ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పెండింగ్ జీతాలు ఇవ్వాలి కార్మికులకు రెండు జట్ల యూనిఫాం, ఐడి కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ మరియు ప్లంబర్ కార్మికుల పెండింగ్ వేతనం ఇవ్వాలని, కార్మికునికి రెండు జతల యూనిఫాం, ఐడి కార్డు ఇవ్వాలని కోరుతు విజ్ఞప్తి ఆసుపత్రి ముందు ధర్నా చేసి సూపరిటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న 250 మంది కార్మికులకి ప్రతినెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని అనేక సార్లు ఏజిల్ సంస్థ యజమాన్యానికి, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరిటెండెంట్ గారికి అనేకసార్లు విన్నవించడం జరిగిందని అయిన కూడా బడ్జెట్ ఉండి కూడా కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని విమర్శించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న వేతనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గత 4 సంవత్సరాల క్రితం యూనిఫాం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ యూనిఫాం అక్కడిక్కడే చినిగిపోయింది.వేసుకోవడానికి కూడా వీలులేకుండ ఉన్నదను అన్నారు. అనేక సార్లు ఏజిల్ sanstha దృష్టికి తీసుకెళ్లిన ఇవ్వడం లేదని విమర్శించారు. కార్మికులకు రెండు జతల యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి. కార్మికులకు చెల్లించే జీతాలు ఏజిల్ సంస్థ ద్వారా కాకుండా నేరుగా ప్రభుత్వమే కార్మికుల అకౌంట్లో జమ చేయాలని కోరారు.మహిళా కార్మికులకు వేతనముతో కూడిన ప్రసూతి వేతనం ఇవ్వాలి.కార్మికులకు ఇఎస్ఐ హెల్త్ కార్డులు ఇవ్వాలి. కార్మికులకు కనీస వేతనం రూ.26,000/- లు ఇవ్వాలి. పై సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పెండింగ్ జీతాలు ఇవ్వాలి కార్మికులకు రెండు జట్ల యూనిఫాం, ఐడి కార్డులు ఇవ్వాలి. ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ మరియు ప్లంబర్ కార్మికుల పెండింగ్ వేతనం ఇవ్వాలని, కార్మికునికి రెండు జతల యూనిఫాం, ఐడి కార్డు ఇవ్వాలని కోరుతు విజ్ఞప్తి ఆసుపత్రి ముందు ధర్నా చేసి సూపరిటెండెంట్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న 250 మంది కార్మికులకి ప్రతినెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని అనేక సార్లు ఏజిల్ సంస్థ యజమాన్యానికి, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరిటెండెంట్ గారికి అనేకసార్లు విన్నవించడం జరిగిందని అయిన కూడా బడ్జెట్ ఉండి కూడా కార్మికులకు జీతాలు
ఇవ్వడం లేదని విమర్శించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న వేతనం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు గత 4 సంవత్సరాల క్రితం యూనిఫాం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ యూనిఫాం అక్కడిక్కడే చినిగిపోయింది.వేసుకోవడానికి కూడా వీలులేకుండ ఉన్నదను అన్నారు. అనేక సార్లు ఏజిల్ sanstha దృష్టికి తీసుకెళ్లిన ఇవ్వడం లేదని విమర్శించారు. కార్మికులకు రెండు జతల యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి. కార్మికులకు చెల్లించే జీతాలు ఏజిల్ సంస్థ ద్వారా కాకుండా నేరుగా ప్రభుత్వమే కార్మికుల అకౌంట్లో జమ చేయాలని కోరారు.మహిళా కార్మికులకు వేతనముతో కూడిన ప్రసూతి వేతనం ఇవ్వాలి.కార్మికులకు ఇఎస్ఐ హెల్త్ కార్డులు ఇవ్వాలి. కార్మికులకు కనీస వేతనం రూ.26,000/- లు ఇవ్వాలి. పై సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
- కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడుగా ముమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో సంక్షేమ సంఘానికి ప్రతినిత్యం తనవంతు పోరాటాన్ని సాగిస్తానని ఆటో డ్రైవర్లకి ఏ కష్టమొచ్చినా నేను ముందుండి నడిపిస్తానని తెలిపారు1
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.1
- బీఆర్ఎస్ వర్గపోరు మొదలైందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటో కేసిఆర్ స్పష్టం చేశారన్నారు. మీడియాకు వీడియో రిలీజ్ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సభలో కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావు డీల్లీ టూర్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దూరమైన కుటుంబ సభ్యురాలు కవిత, పార్టీని తిట్టాలని పెట్టుకున్న బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ , కేటీఆర్ ల కుటీల మనస్తత్వంతో హరీష్ రావు బిజేపి నేతల టచ్ లోకి వెళ్ళాడని తెలిపారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2
- జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో, దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది1
- raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel1
- జనగాం జిల్లా:పాలకుర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్ను పరిశీలించిన రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- మానవత్వ వాదిగా,హేతు వాదిగా,అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప వ్యక్తి మలయశ్రీ. సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సాహిత్య రంగంలో అనేక స్వీయ అనుభవం,కవితా,రచనలపై ఆయనకున్న పట్టుదల ఎంతో శ్లాఘనీయమైనదని,సాహిత్య రంగంలో డాక్టర్ మలయశ్రీ పాత్ర మరువలేనిదని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రేకుర్తి వాస్తవ్యులు ప్రముఖ కవి, రచయిత డాక్టర్ మలయశ్రీ ఇటీవల మృతి చెందడంతో సోమవారం కరీంనగర్ లోని ఆయన నివాసానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మలయశ్రీ చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ వామపక్ష,అభ్యుదయ వాదిగా,కవితా రచనల పట్ల ఆసక్తితో అందులో అనేక మెళకువలు నేర్చుకొని,మానవాలి ఎదుర్కొంటున్న సమస్యలు,సవాళ్లును అవగాహన చేసుకొని,వాటిని అధ్యయనం చేసి ఎన్నో రచనలు చేసి పుస్తకాల రూపంలో ప్రజలకు అందించిన రచయిత అని,కులాల,మతాల,మానవత్వానికి సంబంధించిన అంతర్లీన అంశాలపై ఎన్నో ,ఎన్నెన్నో కవితలు,సామెతలు వ్రాసారని,మానవతా వాదిగా దోపిడీ రహిత పరిపాలన కొనసాగాలని,అంతరాలు లేని సమాజం కావాలని కోరుకునే వారని, 30 ఏళ్ల క్రితం తాను చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులుగా, సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో మలయశ్రీ రచించిన సామెతలు - హేతువాదం అనే పుస్తకాన్ని నాకు అంకితం చేయడం అత్యంత గొప్ప అవకాశంగా భావిస్తున్నానని,డాక్టర్ మలయశ్రీ కవిగా,రచయితగా,హేతువాదిగా,వామపక్ష అభ్యుదయ వాదిగా నీతి,నిజాయితీగా ఎంతో ఉన్నతమైన విలువలతో కూడా జీవితాన్ని గడిపారని, సాహిత్య రంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేందుకు నావంతుగా కృషి చేస్తానని, ఎల్ ఎం డి లో కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మేధో వికలాంగుల పాఠశాలలో మలయశ్రీ రచనలపై ఓ కార్యక్రమం నిర్వహిస్తామని,అలాంటి మహనీయుని జీవిత లక్ష్యాలను నెరవేర్చేందుకు నేటి తరం వారు ముందుకు రావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.1