Shuru
Apke Nagar Ki App…
హోలీ సంబరాల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు నల్లగొండ జిల్లా, నకిరేకల్ లో.. హోళీ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే "వేముల వీరేశం".. పార్టీ కార్యకర్తల తో పాటు ప్రజలతో కలిసి డాన్స్ వేస్తూ జోష్ నింపిన వేముల ప్రతి ఒక్కరు ఆయురు ఆరోగ్యలతో సంతోష ఉండాలని ఆయన ఆకాక్షించారు
Nagesh Kothapalli
హోలీ సంబరాల్లో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం గారు నల్లగొండ జిల్లా, నకిరేకల్ లో.. హోళీ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే "వేముల వీరేశం".. పార్టీ కార్యకర్తల తో పాటు ప్రజలతో కలిసి డాన్స్ వేస్తూ జోష్ నింపిన వేముల ప్రతి ఒక్కరు ఆయురు ఆరోగ్యలతో సంతోష ఉండాలని ఆయన ఆకాక్షించారు
More news from తెలంగాణ and nearby areas
- నల్లగొండ జిల్లా, నకిరేకల్ లో.. హోళీ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే "వేముల వీరేశం".. పార్టీ కార్యకర్తల తో పాటు ప్రజలతో కలిసి డాన్స్ వేస్తూ జోష్ నింపిన వేముల ప్రతి ఒక్కరు ఆయురు ఆరోగ్యలతో సంతోష ఉండాలని ఆయన ఆకాక్షించారు1
- నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – *బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి* *నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లకు ఘన సన్మానం..* 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి సహా యామ కవితా దయాకర్, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, మారగోని నవీన్ కుమార్ గౌడ్కు సత్కారం... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సహకారంతో గ్రీన్ సిటీగా నల్గొండ అభివృద్ధి – మేయర్... ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి... *నల్లగొండ కార్పొరేషన్ మేయర్–బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*☝️ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు...1
- మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు నిరసనగా మంగళవారం పాఠశాల ఎదుట బాధితుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.1
- ఖమ్మం నగరం 26 డివిజన్ పరిధిలోని రామాలయం వీధిలో మంగళవారం ఉదయం చిన్నారులందరూ ఆటపాటలతో ఘనంగా హోళీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులందరూ ఉదయాన్నే లేచి స్నేహితులతో కలిసి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఒకరిమీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ ఆనందోత్సాహాలతో హోళీ పండుగను జరుపుకున్నారు. ఆ వీధిగుండా వెళ్ళేవారికి మీద కూడా రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. వారిని చూసి తల్లిదండ్రులు పెద్దవారందరూ కూడా శుభాకాంక్షలు అందజేశారు.1
- హోళీ పండుగను ఆనందోత్సాహాలతో పాటు బాధ్యతతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. పండుగ వేళ సహజసిద్ధమైన, పర్యావరణ హిత రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనాలతో కూడిన హానికర రంగులను పూర్తిగా నివారించాలని సూచించారు. ఇతరుల అభిమతానికి విరుద్ధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని స్పష్టం చేశారు. ప్రార్థనా స్థలాలు, ఆసుపత్రులు, ప్రధాన రహదారులు మరియు ప్రజా ప్రదేశాలలో ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని తెలిపారు. హోలీ పండుగ చందా పేరుతో రహదారులపై బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠినచర్యలు తీసుకోబడతాయని తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠిన చర్యలు పండుగ రోజు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచిస్తూ, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నీటి ప్రాంతాల వద్ద జాగ్రత్తలు ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లరాదని, తల్లిదండ్రులు చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలందరూ శాంతి, సౌహార్ద్ర వాతావరణంలో, పరస్పర గౌరవంతో హోళీ పండుగను సురక్షితంగా జరుపుకొని పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ కోరారు.1
- కీసర, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని రాంపల్లి దాయరలో వెలసిన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో మంగళవారం గిరి ప్రదక్షిణ, పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున జరిగే ఈ కార్యక్రమం హోలీ పర్వదినం, లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేషంగా జరిగింది.ఉదయం ఐదు గంటలకు వేదోత్తములు ఆదిత్య శర్మ, శ్రీనివాస్ శర్మల మార్గదర్శకత్వంలో స్వామి వారి విశేష పూజలు నిర్వహించి అనంతరం పల్లకి సేవతో గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు భజనలు, భక్తి గీతాలతో గోవింద నామస్మరణ చేస్తూ వెంకులోనిగుట్ట గిరులను మార్మోగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, శ్రీ సాయి ధామం దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రామానంద ప్రభూజీ స్వామి పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేష లక్ష్మీ పూజను ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారికి గవ్వలతో అభిషేకం చేసి, అనంతరం స్వామీజీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా భక్తులకు లక్ష్మీ గవ్వలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలో లక్ష్మీ గవ్వలు ఉండడం అష్టైశ్వర్య సిద్ధికి కారణమని వేద పండితులు తెలిపారు.వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన నిర్వాహకులను ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో కెఎల్ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్ సభ్యులు, మన్నె ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు, అలియాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ ట్రస్టు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.3
- ములుగు జిల్లా : ములుగు జిల్లా కేంద్రంలో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ములుగు పోలీస్ స్టేషన్లో ఎస్ పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో జిల్లా పోలీసులతో పాటు ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టు కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. డీజే సౌండ్స్ తో ఎస్పీ తోపాటు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కలిసి నృత్యాలు చేస్తూ రంగులను అద్దుకున్నారు. మున్సిపాలిటీ కౌన్సిలర్లు జాతీయ రహదారిపై డీజే లు ఏర్పాటు చేసి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నృత్యాలు చేశారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ పట్టణ కేంద్రంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్ షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు... జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ *ఎమీరెడ్డి రాజశేఖర్ రెడ్డి* ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్... మైనర్ పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం... బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే కఠిన శిక్షలు తప్పవు.! చట్ట విరుద్ధంగా సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా విక్రయిస్తే కేసులు నమోదు చేసి షాపులు సీజ్ చేస్తామని హెచ్చరిక... పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు మరియు ఇతర ప్రజా ప్రాంగణాల నుంచి 100 మీటర్ల దూరంలోనే పాన్ షాపులు ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ... నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులు రద్దు చేసి చర్యలు... మైనర్ బాలురు, బాలికలకు పొగాకు అమ్మడం నేరం.. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా పెట్టాలి... అలవాట్లు చిన్న వయసులో మొదలైతే భవిష్యత్ అంధకారం అవుతుంది... పాన్ షాప్ యాజమాన్యాలకు చివరి హెచ్చరిక జారీ చేస్తూ – ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని, ప్రత్యేక బృందాలు అకస్మాత్తుగా తనిఖీలు కొనసాగిస్తాయని స్పష్టం...1