logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్...గాడ్సే వారసులు బిజెపి నాయకులని విమర్శ కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎంను, ఎంఐఎం ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. జాతిపితను అవమానపరిచేలా వ్యవహరిస్తూ గాడ్సేకు వారసులుగా బీజేపీ నాయకులున్నారని విమర్శించారు.‌ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే.. ఏదైనా ఫిర్యాదు ఉంటే శాసనసభ సభాపతికి దృష్టికి తీసుకురావాలని సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాతపూర్వకంగా లేదా తమ పార్టీ సభ్యుల ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. గాంధీ వారసులను గాడ్సే వారసులంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గాంధీకి సంబంధించిన స్మృతి వనం పెడతామంటే విమర్శ చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని తెలిపారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన జాతిపిత గాంధీజీ నీ స్వాతంత్రం వచ్చిన కొద్దిరోజుల్లోనే తుపాకి పెట్టి కాల్చి చంపిన గాడ్సే వారసులు వాళ్ళని ఆరోపించారు. గాడ్సే వారసులుగా విభజించు పాలించు అనే మతతత్వ వాదానికి ప్రతిజ్ఞ చేస్తున్నారని, అన్ని మతాలకు, కులాలకు, ప్రాంతాలకు విద్య వైద్యం వివిధ అంశాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఉంది అంటే నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణ లే నిదర్శనమని తెలిపారు. మోడీ 12 సంవత్సరాల మాటల గారడి తప్ప.. దేశానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం పై బిజెపి ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని విమర్శించారు. సబర్మతి డెవలప్ చేసుకోగా.. మూసి డెవలప్ చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మూసినిర్వాసులకు న్యాయం చేసిన తరువాతనే ముందడుగు వేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బిజెపి బిఆర్ఎస్ లు సహకరించాలని కోరారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్...గాడ్సే వారసులు బిజెపి నాయకులని విమర్శ కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎంను, ఎంఐఎం ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. జాతిపితను అవమానపరిచేలా వ్యవహరిస్తూ గాడ్సేకు వారసులుగా బీజేపీ నాయకులున్నారని విమర్శించారు.‌ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే.. ఏదైనా ఫిర్యాదు ఉంటే శాసనసభ సభాపతికి దృష్టికి తీసుకురావాలని సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాతపూర్వకంగా లేదా తమ పార్టీ సభ్యుల ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. గాంధీ వారసులను గాడ్సే వారసులంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గాంధీకి సంబంధించిన స్మృతి వనం పెడతామంటే విమర్శ చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని తెలిపారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా

స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన జాతిపిత గాంధీజీ నీ స్వాతంత్రం వచ్చిన కొద్దిరోజుల్లోనే తుపాకి పెట్టి కాల్చి చంపిన గాడ్సే వారసులు వాళ్ళని ఆరోపించారు. గాడ్సే వారసులుగా విభజించు పాలించు అనే మతతత్వ వాదానికి ప్రతిజ్ఞ చేస్తున్నారని, అన్ని మతాలకు, కులాలకు, ప్రాంతాలకు విద్య వైద్యం వివిధ అంశాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఉంది అంటే నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణ లే నిదర్శనమని తెలిపారు. మోడీ 12 సంవత్సరాల మాటల గారడి తప్ప.. దేశానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం పై బిజెపి ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని విమర్శించారు. సబర్మతి డెవలప్ చేసుకోగా.. మూసి డెవలప్ చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మూసినిర్వాసులకు న్యాయం చేసిన తరువాతనే ముందడుగు వేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి బిజెపి బిఆర్ఎస్ లు సహకరించాలని కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఉగాది పర్వదినం, తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ఉగాది పండుగ వేళ కరీంనగర్ లోనే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పలు ఆలయాలతో పాటు ముఖ్య ప్రదేశాల్లో పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. కరీంనగర్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో కన్నులపండువలా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సుడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ మంత్రి పొన్నం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలకు చేరాలని భగవంతుని కోరుకున్నట్లు చేప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని, గవర్నర్ ధన్యవాదాలు తీర్మానంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.
    2
    ఉగాది పర్వదినం, తెలుగు నూతన సంవత్సరం పరాభవ నామ సంవత్సర వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. ఉగాది పండుగ వేళ కరీంనగర్ లోనే ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. పలు ఆలయాలతో పాటు ముఖ్య ప్రదేశాల్లో పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. కరీంనగర్ లోని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో కన్నులపండువలా పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సుడ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ మంత్రి పొన్నం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధి వర్షాలతో పాడిపంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలకు చేరాలని భగవంతుని కోరుకున్నట్లు చేప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తుందని, గవర్నర్  ధన్యవాదాలు తీర్మానంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
    2
    జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవో రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు నూతన సంవత్సర పంచాంగాన్ని వివరిస్తూ భవిష్యత్తు ఫలితాలను వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో జామా మసీదులో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్ సాహెబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గొల్లపల్లి బొప్పాపూర్ ఇరు గ్రామంలో ముస్లిం సోదరులకు సుమారు 400 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ హాజరై విందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో రంజాన్ ఒకటి, ఈ పండుగ వేళ మతసామరస్యాన్ని చాటిచెప్పేలా అందరూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు, మనకు ఉన్న దానిలో మరొకరితో పంచుకోవడం అనే సందేశాన్ని రంజాన్ మాసం తెలియజేస్తుంది, నేడు బొప్పాపూర్ గ్రామం "జామా మసీద్"లో గొల్లపల్లి బొప్పాపూర్ ఇరు గ్రామాల ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.
    1
    ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో జామా మసీదులో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షేక్  సాహెబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గొల్లపల్లి బొప్పాపూర్ ఇరు గ్రామంలో ముస్లిం సోదరులకు సుమారు 400 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్  విందుకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ హాజరై విందులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో రంజాన్ ఒకటి, ఈ పండుగ వేళ మతసామరస్యాన్ని చాటిచెప్పేలా అందరూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు, మనకు ఉన్న దానిలో  మరొకరితో  పంచుకోవడం అనే సందేశాన్ని రంజాన్ మాసం తెలియజేస్తుంది, నేడు బొప్పాపూర్ గ్రామం "జామా మసీద్"లో గొల్లపల్లి బొప్పాపూర్ ఇరు గ్రామాల ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 min ago
  • వరంగల్ జిల్లా:పర్వదినాన్ని పురస్కరించుకొని 56వ డివిజన్ పరిధిలో గోపాలపురం Z కన్వెన్షన్ హాల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాసం పూర్తి చేసిన ముస్లిం సోదరులకు కజ్జూర తినిపించారు. ఎమ్మెల్యే నాగరాజు రంజాన్ మాసం మతపరమైన ఆంకితభావానికి, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ముఖ్యమైనదని, మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గోపాలపురం ఊర చెరువు కట్ట మరమత్తులకు 4 కోట్లు మంజూరైనట్లు, నియోజకవర్గంలోని అన్ని మసీదులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత, మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:పర్వదినాన్ని పురస్కరించుకొని 56వ డివిజన్ పరిధిలో గోపాలపురం Z కన్వెన్షన్ హాల్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దావత్-ఏ-ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయబడింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు పాల్గొన్నారు.
సామూహిక నమాజ్ అనంతరం ఉపవాసం పూర్తి చేసిన ముస్లిం సోదరులకు కజ్జూర తినిపించారు. ఎమ్మెల్యే నాగరాజు రంజాన్ మాసం మతపరమైన ఆంకితభావానికి, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడంలో ముఖ్యమైనదని, మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గోపాలపురం ఊర చెరువు కట్ట మరమత్తులకు 4 కోట్లు మంజూరైనట్లు, నియోజకవర్గంలోని అన్ని మసీదులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువత, మైనారిటీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    57 min ago
  • ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వడగళ్ల దాడికి వరి, మిరప తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షం తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పలుచోట్ల చీకట్లు కమ్ముకున్నాయి. పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.
    1
    ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది.
వడగళ్ల దాడికి వరి, మిరప తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక వర్షం తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పలుచోట్ల చీకట్లు కమ్ముకున్నాయి. పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
    1
    తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
    user_కిరణ్ కుమార్ జర్నలిస్ట్
    కిరణ్ కుమార్ జర్నలిస్ట్
    జర్నలిస్ట్ భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    10 hrs ago
  • మెట్‌ పల్లి, మార్చి 19: కోరుట్ల నియోజకవర్గం మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్యను కట్న వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి..దర్యాప్తులో భాగంగా నిందితుడికి సహకరించి బాధితురాలిని కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించినట్లు తెలిసిన చిత్తారి లక్ష్మి (తల్లి), చిత్తారి ఆనంద్ (అన్న), చిత్తారి అశోక్ (అన్న)పై పోలీసులు కేసు నమోదు చేశారు. కట్న వేధింపులు హత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశారు.మెట్‌ పల్లి డిఎస్పీ రాములు ఆదేశాల మేరకు ఎస్సై చిరంజీవి దర్యాప్తు చేపట్టగా, నిందితులను  గురువారం అరెస్ట్ చేసి, సబ్ డివిజన్ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెలువడించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ  వారిని న్యాయస్థానంలో ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు .ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
    2
    మెట్‌ పల్లి, మార్చి 19: కోరుట్ల నియోజకవర్గం మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం వైష్ణవి (20) హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు చిత్తారి హరిబాబు తన భార్యను కట్న వేధింపుల నేపథ్యంలో హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి..దర్యాప్తులో భాగంగా నిందితుడికి సహకరించి బాధితురాలిని కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించినట్లు తెలిసిన చిత్తారి లక్ష్మి (తల్లి), చిత్తారి ఆనంద్ (అన్న), చిత్తారి అశోక్ (అన్న)పై పోలీసులు కేసు నమోదు చేశారు. కట్న వేధింపులు హత్యకు ప్రేరేపించిన ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశారు.మెట్‌ పల్లి డిఎస్పీ రాములు ఆదేశాల మేరకు ఎస్సై చిరంజీవి దర్యాప్తు చేపట్టగా, నిందితులను  గురువారం అరెస్ట్ చేసి, సబ్ డివిజన్ కార్యాలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెలువడించారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ  వారిని న్యాయస్థానంలో ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు .ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
    user_Mahammad Vaseem
    Mahammad Vaseem
    Metpalli, Jagitial•
    2 hrs ago
  • కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఈవోగా అంజనా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఈవో గా బాధ్యతలు స్వీకరించిన అంజనా రెడ్డి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ ధర్మం పంచాంగాన్ని ఆవిష్కరించారు. అధికారులు, సిబ్బంది హాజరై ఉగాది పర్వదినం తెలుగు నూతన సంవత్సర శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈవో తెలిపారు.
    4
    కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ఈవోగా అంజనా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఈవో గా బాధ్యతలు స్వీకరించిన అంజనా రెడ్డి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ ధర్మం పంచాంగాన్ని ఆవిష్కరించారు.
అధికారులు, సిబ్బంది హాజరై ఉగాది పర్వదినం తెలుగు నూతన సంవత్సర శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొండగట్టు దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈవో తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.