logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రమాదం తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. ఆటో డ్రైవర్లకు కఠిన హెచ్చరిక రామాయంపేట జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన ఆటో–లారీ ప్రమాదంలో 14 మంది చిన్నారులు గాయపడిన ఘటన నేపథ్యంలో నిజాంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన నిజాంపేట ఎస్ఐ రాజేష్, ఆటోల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని డ్రైవర్లను హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అధిక లోడుతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని వివరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్ఐ రాజేష్ సూచించారు.

9 hrs ago
user_Priya
Priya
నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
9 hrs ago

ప్రమాదం తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. ఆటో డ్రైవర్లకు కఠిన హెచ్చరిక రామాయంపేట జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన ఆటో–లారీ ప్రమాదంలో 14 మంది చిన్నారులు గాయపడిన ఘటన నేపథ్యంలో నిజాంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన నిజాంపేట ఎస్ఐ రాజేష్, ఆటోల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని డ్రైవర్లను హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అధిక లోడుతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని వివరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్ఐ రాజేష్ సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఆర్డీవో ఆకస్మిక తనిఖీ.. ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలని ఆదేశం రామాయంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం మెదక్ ఆర్డీవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన ఆమె ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పనులను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పిస్తూ, ఎలాంటి పొరపాట్లు లేదా ఫిర్యాదులకు తావులేకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
    1
    ఆర్డీవో ఆకస్మిక తనిఖీ.. ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలని ఆదేశం
రామాయంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం మెదక్ ఆర్డీవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించిన ఆమె ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నమోదు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పనులను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పిస్తూ, ఎలాంటి పొరపాట్లు లేదా ఫిర్యాదులకు తావులేకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    9 hrs ago
  • పటాన్చెరు నుండి సంగారెడ్డి వరకు రోడ్డు విస్తరణ పనులు... దుమ్ములేస్తూ వాహనదాలకు ఇక్కట్లు ఇస్నాపూర్‌లో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనుల కారణంగా నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. ముఖ్యంగా భారీ వాహనాలు వెళ్లే సమయంలో ఎగిసిపడుతున్న దుమ్ము, దూళితో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి దుమ్ము నివారణకు నీరు చల్లాలని స్థానికులు కోరుతున్నారు.
    2
    పటాన్చెరు నుండి సంగారెడ్డి వరకు రోడ్డు విస్తరణ పనులు... దుమ్ములేస్తూ వాహనదాలకు ఇక్కట్లు 
ఇస్నాపూర్‌లో రోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పనుల కారణంగా నిత్యం ట్రాఫిక్ రద్దీ నెలకొంటోంది. ముఖ్యంగా భారీ వాహనాలు వెళ్లే సమయంలో ఎగిసిపడుతున్న దుమ్ము, దూళితో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి దుమ్ము నివారణకు నీరు చల్లాలని స్థానికులు కోరుతున్నారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • *అరుదైన గుండె లోపాలతో బాధపడుతున్న 8 నెలల ఆఫ్రికా చిన్నారికి అత్యాధునిక గుండె శస్త్రచికిత్స ద్వారా పునర్జన్మ అందించిన మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైద్యులు*
    1
    *అరుదైన గుండె లోపాలతో బాధపడుతున్న 8 నెలల ఆఫ్రికా చిన్నారికి అత్యాధునిక గుండె శస్త్రచికిత్స ద్వారా పునర్జన్మ అందించిన మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైద్యులు*
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    8 hrs ago
  • ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు: శ్రీ చైతన్య యాజమాన్యానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరిక హైదరాబాద్ నారాయణగూడలోని శ్రీ చైతన్య కళాశాలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. పత్రికల్లో ర్యాంకుల పేరుతో ప్రకటనలు ప్రచురిస్తూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నేరుగా కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలు వెంటనే నిలిపివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
    1
    ర్యాంకుల పేరుతో తల్లిదండ్రులను మోసం చేయొద్దు: శ్రీ చైతన్య యాజమాన్యానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరిక
హైదరాబాద్ నారాయణగూడలోని శ్రీ చైతన్య కళాశాలను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సందర్శించారు. పత్రికల్లో ర్యాంకుల పేరుతో ప్రకటనలు ప్రచురిస్తూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నేరుగా కళాశాలకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. వాస్తవాలను దాచిపెట్టి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తే సహించబోమని హెచ్చరించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రజలను మభ్యపెట్టే చర్యలు వెంటనే నిలిపివేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • కెసిఆర్ సీఎం అయినాకే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి వచ్చింది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యాక ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు 04 ఆగస్ట్ 2016లో నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది.. ఇవ్వాల్టితో పదేళ్లు పూర్తయింది ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు అప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది.. అయినా కూడా ఒప్పందం కుదుర్చుకోలేకపోయారు కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించి ఒప్పందం కుదుర్చుకున్నారు ఈరోజు కన్నెపల్లి దగ్గర నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి NDSAను సాకుగా చూపించి ఎత్తిపోయడం లేదు • మాజీ మంత్రి జీవన్ రెడ్డి
    1
    కెసిఆర్ సీఎం అయినాకే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి వచ్చింది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి 
కేసీఆర్ ముఖ్యమంత్రిగా అయ్యాక ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చాడు
ఎల్లంపల్లి ప్రాజెక్టు 04 ఆగస్ట్ 2016లో నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చింది.. ఇవ్వాల్టితో పదేళ్లు పూర్తయింది
ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు
అప్పుడు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది.. అయినా కూడా ఒప్పందం కుదుర్చుకోలేకపోయారు
కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించి ఒప్పందం కుదుర్చుకున్నారు
ఈరోజు కన్నెపల్లి దగ్గర నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి NDSAను సాకుగా చూపించి ఎత్తిపోయడం లేదు
• మాజీ మంత్రి జీవన్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    4 hrs ago
  • కార్మికులకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ* రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల కోసం బస్ భవన్‌లో గళమెత్తిన *టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* బస్ భవన్,హైదరాబాద్: హైదరాబాద్‌లోని బస్ భవన్‌ను ముట్టడించిన టి.జి.ఎస్.ఆర్.టి.సి విశ్రాంతి ఉద్యోగుల ఆందోళన మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. రిటైర్డ్ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బస్ భవన్‌కు చేరుకోగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరకు మల్లన్నతో పాటు ఐదుగురు రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులకు మాత్రమే అధికారులను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. *2013, 2017,2021 వేతన సవరణ మరియు PF బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్* *ప్రభుత్వానికి తీన్మార్ మల్లన్న డెడ్ లైన్* *వారం రోజుల్లో బెనిఫిట్స్ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక* *అవసరమైతే కార్మికులతో కలిసి అసెంబ్లీ ముట్టడి...* *ఆర్టీసీ ఎన్నికల్లోనూ పోరాటానికి సిద్ధమని మల్లన్న స్పష్టం* *రేవంత్ రెడ్డి చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి* *మహేష్ కుమార్ గౌడ్,పొన్నం సమాధానం చెప్పాలి* * అనంతరం ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై వారిని మల్లన్న నిలదీశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన PF, EPS-95, PF కాంట్రిబ్యూషన్, డీఏ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని మండిపడ్డారు. 2013లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఎంప్లాయర్ వాటా PF ఇప్పటికీ చెల్లించలేదని, 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు 2021 నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాలేదని పేర్కొన్నారు. ఉద్యోగులు జీవితాంతం సంస్థ కోసం కష్టపడితే, రిటైర్మెంట్ తర్వాత వారికి రావాల్సిన కష్టార్జిత సొమ్మును నిలిపివేయడం అమానుషమని అన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై మల్లన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని,సమ్మె సమయంలో కార్మికులకు అండగా ఉన్నట్లు చెప్పుకున్న ప్రభుత్వం,తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఢిల్లీ మాదిరి ఉద్యమం ఈ తెలంగాణలో పుట్టిస్తానని మల్లన్న స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి లాంటి ఒక సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నందు వలన ఆర్టీసీ కార్మికులకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి ముఖ్యమంత్రి మన తెలంగాణకు ఉండడం దురదృష్టకరమని అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే ఆర్టీసీ కార్మికులు రేవంత్ సర్కార్ ను బొందపెడుతుందని హెచ్చరించారు. "17 వేల మంది రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా తీన్మార్ మల్లన్న ఉన్నాడని,వారి హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే బస్ భవన్ ను అర్రాస్ పాట పెట్టి అమ్మైనా సరే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించుకుంటామని ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చూసుకోవాలని స్పష్టం చేశారు. వారం రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేయాలని, లేకుంటే డిల్లీ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేవలం వారం రోజులే రేవంత్ సర్కార్ కు డెడ్ లైన్ అని హెచ్చరించారు. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు. ఆర్టీసీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ "దమ్ముంటే ఎన్నికలకు రండి... నేను ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల తరఫున వస్తా...రేవంత్ తన బొమ్మతో,కాంగ్రెస్ పార్టీ జెండాతో రావాలని... కార్మికులే తీర్పు చెబుతారు" అంటూ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. "కార్మికులను మోసం చేస్తే ప్రభుత్వం, అధికారులు ఇద్దరూ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని,ఆర్టీసీ ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు" అని మల్లన్న హెచ్చరించారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేయడంతో పాటు అసెంబ్లీ ముట్టడి సహా భారీ ఉద్యమాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన నిలుస్తుందని, వారి హక్కుల సాధన కోసం శాసనమండలిలో, ప్రజాక్షేత్రంలోనూ తీన్మార్ మల్లన్నగా పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ ,రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ సాజిద్,గ్రేటర్ హైదరాబాద్ జోన్ BWU గౌరవ అధ్యక్షుడు TVR,తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క,సహాయ కార్యదర్శి గిరిగాని బిక్షపతి గౌడ్,రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
    4
    కార్మికులకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ*

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల హక్కుల కోసం బస్ భవన్‌లో గళమెత్తిన *టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*

బస్ భవన్,హైదరాబాద్:
హైదరాబాద్‌లోని బస్ భవన్‌ను ముట్టడించిన టి.జి.ఎస్.ఆర్.టి.సి విశ్రాంతి ఉద్యోగుల ఆందోళన మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. రిటైర్డ్ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బస్ భవన్‌కు చేరుకోగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చివరకు మల్లన్నతో పాటు ఐదుగురు రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులకు మాత్రమే అధికారులను కలిసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

*2013, 2017,2021 వేతన సవరణ మరియు  PF  బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్*
*ప్రభుత్వానికి తీన్మార్ మల్లన్న డెడ్ లైన్*
*వారం రోజుల్లో బెనిఫిట్స్ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక*
*అవసరమైతే కార్మికులతో కలిసి అసెంబ్లీ ముట్టడి...*
*ఆర్టీసీ ఎన్నికల్లోనూ పోరాటానికి సిద్ధమని మల్లన్న స్పష్టం*
*రేవంత్ రెడ్డి చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి*
*మహేష్ కుమార్ గౌడ్,పొన్నం సమాధానం చెప్పాలి*
*
అనంతరం ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై వారిని మల్లన్న నిలదీశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన PF, EPS-95, PF కాంట్రిబ్యూషన్, డీఏ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంచడం అన్యాయమని మండిపడ్డారు.
2013లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఎంప్లాయర్ వాటా PF ఇప్పటికీ చెల్లించలేదని, 2017 నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు 2021 నుంచి రావాల్సిన బకాయిలు విడుదల కాలేదని పేర్కొన్నారు. ఉద్యోగులు జీవితాంతం సంస్థ కోసం కష్టపడితే, రిటైర్మెంట్ తర్వాత వారికి రావాల్సిన కష్టార్జిత సొమ్మును నిలిపివేయడం అమానుషమని అన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై మల్లన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని,సమ్మె సమయంలో కార్మికులకు అండగా ఉన్నట్లు చెప్పుకున్న ప్రభుత్వం,తర్వాత వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఢిల్లీ మాదిరి ఉద్యమం ఈ తెలంగాణలో పుట్టిస్తానని మల్లన్న స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి లాంటి ఒక సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నందు వలన ఆర్టీసీ కార్మికులకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఇలాంటి ముఖ్యమంత్రి మన తెలంగాణకు ఉండడం దురదృష్టకరమని అన్నారు. రాబోయే  రోజుల్లో ఇదే ఆర్టీసీ కార్మికులు రేవంత్ సర్కార్ ను బొందపెడుతుందని హెచ్చరించారు.
"17 వేల మంది రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు అండగా తీన్మార్ మల్లన్న ఉన్నాడని,వారి హక్కుల కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ చివరి వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే బస్ భవన్ ను అర్రాస్ పాట పెట్టి అమ్మైనా సరే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించుకుంటామని ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చూసుకోవాలని స్పష్టం చేశారు.
వారం రోజుల్లో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ విడుదల చేయాలని, లేకుంటే డిల్లీ తరహాలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కేవలం వారం రోజులే రేవంత్ సర్కార్ కు డెడ్ లైన్ అని  హెచ్చరించారు. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు.
ఆర్టీసీ ఎన్నికల విషయాన్ని ప్రస్తావిస్తూ "దమ్ముంటే ఎన్నికలకు రండి... నేను ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల తరఫున వస్తా...రేవంత్ తన బొమ్మతో,కాంగ్రెస్ పార్టీ జెండాతో రావాలని... కార్మికులే తీర్పు చెబుతారు" అంటూ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు.
"కార్మికులను మోసం చేస్తే ప్రభుత్వం, అధికారులు ఇద్దరూ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని,ఆర్టీసీ ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు" అని మల్లన్న హెచ్చరించారు.
రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేయడంతో పాటు అసెంబ్లీ ముట్టడి సహా భారీ ఉద్యమాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వం వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన నిలుస్తుందని, వారి హక్కుల సాధన కోసం శాసనమండలిలో, ప్రజాక్షేత్రంలోనూ తీన్మార్ మల్లన్నగా  పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్ ,రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ సాజిద్,గ్రేటర్ హైదరాబాద్ జోన్ BWU గౌరవ అధ్యక్షుడు TVR,తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క,సహాయ కార్యదర్శి గిరిగాని బిక్షపతి గౌడ్,రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    5 hrs ago
  • ప్రమాదం తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. ఆటో డ్రైవర్లకు కఠిన హెచ్చరిక రామాయంపేట జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన ఆటో–లారీ ప్రమాదంలో 14 మంది చిన్నారులు గాయపడిన ఘటన నేపథ్యంలో నిజాంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన నిజాంపేట ఎస్ఐ రాజేష్, ఆటోల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని డ్రైవర్లను హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అధిక లోడుతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని వివరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్ఐ రాజేష్ సూచించారు.
    1
    ప్రమాదం తర్వాత అప్రమత్తమైన పోలీసులు.. ఆటో డ్రైవర్లకు కఠిన హెచ్చరిక
రామాయంపేట జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన ఆటో–లారీ ప్రమాదంలో 14 మంది చిన్నారులు గాయపడిన ఘటన నేపథ్యంలో నిజాంపేట పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన నిజాంపేట ఎస్ఐ రాజేష్, ఆటోల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని డ్రైవర్లను హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అధిక లోడుతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని వివరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్ఐ రాజేష్ సూచించారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    9 hrs ago
  • కంది: చాకుతో యువకునిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు...! స్థానికులు మరియు క్షతగాత్రుడు తెలిపిన వివరాల ప్రకారం,ఆందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన అంజయ్య (32) ఇంటి వద్ద తన భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందామని కంది ఐఐటి ముందున్న చెరువు వద్దకు మంగళవారం సాయంత్రం రాగా అతనిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చాకులతో దాడి చేశారు.అతని పొట్టపై గాయాలయ్యాయి.వారి నుండి అతను తప్పించుకుని రోడ్డు పైకి రాగా గమనించిన స్థానికులు 108కి సమాచారమివ్వగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న కంది108 సిబ్బంది ఈఎంటి శశిధర్,పైలట్ జగదీష్ లు క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందిస్తూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    4
    కంది: చాకుతో యువకునిపై దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు...!

స్థానికులు మరియు క్షతగాత్రుడు తెలిపిన  వివరాల ప్రకారం,ఆందోల్ మండలం కోడెకల్ గ్రామానికి చెందిన అంజయ్య (32) ఇంటి వద్ద తన భార్యతో గొడవపడి ఆత్మహత్య చేసుకుందామని కంది ఐఐటి ముందున్న చెరువు వద్దకు మంగళవారం సాయంత్రం రాగా అతనిపై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చాకులతో దాడి చేశారు.అతని పొట్టపై గాయాలయ్యాయి.వారి నుండి అతను తప్పించుకుని రోడ్డు పైకి రాగా గమనించిన స్థానికులు 108కి సమాచారమివ్వగా హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న కంది108 సిబ్బంది ఈఎంటి శశిధర్,పైలట్ జగదీష్ లు క్షతగాత్రునికి ప్రధమ చికిత్స అందిస్తూ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
    user_SRIRAMULA KIRANKUMAR
    SRIRAMULA KIRANKUMAR
    Public Health Department Sangareddy, Telangana•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.