Shuru
Apke Nagar Ki App…
యూరియా కోసం రైతులు అవస్థలు. బద్వేలు: నియోజకవర్గం లోని కాశి నాయన మండలంలోని రైతులు యురియా కోసం అవస్థలు పడుతున్నారు. మండలంలో రబి సాగు క్రింద క్రాసింగ్ సజ్జ. మొక్కజొన్న .వరి ,నువ్వులు పంటలను రైతులు సాగు చేశారు. ఈ పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతు సేవ కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు యూరియాను పంపిణీ చేయకపోవడంతో ప్రైవేట్ దుకాణాలకు వెళ్లి అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగపాడు, నరసాపురం, గంగనపల్లె రైతు సేవ కేంద్రాలకు 300 బస్తాలు చొప్పున యూరియా వచ్చింది దీనికోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క రైతుకు ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఒక బస్తా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీ.మౌలాలి.
యూరియా కోసం రైతులు అవస్థలు. బద్వేలు: నియోజకవర్గం లోని కాశి నాయన మండలంలోని రైతులు యురియా కోసం అవస్థలు పడుతున్నారు. మండలంలో రబి సాగు క్రింద క్రాసింగ్ సజ్జ. మొక్కజొన్న .వరి ,నువ్వులు పంటలను రైతులు సాగు చేశారు. ఈ పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతు సేవ కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు యూరియాను పంపిణీ చేయకపోవడంతో ప్రైవేట్ దుకాణాలకు వెళ్లి అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగపాడు, నరసాపురం, గంగనపల్లె రైతు సేవ కేంద్రాలకు 300 బస్తాలు చొప్పున యూరియా వచ్చింది దీనికోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క రైతుకు ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఒక బస్తా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేలు: ఇంటి పన్నులు,నీటి పనులు వసూలు చేయడం లో ఉన్న శ్రద్ధ, సుందరయ్య కాలనీ సమస్యలు అధికారులకు తెలియవా అని సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు అన్నారు.భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్వేలు పట్టణ సమితి ఆధ్వర్యంలో 18 వ వార్డు లోని సుందరయ్య కాలనీలో పర్యటించి ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దుల్లపల్లి బాలు మాట్లాడుతూ సుందరయ్య కాలనీలో స్మశానం, డ్రైనేజీ, సీసీ రోడ్లు, ఏర్పాటు చేయాలని, 130 కోట్ల రూపాయలు నిధులు ఇలాంటి పేదలు నివాసం ఉన్న చోట అభివృద్ధి చేస్తే వారు మున్సిపల్ అధికారులను గొప్పగా భావిస్తారు, ఇల్లు లేని చోట, స్మశానాలకు, ధనవంతుల ఇండ్ల వెనుక భాగంలో శుభ్రంగా ఉండాలని కోట్ల రూపాయలు ఖర్చు చేసి మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయమని సిపిఐ పట్టణ సమితిగా అధికారులను ప్రశ్నిస్తున్నామని అలాగే కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేసి సైడ్ మట్టి తోలడం మరిచారని దీనివల్ల ఇంటిలోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా, ఆరుబయట పిల్లలు ఆడుకోవాలని, వాహనాలు పెట్టుకోవాలన్న తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు సిసి రోడ్లు క్వాలిటీ కంట్రోలర్ పర్యవేక్షణ లేకుండానే, కాంట్రాక్టర్ కు బిల్లు ఇస్తే వారు రోడ్డు పర్యవేక్షణకు లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2000 కుటుంబాలు నివాసం ఉంటున్న సుందరయ్య కాలనీకి స్మశానం లేకపోవడం దీనిపైన అధికారులు స్పందించకపోవడం జరగబోవు మున్సిపల్ ఎలక్షన్లో ఏ ఒక్క రాజకీయ నాయకులు సుందరయ్య కాలనీకి రా వద్దని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనార్టీలు పేదలు బడుగు బలహీన వర్గాల కాలనీల పైన దృష్టి పెట్టి అధికారులు అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శిపొంగూర్ నాగరాజ్, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, పట్టణ నాయకులు సలోమి. సుందరయ్య కాలనీ వాసులు పాల్గొన్నారు.1
- శ్రీకాళహస్తి పర్యటనలో నందమూరి కళ్యాణ్ రామ్1
- STV9: guntur: మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగనన్న!1
- Post by ఉంగరాల కార్తీక్1
- Post by Paramesh Ratnagiri1
- మంచు మోహన్ బాబు, విష్ణులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఏఐబిఎస్పి. పలమనేరు ఫిబ్రవరి4( ప్రజా ప్రతిభ) సినీ నటుడు మంచు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో విద్యార్థులను వివిధ రకాల ఫీజుల రూపంలో నిలువు దోపిడీ చేస్తున్న విషయాన్ని ప్రశ్నించి నిలదీసిన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్ నాయకులను కిడ్నాప్ చేసి దాడి చేసి గాయపరిచిన మంచు మోహన్ బాబు, మంచు విష్ణు వర్ధన్ లను వెంటనే అరెస్ట్ చేయాలని ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డివి మునిరత్నం, జిల్లా నాయకులు మణి డిమాండ్ చేశారు. అందులో భాగంగా బుధవారం స్థానిక కార్యాలయంలో శివన్న అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంచు మోహన్ బాబుకు ఉన్న పలుకుబడితో కళాశాలలో అవినీతి అక్రమాలు గురించి అనేక పర్యాయాలు స్టూడెంట్ యూనియన్ నాయకులు నిరసనల ద్వారా తెలియపరిచినప్పుడల్లా సరిదిద్దుకుంటామని చెప్పి యాజమాన్యం వ్యవహారములో ఎలాంటి మార్పు రాకపోవడంతో స్టూడెంట్ నాయకులు ప్రత్యామ్నాయంగా ఆలోచించాచారన్నారు. కళాశాల యాజమాన్యం దోపిడి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చేస్తున్న ప్రయత్నాన్ని జీర్ణించుకోలేని మంచు మోహన్ బాబు, విష్ణు, పోషిస్తున్న గూండాలు, బౌన్సర్లు ద్వారా కిడ్నాప్ చేయించి కొట్టి గాయపరచడం దుర్మార్గమన్నారు. విద్యార్థుల హక్కులు ఉల్లంఘించినా ఏ యాజమాన్యం పైన ఎస్ఎఫ్ఐ పోరాడుతుందనే విషయం మంచు మోహన్ బాబు, విష్ణు గుర్తించుకోవాలన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు చేసే పోరాటానికి ఏఐబిఎస్పి ఎప్పుడు ముందుంటుందని సంఘీభావాన్ని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రత్నమ్మ, సరస్వతి ,గౌరీ, ఆనంద్, గుర్రం సుబ్రహ్మణ్యం, చంగల్రాయ, శ్రీనివాసులు, హనుమప్ప, చలపతి, బుజ్జి, మంజునాథ్ పాల్గొన్నారు.1
- ఆదోని పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన పవన్ కుమార్ వయసు 30 సంవత్సరాలు పెసల బండ గ్రామంలో జరిగిన దేవర ఉత్సవంలో పాల్గొని తిరిగి ఆదోని కి వస్తుండగ బైసిగేరి గ్రామం బైపాస్ లో వెనక నుండి కర్ణాటక జీపు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు3
- బద్వేలు: నియోజకవర్గం లోని కాశి నాయన మండలంలోని రైతులు యురియా కోసం అవస్థలు పడుతున్నారు. మండలంలో రబి సాగు క్రింద క్రాసింగ్ సజ్జ. మొక్కజొన్న .వరి ,నువ్వులు పంటలను రైతులు సాగు చేశారు. ఈ పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతు సేవ కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు యూరియాను పంపిణీ చేయకపోవడంతో ప్రైవేట్ దుకాణాలకు వెళ్లి అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగపాడు, నరసాపురం, గంగనపల్లె రైతు సేవ కేంద్రాలకు 300 బస్తాలు చొప్పున యూరియా వచ్చింది దీనికోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క రైతుకు ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఒక బస్తా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1