వేసవిలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి... రక్షణ కిట్లు రోడ్డు భద్రత కు ఆధునిక పరికరాల పంపిణీ... రోడ్డు ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు . కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. కర్నూలు జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణతో పాటు , రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత ను బలోపేతం చేసే దిశగా కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు గట్టి చర్యలు చేపట్టామని తెలిపారు. బుధవారం కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కిట్లు, హైవే పెట్రోలింగ్ మొబైల్ పోలీసులకు ఆధునిక పరికరాలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతతో కర్నూలు మెడికవర్ హాస్పిటల్ సహకారంతో కర్నూలు ట్రాఫిక్ పోలీసులకు చలువ అద్దాలు, వాటర్ బాటిల్స్, కూల్ వాటర్ క్యాన్స్, టోపీలు, గ్లూకోజ్-డి ప్యాకెట్లు అందజేశామన్నారు. కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలన్నారు. వేసవిలో రోడ్ల పై గంటల తరబడి ఎండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, ప్రజలు కూడా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. అదే విధంగా నేషనల్ హైవేలలో ఎక్కడైనా రాత్రి వేళలలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ట్రాఫిక్ అంతరాయం కాకుండా , వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు డైవర్షన్స్ చేసే విధంగా, సత్వరమే స్పందించే విధంగా రోడ్డు భద్రతా చర్యలలో భాగంగా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (మహబూబ్ నగర్) మరియు కెనరా బ్యాంక్ సహకారంతో హైవే పెట్రోలింగ్ మొబైల్ పోలీసులకు రెఫ్లెక్టివ్ (రేడియం) జాకెట్లు, ఇండికేటింగ్ కోన్స్, కంబళ్లు, సుత్తెలు, డ్రాగన్ లైట్లు, లైటింగ్ బాటన్స్ అందజేశామన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రాణ నష్టాన్ని తగ్గించడం మరియు ప్రయాణికుల భద్రతను పెంపొందించడం కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాద సమయాలలో ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్ రావు, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, టూ టౌన్ సీఐ నాగరాజరావు మరియు ట్రాఫిక్ ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, NHAI సిబ్బంది పాల్గొన్నారు.
వేసవిలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి... రక్షణ కిట్లు రోడ్డు భద్రత కు ఆధునిక పరికరాల పంపిణీ... రోడ్డు ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు . కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. కర్నూలు జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య పరిరక్షణతో పాటు , రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రత ను బలోపేతం చేసే దిశగా కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు గట్టి చర్యలు చేపట్టామని తెలిపారు. బుధవారం కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కిట్లు, హైవే పెట్రోలింగ్ మొబైల్ పోలీసులకు ఆధునిక పరికరాలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతతో కర్నూలు మెడికవర్ హాస్పిటల్ సహకారంతో కర్నూలు ట్రాఫిక్ పోలీసులకు చలువ అద్దాలు, వాటర్ బాటిల్స్, కూల్ వాటర్ క్యాన్స్, టోపీలు, గ్లూకోజ్-డి ప్యాకెట్లు అందజేశామన్నారు. కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్న నేపథ్యంలో, ట్రాఫిక్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వర్తించాలన్నారు. వేసవిలో రోడ్ల
పై గంటల తరబడి ఎండలో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని, ప్రజలు కూడా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలన్నారు. అదే విధంగా నేషనల్ హైవేలలో ఎక్కడైనా రాత్రి వేళలలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ట్రాఫిక్ అంతరాయం కాకుండా , వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు డైవర్షన్స్ చేసే విధంగా, సత్వరమే స్పందించే విధంగా రోడ్డు భద్రతా చర్యలలో భాగంగా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (మహబూబ్ నగర్) మరియు కెనరా బ్యాంక్ సహకారంతో హైవే పెట్రోలింగ్
మొబైల్ పోలీసులకు రెఫ్లెక్టివ్ (రేడియం) జాకెట్లు, ఇండికేటింగ్ కోన్స్, కంబళ్లు, సుత్తెలు, డ్రాగన్ లైట్లు, లైటింగ్ బాటన్స్ అందజేశామన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం, ప్రాణ నష్టాన్ని తగ్గించడం మరియు ప్రయాణికుల భద్రతను పెంపొందించడం కోసం గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాద సమయాలలో ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్ రావు, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, టూ టౌన్ సీఐ నాగరాజరావు మరియు ట్రాఫిక్ ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, NHAI సిబ్బంది పాల్గొన్నారు.
- ధరూర్: మండలంలోని నెట్టెంపాడు గ్రామంలో గ్రామసభ వాడివేడిగా జరిగింది. గ్రామసభ సమావేశంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు చర్చించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కూడా చర్చలో భాగంగా మరోసారి గుర్తు చేశారు. బూడిది పాడు నెట్టెంపాడు గ్రామానికి మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని గతంలో హామీ ఇచ్చి నేటి వరకు అది పూర్తి చేయలేదని చెప్పారు.1
- దరూరు మండల కేంద్రములో శ్రీ కొండేటి అంజన్న జన్మదిన వేడుకలు అంగరంగ వైభోగంగా నిర్వహించిన సర్పంచ్ డి ఆర్ విజయ్ కుమార్. ********<<<<<<>>>>>>******** జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండల కేంద్రములో వెలసిన శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయములో హనుమాన్ జయంతి వేడుకలు ముగించుకొని స్వామివారిని పురవీధులగుండా స్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకి లో మోస్తూ వెనకాల అభయాంజనేయ స్వామి విగ్రహమును ట్రాక్టర్లో ఊరేగిస్తూ ముందుగా పార్థసారతి ఆలయములో స్వామి వారి దర్శనం చేసుకొని పురవీధుల గుండా స్వామిని ఆయిరేగింపుగా తీసుకెలుతూ శ్రీకొండేటి ఆంజనేయస్వామి దేవాలయము వరకు తీసుకెలుతున్నట్లు డి ఆర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఎమ్మిగనూరు నుండి ముఖ్య వార్త… అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టంగా మారడంతో ఎమ్మిగనూరులో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రైతుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలు ఈ విజయాన్ని పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.1
- ఆకలి కడుపులు నింపుటకై పెట్టిన కార్యక్రమం అన్న క్యాంటీన్. దయచేసి ఒక టోకెన్ మాత్రమే తీసుకోవాలి అని మనవి.మీ వెనకాల ఉన్న పేద వాడి కడుపు కూడా నిండాలి అంటే ..1
- బద్వేలు:రాజధాని అమరావతి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలపడంతో రాజధానిపై కమ్ముకున్న అనిశ్చితి, చీకట్లు పూర్తిగా తొలగిపోయాయని ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బద్వేలు పట్టణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాలు నిర్వహించారు. అమరావతికి వెలుగులు వచ్చినట్లుగా సంకేతంగా దీపాలు వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేశారు., “ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు అమరావతి ఇక శాశ్వత రాజధానిగా నిలవనుంది” అని అన్నారు. అమరావతి నిర్మాణానికి రైతులు తమ సొంత భూములను త్యాగంగా సమర్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ, గత ప్రభుత్వ కాలంలో రాజధాని అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే ఆ పరిస్థితులను అర్థం చేసుకుని తగిన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇకపై ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా అమరావతిని ఎవరూ కదిలించలేరని, ఇది రాష్ట్ర ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తరఫున దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్,చెరుకూరి రవికుమార్, పరిటాల వెంకట సుబ్బయ్య,బీరం జయ రామి రెడ్డి, పాలకొండు రాజశేఖర్ రెడ్డి,గాజులపల్లె శంకర్ రెడ్డి కొంకుల రాంబాబు, కల్వపల్లె వీర రెడ్డి, జహంగీర్ భాష,బోవిళ్ళ నరసింహ రెడ్డి,బిజీవేముల రమణారెడ్డి,మాచుపల్లి కృష్ణారెడ్డి, పఠాన్ మౌలాలి, రసూల్, ఉపత్తి సుబ్బారెడ్డి,గోపి రెడ్డి, సుబ్బా రాయుడు,రాము,గురు ప్రసాద్ రెడ్డి,కోటపాటి పెంచలయ్య,చిన్నప్ప రెడ్డి, గంగాధర్ రెడ్డి, వెంకటేష్ తదితరు తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- వికారాబాద్, మోమిన్ పేట్ : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మొహం పేట్ మండలం బూరుగుపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ పతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆర్డిఓ వాసు చంద్ర జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు గ్రామంలోని ప్రజలకు అందాల లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేస్తున్నదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాలను పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటివరకు పదివేల కోట్ల రూపాయల ప్రయాణాలు చేశారని, 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ గురజాతి పథకంలో పేదల ఇళ్లకు ఉచిత కరెంట్ రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు కల్పించినట్లు తెలిపారు.1
- కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల బైక్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో కళ్యాణదుర్గం టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీ సర్కిల్లో బాణసంచా పేల్చి, సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు మోరేపల్లి మల్లికార్జున, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఆర్గానిక్ గా పండించిన పంటలకు రైతులు లాభదాయకంగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది1