logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాసరలో ఆర్టీసీ బస్సు–టిప్పర్ ఢీకొన్న ప్రమాదం… నలుగురికి గాయాలు నిర్మల్ జిల్లా బాసరలోని శివాజీ చౌక్ ఫ్లైఓవర్ వద్ద ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొన్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి భైంసాకు 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రియాజ్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే నాయగామ్ రోడ్డు వెంట ప్రతిరోజూ పదుల సంఖ్యలో హైవా వాహనాల ద్వారా అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతుండటమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందని వారు పేర్కొన్నారు గాయపడిన వారిని పరామర్శించిన ఏఎస్పీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్మల్ ఏఎస్పీ, భైంసా సి.ఐ కలిసి భైంసా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గాయపడిన వారిలో ఒక మహిళ కంటికి గాయం కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏఎస్పీ వైద్యులను ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లారీ మరియు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

18 hrs ago
user_Solanke Ravi
Solanke Ravi
Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
18 hrs ago

బాసరలో ఆర్టీసీ బస్సు–టిప్పర్ ఢీకొన్న ప్రమాదం… నలుగురికి గాయాలు నిర్మల్ జిల్లా బాసరలోని శివాజీ చౌక్ ఫ్లైఓవర్ వద్ద ఆర్టీసీ బస్సు, ఇసుక టిప్పర్ ఢీకొన్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి భైంసాకు 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రియాజ్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే నాయగామ్

రోడ్డు వెంట ప్రతిరోజూ పదుల సంఖ్యలో హైవా వాహనాల ద్వారా అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతుండటమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందని వారు పేర్కొన్నారు గాయపడిన వారిని పరామర్శించిన ఏఎస్పీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్మల్ ఏఎస్పీ, భైంసా సి.ఐ కలిసి భైంసా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ప్రమాదంలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గాయపడిన వారిలో ఒక మహిళ కంటికి గాయం కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏఎస్పీ వైద్యులను ఆదేశించారు. ప్రమాదానికి కారణమైన లారీ మరియు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Solanke Ravi
    3
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    18 hrs ago
  • Post by KR NEWS 369
    2
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    4 hrs ago
  • నేరడిగొండ మండలంలోని గౌలిగూడ గ్రమనికి చెందిన జాదవ్ సునీల్ టిల కార్యక్రమం పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.వారితోపాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
    1
    నేరడిగొండ మండలంలోని గౌలిగూడ గ్రమనికి చెందిన జాదవ్ సునీల్ టిల కార్యక్రమం పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.వారితోపాటు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Neradigonda, Adilabad•
    3 hrs ago
  • కామారెడ్డి: 'దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి' ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం |కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కోరారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బస్సుల్లో కేవలం 50 శాతం రాయితీ మాత్రమే ఉందని, దానిని పూర్తిగా ఎత్తివేసి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.
    1
    కామారెడ్డి: 'దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి' ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం |కల్పించాలని రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బైండ్ల భూపతి కోరారు. గురువారం కామారెడ్డిలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బస్సుల్లో కేవలం 50 శాతం రాయితీ మాత్రమే ఉందని, దానిని పూర్తిగా ఎత్తివేసి ఉచితంగా ప్రయాణించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    21 hrs ago
  • గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖానాపూర్ మండలంలోని సేవా నాయక్ తండాలో గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలతో జీవితాలు ప్రశ్నార్ధకంగా మార్తాయని, వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖానాపూర్ మండలంలోని
సేవా నాయక్ తండాలో గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలతో జీవితాలు ప్రశ్నార్ధకంగా మార్తాయని, వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    59 min ago
  • జగిత్యాల : 👉 పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి 👉 జిల్లా మొత్తం మీద 68 పరీక్ష కేంద్రాలు 12,964 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం  జగిత్యాల జిల్లాలో 10వ పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రాము వెల్లడించారు.శుక్రవారం మధ్యాహ్నం ఆయన 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ, జగిత్యాల జిల్లాలో మొత్తం 12,964 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఇందుకుగాను 68మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 68 మంది చీఫ్ సూపరింటెండెంట్ లు మరియు 5 గురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, 4 ఫ్లైయింగ్ స్క్వార్డ్స్, ఇన్విజిలేటర్ల నియామకంతోపాటుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని వివరించారు అలాగే పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి వసతి వైద్య సహకారం, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ పక్షాన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైందని తెలిపారు. అంతేకాకుండా, ప్రతీ పరీక్షకు మధ్యన ఉన్న విరామం రోజుల్లో మరుసటి పరీక్షకు సంబంధించి, విద్యార్థులు ఎలాంటి సందేహాలున్నాకూడ పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ఆదేశించడం కూడా జరిగిందని తెలిపారు విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
    1
    జగిత్యాల :
👉 పదవ తరగతి పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి 
👉 జిల్లా మొత్తం మీద 68 పరీక్ష కేంద్రాలు 12,964 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం 
జగిత్యాల జిల్లాలో 10వ పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి కే.రాము వెల్లడించారు.శుక్రవారం మధ్యాహ్నం ఆయన 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ, జగిత్యాల జిల్లాలో మొత్తం 12,964 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఇందుకుగాను 68మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 68 మంది చీఫ్ సూపరింటెండెంట్ లు మరియు 5 గురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, 4 ఫ్లైయింగ్ స్క్వార్డ్స్, ఇన్విజిలేటర్ల నియామకంతోపాటుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని వివరించారు అలాగే పరీక్ష కేంద్రాల వద్ద తాగునీటి వసతి వైద్య సహకారం, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా విద్యాశాఖ పక్షాన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పదో తరగతి పరీక్షలకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైందని తెలిపారు. అంతేకాకుండా, ప్రతీ పరీక్షకు మధ్యన ఉన్న విరామం రోజుల్లో మరుసటి పరీక్షకు సంబంధించి, విద్యార్థులు ఎలాంటి సందేహాలున్నాకూడ పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని ఆదేశించడం కూడా జరిగిందని తెలిపారు విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • రోడ్ నెంబర్ 29, బ్లాక్ 292 వద్ద నీటి పైప్ లీక్ జగిత్యాల పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రోడ్ నెంబర్ 29, బ్లాక్ 292 సమీపంలో తాగునీటి పైప్ లైన్ లీక్ అవుతున్నది. దీంతో పెద్ద మొత్తంలో నీరు వృథా అవుతూ రోడ్డంతా నీరు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్య వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి లీకేజీని మరమ్మతు చేసి నీటి వృథాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. నీటి పైప్ లీకేజీలను సమయానికి సరిచేయకపోతే పెద్ద మొత్తంలో నీటి నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. �
    1
    రోడ్ నెంబర్ 29, బ్లాక్ 292 వద్ద నీటి పైప్ లీక్
జగిత్యాల పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో రోడ్ నెంబర్ 29, బ్లాక్ 292 సమీపంలో తాగునీటి పైప్ లైన్ లీక్ అవుతున్నది. దీంతో పెద్ద మొత్తంలో నీరు వృథా అవుతూ రోడ్డంతా నీరు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ సమస్య వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి లీకేజీని మరమ్మతు చేసి నీటి వృథాను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
నీటి పైప్ లీకేజీలను సమయానికి సరిచేయకపోతే పెద్ద మొత్తంలో నీటి నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. �
    user_Boga naga bhushanam
    Boga naga bhushanam
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • Post by Solanke Ravi
    2
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.