logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నర్సంపేట పట్టణంలో యువ డాక్టర్ శశిధర్ రెడ్డి అనుమానస్పద మృతి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శశిధర్ రెడ్డి మృతి స్థానికంగా విషాదం నింపింది. పట్టణంలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న శశిధర్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు . అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెంది ఉండొచ్చని తోటి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువ వైద్యుడి అకాల మరణ వార్త తోటి సిబ్బంది, స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించాయి.

23 hrs ago
user_Srinivas goud Reporter
Srinivas goud Reporter
నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
23 hrs ago
d14b4718-7498-4105-91d6-1ef211fbc349

నర్సంపేట పట్టణంలో యువ డాక్టర్ శశిధర్ రెడ్డి అనుమానస్పద మృతి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శశిధర్ రెడ్డి మృతి స్థానికంగా విషాదం నింపింది. పట్టణంలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న శశిధర్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు . అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెంది ఉండొచ్చని తోటి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువ వైద్యుడి అకాల మరణ వార్త తోటి సిబ్బంది, స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించాయి.

More news from తెలంగాణ and nearby areas
  • నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహుజనులకు రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షత వహించగా బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
    2
    నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ ముంజాల రాజేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహుజనులకు రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షత వహించగా బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శశిధర్ రెడ్డి మృతి స్థానికంగా విషాదం నింపింది. పట్టణంలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న శశిధర్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు . అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెంది ఉండొచ్చని తోటి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువ వైద్యుడి అకాల మరణ వార్త తోటి సిబ్బంది, స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించాయి.
    2
    వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శశిధర్ రెడ్డి మృతి స్థానికంగా విషాదం నింపింది. పట్టణంలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న శశిధర్ రెడ్డి ఆదివారం తెల్లవారుజామున  అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు . అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే ఆయన మృతి చెంది ఉండొచ్చని తోటి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. యువ వైద్యుడి అకాల మరణ వార్త తోటి సిబ్బంది, స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించాయి.
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో రైతు వేదికలో గీసుగొండ, సంగెం మండలాల రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యాంత్రీకరణ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.
    1
    వరంగల్ జిల్లా సంగెం మండల కేంద్రంలో  రైతు వేదికలో గీసుగొండ, సంగెం మండలాల రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యాంత్రీకరణ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతిపాక, మంగలి కాలనీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
    1
    మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతిపాక, మంగలి కాలనీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
    1
    తెలంగాణ  రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వడగండ్ల వానలు పడుతున్నాయి. పంటలు దెబ్బతింటుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాముల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని క్లాసులకు అనుమతించడంతో ఆందోళన సద్దుమణిగింది.
    1
    జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ ప్రైవేట్ స్కూల్లో హనుమాన్ స్వాముల ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.
హనుమాన్ దీక్ష తీసుకున్న ఐదుగురు విద్యార్థులను పాఠశాలలోపలికి అనుమతించడం లేదని హనుమాన్ దీక్ష స్వాములు ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు బైఠాయించి యాజమాన్య తీరును నిరసిస్తూ ధర్నా చేశారు. ఆందోళన దిగిన స్వాములతో పాఠశాల యాజమాన్యం సంప్రదింపులు జరిపి దీక్ష తీసుకున్న స్వామి విద్యార్థులను ఇబ్బంది లేకుండా చూస్తామని  క్లాసులకు అనుమతించడంతో  ఆందోళన సద్దుమణిగింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా జరిగింది.. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. పట్టు వస్త్రాలు. తలంబ్రాలను. స్వామివారికి సమర్పించారు. కళ్యాణం ఆధ్యాంతం గుట్టపై కళ్యాణ వేదికపై ఉండి కళ్యాణాన్ని మంత్రులు తిలకించారు ..... ఇన్నేళ్ల దేవస్థాన కళ్యాణ మహోత్సవాల్లో రాష్ట్ర మంత్రులు రావడం ఇదే మొదటిసారి.. శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. భక్తులు. రాష్ట్ర మంత్రులు దేవస్థానం ముఖ ద్వారం నుంచి గుట్ట పైకి వేసిన 1650 మెట్లు ఎక్కి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులకు భక్త సమాజ కమిటీ. సేవా ట్రస్ట్. మెడికల్ అసోసియేషన్. తగు సౌకర్యాలను కల్పించారు.... గుట్టపై భోజన వసతులను భక్తులకు ఏర్పాటు చేశారు. గుట్ట పైకి ఎక్కి దిగే భక్తులకు మంచినీటి సౌకర్యం. ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందజేయడం ఎంతో ఉపశమనం కలిగించింది.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్. నలుగురు సిఐలు. పదిమంది ఎస్ఐలు. బందోబస్తు నిర్వహించారు...
    4
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. కొత్తగూడెం కార్పొరేషన్ పాల్వంచ డివిజన్లో శ్రీనివాస్ గిరి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవోపేతంగా  జరిగింది..
ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు. రెవిన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి  సతీ సమేతంగా హాజరయ్యారు. పట్టు వస్త్రాలు. తలంబ్రాలను. స్వామివారికి  సమర్పించారు. కళ్యాణం ఆధ్యాంతం గుట్టపై  కళ్యాణ వేదికపై ఉండి  కళ్యాణాన్ని  మంత్రులు తిలకించారు .....
ఇన్నేళ్ల దేవస్థాన  కళ్యాణ మహోత్సవాల్లో  రాష్ట్ర మంత్రులు రావడం ఇదే మొదటిసారి.. శ్రీనివాస్ గిరి  వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ఉమ్మడి జిల్లాతో పాటు  ఇతర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. భక్తులు. రాష్ట్ర మంత్రులు    దేవస్థానం ముఖ ద్వారం నుంచి  గుట్ట పైకి  వేసిన 1650 మెట్లు ఎక్కి కళ్యాణాన్ని వీక్షించారు. భక్తులకు భక్త సమాజ కమిటీ. సేవా ట్రస్ట్. మెడికల్ అసోసియేషన్. తగు సౌకర్యాలను కల్పించారు....
గుట్టపై భోజన వసతులను భక్తులకు ఏర్పాటు చేశారు. గుట్ట పైకి  ఎక్కి దిగే భక్తులకు మంచినీటి  సౌకర్యం.  ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందజేయడం
ఎంతో ఉపశమనం  కలిగించింది.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్. నలుగురు సిఐలు. పదిమంది ఎస్ఐలు. బందోబస్తు నిర్వహించారు...
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    15 hrs ago
  • నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో–కన్వీనర్ రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో–కన్వీనర్, మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ అవార్డు గ్రహీత ముంజాల రాజేందర్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముంజాల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ, బహుజన సమాజానికి రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని మన్యవర్ కాన్షిరాం తన జీవితాన్ని బహుజన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని పేర్కొన్నారు. మండల్ కమిషన్ అమలుకు ఆయన చేసిన పోరాటం ఫలితంగా 1990లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని తెలిపారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ బహుజనులకు రాజకీయ అధికారం వచ్చినప్పుడే సమాజంలోని అసమానతలు తొలగుతాయని కాన్షిరాం ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బహుజన సమాజ అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో బహుజన ఐక్యతతో ముందుకు సాగి రాజకీయ అధికారాన్ని సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
    2
    నర్సంపేట నియోజకవర్గంలోని జ్యోతిబసు నగర్ కాలనీలో ఆదివారం బహుజన పితామహుడు మన్యవర్ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో–కన్వీనర్ రామగిరి యాదగిరి స్వామి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ రాష్ట్ర కో–కన్వీనర్, మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ అవార్డు గ్రహీత ముంజాల రాజేందర్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముంజాల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ, బహుజన సమాజానికి రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారమని మన్యవర్ కాన్షిరాం తన జీవితాన్ని బహుజన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని పేర్కొన్నారు. మండల్ కమిషన్ అమలుకు ఆయన చేసిన పోరాటం ఫలితంగా 1990లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు సాధ్యమయ్యాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా పర్యటిస్తూ బహుజనులకు రాజకీయ అధికారం వచ్చినప్పుడే సమాజంలోని అసమానతలు తొలగుతాయని కాన్షిరాం ప్రజలకు అవగాహన కల్పించారని అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ బహుజన సమాజ అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజాలు ఐక్యంగా పనిచేసి బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. 2029 ఎన్నికల్లో బహుజన ఐక్యతతో ముందుకు సాగి రాజకీయ అధికారాన్ని సాధించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బెజ్జం రాజేష్, పిట్టల యాకయ్య, మేడిద కొమురయ్య, ఊర్సు సరోజన, మేడిద ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.