logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కామారెడ్డి : దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలి, దివ్యాంగుల సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కామారెడ్డి: 'దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి' ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం |కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కోరారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బస్సుల్లో కేవలం 50 శాతం రాయితీ మాత్రమే ఉందని, దానిని పూర్తిగా ఎత్తివేసి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.

21 hrs ago
user_Narmala Swapna
Narmala Swapna
Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
21 hrs ago

కామారెడ్డి : దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలి, దివ్యాంగుల సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కామారెడ్డి: 'దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి' ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం |కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కోరారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బస్సుల్లో కేవలం 50 శాతం రాయితీ మాత్రమే ఉందని, దానిని పూర్తిగా ఎత్తివేసి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్ పల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం లో లడ్డు, పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా దేవాలయ ఈవో వీరేశం మాట్లాడుతూ దేశాల మధ్య యుద్ధం తో గ్యాస్ రవాణా నిలిచిపోవడం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని అన్నారు. దేవస్థానం లడ్డు, పులిహోర తయారీ కోసం గ్యాస్ కొరత ఏర్పడిందని దీంతో కట్టెల పొయ్యి సహాయం తో తయారీ చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ దేవాలయాల కోసం గ్యాస్ ను ఏర్పాటు చేసి గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.
    1
    మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసన్ పల్లి గ్రామంలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని దేవస్థానం లో  లడ్డు, పులిహోర తయారీ కేంద్రంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా దేవాలయ ఈవో వీరేశం మాట్లాడుతూ దేశాల మధ్య యుద్ధం తో గ్యాస్ రవాణా నిలిచిపోవడం వల్ల గ్యాస్ కొరత ఏర్పడిందని అన్నారు. దేవస్థానం లడ్డు, పులిహోర తయారీ కోసం గ్యాస్ కొరత ఏర్పడిందని దీంతో కట్టెల పొయ్యి సహాయం తో తయారీ చేస్తున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ దేవాలయాల కోసం గ్యాస్ ను ఏర్పాటు చేసి గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఆయన కోరారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • విద్యార్థులు తమలోని భయాన్ని పూర్తిగా విడనాడి పట్టుదల, క్రమశిక్షణతో చదివిపదవ తరగతి ఫలితాలలో మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి, రాష్ట్రంలో మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు .పదవ తరగతి పరీక్షలు నిమిత్తం విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్. 9848214166. ఏర్పాటుపదవ తరగతి పరీక్షలు విద్యార్థులు మరియు అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా లో పదవ తరగతి పరీక్షలు ఈ నెల 14.03.2026 నుండి 16.04.2026 వ తేది వరకు నిర్వహణ మొత్తం 68 రెగ్యులర్ సెంటర్ లలో జరగనున్నాయి. మొత్తం 11247 మరియు 100 ప్రైవేట్ అభ్యర్థులు ఈ పరీక్షలకుహాజరవుతున్నారని చెప్పారు. ఈ క్రింది సూచనలను పాటించాల్సిందిగా కోరటమైనది.: ఉదయం 09.30 నుండి 12.30/12.50 PM వరకు జరుగుతుంది,విద్యార్థులు వారికీ కేటాయించిన పరీక్షా కేంద్రమును ఒక రోజు ముందుగా సందర్శించి పరీక్షా ప్రారంభపు తేది రోజు పరీక్షా కేంద్రం చేరుకొనుటకు గల అవాంతరాలను/ ఆలస్యాన్ని నివారించడానికి ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విద్యార్థులకు జారీ చేయబడిన పరీక్షా హాల్ టికెట్ నందు గానీ, OMR షీట్ నందు గానీ ఏవైన ప్రింటింగ్ పొరపాట్లు ఉంటె సంబందిత ఆధార ప్రతులతో ఇన్విజిలేటర్ లేదా చీఫ్ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. పరీక్షా కేంద్రంలోని పరీక్షా నిర్వహణ సిబ్బందికి సూచనలు.పరీక్షా కేంద్రం నకు కేటాయించబడిన సిబ్బంది అందరు గుర్తింపు కార్డ్లను ధరించవలెను. పరీక్షా కేంద్రంలో పరీక్షా నిర్వహణకు కేటాయించబడిన సిబ్బంది తప్ప ఇతరులకు ప్రవేశం నిషేధించబడిందని చెప్పారు. పరీక్షా కేంద్రంలోని ముఖ్య పరీక్షా పర్యవేక్షకుని అనుమతిలేనిదే ఎవ్వరు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం ఉండదని వెల్లడించారు. పరీక్షా కేంద్రంనకు చుట్టుపక్కల 100 మీటర్ల వరకు 163 B.N.S.S సెక్షన్ అమలులో ఉన్నందున జనం సమూహాలుగా గుమిగూడి ఉండుట నిషేధంఅని చెప్పారు.ఆయా పరీక్షా తేదిలలో ఉదయం 8.00 నుండి సాయంత్రంశ 01.00 గంటల వరకు జీరాక్స్ సెంటర్లు మూసి వుంచవలెను. పరీక్షా కేంద్రం లోకి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటు ఆఫీసర్, ఇన్విజిలేటర్, మెడికల్ సిబ్బంది, అటెండర్, వాటర్ బాయ్స్, అభ్యర్థులు మరియు ఇతర పరీక్షా నిర్వహణ సిబ్బంది ఎవ్వరు కూడా సెల్ ఫోన్స్, పేజర్లు & క్యాలక్యులేటర్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొని రావడం నిషేధం. అని తెలిపారు. కేంద్రంలో గుర్తించినట్లయితే సంబందికులపై ప్రభుత్వ పరిక్షల మాల్ ప్రాక్టీసు నిరోధక చట్టం 25/1997 ప్రకారం క్రమ శిక్షణ చర్యలు చేపట్టబడును. అని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం నందు ఏదైనా అత్యవసర సమాచారం తెలియజేయుటకు ఆయా పరీక్షా కేంద్రములకు ఆయా తేదిలలో విధులు కేటాయించబడిన పోలీస్ సిబ్బంది యొక్క ఫోన్ ను మాత్రమే వినియోగించవలెను. వివరించారు. ఇట్టి వినియోగానికి కూడా' కాల్ రిజిస్టర్ నిర్వహించి ఇన్కమింగ్ మరియు ఔట్గోయింగ్ కాల్స్ ను విధిగా రిజిస్టర్ ఇంతకముందే సరఫరా చేయబడిన పరిక్షల నిర్వహణ-శిక్షణా-కరదీపికలోని సూచనలను పాటిస్తూ సజావుగా పరిక్షల సహకరించవలసినదిగా కోరారు.
    1
    విద్యార్థులు తమలోని భయాన్ని పూర్తిగా విడనాడి పట్టుదల, క్రమశిక్షణతో చదివిపదవ తరగతి ఫలితాలలో మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపి, రాష్ట్రంలో మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ గురువారం  ఒక ప్రకటనలో పేర్కొన్నారు .పదవ తరగతి పరీక్షలు నిమిత్తం విద్యాశాఖ కార్యాలయంలో  కంట్రోల్ రూమ్ నెంబర్. 9848214166. ఏర్పాటుపదవ తరగతి పరీక్షలు విద్యార్థులు మరియు అధికారులకు కలెక్టర్ పలు సూచనలు  చేశారు.మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
జిల్లా లో పదవ తరగతి పరీక్షలు ఈ నెల 14.03.2026 నుండి 16.04.2026 వ తేది వరకు నిర్వహణ
మొత్తం 68 రెగ్యులర్ సెంటర్ లలో జరగనున్నాయి. మొత్తం 11247 మరియు 100 ప్రైవేట్ అభ్యర్థులు ఈ పరీక్షలకుహాజరవుతున్నారని చెప్పారు.
ఈ క్రింది సూచనలను పాటించాల్సిందిగా కోరటమైనది.: ఉదయం 09.30 నుండి 12.30/12.50 PM  వరకు జరుగుతుంది,విద్యార్థులు వారికీ కేటాయించిన పరీక్షా కేంద్రమును ఒక రోజు ముందుగా సందర్శించి పరీక్షా ప్రారంభపు తేది రోజు పరీక్షా కేంద్రం చేరుకొనుటకు గల అవాంతరాలను/ ఆలస్యాన్ని నివారించడానికి ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.
విద్యార్థులకు జారీ చేయబడిన పరీక్షా హాల్ టికెట్ నందు గానీ, OMR షీట్ నందు గానీ ఏవైన ప్రింటింగ్ పొరపాట్లు ఉంటె సంబందిత ఆధార ప్రతులతో ఇన్విజిలేటర్ లేదా చీఫ్ సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు.
పరీక్షా కేంద్రంలోని పరీక్షా నిర్వహణ సిబ్బందికి సూచనలు.పరీక్షా కేంద్రం నకు కేటాయించబడిన సిబ్బంది అందరు గుర్తింపు కార్డ్లను ధరించవలెను. పరీక్షా కేంద్రంలో పరీక్షా నిర్వహణకు కేటాయించబడిన సిబ్బంది తప్ప ఇతరులకు ప్రవేశం నిషేధించబడిందని చెప్పారు.
పరీక్షా కేంద్రంలోని ముఖ్య పరీక్షా పర్యవేక్షకుని అనుమతిలేనిదే ఎవ్వరు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం ఉండదని వెల్లడించారు. పరీక్షా కేంద్రంనకు చుట్టుపక్కల 100 మీటర్ల వరకు 163 B.N.S.S సెక్షన్ అమలులో ఉన్నందున జనం సమూహాలుగా గుమిగూడి ఉండుట నిషేధంఅని చెప్పారు.ఆయా పరీక్షా తేదిలలో ఉదయం 8.00 నుండి సాయంత్రంశ 01.00 గంటల వరకు జీరాక్స్ సెంటర్లు మూసి వుంచవలెను. పరీక్షా కేంద్రం లోకి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటు ఆఫీసర్, ఇన్విజిలేటర్, మెడికల్ సిబ్బంది, అటెండర్, వాటర్ బాయ్స్, అభ్యర్థులు మరియు ఇతర పరీక్షా నిర్వహణ సిబ్బంది ఎవ్వరు కూడా సెల్ ఫోన్స్, పేజర్లు & క్యాలక్యులేటర్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకొని రావడం నిషేధం. అని తెలిపారు.
కేంద్రంలో గుర్తించినట్లయితే సంబందికులపై ప్రభుత్వ పరిక్షల మాల్ ప్రాక్టీసు నిరోధక చట్టం 25/1997 ప్రకారం క్రమ శిక్షణ చర్యలు చేపట్టబడును. అని అన్నారు.
ప్రతి పరీక్షా కేంద్రం నందు ఏదైనా అత్యవసర సమాచారం తెలియజేయుటకు ఆయా పరీక్షా కేంద్రములకు ఆయా తేదిలలో విధులు కేటాయించబడిన పోలీస్ సిబ్బంది యొక్క ఫోన్ ను మాత్రమే వినియోగించవలెను. వివరించారు.
ఇట్టి వినియోగానికి కూడా' కాల్ రిజిస్టర్ నిర్వహించి ఇన్కమింగ్ మరియు ఔట్గోయింగ్ కాల్స్ ను విధిగా రిజిస్టర్ ఇంతకముందే సరఫరా చేయబడిన పరిక్షల నిర్వహణ-శిక్షణా-కరదీపికలోని సూచనలను పాటిస్తూ సజావుగా పరిక్షల సహకరించవలసినదిగా కోరారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    21 hrs ago
  • Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    1
    Post by ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    22 min ago
  • Post by KR NEWS 369
    2
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    4 hrs ago
  • సదాశివపేట మండలంలోని వెంకటపూర్ లో ఈరోజు ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో అక్షర(5)తులసిదాస్(55), కిట్టయ్య(58), సుధాకర్ పరమేశ్వరి (15) సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సదాశివపేట 108 సిబ్బంది EMT రఘురాం, పైలెట్ శ్రీనివాస్ లు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ సామాజిక ఆరోగ్య కేంద్రం సదాశివపేటకి తరలించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
    2
    సదాశివపేట మండలంలోని వెంకటపూర్ లో ఈరోజు ఉదయం తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో అక్షర(5)తులసిదాస్(55), కిట్టయ్య(58), సుధాకర్ పరమేశ్వరి (15) సహా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సదాశివపేట 108 సిబ్బంది EMT రఘురాం, పైలెట్ శ్రీనివాస్ లు వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ సామాజిక ఆరోగ్య కేంద్రం సదాశివపేటకి తరలించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.
    user_SRIRAMULA KIRANKUMAR
    SRIRAMULA KIRANKUMAR
    Public Health Department Kandi, Sangareddy•
    6 hrs ago
  • సంగారెడ్డి జిల్లాలో ఇన్స్పైర్ మనక్ కార్యక్రమానికి 104 మంది విద్యార్థులు ఎంపిక: మీడియాతో వివరాలు తెలిపిన జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి
    1
    సంగారెడ్డి జిల్లాలో ఇన్స్పైర్ మనక్ కార్యక్రమానికి 104 మంది విద్యార్థులు ఎంపిక: మీడియాతో వివరాలు తెలిపిన జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • కామారెడ్డి: 'ప్రతి గ్రామం అభివృద్ధిలో ఆదర్శం కావాలి' ప్రతి గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆకాంక్షించారు. గురువారం కామారెడ్డిలో సర్పంచులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. '99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక'లో భాగంగా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గ్రామాల బాగు కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యతనిస్తుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
    1
    కామారెడ్డి: 'ప్రతి గ్రామం అభివృద్ధిలో ఆదర్శం కావాలి'
ప్రతి గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆకాంక్షించారు.
గురువారం కామారెడ్డిలో సర్పంచులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. '99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక'లో భాగంగా గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గ్రామాల బాగు కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రాధాన్యతనిస్తుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • ప్రజా ప్రతినిధులు , అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామ అభివృద్ధి చేయాలి ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యేమైనంపల్లి రోహిత్ రావు అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, సర్పంచులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా పాల్గోని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్,మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నోడల్ అధికారి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ లుజ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంబించారు. అనంతరంతెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే.. తో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. పట్టణ ,గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక బృహత్కర కార్యక్రమం ఇది అని అన్నారు. గ్రామ సర్పంచులు గ్రామం నాది అనే స్వభావాన్ని కలిగి ఉండాలన్నారు. 99 రోజుల్లో అనేక కార్యక్రమాల చేపడుతునట్లు చెప్పారు. సుబిక్షమైన పట్టణ ,పల్లెల కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల అబివృద్ధి , ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం నిరతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, జీరో విద్యుత్,సన్నబియ్యం,మెడికల్ కాలేజీ,యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం లాంటి అనేక పథకాలు చేపట్టామన్నారు.అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను తీర్చి, పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శాంతి భద్రతను కాపాడాలని,రోడ్డు ప్రమాదాల.వల్ల రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి,డ్రగ్స్,సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నోడల్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పట్టణ,గ్రామీణ ప్రజా ప్రతినిధుల పదవి చిన్నదైన బాధ్యత పెద్దదన్నారు.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా అవసరాలను తీర్చాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..పట్టణ,గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కారం చూపించాలన్నారు . అంతకు ముందు సమాచార పౌర సంబంధాల శాఖ మెదక్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల ఫోటోల ఎగ్జిబిషన్ ను అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తిలకించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. #comment​ #follow​ #subscribe​ #news​ #like​
    1
    ప్రజా ప్రతినిధులు , అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామ అభివృద్ధి చేయాలి ఎమ్మెల్యే రోహిత్ రావు 
ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యేమైనంపల్లి రోహిత్ రావు అన్నారు. 
గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, సర్పంచులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్నికి ముఖ్య అతిథిగా పాల్గోని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్,మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నోడల్ అధికారి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ లుజ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం  ప్రారంబించారు.
అనంతరంతెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే.. తో ప్రారంభించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. పట్టణ ,గ్రామస్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక బృహత్కర కార్యక్రమం ఇది అని అన్నారు. గ్రామ సర్పంచులు గ్రామం నాది అనే స్వభావాన్ని కలిగి ఉండాలన్నారు. 99 రోజుల్లో అనేక కార్యక్రమాల చేపడుతునట్లు చెప్పారు. సుబిక్షమైన పట్టణ ,పల్లెల కోసం నిరంతరం కృషి చేయాలన్నారు.
శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల అబివృద్ధి , ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం నిరతరం శ్రమిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, జీరో విద్యుత్,సన్నబియ్యం,మెడికల్ కాలేజీ,యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం  లాంటి అనేక పథకాలు చేపట్టామన్నారు.అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజల సమస్యలను తీర్చి, పథకాలు ముందుకు తీసుకెళ్లాలన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శాంతి భద్రతను కాపాడాలని,రోడ్డు ప్రమాదాల.వల్ల రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి,డ్రగ్స్,సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
నోడల్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పట్టణ,గ్రామీణ ప్రజా ప్రతినిధుల పదవి చిన్నదైన బాధ్యత పెద్దదన్నారు.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా అవసరాలను తీర్చాలన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..పట్టణ,గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కారం చూపించాలన్నారు .
అంతకు ముందు సమాచార పౌర సంబంధాల శాఖ మెదక్ జిల్లా వారి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాల ఫోటోల ఎగ్జిబిషన్ ను అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తిలకించారు.
ఈ కార్యక్రమంలో  జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. #comment​ #follow​ #subscribe​ #news​ #like​
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    23 hrs ago
  • కుషాయిగూడ డివిజన్ నాగార్జున నగర్ కాలనీలోని సాయి సింధు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల సతీష్ గౌడ్, కాసుల పోషయ్య గౌడ్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి చర్లపల్లి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్లు తదితర పరీక్ష సామాగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గురువులు మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు.కార్యక్రమ నిర్వాహకులు కాసుల సతీష్ గౌడ్ మాట్లాడుతూ తాను మొదటి తరగతి నుండి పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు. తాను చదివిన పాఠశాల విద్యార్థులకు తన వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, భాను, శివ, శ్రీకాంత్, ప్రవీణ్, సాయి చరణ్ తదితరులు, స్థానిక నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
    3
    కుషాయిగూడ డివిజన్ నాగార్జున నగర్ కాలనీలోని సాయి సింధు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాసుల సతీష్ గౌడ్, కాసుల పోషయ్య గౌడ్ ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి చర్లపల్లి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్లు తదితర పరీక్ష సామాగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గురువులు మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు.కార్యక్రమ నిర్వాహకులు కాసుల సతీష్ గౌడ్ మాట్లాడుతూ తాను మొదటి తరగతి నుండి పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు. తాను చదివిన పాఠశాల విద్యార్థులకు తన వంతు సహాయం చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, భాను, శివ, శ్రీకాంత్, ప్రవీణ్, సాయి చరణ్ తదితరులు, స్థానిక నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.