Shuru
Apke Nagar Ki App…
నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం మహాగాం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల కోసం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపేంద్ర జోషి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుడు కృష్ణ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కనకరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Murali
నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం మహాగాం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల కోసం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపేంద్ర జోషి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుడు కృష్ణ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కనకరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం మహాగాం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల కోసం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపేంద్ర జోషి ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుడు కృష్ణ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కనకరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.1
- నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీకి మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. బోధన్ మండలం, స్థానిక తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. గంగాధర్ మాట్లాడుతూ, శ్రీశ్రీ అప్పట్లో సమాజంలోని వాస్తవాలకు అక్షర రూపం ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన పదునైన పదాలు, లోతైన భావాలతో స్వార్థపరులు, లంచగొండులు, సాటి మనిషి శ్రమను దోచుకునే దుర్మార్గులకు, సమసమాజాన్ని అంగీకరించని నీచులకు సింహస్వప్నంగా మారారని వివరించారు. పీడితులు, తాడితులు, అణగారిన వర్గాలకు మాత్రం శ్రీశ్రీ ఆప్తుడయ్యారని, దోపిడీలు, దౌర్జన్యాలు ఇకపై చెల్లవని ఆయన సవాల్ విసిరారని గంగాధర్ కొనియాడారు. గుప్పెడు అక్షరాలతో అనంతమైన భావాలు ఆయన రచనల్లో నాట్యమాడతాయని, శ్రీశ్రీ సాహిత్యానికి కన్నీటిని ఉప్పెనగా మార్చే శక్తి, శక్తిహీనులను పోరాట యోధులుగా మార్చే స్ఫూర్తి ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పి. శంకర్, బి. సాయిలు, దేవయ్య, రమేష్, లాలయ్య, గంగాధర్, రాములు తదితరులు పాల్గొన్నారు.3
- ఒకరు తమ భార్య మరియు కూతురితో కలిసి కమ్మర్పల్లి నుండి కోన సముందర్కు సరదాగా ప్రయాణాన్ని సాగించారు. ఈ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా గడిచింది.1
- జూన్ 16, మంగళవారం నాడు, స్థానిక మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్, బన్స్వారా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఫిల్టర్ బెడ్ను తనిఖీ చేశారు. ఈ ఫిల్టర్ బెడ్ నగరం ప్రజలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తుంది. ఈ తనిఖీ సమయంలో, కమీషనర్ ఫిల్టర్ బెడ్ సిబ్బందితో పాటు నీటి సరఫరా సిబ్బంది యొక్క హాజరు రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత, నగరం ప్రజలకు ప్రతిరోజూ పరిశుభ్రమైన తాగునీరు నిరంతరాయంగా అందేలా ఫిల్టర్ బెడ్ను సరిగ్గా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. నగర ప్రజలకు నీటి సరఫరాలో ఎదురయ్యే ఏ సమస్యలనైనా తక్షణమే పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి స్పష్టం చేశారు. తాగునీటికి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ఈ తనిఖీలో కమీషనర్తో పాటు కార్యాలయ సిబ్బంది మరియు నీటి సరఫరా సిబ్బంది కూడా ఉన్నారు.1
- కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరు పోలీస్ స్టేషన్ను ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. తనిఖీలో భాగంగా స్టేషన్ పరిసరాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన ఎస్పీ, రోల్ కాల్ ప్రాముఖ్యత, విధులు, బాధ్యతలపై పలు సూచనలు చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన ఆర్థిక నేరాలు, దొంగతనాలు, ఇతర కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించి, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో ప్రత్యేక కార్యాచరణతో త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ను మరింత పటిష్టం చేయాలని, పగలు, రాత్రి గస్తీని పెంచాలని సూచించారు. వాహనాల తనిఖీలు, నాకాబందీలు నిర్వహిస్తూ అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, రోడ్డు భద్రత అంశాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భిక్కనూరు ఎన్హెచ్ఐవోకు సూచించారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళ్ళపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మానుక సత్యం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నూతన కమిటీల ఎన్నిక కోసం దరఖాస్తులను స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు, మరియు మానుక సత్యం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయడం అత్యవసరమని పునరుద్ఘాటించారు.1
- కామారెడ్డి నగరంలో ఆన్లైన్ ట్రేడింగ్, టాస్క్ ఆధారిత పెట్టుబడి మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని సైబర్ క్రైమ్ పోలీసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, కామారెడ్డి పట్టణ సీఐ నరహరి మంగళవారం ఉదయం ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలకు పలు హెచ్చరికలు, సూచనలు జారీ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లైన టెలిగ్రామ్, వాట్సాప్లలో తాము 'ఫైనాన్షియల్ అడ్వైజర్స్' అని చెప్పుకుంటూ వచ్చే ముఠాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఐ నరహరి స్పష్టం చేశారు. 'ఆశ దురాశగా మారి, ఆపై సర్వస్వం కోల్పోయేలా చేసే' ఇలాంటి ఆన్లైన్ ఉచ్చుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. తెలియని లింకులను క్లిక్ చేయడం, గుర్తుతెలియని ఖాతాలకు డబ్బులు పంపడం తక్షణమే ఆపివేయాలని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దని నొక్కి చెప్పారు. లాటరీ మోసాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండి, సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి పట్టణ సీఐ నరహరి విజ్ఞప్తి చేశారు.1
- నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట్ పునరావాస గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పునరావాస గ్రామస్తులకు కేటాయించిన వ్యవసాయ భూముల్లో రెవెన్యూ అధికారులు హద్దు రాళ్లు పాతుతుండగా, నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడకు చెందిన గిరిజనులు దీనిని అడ్డుకున్నారు. తాము గతంలో సాగు చేసిన భూములను ముందుగా తమకే కేటాయించాలని, అనంతరం ఇతరులకు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు దిగిన గిరిజనుల్లో సుమారు 20 మందిని పోలీసులు, అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని జన్నారం మండలం ఇంధన్పల్లి అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. భూముల కేటాయింపుపై నెలకొన్న ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.1