ప్లాన్‌తో చిరుతను హతమార్చారు. కేవలం క్లచ్ వైరుతో ఉచ్చు వేసి, ఒక క్రూర మృగాన్ని హతమార్చగలిగారంటే.. ఆ ప్రాంతంలో అటవీ శాఖ నిఘా ఎంత 'ఘనం'గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ​వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. వన్యప్రాణులపై లేదా? ​లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న బీట్ ఆఫీసర్ల నుంచి ఎఫ్.డి.ఓ, వరకు అందరిపై ఇప్పుడు విమర్శల జడివాన కురుస్తోంది. ​నాలుగు రోజుల మౌనం: చిరుత

చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్నా, నిందితులు దాని అవయవాలను అమ్ముకోవడానికి బయలుదేరే వరకు అధికారులకు ఉలుకూ లేదు.. పలుకూ లేదు. ​ఫోన్లకు నో ఆన్సర్: వివరణ కోసం మీడియా ప్రతినిధులు ఫోన్ చేస్తే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారులు స్పందించకపోవడం దేనికి సంకేతం? ​అవినీతి ఆరోపణలు: స్మగ్లర్లు, అక్రమ ఇసుక రవాణా చేసే వారితో చేతులు కలిపి, సామాన్య ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారాయి. ​"అధికారులు కేవలం నామమాత్రపు తనిఖీలతో కాలక్షేపం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వేటగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతుంటే వీరు ఏసీ గదుల్లో ఏం చేస్తున్నారు?" అని మండల వాసులు, ప్రజా సంఘాల నేతలు నిలదీస్తున్నారు. ​తక్షణ డిమాండ్: సస్పెన్షన్ వేటు పడాల్సిందే! ​విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన బీట్ ఆఫీసర్లు, ఎఫ్.ఆర్.ఓ, మరియు ఎఫ్.డి.ఓ, లను తక్షణమే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తూ, వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆక్రోశిస్తున్నారు.

More news from Adilabad and nearby areas
  • ఇచ్చొడ మండలంలోని ఆడిగామ (బి) గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో శబరిమాత ఆలయం వద్ద నూతనంగా బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల సౌకర్యార్తమే గ్రామంలో చౌకధరల దుకాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఇచ్చొడ మండలంలోని ఆడిగామ (బి) గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాపు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో శబరిమాత ఆలయం వద్ద నూతనంగా బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల సౌకర్యార్తమే గ్రామంలో చౌకధరల దుకాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Ichoda, Adilabad•
    11 hrs ago
  • మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.
    1
    మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం  మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల  బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తో కాలం చెల్లిందా అంటే ఔననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్న తనకు పార్టీని వీడాలంటే బాదేస్తుందని తెలిపారు. తనతో పాటు అనుచరులు బాధపడుతున్నారని చెప్పారు. త్వరలోనే అందరితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో కొత్త విషయం వింటారని తన మనసులోని మాట చెప్పారు. బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఓటమిలను చవిచూశారు. జీవన్ రెడ్డిని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఆందోళనలో ఉన్నారు.
    2
    గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తో కాలం చెల్లిందా అంటే ఔననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్న తనకు పార్టీని వీడాలంటే బాదేస్తుందని తెలిపారు. తనతో పాటు అనుచరులు బాధపడుతున్నారని చెప్పారు. త్వరలోనే అందరితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో కొత్త విషయం వింటారని తన మనసులోని మాట చెప్పారు. బిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. జగిత్యాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఓటమిలను చవిచూశారు. జీవన్ రెడ్డిని పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆవేదనతో ఆందోళనలో ఉన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • Post by Solanke Ravi
    4
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    6 hrs ago
  • ధర్మారం మండలంలో శనివారం పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష మొదలైంది. మొదటి రోజు కాబట్టి 45 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను ధర్మారం ఎస్సై సందర్శించారు
    1
    ధర్మారం మండలంలో శనివారం పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటలకు పరీక్ష మొదలైంది. మొదటి రోజు కాబట్టి 45 నిమిషాల ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను ధర్మారం ఎస్సై సందర్శించారు
    user_ధర్మారం వార్తలు
    ధర్మారం వార్తలు
    Insurance Agent ధర్మారం, పెద్దపల్లి, తెలంగాణ•
    11 hrs ago
  • కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాజు తెలిపారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,117 మంది పరీక్షకు హాజరుకాగా, 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని DEO రాజు తెలిపారు. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
జిల్లాలో మొత్తం 13,154 మంది విద్యార్థులకు గాను 13,117 మంది పరీక్షకు హాజరుకాగా, 37 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రూ. 2 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరతరగతిన పూర్తి చేసి ప్రజలు తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరు అయిన రూ. 2 కోట్ల 10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరతరగతిన పూర్తి చేసి ప్రజలు తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Boath, Adilabad•
    11 hrs ago
  • పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. పదవ తరగతి పరీక్షల సందర్భంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుసుమరయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలన్ని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి, కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షలు సజావుగా,అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడ కుండా చూడలన్నారు.పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట,డిఎస్పీ నాగేంద్రచారి, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.
    1
    పదవ తరగతి పరీక్ష కేంద్రాలను
క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.
పదవ తరగతి పరీక్షల సందర్భంగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుసుమరయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలన్ని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి,పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి, కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షలు సజావుగా,అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163 BNSS (సెక్షన్ 144) అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడ కుండా చూడలన్నారు.పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని (100 మీటర్ల పరిధిలో) అన్ని ఫోటోకాపీ (జిరాక్స్) మరియు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట,డిఎస్పీ నాగేంద్రచారి, పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 217 కేంద్రాల్లో 40 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. శనివారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించడంతో నిర్దేశించిన సమయానికంటే అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40662 మంది పదవ తరగతి విద్యార్థులు ఉండగా వారి కోసం 217 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి కాకుండా అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల అస్వస్థతకు గురి కాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఇచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరీక్షా కేంద్రానికి వంద మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కరీంనగర్ జిల్లాలో 73 పరీక్ష కేంద్రాల ద్వారా 13 వేల మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షలకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో 69 పరీక్ష కేంద్రాల్లో 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో 7300 మంది పెద్దపెల్లి జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల్లో 7,400 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది.
    4
    పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 217 కేంద్రాల్లో 40 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. శనివారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 13 వరకు కొనసాగుతాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి. నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించడంతో నిర్దేశించిన సమయానికంటే అరగంట ముందుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరారు. 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40662 మంది పదవ తరగతి విద్యార్థులు ఉండగా వారి కోసం 217 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి కాకుండా అధికారులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల అస్వస్థతకు గురి కాకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని అందుబాటులో ఇచ్చారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరీక్షా కేంద్రానికి వంద మీటర్ల దూరంలో జిరాక్స్ సెంటర్లను మూసివేశారు. కరీంనగర్ జిల్లాలో 73 పరీక్ష కేంద్రాల ద్వారా 13 వేల మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షలకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లాలో 69 పరీక్ష కేంద్రాల్లో 12,693 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 34 పరీక్షా కేంద్రాల్లో 7300 మంది పెద్దపెల్లి జిల్లాలో 41 పరీక్ష కేంద్రాల్లో 7,400 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఎలాంటి ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ఫ్రీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.