అక్షరానికి ఆటంకంగా మారిన వాగులు: ప్రాణాలకు తెగించి బడికి వెళ్తున్న గిరిజన విద్యార్థులు దేవరపల్లి (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం సింతలపూడి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చదువుకోవాలన్న ఆశ ఉన్నా, అంతులేని ఆటంకాలు వారిని బడికి దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా కడరేవు, కొట్టెంగూడ గ్రామాల నుంచి బోడిగరువు గ్రామ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు..కడరేవు నుంచి నలుగురు, కొట్టెంగూడ నుంచి ఎనిమిది మంది పిల్లలు ప్రతిరోజూ 4 కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. ఈ దారిలో ఏకంగా నాలుగు వాగులు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చిన్న పిల్లలు వాటిని దాటడం ప్రాణసంకటంగా మారింది. ఈ రెండు గ్రామాల్లో కలిపి సుమారు 20 మంది విద్యార్థులు ఉండగా, ఈ ప్రమాదకర ప్రయాణం చేయలేక కేవలం 11 మంది విద్యార్థులు మాత్రమే బడికి వెళ్తున్నారు. మిగిలిన వారు చదువుకు దూరమవుతున్నారు. నేర్లపాడు నుండి కొట్టెంగూడ, కడరేవు, కర్రిగూడ మీదుగా గుమ్మ వరకు 9 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి ₹7.5 కోట్లు మంజూరయ్యాయి. కానీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల కేవలం 1.5 కిలోమీటర్లు మాత్రమే పని జరిగి ఆగిపోయింది. మిగిలిన రోడ్డు పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. "మా పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బడికి వెళ్తున్నారు. వాగులు దాటించేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? నిధులు మంజూరైనా రోడ్డు పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు?" అని స్థానిక గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు మరియు విద్యాశాఖ అధికారులు స్పందించి, నిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తి చేయాలని, విద్యార్థులు సురక్షితంగా బడికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అక్షరానికి ఆటంకంగా మారిన వాగులు: ప్రాణాలకు తెగించి బడికి వెళ్తున్న గిరిజన విద్యార్థులు దేవరపల్లి (అనకాపల్లి జిల్లా): అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం సింతలపూడి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల్లో విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చదువుకోవాలన్న ఆశ ఉన్నా, అంతులేని ఆటంకాలు వారిని బడికి దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా కడరేవు, కొట్టెంగూడ గ్రామాల నుంచి బోడిగరువు గ్రామ పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు..కడరేవు నుంచి నలుగురు, కొట్టెంగూడ నుంచి ఎనిమిది మంది పిల్లలు ప్రతిరోజూ 4 కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. ఈ దారిలో ఏకంగా నాలుగు వాగులు ఉన్నాయి. వర్షాకాలంలో ఈ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చిన్న పిల్లలు వాటిని దాటడం ప్రాణసంకటంగా మారింది. ఈ రెండు గ్రామాల్లో కలిపి సుమారు 20 మంది విద్యార్థులు ఉండగా, ఈ ప్రమాదకర ప్రయాణం చేయలేక కేవలం 11 మంది విద్యార్థులు మాత్రమే బడికి వెళ్తున్నారు. మిగిలిన వారు చదువుకు దూరమవుతున్నారు. నేర్లపాడు నుండి కొట్టెంగూడ, కడరేవు, కర్రిగూడ మీదుగా గుమ్మ వరకు 9 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి ₹7.5 కోట్లు మంజూరయ్యాయి. కానీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల కేవలం 1.5 కిలోమీటర్లు మాత్రమే పని జరిగి ఆగిపోయింది. మిగిలిన రోడ్డు పనులు ఎప్పుడు పూర్తి అవుతాయో ఎవరికీ తెలియని పరిస్థితి. "మా పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బడికి వెళ్తున్నారు. వాగులు దాటించేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? నిధులు మంజూరైనా రోడ్డు పనులు ఎందుకు ముందుకు సాగడం లేదు?" అని స్థానిక గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు మరియు విద్యాశాఖ అధికారులు స్పందించి, నిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తి చేయాలని, విద్యార్థులు సురక్షితంగా బడికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Post by Giridhar singh1
- కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైయస్ జగన్కు అందజేసి, వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు. వైయస్ జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.1
- VZM: శృంగవరపుకోట పట్టణంలో దారగంగమ్మ గుడి సమీపంలో ఉన్న దగ్గు చెరువులో పడి కోటదేవి అనే మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, చెరువు సమీపంలోనే నివాసం ఉంటున్న కోట గోపి భార్య దేవి బహిర్భూమికి వెళ్లేందుకు చెరువు గట్టుపైకి వెళ్లగా కాలుజారి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయినట్లు తెలిపారు. అటుగా వెళ్తున్న కొంతమంది గమనించి సమాచారం ఇవ్వగా, స్థానికులు అక్కడికి చేరుకుని చూసేసరికి ఆమె మృతి చెందింది.1
- చెరువులో పడి మహిళ మృతి1
- జై భారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” పిలుపులో భాగంగా ఎన్ఏడి కోడలి ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా అంటించిన వాల్ పోస్టర్లను తొలగించారు. ఈ కార్యక్రమంలో జెడి ఫౌండేషన్ మరియు ఈస్ట్రన్ ఘాట్స్ ట్రెక్కింగ్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ, జీవీఎంసీ వారు విశాఖను సుందర విశాఖగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న సమయంలో కొంతమంది నిబంధనలు అతిక్రమించి గోడలపై పోస్టర్లు అంటించడం వల్ల నగర సౌందర్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. అలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, జై భారత్ అసోసియేషన్ సభ్యులు కోరారు.4
- రహదారి మంజూరు రెండు గ్రామాల మధ్య వివాదం రేపగా..వారు కొట్టుకునే పరిస్థితికి తీసుకెళ్లింది. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం జలగలగెడ్డ గ్రామం రోడ్డు నిర్మాణానికి ఇటీవల రూ. 90 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన జరగనుంది. పనులు కోర్రుబయలు గ్రామం మీదుగా చేపట్టనుండగా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం మంగళవారం ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారి తీసింది.1
- రేడియేషన్ నియంత్రణ గ్రహణ సమయంలో భూమిపై పడే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల నుండి ఆహార పదార్థాలను రక్షించడానికి గరికను ఉపయోగిస్తారు. పవిత్రత మరియు రక్షణ: గరిక (దర్భ) ను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది అపవిత్రతను లేదా గ్రహణ సమయంలో సంభవించే ప్రతికూల శక్తులను (Negative Energy) నివారిస్తుందని నమ్ముతారు.సహజ నిల్వ కారకం (Natural Preservative): గరిక యాంటీ రేడియేషన్ మరియు బ్యాక్టీరియాను నిరోధించే లక్షణాలను కలిగి ఉంది. ఇది పెరుగు, పాలు, వండిన ఆహార పదార్థాలు, ఊరగాయలు పాడవకుండా లేదా బ్యాక్టీరియా పెరగకుండా చూస్తుంది. శాస్త్రీయ కారణం: పరిశోధనల ప్రకారం, దర్భ గడ్డి రేడియేషన్ను, ముఖ్యంగా ఎక్స్-రేలను కూడా కొంతవరకు శోషించుకుంటుంది (absorb). అందుకే, గ్రహణ సమయంలో వండిన పదార్థాలు, నీటి పాత్రలు, నిల్వ ఉంచిన ధాన్యంపై ఈ గడ్డిని వేస్తారు. ప్రధాన ఉపయోగాలు ఆహార రక్షణ ఆహార పదార్థాలపై గరికను వేయడం వల్ల ఆహారం నిల్వ ఉంటుంది, విషతుల్యం కాదు. నీటి శుద్ధి: మంచి నీటి పాత్రలలో గరికను ఉంచడం వల్ల నీరు శుద్ధి అవుతుంది.గ్రహణ సమయంలో చేసే దానధర్మాలు, జపాలు, తర్పణాల సమయంలో దర్భల రంగును (పవిత్రి) ధరించడం శుభప్రదంగా భావిస్తారు. గ్రహణ సమయంలో గరికను వాడటం అనేది కేవలం మూఢనమ్మకం కాదు, దీని వెనుక పవిత్రమైన మరియు శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఈ గడ్డిని తీసివేసి, స్నానం ఆచరించడం మంచిది.1
- VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆదేశాల మేరకు రాజాంలో మహిళా సాధికారిత వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ఫుట్ మార్చ్ ర్యాలీ చేపట్టారు. మహిళల భద్రతపై చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మహిళలపై వేధింపులు, దాడులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై చట్టపరమైన చర్యలు, రక్షణ మార్గాలపై అవగాహన కల్పించారు.2