వన్యప్రాణులను కాపాడుదాం - భవిష్యత్తును రక్షిద్దాం: MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు డివిజన్, గూడూరు WLM పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ... ప్రకృతి సమతుల్యతలో వన్యప్రాణుల పాత్ర అత్యంత కీలకమని, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యతని MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు పిలుపునిచ్చారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పొల్గొన్నారు,అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మానవ మనుగడ సాధ్యమని, రాబోయే తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి పచ్చని ప్రకృతి అని ఆయన పేర్కొన్నారు. గూడూరు డివిజన్ (WLM) పరిధిలో అడవుల రక్షణకు, వన్యప్రాణుల సంరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. నినాదం: "వన్యప్రాణులను కాపాడుదాం - భవిష్యత్తును రక్షిద్దాం" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. "ప్రకృతి ప్రసాదించిన వన్యప్రాణుల సంపదను ధ్వంసం చేయడం అంటే మన వినాశనాన్ని మనం కోరుకోవడమే. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న అరుదైన జీవజాలాన్ని సంరక్షించుకోవాలి. అటవీ శాఖ అధికారులు, ప్రజలు సమన్వయంతో వేటగాళ్ల నుండి, అగ్నిప్రమాదాల నుండి అడవిని కాపాడుకోవాలి." ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ అటవీ శాఖ అధికారులు, రేంజ్ సిబ్బంది మరియు పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వన్యప్రాణుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని, అడవుల విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
వన్యప్రాణులను కాపాడుదాం - భవిష్యత్తును రక్షిద్దాం: MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు డివిజన్, గూడూరు WLM పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ... ప్రకృతి సమతుల్యతలో వన్యప్రాణుల పాత్ర అత్యంత కీలకమని, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యతని MLC తక్కెళ్లపల్లి రవీందర్ రావు గారు పిలుపునిచ్చారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పొల్గొన్నారు,అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మానవ మనుగడ సాధ్యమని, రాబోయే తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి పచ్చని ప్రకృతి అని ఆయన పేర్కొన్నారు. గూడూరు డివిజన్ (WLM) పరిధిలో అడవుల రక్షణకు, వన్యప్రాణుల సంరక్షణకు అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన అభినందించారు. నినాదం: "వన్యప్రాణులను కాపాడుదాం - భవిష్యత్తును రక్షిద్దాం" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. "ప్రకృతి ప్రసాదించిన వన్యప్రాణుల సంపదను ధ్వంసం చేయడం అంటే మన వినాశనాన్ని మనం కోరుకోవడమే. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న అరుదైన జీవజాలాన్ని సంరక్షించుకోవాలి. అటవీ శాఖ అధికారులు, ప్రజలు సమన్వయంతో వేటగాళ్ల నుండి, అగ్నిప్రమాదాల నుండి అడవిని కాపాడుకోవాలి." ఈ కార్యక్రమంలో గూడూరు డివిజన్ అటవీ శాఖ అధికారులు, రేంజ్ సిబ్బంది మరియు పర్యావరణ ప్రేమికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వన్యప్రాణుల పట్ల ప్రేమను కలిగి ఉండాలని, అడవుల విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
- ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కాల్వపెల్లి గ్రామంలో పోడు భూముల విషయంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. గుంతలు తవ్వేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను, జేసీబీని పోడు రైతులు అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.1
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ (పెద్దమ్మ తల్లి) ఆలయం మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మూతపడింది. భక్తుల కొంగుబంగారంగా వెలసిన ఈ క్షేత్రంలో గ్రహణ నియమాల దృష్ట్యా ప్రత్యేక మార్పులు చేపట్టారు. నేడు తెల్లవారుజామున 5 గంటలకే ఆలయ తలుపులు తెరిచి, అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు కొద్దిసేపు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, గరికతో ఆలయమంతా ప్రోక్షణ చేశారు. ఉదయం 7:30 గంటలకు ఆలయ అర్చకులు, పాలకమండలి చైర్మన్ సమక్షంలో ఆలయ ద్వారబంధనం(తలుపులు మూసివేత) చేశారు. గ్రహణ సమయం ముగిసే వరకు భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరల రేపు (బుధవారం) తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ తలుపులు తీసి, సంప్రోక్షణ మరియు ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి భక్తులకు యధావిధిగా దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ తెలిపారు.1
- నల్లగొండ జిల్లా, నకిరేకల్ లో.. హోళీ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే "వేముల వీరేశం".. పార్టీ కార్యకర్తల తో పాటు ప్రజలతో కలిసి డాన్స్ వేస్తూ జోష్ నింపిన వేముల ప్రతి ఒక్కరు ఆయురు ఆరోగ్యలతో సంతోష ఉండాలని ఆయన ఆకాక్షించారు1
- వీరులపాడు మండలం జయంతి గ్రామంలో అక్రమ రేషన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తహసిల్దార్ రవికుమార్ మాట్లాడుతూ పౌరసరఫరాల మరియు రెవెన్యూ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడిలో 295 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.1
- నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – *బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి* *నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లకు ఘన సన్మానం..* 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి సహా యామ కవితా దయాకర్, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, మారగోని నవీన్ కుమార్ గౌడ్కు సత్కారం... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సహకారంతో గ్రీన్ సిటీగా నల్గొండ అభివృద్ధి – మేయర్... ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి... *నల్లగొండ కార్పొరేషన్ మేయర్–బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*☝️ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు...1
- Post by వేణు విలేకరి1
- మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ లోని ఎస్పీ క్యాంపు కార్యాలయం ఆవరణ లో ఘనంగా హోలీ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పోలీస్ సిబ్బంది తో కలిసిఎస్పీ శబరిష్ ,డీఎస్పీ తిరుపతి రావు.. జిల్లా పోలీస్ అధికారులు. అదిరి పొయో స్టెప్పులు వేసి అలరించారు..1
- ములుగు జిల్లా కేంద్రంలో హోళీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. మంగళవారం నిర్వహించిన సంబరాల్లో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పాల్గొని పోలీసు సిబ్బందితో కలిసి రంగులు చల్లుకుని స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలు సురక్షితంగా పండుగ జరుపుకోవాలని సూచించారు.1
- చండ్రుగొండ మండలం చండ్రుగొండ లో నమ్మదగిన సమాచారం మేరకు సీసీఎస్ మరియు చండ్రుగొండ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు బ్యాగ్ లను తనిఖీ చేయగా వాటిలో 10.50 లక్షల రూపాయల విలువ చేసే 21 కేజీల నిషేధిత గంజాయి ఉండడంతో గంజాయితోపాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్ లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.... ఒరిస్సా రాష్ట్రం నుండి తెలంగాణా, ఆంద్రప్రదేశ్ మీదుగా తమిళనాడు లోని చెన్నై కు ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై గంజాయిని తరలిస్తున్నారనే సమాచారం తో వారిని పట్టుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ముగ్గురు వ్యక్తులు విజయవాడ, ఒడిశా రాష్ట్రానికి చెందినవారని అన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలను సేవించిన, రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.1