Shuru
Apke Nagar Ki App…
నక్సలైట్ భావజాలం బతికే ఉంటుంది.. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. నక్సలైట్ భావజాలం బతికే ఉంటుంది: ఎమ్మెల్యే కూనంనేని దేశంలో నక్సలైట్లు లేరని సంబరపడుతున్న ప్రధాని మోదీ.. నక్సలైట్ భావజాలం మాత్రం బతికే ఉంటుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సుజాతనగర్ చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన దృక్పథం కమ్యూనిస్టులకు ఉందన్నారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు.
తేజవత్ గిరిబాబు
నక్సలైట్ భావజాలం బతికే ఉంటుంది.. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. నక్సలైట్ భావజాలం బతికే ఉంటుంది: ఎమ్మెల్యే కూనంనేని దేశంలో నక్సలైట్లు లేరని సంబరపడుతున్న ప్రధాని మోదీ.. నక్సలైట్ భావజాలం మాత్రం బతికే ఉంటుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సుజాతనగర్ చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన దృక్పథం కమ్యూనిస్టులకు ఉందన్నారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- మధిర మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలి:బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.1
- ఖమ్మం నగరంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల బస్సుల్లో విద్యార్థుల తరలింపుపై తీవ్ర వివాదం నెలకొంది. పరిమితికి మించి ఒకే బస్సులో భారీ సంఖ్యలో విద్యార్థులను తరలిస్తున్నారంటూ యుఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. బస్సును అడ్డుకుని విద్యా సంస్థ యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. విద్యార్థుల నుంచి భారీగా బస్సు ఫీజులు వసూలు చేస్తూ కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని యుఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. సీటింగ్ సామర్థ్యానికి మించి సుమారు 100 మందికి పైగా విద్యార్థులను ఒకే బస్సులో తరలించడం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు. ఇదే సమయంలో యుఎస్ఎఫ్ఐ చేసిన నిరసన, ఫిర్యాదుపై రవాణా శాఖ అధికారులు స్పందించారు. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నట్లు గుర్తించిన శ్రీ చైతన్య విద్యా సంస్థకు చెందిన బస్సును అక్కడికక్కడే సీజ్ చేశారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల బస్సుల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలను సమగ్రంగా తనిఖీ చేయాలని యుఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.4
- రత్నవరంలో బోనాల సందడి.................................... సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామంలోని హరిహర క్షేత్రంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు ఘనంగా బోనాలు సమర్పించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆటపాటలతో సందడి చేశారు. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మహిళల బోనాల సమర్పణతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో కళకళలాడాయి.1
- సండ్రా ఫైబర్ కేటుగాడు పిడమర్తి రవి సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం మీ అందరికీ ముందు నుంచే నేను హెచ్చరిస్తున్న సండ్ర వెంకట వీరయ్య సైబర్ నేరగాడు సైబర్ కేటు గాడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న యువకులను జమ చేసుకొని వాళ్ళ ద్వారా ఆస్ట్రేలియాలో ఒక కంపెనీ పెట్టి ఆ సైబర్ కంపెనీ ద్వారా 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు సత్తుపల్లి నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచి చేసిన గొప్ప పని ఇది. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మద్యం మాఫియా దొంగ నోట్ల ముద్రణ జూదం బెట్టింగ్ అన్ని మాఫియాల వెనుక సండ్ర వెంకట వీర ఉన్నాడు ఆయన పని డబ్బు సంపాదనని ఆయన సత్తుపల్లికి అభివృద్ధి ఆయననే అభివృద్ధి చెందింది ఇటువంటి లోఫర్ పనులు చేసుకుంటా ఈ ప్రాంత యువకులైనటువంటి పట్టాభి ప్రవీణ్ లు కాదు ముందుగా సండ్రా వెంకట వీరిని అరెస్ట్ చేయాలి ఆస్ట్రేలియా ఉంటున్న తన కొడుకుని అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకురావాలి పోలీసులు ప్రభుత్వము సండ్ర వెంకటవీరని అరెస్టు చేస్తే మొత్తం నిజ నిజాలు బయటపడతాయి ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సత్తుపల్లి నియోజకవర్గం ముఖం చాట్ చేసిన వీరయ్య నిజంగా సత్తుపల్లి మీద నిజంగా అతని మీద వస్తున్న నేపథ్యంలో సత్తుపల్లి కి రాకుండా కీరవాణి సంభాషణలు జరుపుతున్నాడు1
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ లో సీలింగ్ పెచ్చులు ఊడిపడి ఏఎస్ఐ కి గాయాలు మరిపెడ పోలీస్ స్టేషన్లో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. పాత పోలీస్ స్టేషన్ భవనం శిథిలావస్థకు చేరడంతో, సీలింగ్ పెచ్చులు ఊడిపడి విధుల్లో ఉన్న ఏఎస్ఐ శ్రీనివాసరావు భుజంపై పడ్డాయి. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. భవనం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరడంతో ఇప్పటికే అన్ని ఆధునిక వసతులు, హంగులతో పక్కనే నూతన పోలీస్ స్టేషన్ను నిర్మించారు. పాత భవనం నుండి కొత్త భవనంలోకి మారే ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. నిజానికి నిన్న 'జైల్ భరో' కార్యక్రమం ఉండటంతో, స్టేషన్లోని కంప్యూటర్ల ముందు పనిచేసే సిబ్బంది అంతా అదనపు భద్రతా విధుల కోసం బయటకు వెళ్లారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ అందరూ లోపలే ఉండి ఉంటే నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అధికారులు భావిస్తున్నారు. ఏఎస్ఐ శ్రీనివాసరావు ఒక్కరే అక్కడ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్త భవనంలోకి పూర్తిస్థాయిలో మారేలోపే ఈ ఘటన జరగడం పట్ల స్థానిక పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.1
- ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విస్తృతంగా పర్యటించి అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం హనుమకొండలో... తలసేమియా, సికిల్ సెల్ వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ మంజూరూ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుతూ హనుమకొండ ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వారు నిర్వహించిన కృతజ్ఞతా సభలో మంత్రి పొంగులేటి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని, చిన్నారులకు పెన్షన్ కు సంబంధించిన హెల్ప్ డెస్క్ ను ప్రారంభించారు. ఆ తరువాత ఇషా సూపర్ స్పెషాలిటీ & క్రిటికల్ కేర్ ఆసుపత్రికి మంత్రిగారు ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన రైతుమేళా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వరంగల్ పట్టణంలోని శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయం అభివృద్ధి పనులను పరిశీలించి, కాతీయ మ్యూజికల్ గార్డెన్ ప్రారంభించారు. దీంతో పాటు కాజీపేట దర్గా లో ముస్లీం మత పెద్దల సమక్షంలో నిర్వహించిన ఉర్సు వేడుకల్లో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్ గారు, కొండా సురేఖ గారితో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పాల్లొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ సారయ్య గారు, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి గారు, కే. ఎల్. నాగరాజు గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ఆయా శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, మైనార్టీ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.1
- నక్సలైట్ భావజాలం బతికే ఉంటుంది.. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. నక్సలైట్ భావజాలం బతికే ఉంటుంది: ఎమ్మెల్యే కూనంనేని దేశంలో నక్సలైట్లు లేరని సంబరపడుతున్న ప్రధాని మోదీ.. నక్సలైట్ భావజాలం మాత్రం బతికే ఉంటుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సుజాతనగర్ చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై స్పష్టమైన దృక్పథం కమ్యూనిస్టులకు ఉందన్నారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలని కోరారు.1