Shuru
Apke Nagar Ki App…
కడప–రాయచోటి ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఆదివారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కారు కొత్త వాహనంగా కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.అయితే, కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం అందింది. ప్రమాదానికి గల కారణాలు, వాహనంలోని ప్రయాణికుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VEMULURIMALAKONDAIAH
కడప–రాయచోటి ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు కడప జిల్లా గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఆదివారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కారు కొత్త వాహనంగా కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.అయితే, కారులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక సమాచారం అందింది. ప్రమాదానికి గల కారణాలు, వాహనంలోని ప్రయాణికుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మహానంది పుణ్యక్షేత్రంలో ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమము ఆషాఢ మాసపు చీరె సారె కార్యక్రమమును శ్రీ కామేశ్వరీ అమ్మవారకి ఈరోజు వందలాదిమంది భక్తులతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ వారు వ్యవస్థొపకులు ధనుంజయ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గరుడనంది నుంచి శోభాయాత్రను ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాడవీధులగుండా సంకీర్తనలు,కోలాటాలు, భజనలతో కోలాహలంగా నిర్వహించి అనంతరం శ్రీ కామేశ్వరీ మహానందీశ్వర స్వామివార్లకు పట్టువస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. నంద్యాల జిల్లా నిర్వాహకులు శివమ్మ,లీలావతమ్మ,లు పర్యవేక్షించారు. సామూహిక లలితా సహస్రనామ పారాయణ, శివనామ పూజలు నిర్వహించారు.3
- అత్యంత వైభవంగా కలికిరి ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు ప్రారంభం కలికిరి నేస్తం న్యూస్..కలికిరి:01ఆగస్టు2026: ఎల్లమ్మ అమ్మవారికి ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుండి నాలుగో తేదీ వరకు అత్యంత వైభవంగా ఎల్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోలెం వెళ్ళిన అమ్మవారు తన పుట్టింటి నుంచి ఆలయానికి తిరిగి రావడంతో శనివారం సాయంత్రం నుంచి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా జాతరలో మొదటి రోజున సాయంత్రం ఆలయ ధర్మకర్త రెడ్డి వారి అశోక్ కుమార్ రెడ్డి ఇంటి నుంచి పట్టు వస్త్రాలను మేళతాళాలు డప్పు వాయిద్యాలు బాణాసంచా కాల్పుల మధ్య తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక అలంకరణలోని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వారి వెంకట రెడ్డి, రెడ్డి వారి మధుసూదన్ రెడ్డి, రెడ్డి వారి సుధాకర్ రెడ్డి, రెడ్డి వారి యోగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు1
- తక్కువ ధరకే బియ్యం.. స్కీమ్ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ AP: ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించే పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. కేజీ రూ.62 విలువ గల BPT సూపర్ ఫైన్ బియ్యం రూ.52కు, రూ.58 ధర పలికే గ్రేడ్-1 రా రైస్ రూ.50కి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో విక్రయాలు కొనసాగుతాయి. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తారు.1
- గాజులపల్లెలో పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ : ఏవైనా తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి.తహసిల్దార్ మహానంది మండలం గాజులపల్లెలోని రైతు సేవా కేంద్రంలో రైతులకు ఆదివారం పట్టాదారు పాసుపుస్తకాలను తహశీల్దార్ పి.రమాదేవి పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 948 రైతులకు పాసు పుస్తకాలు మంజూరయ్యాయాన్నారు. రైతులందరూ ఈ కేవైసీ చేయించుకొని పట్టాదారు పాసుబుక్కులు తీసుకువెళ్లాలన్నారు. ఏవైనా తప్పులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ సుబ్బారావు, వీఆర్వోలు జేజి బాబు, మోహన్, గోపవరం సొసైటీ చైర్మన్ గంగవరపు ఉమామహేశ్వర్ రెడ్డి, రవి స్వామి, శశికళ కొండారెడ్డి, సర్వేర్ సద్దాం, రైతులు పాల్గొన్నారు.3
- శ్రీశైలం జలాశయం కు కొనసాగుతున్న వరద ప్రవాహం.. సంగమేశ్వరంను చుట్టుముట్టిన వరద జలాలు శ్రీశైలం జలాశయం కు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం భారీగా కొనసాగుతుంది. ఆదివారం ఆరు గంటల సమయానికి జూరాల జలాశయం నుంచి శ్రీశైలం జలాశయం కు ఇన్ ఫ్లో 1,74,711 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885.00. అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 846.10. అడుగులు చేరింది. జలాశయ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, జలాశయ ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 72. 1974 టీఎంసీలుగా నమోదయినట్లు అధికారులు తెలిపారు.1
- వర్షాలకోసం జమ్మలమడుగులో రజకుల పూజలు.. 108 బిందెలు నీళ్ల అభిషేకం కడప జిల్లాలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొనడంతో వర్షం కురవాలని కోరుతూ ప్రజలు దేవుళ్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జమ్మలమడుగులో రజకులు గంగమ్మ తల్లికి నిండు బిందెలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.అనంతరం అమ్మవారికి చీర సారె సమర్పించి పూజలు చేశారు. వరుణ దేవుడు కరుణించి త్వరలోనే సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వారు ఈ సందర్భంగా ప్రార్థించారు.1