logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, ఇతర కాంగ్రెస్ నేతలు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యంను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గ రైతులను తన కుటుంబ సభ్యులుగా భావించి మేడిపల్లి సత్యం పనిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీపీఎస్ విధానంతో లారీల కొరత, అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడం వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, మేడిపల్లి సత్యం అర్థరాత్రి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే ఉండి, మానవత్వంతో రైతుల బాధను అర్థం చేసుకొని స్వయంగా లారీ ఎక్కి ధాన్యం తరలింపును పర్యవేక్షించారని కాంగ్రెస్ నేతలు వివరించారు. అలాంటి సత్యం గారిని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ "లారీ ఎక్కి వస్తావా.. బస్సు ఎక్కి వస్తావా" అంటూ పాటలు పాడుతూ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు నీళ్లు అడిగితే, "ఈ ఏడాది రాళ్ల వాన పడి పంట కొట్టుకుపోయిందని అనుకోండి" అని నాటి ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడటం వల్ల రైతులు ఎంతగానో ఆవేదన చెందారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ రివెంజ్ రాజకీయాలకు పెట్టింది పేరని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఖమ్మంలో రైతుల చేతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ కు దక్కిందని పులి ఆంజనేయులు గౌడ్ ఆరోపించారు. చొప్పదండిలో "మేడిపల్లి సత్యం అభివృద్ధి రాజ్యాంగమే" నడుస్తోందని, గంగాధరకు డిగ్రీ కళాశాల మంజూరు, ఆర్నకొండ నుండి మల్యాల వరకు రోడ్డు నిర్మాణం, కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.36 కోట్లు మంజూరు వంటి నిర్మాణాత్మక పనులతో బీఆర్ఎస్ నేతలే స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనులను ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయని నేతలు తెలిపారు. నారాయణపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం ఘటనలో ఎమ్మెల్యే సత్యం గారిని టార్గెట్ చేస్తూ, రైతులపై కేసులు పెట్టారని సుంకే రవిశంకర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని వారు ఖండించారు. పూడూరు, గంగాధరలో ధర్నాలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపైనా కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు సహాయం చేయాల్సిన సమయంలో ఆరోపణలు చేయడం సరికాదని, రైతుల సెంటిమెంట్‌తో రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. వరద కాలువ విషయంలో నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి ముంపు బాధితులకు పరిహారం అందించాలని, చుక్కనీరు వృధా కాకుండా చూడాలని సత్యం కృషి చేస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. నారాయణపూర్ గ్రామ సర్పంచ్ బాబా లక్ష్మి మధు మాట్లాడుతూ, తాను సర్పంచ్ గా ఎన్నికైన నెల రోజుల నుండి ప్రతి గ్రామసభను బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామానికి రావాలంటే కూడా బెదిరింపుల కారణంగా భయపడుతున్నారని ఆమె తెలిపారు. నిన్న ఐకేపీ సెంటర్ లో జరిగిన సంఘటనకు గ్రామ సర్పంచ్ కు గాని, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అది వారి వ్యక్తిగత విషయమని, అక్కడ ఉన్న నిర్వాహకురాలిని సుంకే రవిశంకర్ అనుచరులు వ్యక్తిగతంగా దూషించి బెదిరించడంతో వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారని వివరించారు. నారాయణపూర్ ముంపు గ్రామానికి సంబంధించి గతంలో శాసనసభ్యులుగా ఉన్న సుద్దాల దేవయ్య, బొడిగెశోభ, సుంకే రవిశంకర్ ఎప్పుడూ నష్టపరిహారం గురించి మాట్లాడలేదని, ప్రస్తుత శాసనసభ్యులు మేడిపల్లి సత్యం నిండు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆమె గుర్తుచేశారు. మేడిపల్లి సత్యం రూ.23 కోట్ల నష్టపరిహారం మంజూరు చేయించి ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ వారు అడ్డంకులు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని, దీని వెనుక మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ ఉన్నారని ఆమె ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో గంగాధర మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రి మహేందర్, మాజీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్, గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, తాడి జెర్రీ సర్పంచ్ రామిడి రాజిరెడ్డి, నాయకులు రుద్ర మల్లేశం, సాయిని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. అర్థరాత్రి వరకు కొనుగోలు కేంద్రాల్లోనే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉండటం ఆయన పనితనానికి నిదర్శనమని, నియోజకవర్గంలో "మేడిపల్లి సత్యం అభివృద్ధి రాజ్యాంగం" నడుస్తోందని జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ పునరుద్ఘాటించారు.

1 hr ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
1 hr ago

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, ఇతర కాంగ్రెస్ నేతలు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యంను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గ రైతులను తన కుటుంబ సభ్యులుగా భావించి మేడిపల్లి సత్యం పనిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీపీఎస్ విధానంతో లారీల కొరత, అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడం వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, మేడిపల్లి సత్యం అర్థరాత్రి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే ఉండి, మానవత్వంతో రైతుల బాధను అర్థం చేసుకొని స్వయంగా లారీ ఎక్కి ధాన్యం తరలింపును పర్యవేక్షించారని కాంగ్రెస్ నేతలు వివరించారు. అలాంటి సత్యం గారిని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ "లారీ ఎక్కి వస్తావా.. బస్సు ఎక్కి వస్తావా" అంటూ పాటలు పాడుతూ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు నీళ్లు అడిగితే, "ఈ ఏడాది రాళ్ల వాన పడి పంట కొట్టుకుపోయిందని అనుకోండి" అని నాటి ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడటం వల్ల రైతులు ఎంతగానో ఆవేదన చెందారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ రివెంజ్ రాజకీయాలకు పెట్టింది పేరని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఖమ్మంలో రైతుల చేతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ కు దక్కిందని పులి ఆంజనేయులు గౌడ్ ఆరోపించారు. చొప్పదండిలో "మేడిపల్లి సత్యం అభివృద్ధి రాజ్యాంగమే" నడుస్తోందని, గంగాధరకు డిగ్రీ కళాశాల మంజూరు, ఆర్నకొండ నుండి మల్యాల వరకు రోడ్డు నిర్మాణం, కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.36 కోట్లు మంజూరు వంటి నిర్మాణాత్మక పనులతో బీఆర్ఎస్ నేతలే స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనులను ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయని నేతలు తెలిపారు. నారాయణపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం ఘటనలో ఎమ్మెల్యే సత్యం గారిని టార్గెట్ చేస్తూ, రైతులపై కేసులు పెట్టారని సుంకే రవిశంకర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని వారు ఖండించారు. పూడూరు, గంగాధరలో ధర్నాలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపైనా కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు సహాయం చేయాల్సిన సమయంలో ఆరోపణలు చేయడం సరికాదని, రైతుల సెంటిమెంట్‌తో రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. వరద కాలువ విషయంలో నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి ముంపు బాధితులకు పరిహారం అందించాలని, చుక్కనీరు వృధా కాకుండా చూడాలని సత్యం కృషి చేస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. నారాయణపూర్ గ్రామ సర్పంచ్ బాబా లక్ష్మి మధు మాట్లాడుతూ, తాను సర్పంచ్ గా ఎన్నికైన నెల రోజుల నుండి ప్రతి గ్రామసభను బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామానికి రావాలంటే కూడా బెదిరింపుల కారణంగా భయపడుతున్నారని ఆమె తెలిపారు. నిన్న ఐకేపీ సెంటర్ లో జరిగిన సంఘటనకు గ్రామ సర్పంచ్ కు గాని, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అది వారి వ్యక్తిగత విషయమని, అక్కడ ఉన్న నిర్వాహకురాలిని సుంకే రవిశంకర్ అనుచరులు వ్యక్తిగతంగా దూషించి బెదిరించడంతో వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారని వివరించారు. నారాయణపూర్ ముంపు గ్రామానికి సంబంధించి గతంలో శాసనసభ్యులుగా ఉన్న సుద్దాల దేవయ్య, బొడిగెశోభ, సుంకే రవిశంకర్ ఎప్పుడూ నష్టపరిహారం గురించి మాట్లాడలేదని, ప్రస్తుత శాసనసభ్యులు మేడిపల్లి సత్యం నిండు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆమె గుర్తుచేశారు. మేడిపల్లి సత్యం రూ.23 కోట్ల నష్టపరిహారం మంజూరు చేయించి ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ వారు అడ్డంకులు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని, దీని వెనుక మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ ఉన్నారని ఆమె ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో గంగాధర మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రి మహేందర్, మాజీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్, గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, తాడి జెర్రీ సర్పంచ్ రామిడి రాజిరెడ్డి, నాయకులు రుద్ర మల్లేశం, సాయిని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. అర్థరాత్రి వరకు కొనుగోలు కేంద్రాల్లోనే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉండటం ఆయన పనితనానికి నిదర్శనమని, నియోజకవర్గంలో "మేడిపల్లి సత్యం అభివృద్ధి రాజ్యాంగం" నడుస్తోందని జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ పునరుద్ఘాటించారు.

More news from Telangana and nearby areas
  • కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, ఇతర కాంగ్రెస్ నేతలు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యంను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గ రైతులను తన కుటుంబ సభ్యులుగా భావించి మేడిపల్లి సత్యం పనిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీపీఎస్ విధానంతో లారీల కొరత, అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడం వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, మేడిపల్లి సత్యం అర్థరాత్రి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే ఉండి, మానవత్వంతో రైతుల బాధను అర్థం చేసుకొని స్వయంగా లారీ ఎక్కి ధాన్యం తరలింపును పర్యవేక్షించారని కాంగ్రెస్ నేతలు వివరించారు. అలాంటి సత్యం గారిని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ "లారీ ఎక్కి వస్తావా.. బస్సు ఎక్కి వస్తావా" అంటూ పాటలు పాడుతూ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు నీళ్లు అడిగితే, "ఈ ఏడాది రాళ్ల వాన పడి పంట కొట్టుకుపోయిందని అనుకోండి" అని నాటి ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడటం వల్ల రైతులు ఎంతగానో ఆవేదన చెందారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ రివెంజ్ రాజకీయాలకు పెట్టింది పేరని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఖమ్మంలో రైతుల చేతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ కు దక్కిందని పులి ఆంజనేయులు గౌడ్ ఆరోపించారు. చొప్పదండిలో "మేడిపల్లి సత్యం అభివృద్ధి రాజ్యాంగమే" నడుస్తోందని, గంగాధరకు డిగ్రీ కళాశాల మంజూరు, ఆర్నకొండ నుండి మల్యాల వరకు రోడ్డు నిర్మాణం, కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.36 కోట్లు మంజూరు వంటి నిర్మాణాత్మక పనులతో బీఆర్ఎస్ నేతలే స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనులను ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయని నేతలు తెలిపారు. నారాయణపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం ఘటనలో ఎమ్మెల్యే సత్యం గారిని టార్గెట్ చేస్తూ, రైతులపై కేసులు పెట్టారని సుంకే రవిశంకర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని వారు ఖండించారు. పూడూరు, గంగాధరలో ధర్నాలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపైనా కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు సహాయం చేయాల్సిన సమయంలో ఆరోపణలు చేయడం సరికాదని, రైతుల సెంటిమెంట్‌తో రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. వరద కాలువ విషయంలో నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి ముంపు బాధితులకు పరిహారం అందించాలని, చుక్కనీరు వృధా కాకుండా చూడాలని సత్యం కృషి చేస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. నారాయణపూర్ గ్రామ సర్పంచ్ బాబా లక్ష్మి మధు మాట్లాడుతూ, తాను సర్పంచ్ గా ఎన్నికైన నెల రోజుల నుండి ప్రతి గ్రామసభను బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామానికి రావాలంటే కూడా బెదిరింపుల కారణంగా భయపడుతున్నారని ఆమె తెలిపారు. నిన్న ఐకేపీ సెంటర్ లో జరిగిన సంఘటనకు గ్రామ సర్పంచ్ కు గాని, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అది వారి వ్యక్తిగత విషయమని, అక్కడ ఉన్న నిర్వాహకురాలిని సుంకే రవిశంకర్ అనుచరులు వ్యక్తిగతంగా దూషించి బెదిరించడంతో వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారని వివరించారు. నారాయణపూర్ ముంపు గ్రామానికి సంబంధించి గతంలో శాసనసభ్యులుగా ఉన్న సుద్దాల దేవయ్య, బొడిగెశోభ, సుంకే రవిశంకర్ ఎప్పుడూ నష్టపరిహారం గురించి మాట్లాడలేదని, ప్రస్తుత శాసనసభ్యులు మేడిపల్లి సత్యం నిండు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆమె గుర్తుచేశారు. మేడిపల్లి సత్యం రూ.23 కోట్ల నష్టపరిహారం మంజూరు చేయించి ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ వారు అడ్డంకులు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని, దీని వెనుక మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ ఉన్నారని ఆమె ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో గంగాధర మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రి మహేందర్, మాజీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్, గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, తాడి జెర్రీ సర్పంచ్ రామిడి రాజిరెడ్డి, నాయకులు రుద్ర మల్లేశం, సాయిని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. అర్థరాత్రి వరకు కొనుగోలు కేంద్రాల్లోనే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉండటం ఆయన పనితనానికి నిదర్శనమని, నియోజకవర్గంలో "మేడిపల్లి సత్యం అభివృద్ధి రాజ్యాంగం" నడుస్తోందని జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ పునరుద్ఘాటించారు.
    1
    కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, ఇతర కాంగ్రెస్ నేతలు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యంను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గ రైతులను తన కుటుంబ సభ్యులుగా భావించి మేడిపల్లి సత్యం పనిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీపీఎస్ విధానంతో లారీల కొరత, అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోవడం వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, మేడిపల్లి సత్యం అర్థరాత్రి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దే ఉండి, మానవత్వంతో రైతుల బాధను అర్థం చేసుకొని స్వయంగా లారీ ఎక్కి ధాన్యం తరలింపును పర్యవేక్షించారని కాంగ్రెస్ నేతలు వివరించారు. అలాంటి సత్యం గారిని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ "లారీ ఎక్కి వస్తావా.. బస్సు ఎక్కి వస్తావా" అంటూ పాటలు పాడుతూ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని విమర్శించారు. గత బీఆర్ఎస్ పాలనలో రైతులు నీళ్లు అడిగితే, "ఈ ఏడాది రాళ్ల వాన పడి పంట కొట్టుకుపోయిందని అనుకోండి" అని నాటి ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడటం వల్ల రైతులు ఎంతగానో ఆవేదన చెందారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ రివెంజ్ రాజకీయాలకు పెట్టింది పేరని, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఖమ్మంలో రైతుల చేతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ కు దక్కిందని పులి ఆంజనేయులు గౌడ్ ఆరోపించారు.

చొప్పదండిలో "మేడిపల్లి సత్యం అభివృద్ధి రాజ్యాంగమే" నడుస్తోందని, గంగాధరకు డిగ్రీ కళాశాల మంజూరు, ఆర్నకొండ నుండి మల్యాల వరకు రోడ్డు నిర్మాణం, కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.36 కోట్లు మంజూరు వంటి నిర్మాణాత్మక పనులతో బీఆర్ఎస్ నేతలే స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనులను ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయని నేతలు తెలిపారు. నారాయణపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం ఘటనలో ఎమ్మెల్యే సత్యం గారిని టార్గెట్ చేస్తూ, రైతులపై కేసులు పెట్టారని సుంకే రవిశంకర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని వారు ఖండించారు. పూడూరు, గంగాధరలో ధర్నాలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపైనా కేసులు పెట్టలేదని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు సహాయం చేయాల్సిన సమయంలో ఆరోపణలు చేయడం సరికాదని, రైతుల సెంటిమెంట్‌తో రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. వరద కాలువ విషయంలో నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి ముంపు బాధితులకు పరిహారం అందించాలని, చుక్కనీరు వృధా కాకుండా చూడాలని సత్యం కృషి చేస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

నారాయణపూర్ గ్రామ సర్పంచ్ బాబా లక్ష్మి మధు మాట్లాడుతూ, తాను సర్పంచ్ గా ఎన్నికైన నెల రోజుల నుండి ప్రతి గ్రామసభను బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామానికి రావాలంటే కూడా బెదిరింపుల కారణంగా భయపడుతున్నారని ఆమె తెలిపారు. నిన్న ఐకేపీ సెంటర్ లో జరిగిన సంఘటనకు గ్రామ సర్పంచ్ కు గాని, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అది వారి వ్యక్తిగత విషయమని, అక్కడ ఉన్న నిర్వాహకురాలిని సుంకే రవిశంకర్ అనుచరులు వ్యక్తిగతంగా దూషించి బెదిరించడంతో వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారని వివరించారు. నారాయణపూర్ ముంపు గ్రామానికి సంబంధించి గతంలో శాసనసభ్యులుగా ఉన్న సుద్దాల దేవయ్య, బొడిగెశోభ, సుంకే రవిశంకర్ ఎప్పుడూ నష్టపరిహారం గురించి మాట్లాడలేదని, ప్రస్తుత శాసనసభ్యులు మేడిపల్లి సత్యం నిండు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆమె గుర్తుచేశారు. మేడిపల్లి సత్యం రూ.23 కోట్ల నష్టపరిహారం మంజూరు చేయించి ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అని ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ వారు అడ్డంకులు సృష్టించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని, దీని వెనుక మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ ఉన్నారని ఆమె ఆరోపించారు.

ఈ విలేకరుల సమావేశంలో గంగాధర మండల కాంగ్రెస్ అధ్యక్షులు మంత్రి మహేందర్, మాజీ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్, గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు శ్రీనివాస్ రెడ్డి, తాడి జెర్రీ సర్పంచ్ రామిడి రాజిరెడ్డి, నాయకులు రుద్ర మల్లేశం, సాయిని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. అర్థరాత్రి వరకు కొనుగోలు కేంద్రాల్లోనే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉండటం ఆయన పనితనానికి నిదర్శనమని, నియోజకవర్గంలో "మేడిపల్లి సత్యం అభివృద్ధి రాజ్యాంగం" నడుస్తోందని జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ పునరుద్ఘాటించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • పదేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతూ, మరణించినట్లు నమ్మించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ఖాలీద్ అలియాస్ ధూమ్ ఖాలీద్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు పక్కా వ్యూహంతో వలపన్ని పట్టుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థినిపై మానభంగానికి పాల్పడిన కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకొచ్చిన ధూమ్ ఖాలీద్ అప్పటినుండి పరారీలో ఉంటూ, కరీంనగర్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాడు. గతంలో గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడి రెండు కాళ్లను కోల్పోయినా, అతడు మహారాష్ట్రలోని నాగపూర్, నాందేడ్, చంద్రపూర్, బల్లార్ష వంటి చోట్ల గ్యాంగులను ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడటం పోలీసుల విచారణలో తేలింది. బిక్షగాడి వేషంలో దర్గాల వద్ద ఆశ్రయం పొందుతూ వాహనాల్లో తిరుగుతూ నేరాలు చేసేవాడు. ధూమ్ ఖాలీద్ హైదరాబాద్‌లో పలు క్రిమినల్ కేసుల్లో పాల్గొనగా, కరీంనగర్‌లోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో 5, వన్ టౌన్‌లో 2, టూ టౌన్‌లో 1 కేసు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్, నాగపూర్, బల్లార్ష, చంద్రపూర్‌లలో కూడా కేసులున్నాయి. చైన్ స్నాచింగ్, గ్యాంగ్ రేప్, దారి దోపిడీలకు పాల్పడే ముఠాలను ఏర్పాటు చేసి యువతను నేరప్రవృత్తిలోకి లాగేవాడు. కరీంనగర్‌లో ఇతడు పాల్పడిన దాదాపు వంద ఘటనలపై ఫిర్యాదులు పోలీసులకు అందలేదని తెలుస్తోంది. కరీంనగర్‌లోని మూడు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి ఖాలీద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు కొంతకాలంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో, హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లిలో నివాసముంటున్న తన భార్యను చంపడానికి గత ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నాడని, ఈ పథకంలో భాగంగానే ఖాలీద్ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ సమాచారంతో, సోమవారం కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ధూమ్ ఖాలీద్‌ను అదుపులోకి తీసుకుని, ఇంజనీరింగ్ విద్యార్థిని రేప్ కేసులో కోర్టులో హాజరుపరిచారు. ఇతర కేసుల్లో కూడా అతన్ని అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పదేళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగిన ఘరానా నేరస్తుడు ధూమ్ ఖాలీద్‌ను పట్టుకున్న కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, అతని సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను పట్టుకోవడంలో కరీంనగర్ రూరల్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని సీపీ సూచించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కూడా సీఐ నిరంజన్ రెడ్డి బృందాన్ని ప్రశంసించారు. ధూమ్ ఖాలీద్ అరెస్ట్‌పై కరీంనగర్ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుడు జైళ్లోనే ఉండేలా చూడాలని, బయటకొస్తే మరిన్ని దారుణాలకు పాల్పడే ప్రమాదం ఉందని నగరవాసులు కోరుతున్నారు. ఖాలీద్ చేసిన నేరాలను పరిగణనలోకి తీసుకుని అతనికి కఠిన శిక్షలు పడేలా పోలీసులు చొరవ చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
    1
    పదేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతూ, మరణించినట్లు నమ్మించిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ఖాలీద్ అలియాస్ ధూమ్ ఖాలీద్‌ను కరీంనగర్ రూరల్ పోలీసులు పక్కా వ్యూహంతో వలపన్ని పట్టుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థినిపై మానభంగానికి పాల్పడిన కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకొచ్చిన ధూమ్ ఖాలీద్ అప్పటినుండి పరారీలో ఉంటూ, కరీంనగర్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాడు. గతంలో గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడి రెండు కాళ్లను కోల్పోయినా, అతడు మహారాష్ట్రలోని నాగపూర్, నాందేడ్, చంద్రపూర్, బల్లార్ష వంటి చోట్ల గ్యాంగులను ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడటం పోలీసుల విచారణలో తేలింది. బిక్షగాడి వేషంలో దర్గాల వద్ద ఆశ్రయం పొందుతూ వాహనాల్లో తిరుగుతూ నేరాలు చేసేవాడు.

ధూమ్ ఖాలీద్ హైదరాబాద్‌లో పలు క్రిమినల్ కేసుల్లో పాల్గొనగా, కరీంనగర్‌లోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో 5, వన్ టౌన్‌లో 2, టూ టౌన్‌లో 1 కేసు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్, నాగపూర్, బల్లార్ష, చంద్రపూర్‌లలో కూడా కేసులున్నాయి. చైన్ స్నాచింగ్, గ్యాంగ్ రేప్, దారి దోపిడీలకు పాల్పడే ముఠాలను ఏర్పాటు చేసి యువతను నేరప్రవృత్తిలోకి లాగేవాడు. కరీంనగర్‌లో ఇతడు పాల్పడిన దాదాపు వంద ఘటనలపై ఫిర్యాదులు పోలీసులకు అందలేదని తెలుస్తోంది. కరీంనగర్‌లోని మూడు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి ఖాలీద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు కొంతకాలంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో, హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లిలో నివాసముంటున్న తన భార్యను చంపడానికి గత ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నాడని, ఈ పథకంలో భాగంగానే ఖాలీద్ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ సమాచారంతో, సోమవారం కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ధూమ్ ఖాలీద్‌ను అదుపులోకి తీసుకుని, ఇంజనీరింగ్ విద్యార్థిని రేప్ కేసులో కోర్టులో హాజరుపరిచారు. ఇతర కేసుల్లో కూడా అతన్ని అరెస్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

పదేళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరిగిన ఘరానా నేరస్తుడు ధూమ్ ఖాలీద్‌ను పట్టుకున్న కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, అతని సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌ను పట్టుకోవడంలో కరీంనగర్ రూరల్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని సీపీ సూచించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కూడా సీఐ నిరంజన్ రెడ్డి బృందాన్ని ప్రశంసించారు. ధూమ్ ఖాలీద్ అరెస్ట్‌పై కరీంనగర్ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుడు జైళ్లోనే ఉండేలా చూడాలని, బయటకొస్తే మరిన్ని దారుణాలకు పాల్పడే ప్రమాదం ఉందని నగరవాసులు కోరుతున్నారు. ఖాలీద్ చేసిన నేరాలను పరిగణనలోకి తీసుకుని అతనికి కఠిన శిక్షలు పడేలా పోలీసులు చొరవ చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలి వానిపల్లి అనుబంధ గ్రామమైన కూన వానిపల్లికి చెందిన రైతు కూన యాదగిరి, తన పిల్లల ఈత సరదాను తీర్చడానికి ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. తన వద్ద ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఉపయోగించి, దానిలో టార్పాలిన్ కవర్‌ను అమర్చి, నీటితో నింపి చిన్నపాటి స్విమ్మింగ్ పూల్‌ను తయారుచేశారు. పనికిరాని వస్తువు అంటూ ఏదీ ఉండదని, ఒక ఐడియా జీవితాన్నే మార్చగలదని నిరూపిస్తూ, ఈ తండ్రి తన పిల్లల కోసం ఈ సృజనాత్మక ఏర్పాటు చేశారు.
    1
    కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని చాకలి వానిపల్లి అనుబంధ గ్రామమైన కూన వానిపల్లికి చెందిన రైతు కూన యాదగిరి, తన పిల్లల ఈత సరదాను తీర్చడానికి ఒక అద్భుతమైన ఆలోచన చేశారు. తన వద్ద ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఉపయోగించి, దానిలో టార్పాలిన్ కవర్‌ను అమర్చి, నీటితో నింపి చిన్నపాటి స్విమ్మింగ్ పూల్‌ను తయారుచేశారు. పనికిరాని వస్తువు అంటూ ఏదీ ఉండదని, ఒక ఐడియా జీవితాన్నే మార్చగలదని నిరూపిస్తూ, ఈ తండ్రి తన పిల్లల కోసం ఈ సృజనాత్మక ఏర్పాటు చేశారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కాజీపూర్ ఇసుక క్వారీ వద్ద గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సర్పంచ్ కోమటిరెడ్డి అంజన్ కుమార్ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ నిరసనలో పాల్గొని ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజన్ కుమార్ మరియు మాజీ ప్రజా ప్రతినిధి సోమినేని తిరుపతి మాట్లాడుతూ, గతంలో ఎన్నో ఏళ్లుగా కాజీపూర్ శివారులో టిజిఎండిసి ఆధ్వర్యంలో ఇసుకను చుట్టుపక్కల గ్రామ అవసరాల కోసం నిబంధనలకు అనుగుణంగా తరలించేవారని గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం ఒక కంపెనీకి సుమారు ₹1457 కోట్ల రూపాయలకు కడెం ప్రాజెక్టు, మిడ్ మానేరు, ఎల్ఎండి ప్రాజెక్టులలో ఒక టీఎంసీ నీటి పెరుగుదల కోసం ఇసుక తరలింపు ప్రక్రియను అప్పగించిందని ఆరోపించారు. సాధారణంగా ఒకటి లేదా రెండు సంవత్సరాలకు మాత్రమే ఉండే ఒప్పందాలను పక్కనపెట్టి, ఏకంగా 20 సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకోవడం చరిత్రలో శోచనీయమని, దీన్ని ప్రశ్నించారు. ఈ దీర్ఘకాలిక ఒప్పందాన్ని అలుసుగా తీసుకున్న కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను డంప్ చేసి లక్షల కోట్లు దండుకుంటున్నదని వారు ఆరోపించారు. గతంలో టిఎస్ఎండిఎస్ ద్వారా సాండ్ టాక్స్ అమలు చేయగా, దాని ద్వారా గ్రామస్తులకు ఉపాధి లభించడమే కాకుండా, చుట్టుపక్కల గ్రామాలకు ఇసుక కొరత లేకుండా ఉండేదని వివరించారు. అయితే, ప్రస్తుత కంపెనీ గ్రామస్తులకు చెందిన ఒక్క ట్రాక్టర్ ఇసుకను కూడా తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నదని, సాగునీటి కోసం వాగులో రెండు కిలోమీటర్ల పొడవుతో మోటార్లు వేసుకొని సాగు చేసుకుంటున్న రైతుల మోటార్లను ఇసుక తరలింపు కోసం తొలగిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులు వ్యవసాయం చేసుకునేదెలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవైపు ఇసుక తరలింపు వల్ల సాగునీటికే కాకుండా త్రాగునీటికి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, గ్రామం వలసపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని, టిఎస్ఎండిఎస్ ద్వారా స్థానిక గ్రామ ప్రజలకు ఇసుక తరలింపుకు సాండ్ టాక్స్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, రాబోయే రోజుల్లో ఇసుక తరలింపును అడ్డుకునేందుకు కలెక్టరేట్, క్వారీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
    3
    కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కాజీపూర్ ఇసుక క్వారీ వద్ద గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారు రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సర్పంచ్ కోమటిరెడ్డి అంజన్ కుమార్ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ నిరసనలో పాల్గొని ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అంజన్ కుమార్ మరియు మాజీ ప్రజా ప్రతినిధి సోమినేని తిరుపతి మాట్లాడుతూ, గతంలో ఎన్నో ఏళ్లుగా కాజీపూర్ శివారులో టిజిఎండిసి ఆధ్వర్యంలో ఇసుకను చుట్టుపక్కల గ్రామ అవసరాల కోసం నిబంధనలకు అనుగుణంగా తరలించేవారని గుర్తుచేశారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం ఒక కంపెనీకి సుమారు ₹1457 కోట్ల రూపాయలకు కడెం ప్రాజెక్టు, మిడ్ మానేరు, ఎల్ఎండి ప్రాజెక్టులలో ఒక టీఎంసీ నీటి పెరుగుదల కోసం ఇసుక తరలింపు ప్రక్రియను అప్పగించిందని ఆరోపించారు. సాధారణంగా ఒకటి లేదా రెండు సంవత్సరాలకు మాత్రమే ఉండే ఒప్పందాలను పక్కనపెట్టి, ఏకంగా 20 సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకోవడం చరిత్రలో శోచనీయమని, దీన్ని ప్రశ్నించారు. ఈ దీర్ఘకాలిక ఒప్పందాన్ని అలుసుగా తీసుకున్న కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను డంప్ చేసి లక్షల కోట్లు దండుకుంటున్నదని వారు ఆరోపించారు. గతంలో టిఎస్ఎండిఎస్ ద్వారా సాండ్ టాక్స్ అమలు చేయగా, దాని ద్వారా గ్రామస్తులకు ఉపాధి లభించడమే కాకుండా, చుట్టుపక్కల గ్రామాలకు ఇసుక కొరత లేకుండా ఉండేదని వివరించారు.

అయితే, ప్రస్తుత కంపెనీ గ్రామస్తులకు చెందిన ఒక్క ట్రాక్టర్ ఇసుకను కూడా తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నదని, సాగునీటి కోసం వాగులో రెండు కిలోమీటర్ల పొడవుతో మోటార్లు వేసుకొని సాగు చేసుకుంటున్న రైతుల మోటార్లను ఇసుక తరలింపు కోసం తొలగిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులు వ్యవసాయం చేసుకునేదెలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవైపు ఇసుక తరలింపు వల్ల సాగునీటికే కాకుండా త్రాగునీటికి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయని, గ్రామం వలసపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని, టిఎస్ఎండిఎస్ ద్వారా స్థానిక గ్రామ ప్రజలకు ఇసుక తరలింపుకు సాండ్ టాక్స్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, రాబోయే రోజుల్లో ఇసుక తరలింపును అడ్డుకునేందుకు కలెక్టరేట్, క్వారీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 20వ మరియు 3వ వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ మరియు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై, గృహప్రవేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.డి. ఖదీర్ పాషా, హౌసింగ్ పీడీ, కౌన్సిలర్ సభ్యులు సాగల హరి ప్రసాద్, కూరపాటి శ్రీశైలం, కోఆప్షన్ సభ్యులు నంది శంకర్ మరియు ఎమ్మార్వో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
    1
    సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 20వ మరియు 3వ వార్డులలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ మరియు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై, గృహప్రవేశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.డి. ఖదీర్ పాషా, హౌసింగ్ పీడీ, కౌన్సిలర్ సభ్యులు సాగల హరి ప్రసాద్, కూరపాటి శ్రీశైలం, కోఆప్షన్ సభ్యులు నంది శంకర్ మరియు ఎమ్మార్వో గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • హుస్నాబాద్ పట్టణంలో వందలాది కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్లు, పంటపొలాలను ధ్వంసం చేస్తూ పట్టణవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ కోతుల గుంపుల మధ్య జరుగుతున్న భీకర పోరాటాలు ప్రజల్లో మరింత ఆందోళన నింపుతున్నాయి. దీంతో పిల్లలు, పెద్దలు ఒంటరిగా బయటకు రావాలంటే వణికిపోతున్నారు. కిరాణా వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కోతుల బెడద నుండి తమను రక్షించాలని పట్టణవాసులు అధికారులను వేడుకుంటున్నారు.
    1
    హుస్నాబాద్ పట్టణంలో వందలాది కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇళ్లు, పంటపొలాలను ధ్వంసం చేస్తూ పట్టణవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ కోతుల గుంపుల మధ్య జరుగుతున్న భీకర పోరాటాలు ప్రజల్లో మరింత ఆందోళన నింపుతున్నాయి.

దీంతో పిల్లలు, పెద్దలు ఒంటరిగా బయటకు రావాలంటే వణికిపోతున్నారు. కిరాణా వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కోతుల బెడద నుండి తమను రక్షించాలని పట్టణవాసులు అధికారులను వేడుకుంటున్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ఖాలీద్ అలియాస్ ధూమ్ ఖాలీద్‌ను దశాబ్ద కాలంగా తప్పించుకు తిరుగుతుండగా కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. చనిపోయాడని అందరూ భావిస్తున్న ఈ కరుడుగట్టిన నేరస్తుడిని వలవేసి అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై మానభంగం కేసు తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ధూమ్ ఖాలీద్‌పై దాడి చేసి తీవ్రంగా చితకబాది, కాళ్లపై బండరాళ్లతో మోదారు. ఆసుపత్రిలో అతనికి రెండు కాళ్లు తీసేశారు వైద్యులు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ధూమ్ ఖాలీద్ అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. పదేళ్లుగా కరీంనగర్ వైపు కన్నెత్తి చూడకుండా మహారాష్ట్రలోని నాగపూర్, నాందేడ్, చంద్రపూర్, బల్లార్ష తదితర ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నాడు. రెండు కాళ్లు లేకపోయినా, మహారాష్ట్రలో గ్యాంగులను ఏర్పాటు చేసుకుని ధూమ్ ఖాలీద్ తన నేర ప్రవృత్తిని కొనసాగించాడు. బిక్షగాడి వేషంలో దర్గాల వద్ద షెల్టర్ తీసుకుంటూ, వాహనాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్‌లో పలు క్రిమినల్ కేసుల్లో పాల్గొన్న ధూమ్ ఖాలీద్ కరీంనగర్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. పలు కేసుల్లో శిక్ష పడిన ఖాలీద్ పై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో 5, వన్ టౌన్‌లో 2, టూ టౌన్‌లో 1 కేసు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్, నాగపూర్, బల్లార్ష, చంద్రపూర్ లలో కూడా కేసులు నమోదయ్యాయి. చైన్ స్నాచింగ్, గ్యాంగ్ రేప్, దారి దోపిడీలకు పాల్పడే ముఠాలను ఏర్పాటు చేసుకుని యువతను నేరాలకు ఉసిగొల్పేవాడు. కరీంనగర్‌లో ధూమ్ ఖాలీద్ పాల్పడిన దాదాపు వంద ఘటనలపై కేసులు నమోదు కాలేదని, ఫిర్యాదులు ఇవ్వలేదని తెలుస్తోంది. కరీంనగర్‌లోని మూడు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో ధూమ్ ఖాలీద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. అతని గురించి వాకబు చేయగా చనిపోయాడన్న సమాధానమే రావడంతో అతని ఆచూకీ దొరకడం కష్టమేనని అనుకున్నారు. అయితే, హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లిలో నివసిస్తున్న ధూమ్ ఖాలీద్ భార్యను గత ఆరు నెలలుగా హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్యను హతమార్చేందుకు స్కెచ్ వేయడంలో భాగంగానే ఖాలీద్ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడని పోలీసులు సమాచారం అందుకున్నారు. సోమవారం ధూమ్ ఖాలీద్ కరీంనగర్ వచ్చాడన్న పక్కా సమాచారం మేరకు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థిని రేప్ చేసిన కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగతా కేసుల్లో కూడా అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు, ఇప్పటికే శిక్షలు పడినందున అతను జైలుకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దశాబ్ద కాలంగా తప్పించుకుంటున్న ధూమ్ ఖాలీద్‌ను పట్టుకోవడంలో సఫలం అయిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, పోలీసు సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పట్టుకునేందుకు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కూడా సీఐ నిరంజన్ రెడ్డి బృందాన్ని అభినందించి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. ఘరానా క్రిమినల్ అయిన ధూమ్ ఖాలీద్‌ను పట్టుకోవడంపై కరీంనగర్ ప్రజల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుడు జైళ్లోనే ఉండేలా చూడాలని, బయటకు వస్తే మరిన్ని దారుణాలకు ఒడిగట్టే ప్రమాదం ఉందని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ధూమ్ ఖాలీద్ చేసిన నేరాలను గమనించి కఠిన శిక్షలు పడే విధంగా పోలీసులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ఖాలీద్ అలియాస్ ధూమ్ ఖాలీద్‌ను దశాబ్ద కాలంగా తప్పించుకు తిరుగుతుండగా కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. చనిపోయాడని అందరూ భావిస్తున్న ఈ కరుడుగట్టిన నేరస్తుడిని వలవేసి అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై మానభంగం కేసు తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ధూమ్ ఖాలీద్‌పై దాడి చేసి తీవ్రంగా చితకబాది, కాళ్లపై బండరాళ్లతో మోదారు. ఆసుపత్రిలో అతనికి రెండు కాళ్లు తీసేశారు వైద్యులు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ధూమ్ ఖాలీద్ అప్పటి నుండి పరారీలో ఉన్నాడు.

పదేళ్లుగా కరీంనగర్ వైపు కన్నెత్తి చూడకుండా మహారాష్ట్రలోని నాగపూర్, నాందేడ్, చంద్రపూర్, బల్లార్ష తదితర ప్రాంతాల్లో షెల్టర్ తీసుకున్నాడు. రెండు కాళ్లు లేకపోయినా, మహారాష్ట్రలో గ్యాంగులను ఏర్పాటు చేసుకుని ధూమ్ ఖాలీద్ తన నేర ప్రవృత్తిని కొనసాగించాడు. బిక్షగాడి వేషంలో దర్గాల వద్ద షెల్టర్ తీసుకుంటూ, వాహనాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. హైదరాబాద్‌లో పలు క్రిమినల్ కేసుల్లో పాల్గొన్న ధూమ్ ఖాలీద్ కరీంనగర్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. పలు కేసుల్లో శిక్ష పడిన ఖాలీద్ పై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో 5, వన్ టౌన్‌లో 2, టూ టౌన్‌లో 1 కేసు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్, నాగపూర్, బల్లార్ష, చంద్రపూర్ లలో కూడా కేసులు నమోదయ్యాయి. చైన్ స్నాచింగ్, గ్యాంగ్ రేప్, దారి దోపిడీలకు పాల్పడే ముఠాలను ఏర్పాటు చేసుకుని యువతను నేరాలకు ఉసిగొల్పేవాడు. కరీంనగర్‌లో ధూమ్ ఖాలీద్ పాల్పడిన దాదాపు వంద ఘటనలపై కేసులు నమోదు కాలేదని, ఫిర్యాదులు ఇవ్వలేదని తెలుస్తోంది.

కరీంనగర్‌లోని మూడు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో ధూమ్ ఖాలీద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. అతని గురించి వాకబు చేయగా చనిపోయాడన్న సమాధానమే రావడంతో అతని ఆచూకీ దొరకడం కష్టమేనని అనుకున్నారు. అయితే, హైదరాబాద్ సమీపంలోని మేడిపల్లిలో నివసిస్తున్న ధూమ్ ఖాలీద్ భార్యను గత ఆరు నెలలుగా హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్యను హతమార్చేందుకు స్కెచ్ వేయడంలో భాగంగానే ఖాలీద్ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడని పోలీసులు సమాచారం అందుకున్నారు. సోమవారం ధూమ్ ఖాలీద్ కరీంనగర్ వచ్చాడన్న పక్కా సమాచారం మేరకు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థిని రేప్ చేసిన కేసులో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగతా కేసుల్లో కూడా అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు, ఇప్పటికే శిక్షలు పడినందున అతను జైలుకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దశాబ్ద కాలంగా తప్పించుకుంటున్న ధూమ్ ఖాలీద్‌ను పట్టుకోవడంలో సఫలం అయిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, పోలీసు సిబ్బందిని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పట్టుకునేందుకు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ కూడా సీఐ నిరంజన్ రెడ్డి బృందాన్ని అభినందించి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టాస్క్ ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. ఘరానా క్రిమినల్ అయిన ధూమ్ ఖాలీద్‌ను పట్టుకోవడంపై కరీంనగర్ ప్రజల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుడు జైళ్లోనే ఉండేలా చూడాలని, బయటకు వస్తే మరిన్ని దారుణాలకు ఒడిగట్టే ప్రమాదం ఉందని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ధూమ్ ఖాలీద్ చేసిన నేరాలను గమనించి కఠిన శిక్షలు పడే విధంగా పోలీసులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలోని ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో ఉన్న ఈత వనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈదురు గాలుల కారణంగా అగ్ని మరింత వేగంగా వ్యాపించింది. మంటల గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను విజయవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలంలోని ఎల్లమ్మ టెంపుల్ సమీపంలో ఉన్న ఈత వనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈదురు గాలుల కారణంగా అగ్ని మరింత వేగంగా వ్యాపించింది. మంటల గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను విజయవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.