logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గంగపూర్ జాతర ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా ఎస్పీ. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : లో రాబోయే గంగపూర్ జాతరను శాంతియుతంగా, సక్రమంగా నిర్వహించేందుకు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నితికా పంత్, గంగపూర్ బుధవారం రోజున ఆలయాన్ని సందర్శించి జాతర ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆలయ పరిసరాల్లో తీసుకోవాల్సిన పోలీస్ బందోబస్తు, రద్దీ నియంత్రణ చర్యలు, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయంపై సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. జాతర సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, రెబ్బన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ పాల్గొన్నారు.

1 day ago
user_Banka Srinivas
Banka Srinivas
Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
1 day ago
323b4a77-a684-46d2-b746-80fa7a99b679

గంగపూర్ జాతర ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా ఎస్పీ. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : లో రాబోయే గంగపూర్ జాతరను శాంతియుతంగా, సక్రమంగా నిర్వహించేందుకు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ నితికా పంత్, గంగపూర్ బుధవారం రోజున ఆలయాన్ని సందర్శించి జాతర ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఆలయ పరిసరాల్లో తీసుకోవాల్సిన పోలీస్ బందోబస్తు, రద్దీ నియంత్రణ చర్యలు, ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయంపై సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. జాతర సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, రెబ్బన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణ పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం.
ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
    user_Banka Srinivas
    Banka Srinivas
    Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • भाग्यनगर ट्रेन की यह हालत है। कल रात हैदराबाद से कागजनगर आई ट्रेन जैसे आई थी वैसे ही चलती रहेगी। पूरी ट्रेन बदबू से भरी पड़ी है क्योंकि उसकी सफाई भी नहीं हुई है।
    1
    भाग्यनगर ट्रेन की यह हालत है। कल रात हैदराबाद से कागजनगर आई ट्रेन जैसे आई थी वैसे ही चलती रहेगी। पूरी ट्रेन बदबू से भरी पड़ी है क्योंकि उसकी सफाई भी नहीं हुई है।
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    Journalist ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • యువత క్రీడలలో రాణించాలి యువత క్రీడలలో రాణించాలని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రభుత్వ అధికారులు, నాయకులు, విద్యార్థులు టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం సీఎం ట్రోఫీ క్రీడా పోటీలను నిర్వహిస్తారన్నారు.
    1
    యువత క్రీడలలో రాణించాలి
యువత క్రీడలలో రాణించాలని జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రభుత్వ అధికారులు, నాయకులు, విద్యార్థులు టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం సీఎం ట్రోఫీ క్రీడా పోటీలను  నిర్వహిస్తారన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హెచ్ఎంటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు
    1
    పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హెచ్ఎంటీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ 
కోయ శ్రీహర్ష చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్  శుభాకాంక్షలు తెలియజేశారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    6 hrs ago
  • నాను మహారాజ్
    1
    నాను మహారాజ్
    user_Nirmal KR NEWS 369
    Nirmal KR NEWS 369
    Reporter Nirmal U, Telangana•
    2 hrs ago
  • హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల పేకాట రాయుళ్లను పట్టుకున్న కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాలు, సెల్‌ఫోన్లు విడుదల చేయడానికి ఎస్‌ఐ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో వల పన్ని, డ్రైవర్ ద్వారా లంచం మొత్తాన్ని అందుకుంటున్న సమయంలో ఎస్‌ఐని పట్టుకున్నారు.
    1
    హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇటీవల పేకాట రాయుళ్లను పట్టుకున్న కేసులో స్వాధీనం చేసుకున్న వాహనాలు, సెల్‌ఫోన్లు విడుదల చేయడానికి ఎస్‌ఐ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో వల పన్ని, డ్రైవర్ ద్వారా లంచం మొత్తాన్ని అందుకుంటున్న సమయంలో ఎస్‌ఐని పట్టుకున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బెడ్ లేదన్న సిబ్బంది ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎల్లహోడ్ తోటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులకు కనీస బెడ్ సౌకర్యం కల్పించకపోవడంతో పాటు, ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని వైద్య సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా అంబులెన్స్ సౌకర్యం అందించడం లేదని వారు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, వెంటనే చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు అధికారులను వేడుకుంటున్నారు.
    1
    ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బెడ్ లేదన్న సిబ్బంది
ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎల్లహోడ్ తోటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగులకు కనీస బెడ్ సౌకర్యం కల్పించకపోవడంతో పాటు, ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రికి వెళ్లాలని వైద్య సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా అంబులెన్స్ సౌకర్యం అందించడం లేదని వారు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, వెంటనే చర్యలు తీసుకోవాలని రోగి బంధువులు అధికారులను వేడుకుంటున్నారు.
    user_Banka Srinivas
    Banka Srinivas
    Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.