Shuru
Apke Nagar Ki App…
మహానంది పుణ్యక్షేత్రంలో ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమము ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమమును శ్రీ కామేశ్వరీ అమ్మవారకి ఈరోజు వందలాదిమంది భక్తులతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ వారు వ్యవస్థొపకులు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గరుడనంది నుంచి శోభాయాత్రను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాడవీధులగుండా సంకీర్తనలు,కోలాటాలు, భజనలతో కోలాహలంగా నిర్వహించి అనంతరం శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామివార్లకు పట్టువస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. నంద్యాల జిల్లా నిర్వాహకులు శివమ్మ,లీలావతమ్మ,లు పర్యవేక్షించారు. సామూహిక లలితా సహస్రనామ పారాయణ, శివనామ పూజలు నిర్వహించారు.
Naga kanth
మహానంది పుణ్యక్షేత్రంలో ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమము ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమమును శ్రీ కామేశ్వరీ అమ్మవారకి ఈరోజు వందలాదిమంది భక్తులతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ వారు వ్యవస్థొపకులు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గరుడనంది నుంచి శోభాయాత్రను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాడవీధులగుండా సంకీర్తనలు,కోలాటాలు, భజనలతో కోలాహలంగా నిర్వహించి అనంతరం శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామివార్లకు పట్టువస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. నంద్యాల జిల్లా నిర్వాహకులు శివమ్మ,లీలావతమ్మ,లు పర్యవేక్షించారు. సామూహిక లలితా సహస్రనామ పారాయణ, శివనామ పూజలు నిర్వహించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మహానంది పుణ్యక్షేత్రంలో ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమము ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమమును శ్రీ కామేశ్వరీ అమ్మవారకి ఈరోజు వందలాదిమంది భక్తులతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ వారు వ్యవస్థొపకులు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గరుడనంది నుంచి శోభాయాత్రను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాడవీధులగుండా సంకీర్తనలు,కోలాటాలు, భజనలతో కోలాహలంగా నిర్వహించి అనంతరం శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామివార్లకు పట్టువస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. నంద్యాల జిల్లా నిర్వాహకులు శివమ్మ,లీలావతమ్మ,లు పర్యవేక్షించారు. సామూహిక లలితా సహస్రనామ పారాయణ, శివనామ పూజలు నిర్వహించారు.3
- మహానంది క్షేత్రం లో ఘనంగా ఆషాఢ మాసపు చీరె సారె వేడుకలు మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరీ అమ్మవారికి ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. గరుడనంది నుంచి ప్రారంభమైన శోభాయాత్రను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్. శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మాడవీధుల గుండా సంకీర్తనలు, కోలాటాలు, భజనలతో సాగిన శోభాయాత్ర అనంతరం శ్రీ కామేశ్వరీ అమ్మవారు, మహానందీశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా నిర్వాహకులు శివమ్మ, లీలావతమ్మ పర్యవేక్షణలో సామూహిక లలితా సహస్రనామ పారాయణం, శివనామ పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.1
- రోడ్డును పగలగొట్టి తవ్వడానికి ప్రైవేట్ కేబుల్ వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్ వెల్లడి.. (కోడుమూరు సూర్ న్యూస్ ప్రతినిధి) పట్టణంలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన కేబుల్ ఉద్యోగులు దగ్గరుండి వారి పని కొరకు తారు రోడ్డు ఇష్టం వచ్చినట్టు యంత్రాలతో పగలగొట్టడంతో భూమిలో ఉన్న గ్రామపంచాయతీ అందించే మంచి నీటి పైపులు పగలడంతో ప్రజలకు ఒకవైపు పగిలిన పైపుల నుంచి ఎర్రమట్టి నీరు అందుతున్నాయి. మరోవైపు గుంతలు పడి అలానే వదిలేసి వెళుతున్నారు. గుంతలు త్రవ్వడంతో చాలా జనం రాత్రిపూట కాలినడక వెళ్లే బాటసారులు అందులో పడి గాయాల పాలు అవుతున్నారు.ఈ విషయంపై స్థానిక సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్.సహాయ కార్యదర్శి ధూళ భాస్కర్ సంబంధిత కేబుల్ అధికారులను, గ్రామపంచాయతీ అధికారులను ఎంపీడీవోను మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉద్యమం చేసి తారు రోడ్డును కోడుమూరు పట్టణంకు వేయించుకున్నాం. ఇలాంటి తారు రోడ్డును ప్రైవేట్ కేబుల్ వారు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డును పగలగొట్టి గుంతలు పడేసి మంచినీటి పైపులను పగలగొట్టి అలానే వదిలి పెట్టి వెళ్తే ఎలా అంటూ వారు ప్రశ్నించారు. పగిలిన నీటి పైపులను మరమ్మతులు చేయించాలి. గుంతలను పూడ్చాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు వాట్సాప్ ద్వారా సందేశాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు.1
- శ్రీశైలం జలాశయం కు కొనసాగుతున్న వరద ప్రవాహం.. సంగమేశ్వరంను చుట్టుముట్టిన వరద జలాలు శ్రీశైలం జలాశయం కు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. ఆదివారం ఆరు గంటల సమయానికి జూరాల జలాశయం నుంచి శ్రీశైలం జలాశయం కు ఇన్ ఫ్లో 1,74,711 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00. అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 846.10. అడుగులు చేరింది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, జలాశయ ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 72. 1974 టీఎంసీలుగా నమోదయినట్లు అధికారులు తెలిపారు.1
- రాయలసీమలో పంటలను కాపాడాలి: సీపీఐ యం ఎల్ నేత వెంకటేశ్వర్లు శ్రీశైలం రిజర్వాయర్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటిమట్టం ప్రస్తుతం 850 అడుగులు ఉందని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ నేత వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మల్యాల హంద్రీనీవా, ముచ్చుమరి ఎత్తిపోతల పథకానికి నీరు విడుదల చేసి రాయలసీమ రైతుల పంటలను కాపాడాలని కోరారు. ఇప్పటికే ఖరీఫ్లో సాగుచేసిన పంటలు ఎండిపోయాయన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే చర్యలు తీసుకొని నీటిని విడుదల చేయాలని కోరారు.1