పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతూ తొలకరి పరవళ్ళు తొక్కుతూ పొంగిపొర్లుతున్న పోచారం జలాశయం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు పోచారం జలాశయం ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట్ మండల వరప్రదాయిని అయినా పోచారం జలాశయం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోజురోజుకి నీటిమట్టం పెరుగుతూ ప్రాజెక్టు ఎగువన మంచిప్ప గాంధారి లింగంపేట్ గుండారం తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లింగంపేట్ పెద్దవాగు గుండారం భీమేశ్వర వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తూ భారీ వరద నీరు పోచారం జలాశయంలోకి ఉరకలెత్తడంతో ఉదయం 9 గంటల వరకు పోచారం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతూ తొలకరి పరవళ్ళు తొక్కుతూ పొంగి పొర్లుతుంది ఈ వరద నీరు మంజీరా నది ద్వారా నిజాంసాగర్ జలాశయంలోకి వెళ్తుంది ప్రాజెక్టు దిగువన మంజీరా నది పరవాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు పొంగిపొర్లుతున్న వాగులు ప్రాజెక్టుల వద్దకు ప్రజలు వెళ్లకూడదని అధికారులు సూచించారు పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఆయకట్టు రైతులు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయకట్టు కింద వానకాలం సీజన్ మరియు రబీ సీజన్ సాగుకు ఊపిరి పోసినట్టు అయిందని అన్నదాతలు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయకట్టు కింద సుమారు 10,500 ఎకరాల వరకు పరోక్షంగా మరో 6000 ఎకరాలకు సాగుకు నీరు అందుతుందని నీటిపారుదల శాఖ ఎఈ అక్షయ్ కుమార్ తెలియజేశారు
పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతూ తొలకరి పరవళ్ళు తొక్కుతూ పొంగిపొర్లుతున్న పోచారం జలాశయం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు పోచారం జలాశయం ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట్ మండల వరప్రదాయిని అయినా పోచారం జలాశయం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోజురోజుకి నీటిమట్టం పెరుగుతూ ప్రాజెక్టు ఎగువన మంచిప్ప గాంధారి లింగంపేట్ గుండారం తదితర ప్రాంతాల్లో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లింగంపేట్ పెద్దవాగు గుండారం భీమేశ్వర వాగులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తూ భారీ వరద నీరు పోచారం జలాశయంలోకి ఉరకలెత్తడంతో ఉదయం 9 గంటల వరకు పోచారం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడుతూ తొలకరి పరవళ్ళు తొక్కుతూ పొంగి పొర్లుతుంది ఈ
వరద నీరు మంజీరా నది ద్వారా నిజాంసాగర్ జలాశయంలోకి వెళ్తుంది ప్రాజెక్టు దిగువన మంజీరా నది పరవాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు పొంగిపొర్లుతున్న వాగులు ప్రాజెక్టుల వద్దకు ప్రజలు వెళ్లకూడదని అధికారులు సూచించారు పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఆయకట్టు రైతులు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయకట్టు కింద వానకాలం సీజన్ మరియు రబీ సీజన్ సాగుకు ఊపిరి పోసినట్టు అయిందని అన్నదాతలు ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయకట్టు కింద సుమారు 10,500 ఎకరాల వరకు పరోక్షంగా మరో 6000 ఎకరాలకు సాగుకు నీరు అందుతుందని నీటిపారుదల శాఖ ఎఈ అక్షయ్ కుమార్ తెలియజేశారు
- ఈరోజు కామారెడ్డి జిల్లా బివిపేట మండలం లో 9 ఫీట్ల నీళ్లు రావడం జరిగింది ఈ చెరువుకు 14 నుండి 16 వరకు నిండితే రైతులకు కరువు అన్నది ఉండదు కావున ఈ చెరువు పైన సంబంధిత అధికారులు ప్రాజెక్టులు కాలువలు బిబిపేట మండల్ కు తేవాలని ప్రభుత్వం కూడా బిబిపేట్ చెరువు 500 పైచిలుకు ఎకరాల ఉన్నందున ఒక్క టీఎంసీ వాటర్ ఉంటే ఏడు గ్రామాలకు కరువు లేకుండా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తూచా తప్పకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడే ఈ చెరువు నింపుతూ 500 విస్తీర్ణం రైతులు బాగుపడతారు కావున ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల తరఫున మాజీ ఎంపీటీసీ కోరి నరసింహులు మాట ముచ్చట మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈరోజు కామారెడ్డి జిల్లా బివిపేట మండలం లో 9 ఫీట్ల నీళ్లు రావడం జరిగింది ఈ చెరువుకు 14 నుండి 16 వరకు నిండితే రైతులకు కరువు అన్నది ఉండదు కావున ఈ చెరువు పైన సంబంధిత అధికారులు ప్రాజెక్టులు కాలువలు బిబిపేట మండల్ కు తేవాలని ప్రభుత్వం కూడా బిబిపేట్ చెరువు 500 పైచిలుకు ఎకరాల ఉన్నందున ఒక్క టీఎంసీ వాటర్ ఉంటే ఏడు గ్రామాలకు కరువు లేకుండా ఉండడం జరుగుతుంది ప్రభుత్వం తూచా తప్పకుండా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇప్పుడే ఈ చెరువు నింపుతూ 500 విస్తీర్ణం రైతులు బాగుపడతారు కావున ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రజల తరఫున మాజీ ఎంపీటీసీ కోరి నరసింహులు మాట ముచ్చట మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది2
- ప్రమాదం తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. ఆటో డ్రైవర్లకు కఠిన హెచ్చరిక రామాయంపేట జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన ఆటో–లారీ ప్రమాదంలో 14 మంది చిన్నారులు గాయపడిన ఘటన నేపథ్యంలో నిజాంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన నిజాంపేట ఎస్ఐ రాజేష్, ఆటోల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని డ్రైవర్లను హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అధిక లోడుతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని వివరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్ఐ రాజేష్ సూచించారు.1
- బ్రిచ్కు అడ్డంగా ఇరికిన చెత్తను తొలగింపు ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు భారీగా వరదరావడంతో కంగ్టి మండల బాన్సువాడ సమీపంలో ఉన్న బ్రిడ్జ్ భారీ వర్షాలు కురవడంతో చెట్లు కొమ్మలు వచ్చి తట్టుకోవడంతో నీళ్లు రోడ్డుపై నుంచి ప్రవహించిందని సర్పంచ్ సౌజన్య మాణిక్ రెడ్డి తెలిపారు. ఆ విషయాన్ని గమనించి జెసిపి ద్వారా చెత్త చెట్టుకొమ్ములను తీసివేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గంగారం,రాజిరెడ్డి,ఉల్బారావు తదితరులు ఉన్నారు.1
- బోధన్లో కౌన్సిలర్ సమీర్కు చెందిన మేకల ఫారం ఘటనపై బోధన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎంఐఎం నిరసన బోధన్లో కౌన్సిలర్ సమీర్కు చెందిన మేకల ఫారంపై జరిగినట్లు ఆరోపిస్తున్న విధ్వంసం, మేకల చోరీ ఘటనపై ఎంఐఎం నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అదృశ్యమైన కొన్ని మేకలు కాంగ్రెస్కు చెందిన ఓ కో-ఆప్షన్ సభ్యుడి నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద లభించాయని కౌన్సిలర్ సమీర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.1
- పటాన్చెరు నుండి సంగారెడ్డి వరకు రోడ్డు విస్తరణ పనులు... దుమ్ములేస్తూ వాహనదాలకు ఇక్కట్లు ఇస్నాపూర్లో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనుల కారణంగా నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. ముఖ్యంగా భారీ వాహనాలు వెళ్లే సమయంలో ఎగిసిపడుతున్న దుమ్ము, దూళితో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి దుమ్ము నివారణకు నీరు చల్లాలని స్థానికులు కోరుతున్నారు.2
- వర్షాకాలంలో డెంగ్యూపై అప్రమత్తంగా ఉండాలి : డాక్టర్ ప్రతిమ చిలిపిచేడ్ మండల కేంద్రంలోని పల్లె దవాఖాన వైద్యురాలు డాక్టర్ ప్రతిమ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉండటంతో ప్రతి కుటుంబం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యవసరమని తెలిపారు. ఇళ్ల వద్ద, వీధుల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని, నీటి తొట్టెలు, డ్రమ్లు, కూలర్లను తరచూ శుభ్రపరచి ఖాళీ చేయాలని సూచించారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించాలని పేర్కొన్నారు. గ్రామస్థులందరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటిస్తే సీజనల్ వ్యాధులను సమర్థంగా నివారించవచ్చని డాక్టర్ ప్రతిమ తెలిపారు.1
- శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- కంది: చాకుతో యువకునిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు...! స్థానికులు మరియు క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం,ఆందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన అంజయ్య (32) ఇంటి వద్ద తన భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందామని కంది ఐఐటి ముందున్న చెరువు వద్దకు మంగళవారం సాయంత్రం రాగా అతనిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చాకులతో దాడి చేశారు.అతని పొట్టపై గాయాలయ్యాయి.వారి నుండి అతను తప్పించుకుని రోడ్డు పైకి రాగా గమనించిన స్థానికులు 108కి సమాచారమివ్వగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న కంది108 సిబ్బంది ఈఎంటి శశిధర్,పైలట్ జగదీష్ లు క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందిస్తూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.4